Moscow: కారు బాంబు పేల్చి పుతిన్‌ సన్నిహితుడి కుమార్తె హత్య..!

పుతిన్‌ అత్యంత సన్నిహితుడైన సహాయకుడు అలెగ్జాండర్‌ డుగిన కుమార్తెను కారు బాంబు పేల్చి మాస్కోలో హత్య చేశారు. పుతిన్‌ ఆలోచనలను అత్యధికంగా ప్రభావితం చేసే వ్యక్తిగా అలెగ్జాండర్‌కు పేరుంది.

Published : 21 Aug 2022 10:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన సహాయకుడు అలెగ్జాండర్‌ డుగిన కుమార్తెను కారు బాంబు పేల్చి మాస్కోలో హత్య చేశారు. పుతిన్‌ ఆలోచనలను ప్రభావితం చేసే వ్యక్తిగా అలెగ్జాండర్‌కు పేరుంది. వాస్తవానికి అలెగ్జాండర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేయగా.. అతడి కుమార్తె డార్యా డుగిన మరణించినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.  ఈ ఘటన రష్యా కాలమానం ప్రకారం శనివారం జరిగినట్లు ఆ దేశ వార్తా సంస్థ టాస్‌ పేర్కొంది.

డార్యా తన కారులో ఇంటికి బయల్దేరగా..  మొజస్కౌయి హైవేపై బోల్షియా అనే గ్రామం వద్దకు రాగానే కారులో భారీ పేలుడు చోటు చేసుకుంది. దాడిలో ధ్వంసమైన కారు వాస్తవానికి అలెగ్జాండర్‌ది. ఆయనే అసలైన లక్ష్యమని రష్యా అధికారులు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి అలెగ్జాండర్‌ వాదన కూడా కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఈ యుద్ధం విషయంలో పుతిన్‌ను అలెగ్జాండర్‌ బాగా ప్రభావితం చేశారు. అలెగ్జాండర్‌ కుమార్తె డార్యా కూడా రచయిత. ఆమె పూర్తిగా సంప్రదాయవాది. ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన అమెరికా ట్రెజరీస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ ఫారెన్‌ అసెట్స్‌ ఆంక్షల జాబితాలో డార్యా కూడా ఉన్నారు. ఆమె ఉక్రెయిన్‌పై రాసిన వ్యాసం కారణంగా ఈ జాబితాలో చేర్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని