- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఫ్రాన్స్లో మెక్రాన్కు ఎదురుదెబ్బ!
ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల తొలి విడత ఓటింగ్లో అతి జాతీయవాద నేషనల్ ర్యాలీ పార్టీ ఆధిక్యం సాధించినట్లు సోమవారం విడుదలైన ఫలితాలు సూచిస్తున్నాయి.
తొలి విడత ఓటింగ్లో నేషనల్ ర్యాలీ పార్టీ ఆధిక్యం
పారిస్: ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల తొలి విడత ఓటింగ్లో అతి జాతీయవాద నేషనల్ ర్యాలీ పార్టీ ఆధిక్యం సాధించినట్లు సోమవారం విడుదలైన ఫలితాలు సూచిస్తున్నాయి. ఆదివారం జరిగే తుదివిడత పోలింగ్లోనూ ఆ పార్టీ ఆధిక్యం సాధిస్తే పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ పొందగలుగుతుంది. తద్వారా రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఫ్రాన్స్లో అతి జాతీయవాద పార్టీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. తొలివిడతలో 33 శాతం ఓట్లను మరీన్ లే పెన్ నాయకత్వంలోని నేషనల్ ర్యాలీ పార్టీయే దక్కించుకుంది. వామపక్ష కూటమి అయిన న్యూ పాపులర్ ఫ్రంట్ 28 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలవగా, దేశాధ్యక్షుడు మెక్రాన్ నాయకత్వంలోని మధ్యేవాద కూటమి 20 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఫ్రాన్స్ నుంచి యూరోపియన్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ చేతిలో మెక్రాన్ పార్టీ ఓడిపోవడంతో పార్లమెంటు మధ్యంతర ఎన్నికలకు ఆయన ఆదేశం జారీచేశారు. నేషనల్ ర్యాలీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయకుండా అడ్డుకోవడానికి వామపక్ష కూటమి.. మెక్రాన్ మధ్యేవాద కూటమితో చేతులు కలపడానికి సిద్ధంగా ఉంది. ఆదివారంనాటి తొలివిడత పోలింగ్లో 577 పార్లమెంటు సీట్లకు గానూ 78 సీట్లను 50 శాతానికి పైగా ఓట్లు సాధించినవారు గెలుచుకున్నారు. వీటిలో 38 సీట్లను నేషనల్ ర్యాలీ అభ్యర్థులే దక్కించుకున్నారు. విజేతల్లో మరీన్ లే పెన్ కూడా ఉన్నారు. నేషనల్ ర్యాలీ పార్టీ ఫ్రాన్స్లోని ముస్లిం వర్గాన్ని వ్యతిరేకిస్తోంది. రష్యాను సమర్థిస్తూ ఉక్రెయిన్కు ఫ్రెంచి దూరశ్రేణి క్షిపణుల సరఫరానూ నిలిపేస్తానంటోంది. మెక్రాన్ స్వదేశీ, విదేశీ విధానాలను గట్టిగా వ్యతిరేకిస్తోంది. నేషనల్ ర్యాలీ పార్టీ వంటి శక్తుల చేతికి అధికారం వస్తే ఫ్రాన్స్లో అంతర్యుద్ధం సంభవిస్తుందని మెక్రాన్ హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యూయార్క్ ‘ఇండియా డే’ కవాతులో.. అయోధ్య రామమందిర నమూనా
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆగస్టు 18న నిర్వహించనున్న చారిత్రక ‘ఇండియా డే’ కవాతులో అయోధ్య రామమందిర నమూనాను ప్రదర్శించనున్నారు. -
తోషాఖానా కేసులో ఇమ్రాన్కు మరో ఊరట
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(71)ను వెంటాడిన తోషాఖానా కేసులో మరో ఊరట లభించింది. -
బెంబేలెత్తించిన బెరిల్.. ద్వీపం ధ్వంసం!
కరీబియన్ దీవుల్లో భీకర ‘బెరిల్’ హరికేన్ భారీ విధ్వంసం సృష్టించింది. గంటకు దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు అనేక దీవుల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీశాయి. -
బ్రిటన్ పార్లమెంటు బరిలో భారత సంతతి అభ్యర్థుల హవా
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమైంది. గురువారం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2019 ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు రికార్డు స్థాయిలో ఎన్నికై పార్లమెంటులో అడుగడుపెట్టి చరిత్ర సృష్టించారు. -
భారతీయ విద్యార్థుల మద్దతుకు అమెరికాలో ప్రత్యేక ‘పోర్టల్’ వేదిక
అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సహాయార్థం న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక వేదికను రూపొందించింది. విద్యార్థులకు అమెరికన్ కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు వెదకటంతోపాటు న్యాయ, వైద్యపరమైన సమచారం ఈ వేదిక ద్వారా వారికి అందుబాటులో ఉంచుతారు. -
యుద్ధభూమిలో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా పంపండి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారత జాతీయులను క్షేమంగా స్వదేశానికి తిప్పిపంపాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ను బుధవారం భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ గట్టిగా కోరారు. -
ఇజ్రాయెల్ దాడిలో హెజ్బొల్లా కమాండర్ మృతి
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకుంటున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. -
చర్చ సమయంలో దాదాపు నిద్రపోయాను
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో గతవారం ముఖాముఖిలో తన ప్రదర్శన సరిగా లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. ‘సిబ్బంది వద్దని చెప్పినా చర్చకు ముందు నేను విదేశీ పర్యటనలు చేశాను. -
రష్యా క్షిపణుల దాడిలో ఐదుగురి మృతి
తూర్పు ఉక్రెయిన్లోని నిప్రొ నగరంపై బుధవారం రష్యా చేసిన క్షిపణి దాడుల్లో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. -
సంక్షిప్త వార్తలు
అమెరికాలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు.. ట్రంప్ హయాంలో గర్భవిచ్ఛిత్తిపై నిషేధం అమల్లోకి వచ్చిన రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు
-
నేటి నుంచి ఎప్సెట్ కౌన్సెలింగ్
-
పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్ రూ.5 వేలు
-
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?