- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
స్మార్ట్ఫోన్ బుజ్జగింపులు పిల్లలకు అనర్థదాయకం
పిల్లలు ఒక్కోసారి తీవ్ర అసహనంతో ఊగిపోతుంటారు. అలాంటి సందర్భాల్లో వారిని సులువుగా దారికి తెచ్చుకోవడానికి సెల్ఫోన్ వంటి డిజిటల్ సాధనాలను తల్లిదండ్రులు ఇస్తుంటారు.
దిల్లీ: పిల్లలు ఒక్కోసారి తీవ్ర అసహనంతో ఊగిపోతుంటారు. అలాంటి సందర్భాల్లో వారిని సులువుగా దారికి తెచ్చుకోవడానికి సెల్ఫోన్ వంటి డిజిటల్ సాధనాలను తల్లిదండ్రులు ఇస్తుంటారు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయని పరిశోధకులు తేల్చారు. ఆ పిల్లలు పెద్దయ్యాక భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకునే సామర్థ్యాన్ని కోల్పోతారని పేర్కొన్నారు. స్వీయ నియంత్రణ, వివిధ అంశాలకు ప్రతిస్పందించాల్సిన తీరు వంటి లక్షణాలను పిల్లలు చిన్నప్పుడే చాలావరకూ నేర్చుకుంటారు. వీరిలో అప్పుడప్పుడూ చెలరేగే ప్రతికూల భావోద్వేగ స్పందనను కట్టడి చేయడానికి.. ట్యాబ్లు, స్మార్ట్ఫోన్లోని వీడియోలను చూపడం ఇటీవల బాగా పెరిగిపోతోంది. తద్వారా వారిని కొద్దిసేపు తల్లిదండ్రులు ఏమారుస్తున్నారు. దీనివల్ల ఆ చిన్నారులు.. భవిష్యత్లో భావోద్వేగాలను సమర్థంగా గుర్తించి, వాటిని అదుపులో ఉంచుకునే సామర్థ్యాన్ని కోల్పోయే అవకాశం ఉందని హంగరీ, కెనడా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. డిజిటల్ సాధనాలతో బుజ్జగింపునకు లోనయ్యే చిన్నారుల్లో కోపం, చికాకు నియంత్రణ నైపుణ్యాలు చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఇప్పటికే భావోద్వేగాలను సరిగా అదుపులో ఉంచుకోలేకపోతున్న పిల్లలను దారికి తెచ్చుకోవడానికి వారి తల్లిదండ్రులు ఎలక్ట్రానిక్ సాధనాలపై చాలా ఎక్కువగా ఆధారపడుతున్నట్లు కూడా తేలింది. ఈ పోకడ ఎంత పెరిగితే.. చిన్నారుల్లో ఇబ్బందులు అంత జఠిలమవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైడెన్ వైదొలగాల్సిందే
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అట్లాంటాలో ఇటీవల జరిగిన సంవాదంలో పలుమార్లు తడబడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ దఫా ఎన్నికల బరి నుంచి వైదొలగాలన్న డిమాండ్లు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. -
పుడమికి చేరువగా వచ్చి వెళ్లిన గ్రహశకలాలు
రెండు గ్రహశకలాలు భూమికి అతిదగ్గరగా వచ్చి వెళ్లాయి. వీటి వల్ల ఎలాంటి ముప్పు కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
పిట్ట కొంచెం.. కిక్కు ఘనం..!
పక్షుల వ్యవహారశైలి చాలా వింతగా ఉంటుంది. కొన్ని విహంగాలు ఘాటైన రసాయనాల కోసం గాలిస్తుంటాయి. -
ఫ్రాన్స్లో పార్లమెంటరీ ఎన్నికల తొలి విడత పూర్తి
ఫ్రాన్స్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న పార్లమెంటరీ ఎన్నికల పర్వం ప్రారంభమైంది. మొత్తం రెండు విడతల్లో ఈ ఎన్నికలు జరగనుండగా.. ఆదివారం తొలి రౌండ్ పోలింగ్ పూర్తయింది. -
భీకర హరికేన్ ముప్పు అంచున ఆగ్నేయ కరేబియా ప్రాంతం
ఆగ్నేయ కరేబియన్ ప్రాంతం భీకర హరికేన్ (4వ తరగతి) ముప్పు ముంగిట నిలిచింది. ఆ ప్రాంతానికి సమీపంలో ఏర్పడిన బెరిల్ హరికేన్ దాని అనుకుని ఉన్న హరికేన్ను మరింత బలోపేతం చేస్తోందని అధికారులు తెలిపారు. -
బొమ్మ తుపాకీతో పోలీసులకు బెదిరింపు
పోలీసుల నుంచి తప్పించుకోబోయి, బొమ్మ తుపాకీతో వారిని బెదిరించడంతో ఓ 13ఏళ్ల బాలుడిని న్యూయార్క్ అధికారి ఒకరు తుపాకీతో కాల్చిచంపారు. న్యూయార్క్లోని యుటికా నగరంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
ఉక్రెయిన్పై రష్యా దాడి.. ఏడుగురి మృతి
దక్షిణ ఉక్రెయిన్లోని విల్నియాన్స్క్ పట్టణంపై శనివారం రాత్రి రష్యా ప్రయోగించిన క్షిపణులు ఏడుగురి ప్రాణాలను బలిగొన్నాయి. వీరిలో ముగ్గురు పిల్లలు. దాడిలో అనేకమంది గాయాలపాలయ్యారు. -
నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడులు
నైజీరియాలో శనివారం జరిగిన వరుస ఆత్మాహుతి దాడులు కలకలం రేపాయి. ఈ దాడుల్లో కనీసం 18 మంది మృతిచెందారు. 30 మంది తీవ్రంగా గాయపడగా.. వీరిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉంది. -
హిందూ విశ్వాసం నుంచి ప్రేరణ పొందా
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి శనివారం లండన్లోని నీస్డెన్లో గల బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ్ ఆలయాన్ని సందర్శించారు. -
సూడాన్లో సైన్యంతో సాయుధ ఘర్షణ
సైన్యానికి, ప్రమాదకరమైన సాయుధ బలగాలకు మధ్య మొదలైన ఘర్షణతో ఆఫ్రికాలోని సూడాన్లో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. -
బైడెన్ స్థానంలో మరొకరు?- రిపబ్లికన్లకు నిక్కీ హేలీ అలర్ట్
జో బైడెన్ స్థానంలో ఓ యువనేత, సమర్థవంతమైన వ్యక్తి రానున్నాడని రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ అంచనా వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
-
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
-
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి