- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
500 కోట్ల మందిపై తీవ్రమైన వేడి ప్రభావం
వాతావరణ మార్పుల వల్ల జూన్లో తొమ్మిది రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారని అమెరికాకు చెందిన స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం చేసిన తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది.
అందులో భారతీయులు 61.9 కోట్లు
తాజా అధ్యయనంలో వెల్లడి
దిల్లీ: వాతావరణ మార్పుల వల్ల జూన్లో తొమ్మిది రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారని అమెరికాకు చెందిన స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం చేసిన తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. ఇందులో 61.9 కోట్ల మంది భారతీయులూ ఉన్నారని వెల్లడించింది. వారి క్లైమేట్ సెంట్రల్ నివేదిక ప్రకారం.. జూన్లో బొబ్బలు వచ్చే వేడి వల్ల భారత్లో 61.9 కోట్ల మంది, చైనాలో 57.9 కోట్లు, ఇండోనేసియాలో 23.1 కోట్లు, నైజీరియాలో 20.6 కోట్లు, బ్రెజిల్లో 17.6 కోట్లు, బంగ్లాదేశ్లో 17.1 కోట్లు, అమెరికాలో 16.5 కోట్లు, ఐరోపాలో 15.2 కోట్లు, మెక్సికోలో 12.3 కోట్లు, ఇథియోపియాలో 12.1 కోట్లు, ఈజిప్టులో 10.3 కోట్ల మంది ఇబ్బందులు పడ్డారని వివరించింది. జూన్ 16 నుంచి 24వ తేదీ మధ్య ప్రపంచ జనాభాలో 60 శాతం మంది అధిక వేడిమిని భరించారని పేర్కొంది. భారత్లో ఈసారి అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల వల్ల 40 వేలకు పైగా వడదెబ్బ కేసులు, 100కు పైగా మరణాలు నమోదయ్యాయని నివేదిక తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైడెన్ వైదొలగాల్సిందే
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అట్లాంటాలో ఇటీవల జరిగిన సంవాదంలో పలుమార్లు తడబడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ దఫా ఎన్నికల బరి నుంచి వైదొలగాలన్న డిమాండ్లు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. -
పుడమికి చేరువగా వచ్చి వెళ్లిన గ్రహశకలాలు
రెండు గ్రహశకలాలు భూమికి అతిదగ్గరగా వచ్చి వెళ్లాయి. వీటి వల్ల ఎలాంటి ముప్పు కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
పిట్ట కొంచెం.. కిక్కు ఘనం..!
పక్షుల వ్యవహారశైలి చాలా వింతగా ఉంటుంది. కొన్ని విహంగాలు ఘాటైన రసాయనాల కోసం గాలిస్తుంటాయి. -
ఫ్రాన్స్లో పార్లమెంటరీ ఎన్నికల తొలి విడత పూర్తి
ఫ్రాన్స్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న పార్లమెంటరీ ఎన్నికల పర్వం ప్రారంభమైంది. మొత్తం రెండు విడతల్లో ఈ ఎన్నికలు జరగనుండగా.. ఆదివారం తొలి రౌండ్ పోలింగ్ పూర్తయింది. -
భీకర హరికేన్ ముప్పు అంచున ఆగ్నేయ కరేబియా ప్రాంతం
ఆగ్నేయ కరేబియన్ ప్రాంతం భీకర హరికేన్ (4వ తరగతి) ముప్పు ముంగిట నిలిచింది. ఆ ప్రాంతానికి సమీపంలో ఏర్పడిన బెరిల్ హరికేన్ దాని అనుకుని ఉన్న హరికేన్ను మరింత బలోపేతం చేస్తోందని అధికారులు తెలిపారు. -
బొమ్మ తుపాకీతో పోలీసులకు బెదిరింపు
పోలీసుల నుంచి తప్పించుకోబోయి, బొమ్మ తుపాకీతో వారిని బెదిరించడంతో ఓ 13ఏళ్ల బాలుడిని న్యూయార్క్ అధికారి ఒకరు తుపాకీతో కాల్చిచంపారు. న్యూయార్క్లోని యుటికా నగరంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
ఉక్రెయిన్పై రష్యా దాడి.. ఏడుగురి మృతి
దక్షిణ ఉక్రెయిన్లోని విల్నియాన్స్క్ పట్టణంపై శనివారం రాత్రి రష్యా ప్రయోగించిన క్షిపణులు ఏడుగురి ప్రాణాలను బలిగొన్నాయి. వీరిలో ముగ్గురు పిల్లలు. దాడిలో అనేకమంది గాయాలపాలయ్యారు. -
నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడులు
నైజీరియాలో శనివారం జరిగిన వరుస ఆత్మాహుతి దాడులు కలకలం రేపాయి. ఈ దాడుల్లో కనీసం 18 మంది మృతిచెందారు. 30 మంది తీవ్రంగా గాయపడగా.. వీరిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉంది. -
హిందూ విశ్వాసం నుంచి ప్రేరణ పొందా
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి శనివారం లండన్లోని నీస్డెన్లో గల బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ్ ఆలయాన్ని సందర్శించారు. -
సూడాన్లో సైన్యంతో సాయుధ ఘర్షణ
సైన్యానికి, ప్రమాదకరమైన సాయుధ బలగాలకు మధ్య మొదలైన ఘర్షణతో ఆఫ్రికాలోని సూడాన్లో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. -
బైడెన్ స్థానంలో మరొకరు?- రిపబ్లికన్లకు నిక్కీ హేలీ అలర్ట్
జో బైడెన్ స్థానంలో ఓ యువనేత, సమర్థవంతమైన వ్యక్తి రానున్నాడని రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ అంచనా వేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
-
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై ఘాటుగా స్పందించిన లోకేశ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM