- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Joe Biden: నిద్ర సరిపోవట్లేదు.. రాత్రి 8 తర్వాత రాలేను: బైడెన్
వరుస కార్యక్రమాలతో తాను అలసిపోతున్నానని, అర్ధరాత్రి వరకు ప్రచారాలు వద్దని బైడెన్ (Biden) అన్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు నిర్విరామంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 81 ఏళ్ల అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఈ ప్రచారపర్వంతో అలసిపోతున్నారట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరించారు. తాను నిద్రపోవడానికి మరింత సమయం కావాలని, రాత్రి ఎనిమిది తర్వాత ఎలాంటి ప్రచారంలో పాల్గొనలేనని, అర్ధరాత్రి కార్యక్రమాలు వద్దని చెప్పారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఈ విధంగా వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.
గతవారం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన సంవాదంలో బైడెన్ తడబడిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన ఇంకా రేసులో ఉండటంపై పలువురు గవర్నర్లు అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. ఎవరూ ఆ విషయాన్ని నేరుగా మాత్రం ప్రస్తావించలేదని తెలుస్తోంది. మరోవైపు రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని బైడెన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ‘‘అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి డెమోక్రాటిక్ పార్టీ నామినీని నేనే. నన్నెవరూ తప్పుకోమనడం లేదు. నేను పోటీ నుంచి వైదొలగడం లేదు. తుదివరకు పోరాడతా.. మనమే గెలవబోతున్నాం. దానికి మీ మద్దతు కావాలి’’ అని తన మద్దతుదారులకు రాసిన లేఖలో ఆయన విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
సంవాదంలో తడబాటుకు గల కారణాన్ని బైడెన్ ఇదివరకే వెల్లడించారు. తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని తెలిపారు. దాని వల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందని పేర్కొన్నారు. అందుకే సంవాదంలో సరిగా వాదించలేకపోయినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యుద్ధానికి తొమ్మిది నెలలు.. నెతన్యాహుకు నిరసన సెగలు!
హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమవారిని విడిపించాలంటూ ఇజ్రాయెల్లో నిరసనకారులు కదం తొక్కారు. దేశవ్యాప్తంగా హైవేలను దిగ్బంధించారు. -
ఉక్రెయిన్ ప్రతిదాడులు.. రష్యాలో పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ!
ఉక్రెయిన్ చేస్తోన్న ప్రతిదాడులతో రష్యాలోని వొరోనెజ్ ప్రాంతంలో పలుచోట్ల అత్యవసర స్థితి (State of Emergency) విధించారు. -
మైనర్ల చేతిలో అశ్లీల కంటెంట్.. అడ్డుకట్టకు స్పెయిన్ వినూత్న ఆలోచన!
Adult Content: అశ్లీల చిత్రాలు చూసేవారిలో మైనర్ల సంఖ్య పెరుగుతున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీన్ని అడ్డుకునేందుకు ఓ మొబైల్ యాప్తో పరిష్కారాన్ని సిద్ధం చేసింది. అదేంటి? ఎలా పనిచేస్తుందో చూద్దాం..! -
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
ఓ రకమైన చెక్కను తిని జీవించే పురుగు ఖరీదు ఏకంగా రూ.75 లక్షలు. దానికి అంత ధర ఎందుకో తెలుసా..? -
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
Biden: అధ్యక్ష పోటీ నుంచి బైడెన్ వైదొలగాలనే డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో హవాయి గవర్నర్ గ్రీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలిపారు. -
ఎన్నికల బరి నుంచి తప్పుకొనేదే లేదు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (81) తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న అనుమానాలు, ఆందోళనలను కొట్టివేస్తూ నవంబరు అధ్యక్ష ఎన్నికలో తిరిగి పాలక డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. -
రక్తపోటు నియంత్రణకు ఈ నాలుగు తప్పనిసరి
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సాధారణంగా రక్తపోటు లక్షణాలు బయటకు కనపడవు. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ వైఫల్యానికి దారితీసి నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తుంది. -
ఊబకాయ నిర్ధారణకు బీఎంఐ ఒక్కటే సరిపోదు
ఊబకాయాన్ని నిర్వచించడానికి కేవలం శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచీ (బీఎంఐ)పైనే ఆధారపడటం సరికాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక వ్యక్తి శరీరమంతటా కొవ్వు ఎంతమేర వ్యాపించిందన్నది కూడా కీలకమేనని పేర్కొన్నారు. -
పర్యావరణంలోని టాక్సిన్లతో మానసిక కుంగుబాటు
వాతావరణంలో సాధారణంగా కనిపించే విషతుల్య పదార్థాల (టాక్సిన్లు)తో నిరాశావాదం, రోజువారీ కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడం వంటి కుంగుబాటు లక్షణాలు ఉత్పన్నం కావచ్చని అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది. -
అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి
అమెరికాలోని కెంటకీ ఉత్తర ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. అనంతరం నిందితుడు పారిపోతుండగా పోలీసులు వాహనాన్ని వెంబడించారు. -
ఇరాన్లో సంస్కరణలవాది గెలుపు
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణలవాది మసౌద్ పెజెష్కియాన్ ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన కౌంటింగ్లో ఇస్లామిస్టు సయీద్ జలీలీపై ఆయన భారీ మెజారిటీ సాధించారు. -
సత్వరం.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)ను సత్వరం ఖరారు చేసుకునేందుకు తాను సిద్ధమేనని బ్రిటన్ నూతన ప్రధాని కీర్ స్టార్మర్ చెప్పారు. ఇది ఉభయులకూ ప్రయోజనకరమని పేర్కొన్నారు. -
కీలక డిమాండ్పై హమాస్ వెనక్కి
గాజాలో యుద్ధాన్ని ఇజ్రాయెల్ శాశ్వతంగా ముగిస్తేనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని చెబుతున్న హమాస్.. ఆ కీలక డిమాండ్పై వెనక్కి తగ్గింది. -
సంక్షిప్త వార్తలు
ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయని, ఇవి పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయొచ్చని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. -
చీకట్లలో లక్ష మంది ఉక్రెయిన్ వాసులు
ఉత్తర ఉక్రెయిన్లోని సుమి ప్రావిన్సును రష్యా వైమానిక దాడులు అంధకారం చేశాయి. శుక్రవారం రాత్రి విద్యుత్కేంద్రాలే లక్ష్యంగా మాస్కో చేసిన దాడులతో ఆ నగరంలో దాదాపు లక్ష మంది చీకట్లలో మగ్గుతున్నారు. -
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతంలో లక్ష ఇళ్లకు విద్యుత్ సరఫరా లేకుండా పోయింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాస్తవాన్ని గుర్తించండి.. రాహుల్కు కేంద్రమంత్రి సింధియా చురక!
-
వరుణుడి ఆటంకం.. భారత్- దక్షిణాఫ్రికా రెండో టీ20 రద్దు
-
6 సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించిన సీఎం రేవంత్రెడ్డి
-
ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసు సీబీఐకి అప్పగించాలి: మాయావతి
-
ఆ ఆపరేషన్ కారణంగానే సినిమాలకు విరామం: నభా నటేశ్
-
పిడుగు పాటుకు 10మంది మృత్యువాత