- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సంక్షిప్త వార్తలు (4)
అమెరికాలో ఆసియన్ల జనాభా 2.06 కోట్లకు చేరుకుంది. 2023లో 5,85,000 మంది ఆసియన్లు పెరిగారు. వీరిలో వలస వచ్చిన వారే అధికం.
అమెరికాలో 2.06 కోట్లకు చేరుకున్న ఆసియన్ల జనాభా
హ్యూస్టన్: అమెరికాలో ఆసియన్ల జనాభా 2.06 కోట్లకు చేరుకుంది. 2023లో 5,85,000 మంది ఆసియన్లు పెరిగారు. వీరిలో వలస వచ్చిన వారే అధికం. అమెరికా జన గణన సంస్థ గురువారం విడుదల చేసిన 2023 నాటి లెక్కల ప్రకారం.. టెక్సాస్లోనే ఆసియన్లు అధికంగా నివసించడానికి ఇష్టపడుతున్నారు. హ్యూస్టన్లో హిస్పానియన్లు, డాలస్లో ఆసియన్లు అధికంగా పెరిగారు. టెక్సాస్కు అదనంగా 2023లో 92,000 మంది ఆసియన్లు వచ్చి చేరారు. ప్రస్తుతం దేశంలో హిస్పానియేతర శ్వేత జాతీయులు 58శాతం ఉన్నారు. అమెరికాలో వారిదే అతి పెద్ద వర్గం. ఆ తర్వాతి స్థానంలో హిస్పానియన్లు ఉన్నారు. దేశంలో వారి జనాభా 6.52 కోట్లు. ఆఫ్రో అమెరికన్ల జనాభా 4.23 కోట్లుగా ఉంది.
ఈజిప్టుకు చేరిన 21 మంది గాజా క్యాన్సర్ రోగులు
దుబాయ్: గాజాలో ఆసుపత్రులు ధ్వంసం కావడంతో చికిత్స దొరక్క ఇబ్బందిపడుతున్న 21 మంది క్యాన్సర్ రోగులు గురువారం ఈజిప్టు చేరుకున్నారు. మే నెలలో రఫా క్రాసింగ్ మూతపడిన తర్వాత ఈజిప్టులోకి గాజా రోగులు ప్రవేశించడం ఇదే తొలిసారి. వీరు ఈజిప్టు నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్లి అక్కడ చికిత్స తీసుకోనున్నారు.
ఎర్రసముద్రంలో గురువారం మరో వాణిజ్యనౌకపై యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. సిబ్బంది ఎవరైనా గాయపడ్డారా లేదా అన్న వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
డాలస్ రెస్టారెంటులో ఇద్దరి కాల్చివేత
ఇర్వింగ్ (టెక్సాస్): డాలస్ శివారులోని ఓ రెస్టారెంటులో బుధవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఇవి వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని జరిపిన కాల్పులని, అనుమానితుణ్ని గుర్తించినా ఇంకా అరెస్టు చేయలేదని ఇర్వింగ్ పోలీసులు చెప్పారు. కాల్పులకు దారితీసిన కారణాలను ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.
బొలీవియాలో సైనిక తిరుగుబాటు యత్నం విఫలం
లా పాజ్: బొలీవియాలో అధ్యక్షుడు లూయీస్ ఆర్సే ప్రభుత్వంపై జరిగిన సైనిక తిరుగుబాటు విఫలమైంది. ప్రధాన సైన్యాధికారి జనరల్ హువాన్ హోసే జునిగా నాయకత్వంలో సైనిక దళాలు దేశాధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లినా వెంటనే వెనుదిరిగాయి. రాజధాని లా పాజ్లో గురువారం తిరిగి ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. జనరల్ జునిగా దళాలు ఓ యుద్ధ ట్యాంకుతో అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లాయి. రాజధానిలోని ప్రధాన కూడలిని స్వాధీనం చేసుకున్నాయి. దానిని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన ప్రజలపై బాష్పవాయు ప్రయోగం చేశాయి. మూడు గంటల సేపు కొనసాగిన ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చిపెట్టాయి. ప్రతిపక్షాలు కూడా జనరల్ జునిగా తిరుగుబాటును ఖండించడంతో ఆయన తన దుస్సాహసాన్ని విరమించారు. దేశాధ్యక్షుడు ఆర్సే ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించి కొత్త ప్రధాన సైన్యాధికారిని నియమించారు. జనరల్ జునిగాను అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహ్మద్ అబు సల్మియాను విడుదల చేసిన ఇజ్రాయెల్
హమాస్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారని ఆరోపిస్తూ.. గతంలో బందీగా తీసుకెళ్లిన అల్-షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబు సల్మియాను ఇజ్రాయెల్ తాజాగా విడుదల చేసింది. -
నాలుగేళ్ల తర్వాత భారత్కు ప్రయాణం.. విమానంలో ప్రాణం విడిచిన యువతి!
నాలుగేళ్ల తర్వాత కుటుంబాన్ని కలుసుకునేందుకు భారత్కు బయలుదేరిన ఓ యువతి విమానంలోనే ప్రాణాలు కోల్పోయింది. -
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే..: మెలానియా ఏం చేయనున్నారు!
అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్(Biden), ట్రంప్(Trump) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్, ఆయన సతీమణి మధ్య ఒక డీల్ కుదిరిందని తెలుస్తోంది. -
స్పీకర్జీ.. సూటిగా చూడరేం.. ఎంపీ వీడియో వైరల్
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో చోటుచేసుకున్న ఓ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
విద్యార్థుల ఆస్ట్రేలియా కల మరింత భారం..!
