- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Biden Vs Trump: ట్రంప్ దూకుడు.. బైడెన్ తడబాటు.. ఆసక్తికరంగా అధ్యక్ష అభ్యర్థుల చర్చ
Biden Vs Trump: చివరి అధ్యక్ష ఎన్నికల తర్వాత బైడెన్, ట్రంప్ తొలిసారి ముఖాముఖి తలపడ్డారు. ఇద్దరి మధ్య వివిధ అంశాలపై వాడీవేడిగా చర్చ సాగింది.
వాషింగ్టన్: అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు ప్రత్యక్ష చర్చ (Biden Vs Trump Debate) ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 2020 అధ్యక్ష ఎన్నికల గందరగోళం తర్వాత వీరిద్దరూ తొలిసారి ముఖాముఖి తలపడ్డారు. అట్లాంటాలోని సీఎన్ఎన్ ప్రధాన కార్యాలయంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.
చర్చలో బైడెన్, ట్రంప్ (Biden Vs Trump Debate) ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ఒకానొక దశలో సంయమనం కోల్పోయిన నేతలు వ్యక్తిగత విమర్శలకూ దిగారు. మాజీ అధ్యక్షుడు దూకుడు ప్రదర్శించగా.. బైడెన్ కొన్నిచోట్ల తడబడ్డట్లు కనిపించారు. బైడెన్ను ట్రంప్ ఫెయిల్యూర్గా అభివర్ణించారు. దీనికి ప్రతిగా ట్రంప్ను బైడెన్ దోషి అంటూ ఆరోపణలు గుప్పించారు. చర్చలో నిర్వహకులు తప్ప మరెవరూ లేకపోవడం గమనార్హం. పైగా ఈసారి ఒకరు మాట్లాడుతుండగా.. మరొకరి మైక్లను కట్ చేశారు.
చర్చలో ట్రంప్ పైచేయి సాధించినట్లు సీఎన్ఎన్ పోల్లో మెజారిటీ వీక్షకులు అభిప్రాయపడ్డారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సైతం బైడెన్ చర్చను నెమ్మదిగా ప్రారంభించినట్లు తెలిపారు. కానీ, చివరకు హుందాగా, దీటుగా ముగించారని పేర్కొన్నారు. మొత్తం చర్చలో ట్రంప్ 23 నిమిషాల ఆరు సెకన్లు మాట్లాడగా.. బైడెన్ 18 నిమిషాల 26 సెకన్లు తీసుకున్నారు.
వివిధ అంశాలపై ఇరువురి నేతల అభిప్రాయాలు సంక్షిప్తంగా..
ఆర్థిక వ్యవస్థ..
ట్రంప్ హయాంలో అనుసరించిన ఆర్థిక విధానాలపై విమర్శలు గుప్పిస్తూ బైడెన్ (Joe Biden) చర్చను ప్రారంభించారు. సంపన్నులకు అనుకూల వైఖరిని అవలంబించారని దుయ్యబట్టారు. దీంతో ఆర్థికవ్యవస్థ పూర్తిగా కుప్ప కూలిందన్నారు. ఉద్యోగ కల్పన పూర్తిగా క్షీణించిందన్నారు. నిరుద్యోగం 15 శాతానికి చేరిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టాల్సిన బాధ్యతను ప్రజలు తనపై ఉంచినట్లు పేర్కొన్నారు.
దీనికి బదులిస్తూ.. బైడెన్ హయాంలో కేవలం అక్రమ వలసదారులకు మాత్రమే ఉద్యోగాలు లభించాయని ట్రంప్ (Donald Trump) విమర్శించారు. ద్రవ్యోల్బణం చుక్కలు చూపిస్తోందన్నారు. పన్ను కోతల వల్ల ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ లేనంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోందని విమర్శించారు.
మాల్దీవులు అధ్యక్షుడిపై చేతబడి!
విదేశాంగ విధానం..
విదేశాంగ విధానంపైకి రాగానే చర్చ వాడీవేడిగా సాగింది. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ అత్యంత ఘోరంగా సాగినట్లు ట్రంప్ విమర్శించారు. అమెరికా చరిత్రలోనే అదో దుర్దినంగా నిలిచిపోతుందని బైడెన్ (Biden) అమలుచేసిన అఫ్గాన్ నుంచి బలగాల నిష్క్రమణ విధానాన్ని దుయ్యబట్టారు. తన హయాంలో చాలా గౌరవప్రదంగా సైనికులు బయటకు వచ్చేలా ఏర్పాట్లుచేశామని తెలిపారు.
దీనిపై బైడెన్ స్పందిస్తూ.. ట్రంప్ (Trump) హయాంలో తాలిబన్లు అఫ్గాన్ సామాన్య పౌరులను చంపుతూనే ఉన్నారని తెలిపారు. దీనిపై అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పైగా అక్కడ మరణించిన అమెరికా సైనికులను ట్రంప్ దుర్భాషలాడారని ఆరోపించారు. ఈసందర్భంగా ఇరాక్లో పనిచేసి తర్వాత మరణించిన తన కుమారుడు బ్యూను బైడెన్ గుర్తుచేసుకున్నారు. మరోవైపు ఉక్రెయిన్-రష్యా గురించి మాట్లాడుతూ.. పుతిన్కు ట్రంప్ పూర్తి స్వేచ్ఛనిచ్చారన్నారు. పైగా అనేకమంది సైనికుల ప్రాణాలు కోల్పోయినందునే రష్యా ప్రతిదాడి చేస్తోందని సమర్థించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు.
వలస విధానం..
ఇరువురు నేతల మధ్య సాగిన ముఖాముఖి చర్చలో వలస విధానం మరో కీలక అంశంగా నిలిచింది. అమెరికా విధానాలపై ట్రంప్ కావాలనే తప్పుడు ప్రచారారాలు చేస్తున్నారన్నాని బైడెన్ తెలిపారు. అక్రమ వలసదారులను ఆహ్వానిస్తున్నారన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
ట్రంప్ మాట్లాడుతూ.. దేశ దక్షిణ సరిహద్దులను భద్రంగా ఉంచడంలో బైడెన్ విఫలమయ్యారని తెలిపారు. దీన్ని బైడెన్ చేసిన నేరంగా తాను అభివర్ణిస్తాననన్నారు.
గర్భ విచ్ఛిత్తి..
ఈసారి ఎన్నికల్లో గర్భవిచ్ఛిత్తి అంశం కీలకంగా మారిన విషయం తెలిసిందే. తాజా డిబేట్లోనూ ఈ విషయం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. గర్భవిచ్ఛిత్తి నిషేధాన్ని బైడెన్ తప్పుబట్టారు. దీన్ని అనుమతిస్తూ ఇచ్చిన ‘రో వర్సెస్ వేడ్’ తీర్పును పునరుద్ధరిస్తామని తెలిపారు. గర్భవిచ్ఛిత్తి అనేది ఆ మహిళ, వైద్యులు తేల్చాల్సిన అంశమని.. రాజకీయ నాయకులు కాదని బైడెన్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ అంశాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేయాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. గర్భవిచ్ఛిత్తిపై ఎలాంటి పరిమితులు లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..
ఇజ్రాయెల్కు తమ మద్దతు కొనసాగుతుందని బైడెన్ పునరుద్ఘాటించారు. ఘర్షణలకు పూర్తిగా హమాస్దే బాధ్యతని విమర్శించారు. యుద్ధం ముగించడానికి వారే ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే, ఇజ్రాయెల్తో సత్సంబంధాలు కొనసాగిస్తూనే దీనికి ఒక ముగింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ట్రంప్ సైతం ఈ విషయంలో ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచారు. అయితే, బైడెన్ వైఖరిలో మార్పు వచ్చిందని.. ఓ పాలస్తీనావాసిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వీటితో పాటు కొవిడ్-19, సామాజిక భద్రత, మెడికేర్, పన్నులు, ట్రంప్పై కేసులు, 2020 క్యాపిటల్ దాడులు, మాజీ సైనికుల భద్రత, నాటో వంటి అంశాలు సైతం చర్చకు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలుత పెళ్లి.. తర్వాత అంత్యక్రియలు.. వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి
Nigeria: నైజీరియాలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో కనీసం 18 మంది మృతిచెందారు. మరో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. -
మరో యుద్ధ భయం?
పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తత పెరగనుందా.. ఇప్పటికే పరస్పరం క్షిపణి దాడులు చేసుకుంటున్న ఇజ్రాయెల్, హెజ్బొల్లాలు పూర్తిస్థాయి యుద్ధానికి దిగనున్నాయా? ఈ రెండింటి మధ్య నానాటికీ విస్తరిస్తున్న సాయుధ ఘర్షణలు మరో యుద్ధం తప్పదన్న విస్పష్ట సంకేతాల్ని వెలువరిస్తున్నాయి. -
ఉక్రెయిన్పై రష్యా దాడిలో 12 మంది మృతి
ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో శనివారం రష్యా జరిపిన దాడుల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. డునిప్రొ డగ్ నగరంలోని అపార్ట్మెంటుపై శుక్రవారం జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. -
అవును...తడబడ్డాను
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండగా.. అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సంవాదం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. -
సుస్థిరాభివృద్ధి ఉప లక్ష్యాల సాధనలో ప్రపంచం వెనుకంజ
ప్రపంచంలో 700 కోట్లమంది ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన 169 ఉప లక్ష్యాలలో కేవలం 17 శాతాన్ని మాత్రమే 2030 గడువుకల్లా సాధించగలుగుతామని ఐక్యరాజ్యసమితి వార్షిక నివేదికలో పేర్కొంది. -
ఇరాన్ అధ్యక్ష ఎన్నికలో ప్రతిష్టంభన
తక్కువ పోలింగ్ శాతం కారణంగా ఇరాన్ అధ్యక్ష ఎన్నికలో ప్రతిష్టంభన నెలకొంది. శుక్రవారం నాటి పోలింగులో దాదాపు 60% మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోకపోవడంతో జులై 5న రెండో బ్యాలెట్ (రన్ఆఫ్ పోలింగ్)ను నిర్వహించబోతున్నారు. -
ఐక్యూ తక్కువైతే పక్షవాతం!
బాల్యంలోనూ, కౌమారంలోనూ ఏకాగ్రత, అభ్యసన శక్తి తక్కువగా ఉన్నవారు యాభై ఏళ్ల వయసు రావడానికి ముందే పక్షవాతం బారిన పడే ప్రమాదం ఎక్కువని ఇజ్రాయెల్లోని హీబ్రూ విశ్వవిద్యాలయ పరిశోధన హెచ్చరిస్తోంది. -
సెర్బియాలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద దాడి
సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో ఉన్న ఇజ్రాయెల్ ఎంబసీవద్ద విల్లులాంటి ఆయుధంతో వచ్చిన దుండగుడు భద్రతాధికారిపై దాడి చేసి గాయపరిచాడు. వెంటనే తేరుకున్న అధికారి కాల్పులు జరిపి నిందితుడిని హతమార్చారు. -
ఉక్రెయిన్పైకి ఉత్తరకొరియా ఆయుధాలు!
ఉక్రెయిన్తో యుద్ధంలో ఉత్తరకొరియా ఆయుధాలను రష్యా వినియోగిస్తోందని ఓ పరిశోధన సంస్థ అధిపతి శుక్రవారం ఐరాస భద్రతా మండలికి తెలియజేశారు. -
అంతరిక్ష కేంద్రాన్ని తొలగించేందుకు రూ.7వేల కోట్లు.. మస్క్కు నాసా కాంట్రాక్ట్
International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు నాసా ప్రణాళికలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్కు రూ.7వేల కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వెంకయ్యనాయుడి వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరు: ప్రధాని మోదీ
-
డీఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది: సీఎం రేవంత్రెడ్డి
-
‘‘ఆదర్శప్రాయమైన విజయం’’.. టీమ్ఇండియాకు ప్రధాని మోదీ ఫోన్
-
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
-
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు