మోదీ, పుతిన్‌లు ఏదైనా చర్చించొచ్చు: క్రెమ్లిన్‌

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చాలా విశ్వసనీయమైన మైత్రి ఉందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ పేర్కొంది.

Updated : 03 Jul 2024 05:07 IST

మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చాలా విశ్వసనీయమైన మైత్రి ఉందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో త్వరలో వీరిద్దరి మధ్య మాస్కోలో జరిగే సమావేశంలో ఏ అంశమైనా చర్చకు రావొచ్చని తెలిపింది. ఫలానా విషయాన్ని వారు ప్రస్తావించరన్న విధానమేదీ ఉండదని వివరించింది. మోదీ మాస్కో పర్యటన తేదీలను త్వరలోనే వెల్లడవుతాయని, అయితే పర్యటనకు మాత్రం ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ చెప్పారు. అంతర్జాతీయ భద్రత, వాణిజ్యం, ప్రాంతీయ అంశాలు ఈ ఇద్దరు నేతల మధ్య చర్చకు వస్తాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని