- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
తిరుగు ప్రయాణంలోనూ సునీతా విలియమ్స్కు తిప్పలు
సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదాపడిన తర్వాత ఎట్టకేలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్కు తిరుగు ప్రయాణంలోనూ తిప్పలు తప్పడంలేదు.
ఇంకా ఐఎస్ఎస్లోనే భారత సంతతి వ్యోమగామి!
వాషింగ్టన్: సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదాపడిన తర్వాత ఎట్టకేలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్కు తిరుగు ప్రయాణంలోనూ తిప్పలు తప్పడంలేదు. దీంతో ల్యాండింగ్ వాయిదా పడింది. సునీతతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు ప్రయాణించిన బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక ఈ నెల 5న ఐఎస్ఎస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. 14న వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సింది. అయితే స్టార్లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో భూమిపై ల్యాండింగ్ను వాయిదా వేశారు. జూన్ 26న వీరు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా ప్రకటించగా.. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. కొత్త తేదీని ఇంకా వెల్లడించలేదు. అన్నీ అనుకూలిస్తే జులై 2న వీరి తిరుగుప్రయాణం ఉండొచ్చని అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా అంచనా వేస్తోంది. స్టార్లైనర్ వ్యోమనౌకకు ఇదే తొలి మానవసహిత యాత్ర. భూమి నుంచి బయలుదేరే సమయంలోనూ దీనికి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. హీలియం లీకేజీ కారణంగా గైడెన్స్-కంట్రోల్ థ్రస్టర్లలో ఇబ్బందులు ఎదురై సునీత, విల్మోర్ల అంతరిక్షయానం పలుమార్లు వాయిదా పడింది. రోదసిలోకి వెళ్లిన తర్వాత కూడా కాస్త ఆలస్యంగా ఐఎస్ఎస్తో ఈ వ్యోమనౌక అనుసంధానం కాగలిగింది. సునీతకు ఇది మూడో రోదసి యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ఐఎస్ఎస్కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్వాక్ నిర్వహించారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఐఎస్ఎస్లో ఓసారి మారథాన్ కూడా చేశారు. ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడే హెచ్చరికలు.. అంతలోనే బాంబుల మోత.. ఖాన్ యూనిస్లో విధ్వంసం
గాజాలోని అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్పై ఇజ్రాయెల్ దళాలు బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. -
భారత్-పాక్ సంబంధాలపై.. అమెరికా ఏమన్నదంటే?
భారత్-అమెరికాల మధ్య ఆర్థిక, భద్రతా రంగాల్లో ఎంతో సహకారం ఉందని, ఇదే ఒరవడిని ఇకముందు కొనసాగిస్తామని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. -
అమెరికాలో బిలియన్ డాలర్ల స్కామ్లో భారతీయులకు జైలు
అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తలు బిలియన్ డాలర్ల స్కామ్ చేశారు. దీంతో న్యాయస్థానం వారికి జైలు శిక్ష విధించింది. -
విమానంలో కుదుపులు.. ఓవర్హెడ్ బిన్లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు
గగనతలంలో విమాన ప్రయాణికులు తీవ్ర భయానక పరిస్థితులు ఎదుర్కొన్నారు. కుదుపుల (Turbulence)తో కొందరు అమాంతం సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. -
‘నాయకులు ఇంకెప్పుడు తెలుసుకుంటారు..’: గర్భవిచ్ఛిత్తి పోస్ట్పై మస్క్ వర్సెస్ కమలా హ్యారిస్!
Elon Musk Vs Kamala Harris: గర్భవిచ్ఛిత్తిపై ట్రంప్ నిషేధం విధిస్తారని కమలా హ్యారిస్ చేసిన పోస్ట్పై ఎక్స్ కమ్యూనిటీ నోట్స్ ట్యాగ్ను జత చేసింది. దీనిపై మస్క్ సైతం హ్యారిస్ను విమర్శించారు. -
ఒక్క రోజులో యుద్ధం ఆపేస్తానన్న ట్రంప్.. సాధ్యం కాదన్న రష్యా!
Russia Ukraine war: రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని తాను 24 గంటల్లో ఆపేస్తానని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నారు. రష్యా మాత్రం ఇది అంత త్వరగా పరిష్కరించగల సమస్య కాదని పేర్కొంది. -
సుప్రీంకోర్టులో ట్రంప్నకు ఉపశమనం
అధ్యక్ష ఎన్నికల్లో(2020) ప్రజాతీర్పును మార్చివేసేందుకు యత్నించారనే అభియోగాలను ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. -
పోటీలో కొనసాగనున్న బైడెన్!
