- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Joe Biden: బైడెన్ డిమెన్షియాను దాచిపెట్టారు..కమలా హ్యారిస్ ఆయన స్థానాన్ని భర్తీ చేయొచ్చు..!
అమెరికా అధ్యక్షుడు బైడెన్(Biden) అధ్యక్ష అభ్యర్థిగా నిలుస్తారా..?అనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన స్థానాన్ని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ (Kamala Harris ) భర్తీ చేయొచ్చని తెలుస్తోంది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభమైన దగ్గరి నుంచి అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఆరోగ్యమే హాట్ టాపిక్గా మారింది. ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విమర్శల్లో ఈ విషయమే ఎక్కువగా వినిపిస్తోంది. దీనికితోడు ఇద్దరిమధ్య ఇటీవల జరిగిన ప్రత్యక్ష చర్చలో బైడెన్ తడబాటుకు గురికావడం సొంతపక్షం డెమోక్రాటిక్ నేతల్లో ఆందోళనకు దారితీసింది. ఈ క్రమంలో రాజకీయ విశ్లేషకుడు టకర్ కార్లసన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
బైడెన్కు డిమెన్షియా ఉందని, మీడియా ఆ నిజాన్ని దాచిపెట్టిందని కార్లసన్ ఆరోపించారు. ఆ సమస్య గురించి ఇప్పుడే తెలిసిందన్నట్టుగా నటిస్తోందన్నారు. బెడైన్ మెదడు పనితీరు దెబ్బతిన్నదని, ఆయన స్థానాన్ని భర్తీ చేయొచ్చని డెమోక్రాటిక్ నేతలు అభిప్రాయపడుతున్నట్లు రెండు రోజుల క్రితం కార్లసన్ అన్నారు. దాని గురించి తాజాగా ప్రస్తావిస్తూ..‘‘డెమోక్రాట్లు బైడెన్ను తొలగించాలి. వారు ఆ పని చేస్తారు. కానీ ఎప్పుడు అనేదే ఇక్కడ ప్రశ్న. వారు తెలివిగా ఆలోచిస్తే.. ఇప్పుడే ఆ పని చేస్తారు. ఆయన స్థానంలో వారు కమలాహారిస్(Kamala Harris)ను నియమించొచ్చు’’ అని అన్నారు.
మరోవైపు శృంగార తార స్టార్మీ డేనియల్తో వివాదం కేసులో జులై 11న ట్రంప్ శిక్ష ఖరారు కానుంది. ఈ పరిణామాలు అధికార, విపక్ష పార్టీలు సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయని కార్లసన్ అభిప్రాయపడ్డారు. ఇదిలాఉంటే.. ప్రత్యక్ష చర్చ తర్వాత బైడెన్ ఆమోద రేటింగ్ పడిపోయిందని తాజాగా జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది. ఆయనకంటే ట్రంప్ ఆరు పాయింట్లు ముందున్నారు. అయితే బైడెన్ స్థానంలో కమలా హ్యారిస్ ఉంటే అనే ప్రశ్నకు 47 శాతం మంది ఓటర్లు ట్రంప్కు అనుకూలంగా స్పందించగా, 45 శాతం మంది హ్యారిస్ వైపు మొగ్గు చూపారు. ఫలితాలను చూస్తుంటే.. బైడెన్ కంటే ఆమెనే వైట్హౌస్లో తిరిగి కాలుపెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోందని సర్వే పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల్లో ‘ఏఐ’ అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా..?
AI Candidate In UK Elections: బ్రిటన్ ఎన్నికల ప్రచార సమయంలో ‘ఏఐ స్టీవ్’ అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
నిద్ర సరిపోవట్లేదు.. రాత్రి 8 తర్వాత రాలేను: బైడెన్
వరుస కార్యక్రమాలతో తాను అలసిపోతున్నానని, అర్ధరాత్రి వరకు ప్రచారాలు వద్దని బైడెన్ (Biden) అన్నారు. -
ఎయిర్పోర్టులో గ్యాస్ లీక్.. 39 మందికి అస్వస్థత
విమానాశ్రయంలో గ్యాస్ లీక్ అవ్వడంతో పలువురు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్ (Rishi Sunak) నేతృత్వం వహిస్తోన్న కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. దీనిపై ఆయన స్పందించారు. -
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భంగపాటు.. ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం
UK elections: యూకేలో గురువారం రాత్రి సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారంలో ఉన్న ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. -
సునాక్ భవితవ్యంపై ఉత్కంఠ!
భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ భవితవ్యాన్ని తేల్చే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ గురువారం ఉదయం 7 గంటలకు బ్రిటన్లో ప్రారంభమైంది. దేశంలో మొత్తం 4.6 కోట్ల మంది ఓటర్లున్నారు. -
బలవంతంగా సంతానశక్తి తొలగింపు.. తగిన పరిహారం చెల్లింపునకు కోర్టు ఆదేశం
జపాన్లో దాదాపు డజను మంది బాధితులకు బలవంతంగా సంతానశక్తి తొలగించినందుకుగాను తగిన పరిహారం చెల్లించవలసిందిగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం బుధవారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. -
బైడెన్ వైదొలగేదే లేదు
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగే ప్రసక్తే లేదని శ్వేతసౌధం స్పష్టంచేసింది. తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ముఖాముఖిలో బైడెన్ తడబడడం అనేక సందేహాలకు తావిచ్చిన.. -
దక్షిణాఫ్రికాలో 34 వేల ఏళ్ల పురాతన చెదపుట్టలు
ఇప్పటికీ చెద పురుగులు నివసిస్తున్న అతి పురాతనమైన చెదపుట్టలను దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు నమోదైనవాటిలో ఇవే పురాతనమైనవని పేర్కొన్నారు. -
వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిందే
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించింది. -
ఆ దేశాలను ఉపేక్షించొద్దు
ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలను ఏకాకులుగా మార్చాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే దేశాలనూ బహిరంగంగా ఎండగట్టాలని సూచించింది. -
షికాగోలో కాల్పులు.. ఇద్దరు మహిళల మృతి
అమెరికాలోని షికాగో సమీపంలో గ్రాండ్ క్రాసింగ్ వద్ద గురువారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. గాయపడిన మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఉక్రెయిన్కు మరో ఎదురుదెబ్బ
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు దొనెట్స్క్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా చాలా కీలకమైన చాసివ్ యార్ పట్టణ శివార్ల నుంచి ఆ దేశ బలగాలు వెనక్కి మళ్లాయి. -
ఇజ్రాయెల్పైకి 200 రాకెట్లు.. హెజ్బొల్లా ప్రతీకార దాడి
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తమ కమాండర్ మృతికి ప్రతీకారంగా గురువారం హెజ్బొల్లా.. ఉత్తర ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలపైకి ఏకంగా 200కుపైగా రాకెట్లను, డ్రోన్లను ప్రయోగించింది. -
ఏ పనీ చిన్నది కాదు.. నిబద్ధతతో చేయడమే ముఖ్యం
మనం చేసే ఏ పనీ చిన్నది కాదు. నిబద్ధతతో పనిచేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. పని చేయడమే గౌరవం తప్ప పనిని బట్టి గౌరవం ఉండదు. అందుకే మీ వృత్తి గురించి చెప్పుకోవడానికి నామోషీగా భావించకండి. -
పారిస్లోని ‘గాలరీలఫాయెట్’లో యూపీఐ సేవలు
పారిస్లోని ప్రముఖ షాపింగ్మాల్.. ‘గాలరీ లఫాయెట్’లో యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. -
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
Milk price in pak: పాకిస్థాన్లో పాల ధరకు రెక్కలొచ్చాయి. లీటర్ పాల ధర ఏకంగా రూ.370కి చేరింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్రెడ్డి
-
నష్టాలతో ప్రారంభమై.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడింది: మాజీ ఎంపీ వినోద్
-
ఎన్నికల్లో ‘ఏఐ’ అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా..?
-
జమ్మూకశ్మీర్ ఎన్నికలు అప్పుడేనా..?
-
2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