- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Biden Trump Debate: అందుకే తడబడ్డాను.. ట్రంప్తో సంవాదంపై బైడెన్
Biden Trump Debate: ట్రంప్తో ఇటీవల జరిగిన సంవాదంలో అధ్యక్షుడు బైడెన్ కాస్త తడబడిన విషయం తెలిసిందే. అయితే, దానికి కారణాన్ని ఆయన తాజాగా వెల్లడించారు.
Biden Trump Debate | వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Biden Trump Debate) మధ్య ఇటీవల జరిగిన ప్రత్యక్ష చర్చ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ చర్చ సమయంలో బైడెన్ పలుమార్లు తడబాటుకు గురయ్యారు. ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఇది స్వపక్షం డెమోక్రాటిక్ పార్టీలోనే ఆందోళనలకు దారి తీసింది. ఆయన్ను పోటీ నుంచి తప్పించాలని కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాను తడబాటుకు గురైనట్లు స్వయంగా బైడెన్ (Joe Biden) అంగీకరించారు. అందుకుగల కారణాన్ని వెల్లడించారు.
ఇది సాకు కాదు..
తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని బైడెన్ తెలిపారు. దాని వల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందని పేర్కొన్నారు. అందుకే సంవాదంలో సరిగా వాదించలేకపోయినట్లు వెల్లడించారు. తాను మరింత చురుగ్గా వ్యవహరించాల్సిందని తెలిపారు. అందుకు తనను క్షమించాలని పార్టీ మద్దతుదారులను కోరారు. దీన్ని సాకుగా భావించొద్దని.. కేవలం వివరణగా మాత్రమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్జీనియాలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆయనకు సామర్థ్యం ఉంది: వైట్హౌస్
ట్రంప్తో (Donald Trump) సంవాదంలో బైడెన్ అంతగా రాణించలేకపోయారని శ్వేతసౌధం సైతం అంగీకరించింది. అంతమాత్రాన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేరని మాత్రం అనుకోవద్దని స్పష్టం చేసింది. దేశాన్ని మరో నాలుగేళ్లు ముందుకు నడిపించే సామర్థ్యం ఆయనకు ఉందని ఉద్ఘాటించింది. చర్చ సమయానికి అధ్యక్షుడు జలుబుతో ఇబ్బందిపడుతున్నారని.. గొంతులో కూడా సమస్య ఉందని అధికార ప్రతినిధి కరీన్ జీన్-పియర్ వివరించారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు పలు సందర్భాల్లో అంగీకరించారని గుర్తుచేశారు.
గత మూడున్నరేళ్లుగా బైడెన్ (Biden) అన్ని పనులు, బాధ్యతలను సక్రమంగానే నిర్వర్తించారని జీన్-పియర్ తెలిపారు. దానికి చరిత్రే సాక్ష్యమని పేర్కొన్నారు. అమెరికా ప్రజలకు సేవలందించడంలో ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదని చెప్పారు. తప్పేదో.. ఒప్పేదో నిర్ణయించే సామర్థ్యం ఉందన్నారు. నిజాన్ని ఎలా చెప్పాలో తెలుసన్నారు. జీవితాంతం అనేక సవాళ్లు ఎదుర్కొన్న బైడెన్కు.. పడిన తర్వాత ఎలా లేవాలో కూడా తెలుసునని వ్యాఖ్యానించారు. సంవాదంలో ఎలా వాదించామనేది ప్రధానం కాదనీ.. అధ్యక్షుడిగా ఎలా పనిచేస్తామనేదే కీలకమని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గర్భవిచ్ఛిత్తి సహా పలు అంశాలు గత గురువారం బైడెన్, ట్రంప్ మధ్య జరిగిన వారి సంవాదంలో ప్రస్తావనకు వచ్చాయి. వాటిపై ఇరువురు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భంగపాటు.. అధికారం దిశగా లేబర్ పార్టీ
UK elections: యూకేలో గురువారం రాత్రి సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారంలో ఉన్న ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. -
సునాక్ భవితవ్యంపై ఉత్కంఠ!
భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ భవితవ్యాన్ని తేల్చే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ గురువారం ఉదయం 7 గంటలకు బ్రిటన్లో ప్రారంభమైంది. దేశంలో మొత్తం 4.6 కోట్ల మంది ఓటర్లున్నారు. -
బలవంతంగా సంతానశక్తి తొలగింపు.. తగిన పరిహారం చెల్లింపునకు కోర్టు ఆదేశం
జపాన్లో దాదాపు డజను మంది బాధితులకు బలవంతంగా సంతానశక్తి తొలగించినందుకుగాను తగిన పరిహారం చెల్లించవలసిందిగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం బుధవారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. -
బైడెన్ వైదొలగేదే లేదు
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగే ప్రసక్తే లేదని శ్వేతసౌధం స్పష్టంచేసింది. తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ముఖాముఖిలో బైడెన్ తడబడడం అనేక సందేహాలకు తావిచ్చిన.. -
దక్షిణాఫ్రికాలో 34 వేల ఏళ్ల పురాతన చెదపుట్టలు
ఇప్పటికీ చెద పురుగులు నివసిస్తున్న అతి పురాతనమైన చెదపుట్టలను దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు నమోదైనవాటిలో ఇవే పురాతనమైనవని పేర్కొన్నారు. -
వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిందే
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించింది. -
ఆ దేశాలను ఉపేక్షించొద్దు
ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలను ఏకాకులుగా మార్చాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే దేశాలనూ బహిరంగంగా ఎండగట్టాలని సూచించింది. -
షికాగోలో కాల్పులు.. ఇద్దరు మహిళల మృతి
అమెరికాలోని షికాగో సమీపంలో గ్రాండ్ క్రాసింగ్ వద్ద గురువారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. గాయపడిన మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఉక్రెయిన్కు మరో ఎదురుదెబ్బ
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు దొనెట్స్క్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా చాలా కీలకమైన చాసివ్ యార్ పట్టణ శివార్ల నుంచి ఆ దేశ బలగాలు వెనక్కి మళ్లాయి. -
ఇజ్రాయెల్పైకి 200 రాకెట్లు.. హెజ్బొల్లా ప్రతీకార దాడి
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తమ కమాండర్ మృతికి ప్రతీకారంగా గురువారం హెజ్బొల్లా.. ఉత్తర ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలపైకి ఏకంగా 200కుపైగా రాకెట్లను, డ్రోన్లను ప్రయోగించింది. -
ఏ పనీ చిన్నది కాదు.. నిబద్ధతతో చేయడమే ముఖ్యం
మనం చేసే ఏ పనీ చిన్నది కాదు. నిబద్ధతతో పనిచేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. పని చేయడమే గౌరవం తప్ప పనిని బట్టి గౌరవం ఉండదు. అందుకే మీ వృత్తి గురించి చెప్పుకోవడానికి నామోషీగా భావించకండి. -
పారిస్లోని ‘గాలరీలఫాయెట్’లో యూపీఐ సేవలు
పారిస్లోని ప్రముఖ షాపింగ్మాల్.. ‘గాలరీ లఫాయెట్’లో యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. -
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
Milk price in pak: పాకిస్థాన్లో పాల ధరకు రెక్కలొచ్చాయి. లీటర్ పాల ధర ఏకంగా రూ.370కి చేరింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆడిన మాట తప్పని రాజస్థాన్ మంత్రి కిరోడిలాల్
-
చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో వైకాపా నేత ఈశ్వరప్రసాద్ అరెస్టు
-
‘భారతీయుడు2’ సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ.. రూ.60వేల కోట్లతో ఏర్పాటు
-
ఆరు మందులు రాస్తే.. ఐదు కొనుక్కోవాల్సిందే