ఆస్ట్రేలియాకు వెళ్లే విద్యార్థులకు ఇచ్చే వీసాల్లో ఆ దేశం భారీ మార్పులు చేపట్టింది. నేడు వాటి ఖరీదు కూడా పెరిగింది. వలసలను అదుపు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. -
యుద్ధం చేస్తామంటే విడుదల చేస్తాం.. ఖైదీలకు ఆఫర్
Ukraine: సైన్యంలో సిబ్బంది కొరతతో సతమతమవుతోన్న ఉక్రెయిన్ అక్కడి జైలులో ఉన్న ఖైదీలను ఇంటర్వ్యూ చేస్తోంది. యుద్ధంలో చేరుతామంటే జైలు నుంచి విడుదల చేస్తామని వారికి ఆఫర్ ఇస్తోంది. -
విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకొన్న మహిళా టీచర్..!
పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ అమెరికాలో విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకొంది. ఈ విషయం బయటపడటంతో ఇప్పుడు ఆమె ఊచలు లెక్కబెడుతోంది. -
ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపడిన చైనా రాకెట్..!
చైనాలో ప్రయోగానికి సిద్ధం చేస్తున్న ఓ రాకెట్ ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరి సమీపంలోని కొండల్లో పడింది. ఆ వీడియో వైరల్గా మారింది. -
బైడెన్ వైదొలగాల్సిందే
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అట్లాంటాలో ఇటీవల జరిగిన సంవాదంలో పలుమార్లు తడబడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ దఫా ఎన్నికల బరి నుంచి వైదొలగాలన్న డిమాండ్లు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. -
పుడమికి చేరువగా వచ్చి వెళ్లిన గ్రహశకలాలు
రెండు గ్రహశకలాలు భూమికి అతిదగ్గరగా వచ్చి వెళ్లాయి. వీటి వల్ల ఎలాంటి ముప్పు కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
పిట్ట కొంచెం.. కిక్కు ఘనం..!
పక్షుల వ్యవహారశైలి చాలా వింతగా ఉంటుంది. కొన్ని విహంగాలు ఘాటైన రసాయనాల కోసం గాలిస్తుంటాయి. -
ఫ్రాన్స్లో పార్లమెంటరీ ఎన్నికల తొలి విడత పూర్తి
ఫ్రాన్స్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న పార్లమెంటరీ ఎన్నికల పర్వం ప్రారంభమైంది. మొత్తం రెండు విడతల్లో ఈ ఎన్నికలు జరగనుండగా.. ఆదివారం తొలి రౌండ్ పోలింగ్ పూర్తయింది. -
భీకర హరికేన్ ముప్పు అంచున ఆగ్నేయ కరేబియా ప్రాంతం
ఆగ్నేయ కరేబియన్ ప్రాంతం భీకర హరికేన్ (4వ తరగతి) ముప్పు ముంగిట నిలిచింది. ఆ ప్రాంతానికి సమీపంలో ఏర్పడిన బెరిల్ హరికేన్ దాని అనుకుని ఉన్న హరికేన్ను మరింత బలోపేతం చేస్తోందని అధికారులు తెలిపారు. -
బొమ్మ తుపాకీతో పోలీసులకు బెదిరింపు
పోలీసుల నుంచి తప్పించుకోబోయి, బొమ్మ తుపాకీతో వారిని బెదిరించడంతో ఓ 13ఏళ్ల బాలుడిని న్యూయార్క్ అధికారి ఒకరు తుపాకీతో కాల్చిచంపారు. న్యూయార్క్లోని యుటికా నగరంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
ఉక్రెయిన్పై రష్యా దాడి.. ఏడుగురి మృతి
దక్షిణ ఉక్రెయిన్లోని విల్నియాన్స్క్ పట్టణంపై శనివారం రాత్రి రష్యా ప్రయోగించిన క్షిపణులు ఏడుగురి ప్రాణాలను బలిగొన్నాయి. వీరిలో ముగ్గురు పిల్లలు. దాడిలో అనేకమంది గాయాలపాలయ్యారు. -
నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడులు
నైజీరియాలో శనివారం జరిగిన వరుస ఆత్మాహుతి దాడులు కలకలం రేపాయి. ఈ దాడుల్లో కనీసం 18 మంది మృతిచెందారు. 30 మంది తీవ్రంగా గాయపడగా.. వీరిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉంది. -
హిందూ విశ్వాసం నుంచి ప్రేరణ పొందా
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి శనివారం లండన్లోని నీస్డెన్లో గల బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ్ ఆలయాన్ని సందర్శించారు. -
సూడాన్లో సైన్యంతో సాయుధ ఘర్షణ
సైన్యానికి, ప్రమాదకరమైన సాయుధ బలగాలకు మధ్య మొదలైన ఘర్షణతో ఆఫ్రికాలోని సూడాన్లో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. -
బైడెన్ స్థానంలో మరొకరు?- రిపబ్లికన్లకు నిక్కీ హేలీ అలర్ట్
జో బైడెన్ స్థానంలో ఓ యువనేత, సమర్థవంతమైన వ్యక్తి రానున్నాడని రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ అంచనా వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేశాయ్..
-
రకుల్ప్రీత్ మోటివేషన్.. నభా ప్రమోషన్.. రుహానీ శర్మ సెల్ఫీ!
-
కాగజ్నగర్లో తల్లీ ముగ్గురు కూతుళ్ల ఆత్మహత్యాయత్నం
-
కర్ణాటకలో నాయకత్వ మార్పు..? సీఎం ఏమన్నారంటే!
-
ఆ సైనికుల మరణం తీవ్రంగా కలచివేసింది: చంద్రబాబు
-
మహ్మద్ అబు సల్మియాను విడుదల చేసిన ఇజ్రాయెల్