డొనాల్డ్ ట్రంప్తో జరిగిన సంవాదంలో పేలవమైన పనితీరు కారణంగా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఒత్తిడిని ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్.. తాను వెనక్కి తగ్గకపోవచ్చన్న సంకేతాలను సోమవారం ఇచ్చారు. -
తీరం దాటిన ‘బెరిల్’ హరికేన్
కరీబియన్ దీవులను ‘బెరిల్’ హరికేన్ గజగజలాడిస్తోంది. సోమవారం అది మరింత తీవ్ర రూపం దాల్చి.. కరియాకౌ ఐలాండ్లో తీరం దాటింది. -
నాలుగేళ్ల తర్వాత భారత్కు ప్రయాణం.. విమానంలో ప్రాణం విడిచిన యువతి
ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని మృతి చెందింది. నాలుగేళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలిసేందుకు భారత్కు బయలుదేరిన ఆమె హఠాత్తుగా విమానంలోనే ప్రాణాలు విడిచింది. -
ఆస్టియోపొరోసిస్ ముప్పుపై హెచ్చరికలు చేసే ఏఐ
ఎముకలను గుల్లబార్చే ఆస్టియోపొరోసిస్ రుగ్మత ముప్పును ముందుగానే పసిగట్టేందుకు ఒక కృత్రిమ మేధ (ఏఐ) నమూనా సిద్ధమైంది. -
ఫ్రాన్స్లో మెక్రాన్కు ఎదురుదెబ్బ!
ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల తొలి విడత ఓటింగ్లో అతి జాతీయవాద నేషనల్ ర్యాలీ పార్టీ ఆధిక్యం సాధించినట్లు సోమవారం విడుదలైన ఫలితాలు సూచిస్తున్నాయి. -
ఆస్ట్రేలియా చదువులు మరింత భారం
అంతర్జాతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియాలో చదువులు మరింత భారంగా మారనున్నాయి. ఇతర దేశాల నుంచి అక్కడికి వెళ్లి చదువుకొనే విద్యార్థుల వీసా రుసుములను ఆ దేశం భారీగా పెంచేసింది. -
మనవళ్ల సంరక్షణ చూసే అవ్వాతాతలకు సెలవులు!
పిల్లల పెంపకం దిశగా స్వీడన్ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. మనవళ్ల సంరక్షణ కోసం అవ్వాతాతలకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలనే చట్టం తెచ్చింది. -
ఖాన్యూనిస్ను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్
గాజాలోని ఖాన్ యూనిస్ను ఖాళీ చేయాలంటూ స్థానిక పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం సోమవారం ఆదేశించింది. -
ఇజ్రాయెల్ నుంచి 55 మంది పాలస్తీనా బందీల విడుదల
పాలస్తీనాకు చెందిన 55 మంది బందీలను ఇజ్రాయెల్ సోమవారం విడుదల చేసింది. వారిలో గాజాలోని షిఫా ఆసుపత్రి డైరెక్టర్ మహ్మద్ అబు సల్మియా కూడా ఉన్నారు. -
ప్రమాదవశాత్తూ గాల్లోకి చైనా రాకెట్
పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో చైనాకు చెందిన ఒక శక్తిమంతమైన రాకెట్ ప్రమాదవశాత్తు గాల్లోకి దూసుకెళ్లింది. -
మనుగడ వ్యూహాలకు కేంద్రస్థానం ఇదే..!
మనుగడ కోసం సందర్భోచితంగా వివిధ వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుంది. మెదడులోని హైపోథాలమస్ అనే భాగం ఈ అంశంలో కీలకమని అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధన గుర్తించింది. -
ఆ దేశంలో తెల్లని వెడ్డింగ్ గౌను వేసుకున్నా.. వైన్ గ్లాసుల్లో మద్యం తాగినా..!
కిమ్ (Kim Jong Un) నియంతృత్వ రాజ్యంలో ఆంక్షలు చిత్రంగా ఉంటాయి. ప్రజల అభిరుచులపై సైతం ఆయన కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. -
ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయండి..! గాజావాసులకు ఇజ్రాయెల్ మరోసారి ఆదేశం
గాజాలోని ఖాన్ యూనిస్ నగరం తూర్పు ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ స్థానికులకు ఇజ్రాయెల్ మరోసారి ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్పత్రిలో భారత మాజీ హెడ్ కోచ్.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు
-
50 జంటలకు సామూహిక వివాహాలు.. భారీ కానుకలు అందజేసిన అంబానీ కుటుంబం
-
ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 87కి చేరిన మృతుల సంఖ్య
-
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి
-
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
-
ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ..పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు