- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
హిందూ విశ్వాసం నుంచి ప్రేరణ పొందా
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి శనివారం లండన్లోని నీస్డెన్లో గల బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ్ ఆలయాన్ని సందర్శించారు.
రిషి సునాక్ వ్యాఖ్య
స్వామినారాయణ్ ఆలయ సందర్శన
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి శనివారం లండన్లోని నీస్డెన్లో గల బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ నెల 4న దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దైవ దర్శనం చేసుకున్నారు. వారికి ఆలయ పూజారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అక్కడ ఉన్న సేవా కార్యకర్తలు, హిందూ నాయకులతో సునాక్ మాట్లాడారు. భారత్ టీ20 ప్రపంచకప్ సాధించడాన్ని ప్రస్తావించారు. ‘‘నేను హిందువును. ఇక్కడున్న మీరంటే నాకెంతో ఇష్టం. నేను నా విశ్వాసం నుంచి ప్రేరణ, ఓదార్పు పొందుతాను. భగవద్గీతపై పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణం చేయడం నాకు గర్వకారణం. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలని మన విశ్వాసం బోధిస్తుంది. మన విధులను ఆత్మవిశ్వాసంతో నిర్వహించినప్పుడు ఫలితాన్ని చూసి చింతించకూడదు. ప్రజాసేవకు సంబంధించి నా దృక్పథంలో నా ధర్మమే నాకు మార్గదర్శకత్వం. ఏ భర్తకు లభించని విధంగా నా భార్య నాకు గొప్ప మద్దతుదారే కాక..ప్రజా సేవ పట్ల నిబద్ధత కలిగిన మహిళ’’ అని సునాక్ పేర్కొన్నారు. సునాక్ తన ఆలయ సందర్శన ద్వారా బ్రిటన్లోని హిందువుల ఓట్లను ఆకర్షిస్తున్నారు.
‘హిందూ’ ఓట్లపై పార్టీల కన్ను
బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి వారంతం కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు విస్తృత ప్రచారంలో మునిగిపోయారు. ఈ క్రమంలో అక్కడ హిందూ ఓటర్లపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్, లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్లు అక్కడ హిందూ దేవాలయాలను సందర్శించి, తమ విధానాలతో ఆ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ కూడా కింగ్స్బరీలో ఉన్న మరో స్వామినారాయణ్ ఆలయాన్ని సందర్శించారు. భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూనే హిందూ ఆలయాల రక్షణ, ఈ వర్గంపై దాడులను దీటుగా ఎదుర్కొనే చర్యలు తమ మేనిఫెస్టోలో ఉన్నాయన్నారు. 2021 గణాంకాల ప్రకారం బ్రిటన్లో దాదాపు 10లక్షల మంది హిందువులు ఉన్నట్లు అంచనా. వీరిలో ఓటర్ల సంఖ్య కూడా భారీగానే ఉండనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
17.42 గంటల్లో ఇంగ్లిష్ ఛానల్ ఈదిన భారత మాతృమూర్తి
ఇంగ్లిష్ ఛానల్ను ఈదిన మొదటి భారతీయ మాతృమూర్తిగా మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన తన్వీ చవాన్ దేవరె (33) రికార్డు సృష్టించారు. -
స్పెయిన్ విమానంలో కుదుపులు.. ఆగమాగమైన ప్రయాణికులు
గగనతలంలో వెళుతున్న విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ కుదుపుల తీవ్రతకు కొందరు సీట్లలో నుంచి అమాంతం ఎగిరిపడ్డారు. -
నేపాల్లో కూలనున్న ప్రచండ సర్కారు
నేపాల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ (69) నాయకత్వంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వ స్థానంలో కొత్త సంకీర్ణం పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. -
సంక్షిప్త వార్తలు
నేను రోజూ త్వరగా నిద్రపోతాను. త్వరగా నిద్రలేస్తాను. ఉదయం వార్తాపత్రిక చదవడమంటే ఇష్టం. కాఫీని ఆస్వాదిస్తా. నా పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి ముందే వారితో కలిసి అల్పాహారం తీసుకుంటా. -
ఖాన్ యూనిస్లో విధ్వంసం
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం మరోసారి బాంబులతో దద్దరిల్లింది. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు మెరుపు దాడికి దిగాయి. -
ఉక్రెయిన్కు మరో 230 కోట్ల డాలర్ల భద్రతా సాయం: అమెరికా
ఉక్రెయిన్కు త్వరలో 230 కోట్ల డాలర్ల అదనపు భద్రతా సాయాన్ని చేయనున్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. దీనికింద ట్యాంకు విధ్వంసక ఆయుధాలు, క్షిపణి నిరోధక వ్యవస్థలు, -
మోదీ, పుతిన్లు ఏదైనా చర్చించొచ్చు: క్రెమ్లిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్కు, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చాలా విశ్వసనీయమైన మైత్రి ఉందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పేర్కొంది. -
‘పశ్చాత్తాప పడే పని చేయవద్దు’ - ఓటర్లకు రిషి సునాక్ పిలుపు
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి రోజు అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన ప్రధాన మంత్రి రిషి సునాక్.. పశ్చాత్తప పడే పని చేయవద్దని ఓటర్లకు సూచించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆగస్టు 15 నుంచి వందే భారత్ స్లీపర్.. సికింద్రాబాద్, కాచిగూడ నుంచి నడపాలని ప్రతిపాదన
-
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్ను గుర్తుచేస్తూ..
-
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
-
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ
-
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్