- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
అమెరికాలో వరదలకు కూలిన వంతెన
కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అమెరికాలో వరదలు తీవ్రమయ్యాయి. ప్రవాహ తీవ్రతకు ఓ రైలు వంతెన కూలగా, మరోచోట ఓ డ్యామ్ బద్దలై జనావాసాల్లోకి నీరు చేరింది.
ఇద్దరి మృతి
మిన్నెసోటా రాష్ట్రంలో వరదల కారణంగా తెగిపోయిన డ్యామ్
నార్త్ సియోక్స్ సిటీ(అమెరికా): కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అమెరికాలో వరదలు తీవ్రమయ్యాయి. ప్రవాహ తీవ్రతకు ఓ రైలు వంతెన కూలగా, మరోచోట ఓ డ్యామ్ బద్దలై జనావాసాల్లోకి నీరు చేరింది. ముఖ్యంగా అయోవా, సౌత్ డకోటా, మిన్నెసోటా, నెబ్రస్కా రాష్ట్రాల్లో దాదాపు 30 లక్షల మంది వరదలవల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయోవాలో ఓ వ్యక్తి వరదలో కొట్టుకుపోగా, సౌత్ డకోటాలో మరొకరు మరణించారు. గురువారం నుంచి శనివారం వరకూ కొన్ని చోట్ల 46 సెం.మీ. వర్షపాతం నమోదుకావడంతో చాలా ప్రాంతాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పైనుంచి వరద రావడంతో వర్షాలు లేని ప్రాంతాల్లోనూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు పడే సూచనలున్నాయని, ఈ వారం మధ్యనాటికి మిసౌరీ, మిసిసిపీ నదులు ఉద్ధృతిని అందుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సౌత్ డకోటాలోని బిగ్ సియోక్స్ నదిపై నిర్మించిన ఓ రైలు వంతెన ఆదివారం రాత్రి 11 గంటలకు కూలింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. మిన్నెసోటాలోని బ్లూఎర్త్ కౌంటీలో వరద తీవ్రతకు ది ర్యాపిడాన్ డ్యామ్ బద్దలైంది. దీంతో డ్యామ్ దిగువనున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిడ్వెస్ట్ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఓవైపు వరదలు, మరోవైపు వేడి గాలులతో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. సోమవారం అక్కడ కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతరిక్ష కేంద్రాన్ని తొలగించేందుకు రూ.7వేల కోట్లు.. మస్క్కు నాసా కాంట్రాక్ట్
International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు నాసా ప్రణాళికలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్కు రూ.7వేల కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది. -
పంచశీల ఒప్పందం భేష్.. నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు
India-China: విదేశీ విధానానికి సంబంధించి భారత్ తీసుకొచ్చిన పంచశీల ఒప్పందం మెరుగైందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. ఈసందర్భంగా భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విధానాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. -
అవును నేను వృద్ధుడినే.. కానీ: డిబేట్లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే..?
ట్రంప్ (Trump)తో జరిగిన సంవాదంలో బైడెన్ (Biden) తడబాటుకు గురయ్యారు. దీని గురించి ఆందోళన వ్యక్తమవుతోన్న తరుణంలో అధ్యక్షుడు స్పందించారు. -
నువ్వు అబద్ధాలకోరువి.. కాదు నువ్వే
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. నువ్వు అబద్ధాలకోరువంటే.. నువ్వే అబద్ధాలకోరువంటూ మాటల దాడి చేసుకున్నారు. -
అణుసామర్థ్య స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణులను తయారుచేస్తాం
అణు సామర్థ్యం గల స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణుల తయారీని పునఃప్రారంభిస్తామని శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికాను హెచ్చరించారు. -
స్మార్ట్ఫోన్ బుజ్జగింపులు పిల్లలకు అనర్థదాయకం
పిల్లలు ఒక్కోసారి తీవ్ర అసహనంతో ఊగిపోతుంటారు. అలాంటి సందర్భాల్లో వారిని సులువుగా దారికి తెచ్చుకోవడానికి సెల్ఫోన్ వంటి డిజిటల్ సాధనాలను తల్లిదండ్రులు ఇస్తుంటారు. -
ఐఎస్ఎస్లో కొద్దిసేపు ఎమర్జెన్సీ
భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఇటీవల కొద్దిసేపు ఎమర్జెన్సీ నెలకొంది. దీంతో వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు తప్పనిసరిగా బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో తలదాచుకోవాల్సి వచ్చింది. -
చాంగే-6 తెచ్చిన చందమామ నమూనాలు 2 కిలోలు
చంద్రుడి అవతలి భాగం నుంచి భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమనౌక చాంగే-6.. తన వెంట దాదాపు 2 కిలోల నమూనాలను తీసుకొచ్చింది. -
అమెరికాలో కొవిడ్ కేసులు
అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా కొవిడ్-19 కేసులు వెలుగుచూస్తుండడంతో ఇక్కడి సీడీసీ(సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
అమెరికా హెల్త్ కేర్ కుంభకోణంలో హైదరాబాద్ వైద్యుడు
అమెరికాలో చోటుచేసుకున్న భారీ ఆరోగ్య సంరక్షణ (హెల్త్ కేర్) కుంభకోణానికి సంబంధించి ఓ భారతీయుడు, ఇద్దరు భారత సంతతి వ్యక్తులు సహా 193 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. -
500 కోట్ల మందిపై తీవ్రమైన వేడి ప్రభావం
వాతావరణ మార్పుల వల్ల జూన్లో తొమ్మిది రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారని అమెరికాకు చెందిన స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం చేసిన తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. -
నౌకలపై దాడులు ఆపండి
పశ్చిమాసియా సముద్ర జలాల్లో నౌకా రవాణాకు ఆటంకం కలిగించవద్దని, నౌకలపై దాడులు నిలిపివేయాలని హూతీ తిరుగుబాటుదారులను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం ఓ తీర్మానం ఆమోదించింది. -
బైడెన్, ట్రంప్ వాడీవే‘ఢీ’
ప్రపంచవ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల చర్చ ఊహించినట్లే వాడీవేడిగా జరిగింది. -
ఆ దూషణలు నన్నెంతో బాధించాయి - రిషి సునాక్
రిఫార్మ్ పార్టీకి చెందిన ఓ నేత తనపై చేసిన జాత్యాహంకార దూషణలు ఎంతో బాధించాయని, ఆగ్రహం కూడా తెప్పించాయని రిషి సునాక్ పేర్కొన్నారు. -
‘పక్షపాత వైఖరి.. ఓటు బ్యాంకు కోణం’.. అమెరికా నివేదికను ఖండించిన భారత్
‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ’పై అమెరికా విడుదల చేసిన నివేదికను ఖండిస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ ఛైర్మన్గా చల్లా శ్రీనివాసులు.. ప్రతిపాదించిన ఎఫ్ఎస్ఐబీ
-
ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక: చంద్రబాబు
-
స్టైలిష్ అనసూయ.. చీరకట్టులో విష్ణు ప్రియ..
-
ఒకటో తేదీనే 90 శాతం పింఛన్లు పంపిణీ చేయాలి: ఏపీ సీఎస్
-
అంతరిక్ష కేంద్రాన్ని తొలగించేందుకు రూ.7వేల కోట్లు.. మస్క్కు నాసా కాంట్రాక్ట్
-
వైవీయూ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా.. ఆమోదించిన ప్రభుత్వం