- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Mohammad Abu Salmiya: మహ్మద్ అబు సల్మియాను విడుదల చేసిన ఇజ్రాయెల్
హమాస్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారని ఆరోపిస్తూ.. గతంలో బందీగా తీసుకెళ్లిన అల్-షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబు సల్మియాను ఇజ్రాయెల్ తాజాగా విడుదల చేసింది.
జెరూసలెం: పాలస్తీనా (Palestine) విషయంలో ఇజ్రాయెల్పై (Israel) అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ దేశం కాస్త వెనక్కు తగ్గింది. గతంలో బందీలుగా తీసుకెళ్లిన వారిలో 50 మందికిపైగా ఖైదీలను విడుదల చేసింది. అందులో గాజాలోనే అతిపెద్దదైన అల్-షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబు సల్మియా (Mohammad Abu Salmiya) కూడా ఉన్నారు. ఏడు నెలల క్రితం ఆయన ఇజ్రాయెల్ సైన్యానికి చిక్కారు. సల్మియాతోపాటు విడుదలైన ఖైదీలను ఇజ్రాయెల్కు తూర్పు సరిహద్దులోని ఖాన్ యూనిస్ మార్గం ద్వారా గాజాలోకి పంపారు. ఈ మేరకు గాజాలోని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఇజ్రాయెల్ నుంచి విడుదలైన వారిని ఖాన్-యూనిస్లోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. మరింత మంది ఖైదీలను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరికొందరు ఖైదీల విడుదలకు సంబంధించిన నివేదికలను పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణశాఖ మంత్రి ఇటామర్ బెన్ కూడా ధ్రువీకరించారు. సల్మియాతోపాటు పదుల సంఖ్యలో ఉగ్రవాదులను విడుదల చేయడం దేశ భద్రతను పణంగా పెట్టడమేనని ‘ఎక్స్’ వేదికగా వ్యాఖ్యానించారు.
గాజా స్ట్రిప్లోని వివిధ ఆస్పత్రులను హమాస్ ఉగ్రవాదులు తమ కార్యకలాపాల కోసం వినియోగించుకుంటున్నారని ఎప్పట్నుంచో ఇజ్రాయెల్ ఆరోపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అల్-షిఫా ఆస్పత్రికి డైరెక్టర్గా ఉన్న మహ్మద్ అబు సల్మియాను నిర్బంధించి తీసుకెళ్లింది. అయితే, హమాస్ మాత్రం ఇజ్రాయెల్ ఆరోపణలను ఖండించింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో అల్-షిఫా ఆస్పత్రి వార్తల్లో నిలిచింది. పసిబిడ్డలు సహా 179 మంది మృతులను ఇక్కడి ప్రాంగణంలోనే సామూహికంగా ఖననం చేసినట్లు ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబు సల్మియా అప్పట్లో మీడియాకు వెల్లడించారు. అనంతరం అతడిని ఇజ్రాయెల్ సైన్యం కస్టడీలోకి తీసుకుంది. తాజాగా విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆమె’ కలలకు తాలిబన్ల సంకెళ్లు..!
అఫ్గానిస్థాన్లో తాలిబన్ల ఆంక్షలతో మహిళల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. వారి పాలనతో ఎంతోమంది మహిళలు తమ కలలను చంపుకొని వంట గదికి పరిమితమవుతున్నారు. దీంతో శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు తాజాగా వెల్లడించింది. -
ఉద్యోగులకు జీతాలు పెంచారని.. యజమానులకు జైలు
Myanmar: తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు వేతనాలు పెంచారని కొందరు దుకాణదారులకు జైలు శిక్ష విధించారు. ఈ వింత ఘటన మయన్మార్లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..? -
బైడెన్ డిమెన్షియాను దాచిపెట్టారు..కమలా హ్యారిస్ ఆయన స్థానాన్ని భర్తీ చేయొచ్చు..!
అమెరికా అధ్యక్షుడు బైడెన్(Biden) అధ్యక్ష అభ్యర్థిగా నిలుస్తారా..?అనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన స్థానాన్ని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ (Kamala Harris ) భర్తీ చేయొచ్చని తెలుస్తోంది. -
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!
Hurricane Beryl: బెరిల్ హరికేన్ కరీబియన్ దీవుల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్లోని ‘యూనియన్ ఐలాండ్’ (Union Island) దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. -
అందుకే తడబడ్డాను.. ట్రంప్తో సంవాదంపై బైడెన్
Biden Trump Debate: ట్రంప్తో ఇటీవల జరిగిన సంవాదంలో అధ్యక్షుడు బైడెన్ కాస్త తడబడిన విషయం తెలిసిందే. అయితే, దానికి కారణాన్ని ఆయన తాజాగా వెల్లడించారు. -
17.42 గంటల్లో ఇంగ్లిష్ ఛానల్ ఈదిన భారత మాతృమూర్తి
ఇంగ్లిష్ ఛానల్ను ఈదిన మొదటి భారతీయ మాతృమూర్తిగా మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన తన్వీ చవాన్ దేవరె (33) రికార్డు సృష్టించారు. -
స్పెయిన్ విమానంలో కుదుపులు.. ఆగమాగమైన ప్రయాణికులు
గగనతలంలో వెళుతున్న విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ కుదుపుల తీవ్రతకు కొందరు సీట్లలో నుంచి అమాంతం ఎగిరిపడ్డారు. -
నేపాల్లో కూలనున్న ప్రచండ సర్కారు
నేపాల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ (69) నాయకత్వంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వ స్థానంలో కొత్త సంకీర్ణం పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. -
సంక్షిప్త వార్తలు
నేను రోజూ త్వరగా నిద్రపోతాను. త్వరగా నిద్రలేస్తాను. ఉదయం వార్తాపత్రిక చదవడమంటే ఇష్టం. కాఫీని ఆస్వాదిస్తా. నా పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి ముందే వారితో కలిసి అల్పాహారం తీసుకుంటా. -
ఖాన్ యూనిస్లో విధ్వంసం
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం మరోసారి బాంబులతో దద్దరిల్లింది. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు మెరుపు దాడికి దిగాయి. -
ఉక్రెయిన్కు మరో 230 కోట్ల డాలర్ల భద్రతా సాయం: అమెరికా
ఉక్రెయిన్కు త్వరలో 230 కోట్ల డాలర్ల అదనపు భద్రతా సాయాన్ని చేయనున్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. దీనికింద ట్యాంకు విధ్వంసక ఆయుధాలు, క్షిపణి నిరోధక వ్యవస్థలు, -
మోదీ, పుతిన్లు ఏదైనా చర్చించొచ్చు: క్రెమ్లిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్కు, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చాలా విశ్వసనీయమైన మైత్రి ఉందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పేర్కొంది. -
‘పశ్చాత్తాప పడే పని చేయవద్దు’ - ఓటర్లకు రిషి సునాక్ పిలుపు
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి రోజు అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన ప్రధాన మంత్రి రిషి సునాక్.. పశ్చాత్తప పడే పని చేయవద్దని ఓటర్లకు సూచించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఝార్ఖండ్ సీఎం చంపాయీ సోరెన్ రాజీనామా
-
దేవుడి స్క్రిప్ట్ మరోలా ఉంది.. రిషభ్ పంత్ ఎమోషనల్ పోస్టు
-
సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్
-
ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
-
హైదరాబాద్ను చుట్టేసిన నభా నటేశ్.. కృతి సనన్ స్టైలిష్ డ్రెస్సు!
-
‘డంక్డ్ రైస్ కేక్’..ఇడ్లీ అనుకున్నానే..!: హర్ష గొయెంకా పోస్ట్ వైరల్