- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
భూమికి చేరిన జాబిల్లి ఆవలిభాగం నమూనాలు
చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా జాబిల్లి ఆవలివైపు నమూనాలను సేకరించి, వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది.
ప్రపంచంలోనే తొలిసారిగా సాధించిన చైనా
ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో దిగిన రిటర్న్ క్యాప్సూల్
బీజింగ్: చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా జాబిల్లి ఆవలివైపు నమూనాలను సేకరించి, వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండోవైపు నుంచి మట్టితో చాంగే-6 వ్యోమనౌక మంగళవారం పుడమిని చేరుకుంది. ఈ యాత్రను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అభినందించారు.
మే 3న నింగికెగిరిన చాంగే-6.. జూన్ 2న జాబిల్లి ఆవలివైపున సౌత్ పోల్-అయిట్కిన్ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్లో సురక్షితంగా దిగింది. జాబిల్లి ఉపరితలంపై ఉన్న నమూనాలను రోబోటిక్ హస్తం సాయంతో సేకరించింది. డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి ఉపరితలానికి దిగువనున్న ప్రాంతం నుంచి మట్టిని తీసుకుంది. ఈ నెల 4న.. నమూనాలతో చంద్రుడి ఉపరితలం నుంచి బయలుదేరి, చందమామ కక్ష్యలోకి చేరింది. అనంతరం భూమి దిశగా పయనాన్ని ఆరంభించింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.07 గంటలకు చాంగే-6లోని రిటర్నర్ క్యాప్సూల్.. పారాచూట్ల సాయంతో ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో సురక్షితంగా దిగింది. ఇందులో 2 కిలోల మేర జాబిల్లి నమూనాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్యాప్సూల్ను వాయు మార్గంలో బీజింగ్ తరలించి, అక్కడ తెరుస్తారు. చందమామ నమూనాలను శాస్త్రవేత్తల బృందానికి అప్పగిస్తారు. చంద్రుడి ఆవిర్భావం గురించి ఇది మరిన్ని కొత్త వివరాలను వెలుగులోకి తెస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జాబిల్లి రెండు పార్శ్వాలకు మధ్య ఉన్న వైరుధ్యాల గురించి కూడా తెలుస్తుందని వివరించారు.
సంక్లిష్ట యాత్ర
చందమామకు సంబంధించిన ఒక భాగం మాత్రమే భూమి నుంచి కనిపిస్తుంది. దాన్ని ఇవతలి భాగం (నియర్ సైడ్)గా పేర్కొంటారు. కనిపించని ఆ రెండో పార్శ్యాన్ని ఆవలి భాగం (ఫార్ సైడ్)గా పిలుస్తారు. ఇప్పటివరకు అమెరికా, సోవియెట్ యూనియన్తో పాటు చైనా కూడా పలుమార్లు ఇవతలి వైపు నుంచి నమూనాలను సేకరించి భూమికి తీసుకొచ్చింది. అవతలి భాగం నుంచి మట్టి, శిలలను తీసుకురావడం ఇదే తొలిసారి. దూరం, అక్కడి భారీ బిలాలు వంటి కారణాలరీత్యా చంద్రుడిలోని ఆ పార్శ్వం వద్దకు యాత్రల నిర్వహణ చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. చందమామ అవతలి భాగంలో ఇప్పటివరకూ వ్యోమనౌకను విజయవంతంగా దించిన ఘనత చైనాకు మాత్రమే ఉంది. ఇప్పటికి రెండుసార్లు అక్కడ ల్యాండింగ్ నిర్వహించింది. చంద్రుడి రెండు ప్రాంతాలు పూర్తిగా భిన్నమని రిమోట్ సెన్సింగ్ పరిశీలనల్లో వెల్లడైంది. ఇవతలి భాగం ఒకింత చదునుగా ఉంటుంది. అవతలి ప్రాంతం అంతరిక్ష శిలలు ఢీకొట్టడం వల్ల ఏర్పడిన బిలాలతో నిండిపోయి ఉంటుంది. చంద్రుడి ఉపరితల మందం కూడా రెండు భాగాల్లో భిన్న రీతుల్లో ఉన్నట్లు వెల్లడైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నువ్వు అబద్ధాలకోరువి.. కాదు నువ్వే
