- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఆస్టియోపొరోసిస్ ముప్పుపై హెచ్చరికలు చేసే ఏఐ
ఎముకలను గుల్లబార్చే ఆస్టియోపొరోసిస్ రుగ్మత ముప్పును ముందుగానే పసిగట్టేందుకు ఒక కృత్రిమ మేధ (ఏఐ) నమూనా సిద్ధమైంది.
దిల్లీ: ఎముకలను గుల్లబార్చే ఆస్టియోపొరోసిస్ రుగ్మత ముప్పును ముందుగానే పసిగట్టేందుకు ఒక కృత్రిమ మేధ (ఏఐ) నమూనా సిద్ధమైంది. అమెరికాలోని టులేన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.
ఆస్టియోపొరోసిస్కు కారణమయ్యే 10 ముఖ్యమైన అంశాలను పరిశోధకులు గుర్తించారు. వయసు, బరువు, పిడికిలి పట్టు, అధిక రక్తపోటుతోపాటు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఇందులో ఉన్నాయి. అనంతరం.. 40 ఏళ్లు పైబడ్డ 8వేల మంది డేటాను ఉపయోగించి ఒక డీప్ లెర్నింగ్ అల్గోరిథమ్ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది ఒకరకమైన ఏఐ. మానవ మెదడును అనుకరించడం దీని ప్రత్యేకత. భారీ డేటాసెట్లను పరిశీలించి, వాటిలో విభిన్న పోకడలను ఇది గుర్తించగలదు. తాజా ఏఐ నమూనా సాయంతో ఆస్టియోపొరోసిస్ ముప్పును ముందుగానే పసిగట్టవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రుగ్మతకు సకాలంలో నివారణ చర్యలు చేపట్టడానికి ఇది వీలు కల్పిస్తుందని వివరించారు. ఈ సాధనంపై మరిన్ని పరిశోధనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యూయార్క్ ‘ఇండియా డే’ కవాతులో.. అయోధ్య రామమందిర నమూనా
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆగస్టు 18న నిర్వహించనున్న చారిత్రక ‘ఇండియా డే’ కవాతులో అయోధ్య రామమందిర నమూనాను ప్రదర్శించనున్నారు. -
తోషాఖానా కేసులో ఇమ్రాన్కు మరో ఊరట
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(71)ను వెంటాడిన తోషాఖానా కేసులో మరో ఊరట లభించింది. -
బెంబేలెత్తించిన బెరిల్.. ద్వీపం ధ్వంసం!
కరీబియన్ దీవుల్లో భీకర ‘బెరిల్’ హరికేన్ భారీ విధ్వంసం సృష్టించింది. గంటకు దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు అనేక దీవుల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీశాయి. -
బ్రిటన్ పార్లమెంటు బరిలో భారత సంతతి అభ్యర్థుల హవా
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమైంది. గురువారం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2019 ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు రికార్డు స్థాయిలో ఎన్నికై పార్లమెంటులో అడుగడుపెట్టి చరిత్ర సృష్టించారు. -
భారతీయ విద్యార్థుల మద్దతుకు అమెరికాలో ప్రత్యేక ‘పోర్టల్’ వేదిక
అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సహాయార్థం న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక వేదికను రూపొందించింది. విద్యార్థులకు అమెరికన్ కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు వెదకటంతోపాటు న్యాయ, వైద్యపరమైన సమచారం ఈ వేదిక ద్వారా వారికి అందుబాటులో ఉంచుతారు. -
యుద్ధభూమిలో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా పంపండి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారత జాతీయులను క్షేమంగా స్వదేశానికి తిప్పిపంపాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ను బుధవారం భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ గట్టిగా కోరారు. -
ఇజ్రాయెల్ దాడిలో హెజ్బొల్లా కమాండర్ మృతి
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకుంటున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. -
చర్చ సమయంలో దాదాపు నిద్రపోయాను
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో గతవారం ముఖాముఖిలో తన ప్రదర్శన సరిగా లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. ‘సిబ్బంది వద్దని చెప్పినా చర్చకు ముందు నేను విదేశీ పర్యటనలు చేశాను. -
రష్యా క్షిపణుల దాడిలో ఐదుగురి మృతి
తూర్పు ఉక్రెయిన్లోని నిప్రొ నగరంపై బుధవారం రష్యా చేసిన క్షిపణి దాడుల్లో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. -
సంక్షిప్త వార్తలు
అమెరికాలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు.. ట్రంప్ హయాంలో గర్భవిచ్ఛిత్తిపై నిషేధం అమల్లోకి వచ్చిన రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు.