- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడులు
నైజీరియాలో శనివారం జరిగిన వరుస ఆత్మాహుతి దాడులు కలకలం రేపాయి. ఈ దాడుల్లో కనీసం 18 మంది మృతిచెందారు. 30 మంది తీవ్రంగా గాయపడగా.. వీరిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉంది.
18 మంది మృతి
మైదుగురి: నైజీరియాలో శనివారం జరిగిన వరుస ఆత్మాహుతి దాడులు కలకలం రేపాయి. ఈ దాడుల్లో కనీసం 18 మంది మృతిచెందారు. 30 మంది తీవ్రంగా గాయపడగా.. వీరిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉంది. నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని బోర్నో రాష్ట్రం గ్వోజా పట్టణంలో జరిగిన ఈ ఘటనల్లో అనుమానాస్పద మహిళా ఆత్మాహుతి బాంబర్లు దాడులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. మొదట.. గ్వోజా పట్టణంలో శనివారం సాయంత్రం జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో చిన్నారిని ఎత్తుకున్న ఓ మహిళ తనను తాను పేల్చుకున్నట్లు స్థానిక పోలీసులను ఉటంకిస్తూ ఏఎఫ్పీ న్యూస్ కథనాన్ని ప్రచురించింది. తర్వాత అదే పట్టణంలోని జనరల్ ఆసుపత్రిలో మరో మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ రెండు దాడుల నుంచి తేరుకోక ముందే.. వివాహ కార్యక్రమంలో మరణించినవారి అంత్యక్రియల ఏర్పాట్లలో మూడో మహిళ తన శరీరానికి అమర్చుకున్న ఐఈడీని పేల్చుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
17.42 గంటల్లో ఇంగ్లిష్ ఛానల్ ఈదిన భారత మాతృమూర్తి
ఇంగ్లిష్ ఛానల్ను ఈదిన మొదటి భారతీయ మాతృమూర్తిగా మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన తన్వీ చవాన్ దేవరె (33) రికార్డు సృష్టించారు. -
స్పెయిన్ విమానంలో కుదుపులు.. ఆగమాగమైన ప్రయాణికులు
గగనతలంలో వెళుతున్న విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ కుదుపుల తీవ్రతకు కొందరు సీట్లలో నుంచి అమాంతం ఎగిరిపడ్డారు. -
నేపాల్లో కూలనున్న ప్రచండ సర్కారు
నేపాల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ (69) నాయకత్వంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వ స్థానంలో కొత్త సంకీర్ణం పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. -
సంక్షిప్త వార్తలు
నేను రోజూ త్వరగా నిద్రపోతాను. త్వరగా నిద్రలేస్తాను. ఉదయం వార్తాపత్రిక చదవడమంటే ఇష్టం. కాఫీని ఆస్వాదిస్తా. నా పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి ముందే వారితో కలిసి అల్పాహారం తీసుకుంటా. -
ఖాన్ యూనిస్లో విధ్వంసం
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం మరోసారి బాంబులతో దద్దరిల్లింది. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు మెరుపు దాడికి దిగాయి. -
ఉక్రెయిన్కు మరో 230 కోట్ల డాలర్ల భద్రతా సాయం: అమెరికా
ఉక్రెయిన్కు త్వరలో 230 కోట్ల డాలర్ల అదనపు భద్రతా సాయాన్ని చేయనున్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. దీనికింద ట్యాంకు విధ్వంసక ఆయుధాలు, క్షిపణి నిరోధక వ్యవస్థలు, -
మోదీ, పుతిన్లు ఏదైనా చర్చించొచ్చు: క్రెమ్లిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్కు, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చాలా విశ్వసనీయమైన మైత్రి ఉందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పేర్కొంది. -
‘పశ్చాత్తాప పడే పని చేయవద్దు’ - ఓటర్లకు రిషి సునాక్ పిలుపు
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి రోజు అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన ప్రధాన మంత్రి రిషి సునాక్.. పశ్చాత్తప పడే పని చేయవద్దని ఓటర్లకు సూచించారు.