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. నువ్వు అబద్ధాలకోరువంటే.. నువ్వే అబద్ధాలకోరువంటూ మాటల దాడి చేసుకున్నారు. -
అణుసామర్థ్య స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణులను తయారుచేస్తాం
అణు సామర్థ్యం గల స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణుల తయారీని పునఃప్రారంభిస్తామని శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికాను హెచ్చరించారు. -
స్మార్ట్ఫోన్ బుజ్జగింపులు పిల్లలకు అనర్థదాయకం
పిల్లలు ఒక్కోసారి తీవ్ర అసహనంతో ఊగిపోతుంటారు. అలాంటి సందర్భాల్లో వారిని సులువుగా దారికి తెచ్చుకోవడానికి సెల్ఫోన్ వంటి డిజిటల్ సాధనాలను తల్లిదండ్రులు ఇస్తుంటారు. -
ఐఎస్ఎస్లో కొద్దిసేపు ఎమర్జెన్సీ
భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఇటీవల కొద్దిసేపు ఎమర్జెన్సీ నెలకొంది. దీంతో వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు తప్పనిసరిగా బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో తలదాచుకోవాల్సి వచ్చింది. -
చాంగే-6 తెచ్చిన చందమామ నమూనాలు 2 కిలోలు
చంద్రుడి అవతలి భాగం నుంచి భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమనౌక చాంగే-6.. తన వెంట దాదాపు 2 కిలోల నమూనాలను తీసుకొచ్చింది. -
అమెరికాలో కొవిడ్ కేసులు
అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా కొవిడ్-19 కేసులు వెలుగుచూస్తుండడంతో ఇక్కడి సీడీసీ(సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
అమెరికా హెల్త్ కేర్ కుంభకోణంలో హైదరాబాద్ వైద్యుడు
అమెరికాలో చోటుచేసుకున్న భారీ ఆరోగ్య సంరక్షణ (హెల్త్ కేర్) కుంభకోణానికి సంబంధించి ఓ భారతీయుడు, ఇద్దరు భారత సంతతి వ్యక్తులు సహా 193 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. -
500 కోట్ల మందిపై తీవ్రమైన వేడి ప్రభావం
వాతావరణ మార్పుల వల్ల జూన్లో తొమ్మిది రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారని అమెరికాకు చెందిన స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం చేసిన తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. -
నౌకలపై దాడులు ఆపండి
పశ్చిమాసియా సముద్ర జలాల్లో నౌకా రవాణాకు ఆటంకం కలిగించవద్దని, నౌకలపై దాడులు నిలిపివేయాలని హూతీ తిరుగుబాటుదారులను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం ఓ తీర్మానం ఆమోదించింది. -
బైడెన్, ట్రంప్ వాడీవే‘ఢీ’
ప్రపంచవ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల చర్చ ఊహించినట్లే వాడీవేడిగా జరిగింది. -
ఆ దూషణలు నన్నెంతో బాధించాయి - రిషి సునాక్
రిఫార్మ్ పార్టీకి చెందిన ఓ నేత తనపై చేసిన జాత్యాహంకార దూషణలు ఎంతో బాధించాయని, ఆగ్రహం కూడా తెప్పించాయని రిషి సునాక్ పేర్కొన్నారు. -
‘పక్షపాత వైఖరి.. ఓటు బ్యాంకు కోణం’.. అమెరికా నివేదికను ఖండించిన భారత్
‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ’పై అమెరికా విడుదల చేసిన నివేదికను ఖండిస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది.