- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Australia: విద్యార్థుల ఆస్ట్రేలియా కల మరింత భారం..!
ఆస్ట్రేలియాకు వెళ్లే విద్యార్థులకు ఇచ్చే వీసాల్లో ఆ దేశం భారీ మార్పులు చేపట్టింది. నేడు వాటి ఖరీదు కూడా పెరిగింది. వలసలను అదుపు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: విద్యార్థులకు ఆస్ట్రేలియా(Australia)లో చదువులు మరింత భారంగా మారనున్నాయి. ఇతర దేశాల నుంచి అక్కడికి వెళ్లి చదువుకొనే విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులను ఆ దేశం భారీగా పెంచేసింది. గతంలో 473 అమెరికన్ డాలర్లుగా ఉన్న ఫీజును ఇప్పుడు 1,068 డాలర్లకు పెంచింది. జులై 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. వలసలను బలవంతంగా నియంత్రించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకొన్నారు. ప్రస్తుతం అక్కడికి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడేవారి సంఖ్య ఆల్టైమ్ హైలో ఉంది. ఫలితంగా ఇది గృహ మర్కెటింగ్ రంగంపై ప్రభావం చూపిస్తోంది.
ఇక టెంపరరీ గ్రాడ్యుయేట్, విజిటర్, మారిటైమ్ క్రూ వీసాలు ఉన్నవారు ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా విద్యార్థి వీసాకు దరఖాస్తు చేయడానికి అనర్హులు. ప్రస్తుతం ఆ దేశంలో నివాసం ఉంటున్న వేల మంది భారతీయులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.
‘‘నియమాల్లో ఈ మార్పులు మొత్తం నేటి నుంచి (జులై 1) అమల్లోకి వస్తాయి. మా అంతర్జాతీయ విద్యావిధానం మరింత బలంగా మారేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకొన్నాం. కేవలం దేశాన్ని బలోపేతం చేసేలా ఈ చర్యలు చేపట్టాం’’ అని ఆ దేశ హోం సెక్రటరీ క్లారె ఓనెయిల్ పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాలో కేవలం అసలైన విద్యార్థులు వీసాలు పొందేలా, దేశ ఆర్థికవ్యవస్థకు అది ఊతమిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీనికితోడు వీసా వ్యవస్థలో ఉన్న లోపాలను వాడుకొంటూ విదేశీ విద్యార్థులు అక్కడే ఉండిపోవడాన్ని ఇది నిరోధిస్తుంది. ఆ దేశ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం 2023 సెప్టెంబర్ 30తో ముగిసే ఏడాది కాలంలో 5,48,000 మంది వలస వచ్చారని పేర్కొంది. ఇక భారత్ నుంచి ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల్లో 2022 ఒక్క సంవత్సరమే 1,00,009 మంది రిజిస్టర్ అయ్యారు. ఇక జనవరి 2023 నుంచి సెప్టెంబర్ వరకు 1.22 లక్షల మంది విద్యార్థులున్నారని లెక్కలు చెబుతున్నాయి. అమెరికా, కెనడాతో పోలిస్తే ఆస్ట్రేలియా విద్యార్థి వీసా మరింత ఖరీదైంది. ఆయా దేశాల్లో 185 డాలర్లు, 110 డాలర్లు కాగా.. ఆస్ట్రేలియాలో 1,068 డాలర్లుగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడే హెచ్చరికలు.. అంతలోనే బాంబుల మోత.. ఖాన్ యూనిస్లో విధ్వంసం
గాజాలోని అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్పై ఇజ్రాయెల్ దళాలు బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. -
భారత్-పాక్ సంబంధాలపై.. అమెరికా ఏమన్నదంటే?
భారత్-అమెరికాల మధ్య ఆర్థిక, భద్రతా రంగాల్లో ఎంతో సహకారం ఉందని, ఇదే ఒరవడిని ఇకముందు కొనసాగిస్తామని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. -
అమెరికాలో బిలియన్ డాలర్ల స్కామ్లో భారతీయులకు జైలు
అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తలు బిలియన్ డాలర్ల స్కామ్ చేశారు. దీంతో న్యాయస్థానం వారికి జైలు శిక్ష విధించింది. -
విమానంలో కుదుపులు.. ఓవర్హెడ్ బిన్లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు
గగనతలంలో విమాన ప్రయాణికులు తీవ్ర భయానక పరిస్థితులు ఎదుర్కొన్నారు. కుదుపుల (Turbulence)తో కొందరు అమాంతం సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. -
‘నాయకులు ఇంకెప్పుడు తెలుసుకుంటారు..’: గర్భవిచ్ఛిత్తి పోస్ట్పై మస్క్ వర్సెస్ కమలా హ్యారిస్!
Elon Musk Vs Kamala Harris: గర్భవిచ్ఛిత్తిపై ట్రంప్ నిషేధం విధిస్తారని కమలా హ్యారిస్ చేసిన పోస్ట్పై ఎక్స్ కమ్యూనిటీ నోట్స్ ట్యాగ్ను జత చేసింది. దీనిపై మస్క్ సైతం హ్యారిస్ను విమర్శించారు. -
ఒక్క రోజులో యుద్ధం ఆపేస్తానన్న ట్రంప్.. సాధ్యం కాదన్న రష్యా!
Russia Ukraine war: రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని తాను 24 గంటల్లో ఆపేస్తానని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నారు. రష్యా మాత్రం ఇది అంత త్వరగా పరిష్కరించగల సమస్య కాదని పేర్కొంది. -
సుప్రీంకోర్టులో ట్రంప్నకు ఉపశమనం
అధ్యక్ష ఎన్నికల్లో(2020) ప్రజాతీర్పును మార్చివేసేందుకు యత్నించారనే అభియోగాలను ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. -
పోటీలో కొనసాగనున్న బైడెన్!
డొనాల్డ్ ట్రంప్తో జరిగిన సంవాదంలో పేలవమైన పనితీరు కారణంగా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఒత్తిడిని ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్.. తాను వెనక్కి తగ్గకపోవచ్చన్న సంకేతాలను సోమవారం ఇచ్చారు. -
తీరం దాటిన ‘బెరిల్’ హరికేన్
కరీబియన్ దీవులను ‘బెరిల్’ హరికేన్ గజగజలాడిస్తోంది. సోమవారం అది మరింత తీవ్ర రూపం దాల్చి.. కరియాకౌ ఐలాండ్లో తీరం దాటింది. -
నాలుగేళ్ల తర్వాత భారత్కు ప్రయాణం.. విమానంలో ప్రాణం విడిచిన యువతి
ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని మృతి చెందింది. నాలుగేళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలిసేందుకు భారత్కు బయలుదేరిన ఆమె హఠాత్తుగా విమానంలోనే ప్రాణాలు విడిచింది. -
ఆస్టియోపొరోసిస్ ముప్పుపై హెచ్చరికలు చేసే ఏఐ
ఎముకలను గుల్లబార్చే ఆస్టియోపొరోసిస్ రుగ్మత ముప్పును ముందుగానే పసిగట్టేందుకు ఒక కృత్రిమ మేధ (ఏఐ) నమూనా సిద్ధమైంది. -
ఫ్రాన్స్లో మెక్రాన్కు ఎదురుదెబ్బ!
ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల తొలి విడత ఓటింగ్లో అతి జాతీయవాద నేషనల్ ర్యాలీ పార్టీ ఆధిక్యం సాధించినట్లు సోమవారం విడుదలైన ఫలితాలు సూచిస్తున్నాయి. -
ఆస్ట్రేలియా చదువులు మరింత భారం
అంతర్జాతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియాలో చదువులు మరింత భారంగా మారనున్నాయి. ఇతర దేశాల నుంచి అక్కడికి వెళ్లి చదువుకొనే విద్యార్థుల వీసా రుసుములను ఆ దేశం భారీగా పెంచేసింది. -
మనవళ్ల సంరక్షణ చూసే అవ్వాతాతలకు సెలవులు!
పిల్లల పెంపకం దిశగా స్వీడన్ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. మనవళ్ల సంరక్షణ కోసం అవ్వాతాతలకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలనే చట్టం తెచ్చింది. -
ఖాన్యూనిస్ను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్
గాజాలోని ఖాన్ యూనిస్ను ఖాళీ చేయాలంటూ స్థానిక పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం సోమవారం ఆదేశించింది. -
ఇజ్రాయెల్ నుంచి 55 మంది పాలస్తీనా బందీల విడుదల
పాలస్తీనాకు చెందిన 55 మంది బందీలను ఇజ్రాయెల్ సోమవారం విడుదల చేసింది. వారిలో గాజాలోని షిఫా ఆసుపత్రి డైరెక్టర్ మహ్మద్ అబు సల్మియా కూడా ఉన్నారు. -
ప్రమాదవశాత్తూ గాల్లోకి చైనా రాకెట్
పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో చైనాకు చెందిన ఒక శక్తిమంతమైన రాకెట్ ప్రమాదవశాత్తు గాల్లోకి దూసుకెళ్లింది. -
మనుగడ వ్యూహాలకు కేంద్రస్థానం ఇదే..!
మనుగడ కోసం సందర్భోచితంగా వివిధ వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుంది. మెదడులోని హైపోథాలమస్ అనే భాగం ఈ అంశంలో కీలకమని అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధన గుర్తించింది. -
ఆ దేశంలో తెల్లని వెడ్డింగ్ గౌను వేసుకున్నా.. వైన్ గ్లాసుల్లో మద్యం తాగినా..!
కిమ్ (Kim Jong Un) నియంతృత్వ రాజ్యంలో ఆంక్షలు చిత్రంగా ఉంటాయి. ప్రజల అభిరుచులపై సైతం ఆయన కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. -
ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయండి..! గాజావాసులకు ఇజ్రాయెల్ మరోసారి ఆదేశం
గాజాలోని ఖాన్ యూనిస్ నగరం తూర్పు ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ స్థానికులకు ఇజ్రాయెల్ మరోసారి ఆదేశాలు జారీ చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీషర్ట్, చిరిగిన జీన్స్ ధరించి కాలేజ్కు రావద్దు
-
మీకు వచ్చింది 99/100 కాదు.. 99/543: కాంగ్రెస్పై మోదీ సెటైర్లు
-
‘నీపై దయచూపడమా..?’: కుమార్తె గర్భానికి కారణమైన తండ్రికి 101 ఏళ్ల జైలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ముంబయి అల్లర్ల నిందితుడు.. 31 ఏళ్ల తర్వాత చిక్కాడు!
-
తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీకి ఏర్పాట్లు