- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Afghanistan: ‘ఆమె’ కలలకు తాలిబన్ల సంకెళ్లు..!
అఫ్గానిస్థాన్లో తాలిబన్ల ఆంక్షలతో మహిళల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. వారి పాలనతో ఎంతోమంది మహిళలు తమ కలలను చంపుకొని వంట గదికి పరిమితమవుతున్నారు. దీంతో శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు తాజాగా వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ (Afghanistan)ను చేజిక్కించుకున్న తాలిబన్లు (Taliban).. అక్కడి మహిళల హక్కులను కాలరాస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తూనే ఉన్నాయి. కఠిన ఆంక్షలు విధిస్తూ, అడుగడుగునా వారి అభ్యున్నతికి అడ్డంకిగా మారినట్లు చెబుతున్నాయి. బాలికలను చదువు నుంచి దూరం చేసి వంటింటికే పరిమితం చేయడంపై ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలా తాలిబన్ల తీరుతో ఎంతోమంది ప్రతిభావంతులైన మహిళలు తమ స్వప్నాలను చంపుకొని జీవిస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.
మహిళలకు ఉన్నత విద్య అవసరం లేదంటూ వారిపై ఉక్కుపాదం మోపుతోన్న తాలిబన్లు.. కుట్లు, అల్లికలు ఇతర చిన్న పనులకే పరిమితం కావాలని ఆదేశిస్తున్నారు. ఇలా చేసుకునేందుకు దాదాపు 2 లక్షల మంది మహిళలకు తాలిబన్లు అనుమతి ఇచ్చినట్లు అంచనా. వారిలో ఒకరు ఫ్రోజన్ అహ్మద్జాయ్.
చిన్నప్పటినుంచి డాక్టరు కావాలని ఎన్నో కలలు కన్న అహ్మద్జాయ్కు తాలిబన్ల రాకతో నిరాశే మిగిలింది. స్థానిక విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైన ఆమె ప్రస్తుతం పచ్చళ్ల తయారీకే పరిమితమయ్యారు. వైద్యురాలిగా సేవలందించాలనుకున్న తాను కుటుంబపోషణ కోసం ఈ పని చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా అహ్మద్జాయ్ వంటి ఎంతోమంది నైపుణ్యం కలిగిన మహిళలు తీవ్ర నిరాశతో ఉన్నట్లు వెల్లడవుతోంది.
తగ్గిన మహిళా శ్రామిక శక్తి..
ఆర్థిక అభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేసేందుకు ఎన్నో దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. కానీ, అఫ్గాన్లో మాత్రం వారి భాగస్వామ్యం తగ్గింది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2021లో అక్కడి శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం 14.8 శాతం ఉండగా.. 2023 నాటికి 4.8%కి తగ్గినట్లు వెల్లడైంది.
ఉద్యోగులకు జీతాలు పెంచారని.. యజమానులకు జైలు
అఫ్గానిస్థాన్లో పౌర ప్రభుత్వాన్ని కూల్చి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు మహిళలపై అణచివేతను కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. వారి పాలన మహిళల భవిష్యత్తుకు శాపంగా మారినట్లు చెబుతున్నాయి. దేశంలోని బాలికలు ఆరో తరగతికి మించి చదవాల్సిన అవసరం లేదని, ఉద్యోగాలకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేయడం వంటి ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి హవా.. 26 మంది గెలుపు!
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో హౌస్ ఆఫ్ కామన్స్లో భారత సంతతి హవా కొనసాగింది. మొత్తంగా 26 మంది భారత మూలాలున్న వ్యక్తులు పార్లమెంటులో అడుగుపెడుతున్నారు. -
యూకే నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్.. కింగ్ ఛార్లెస్-3 ఆమోదం
యూకే కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్ (Keir Starmer) నియామకానికి రాజు ఛార్లెస్-3 ఆమోదం తెలిపారు. -
మీ ఆగ్రహం నన్ను తాకింది: ప్రధానిగా చివరి ప్రసంగంలో రిషి సునాక్ భావోద్వేగం
Rishi Sunak: దేశ ప్రజలు మార్పు కోరుకున్నారని, వారి తీర్పును తాను గౌరవిస్తానని రిషి సునాక్ అన్నారు. బ్రిటన్ ప్రధానిగా చివరి ప్రసంగం చేశారు. -
బాధ్యత వహించినా.. సునాక్ కేవలం బాధితుడేనా!
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని రిషి సునాక్ పేర్కొన్నప్పటికీ.. అంతకుముందు అధికారం చేపట్టిన టోరీల నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
యూకే ఎన్నికల ఫలితాలు.. రిషి సునాక్పై మోదీ పోస్టు
యూకే ఎన్నికల ఫలితాల వేళ.. దాదాపు రెండేళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన రిషి సునాక్ (Rishi Sunak)ను ఉద్దేశించి మోదీ(Modi) పోస్టు పెట్టారు. -
ఎన్నికల్లో ‘ఏఐ’ అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా..?
AI Candidate In UK Elections: బ్రిటన్ ఎన్నికల ప్రచార సమయంలో ‘ఏఐ స్టీవ్’ అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
నిద్ర సరిపోవట్లేదు.. రాత్రి 8 తర్వాత రాలేను: బైడెన్
వరుస కార్యక్రమాలతో తాను అలసిపోతున్నానని, అర్ధరాత్రి వరకు ప్రచారాలు వద్దని బైడెన్ (Biden) అన్నారు. -
ఎయిర్పోర్టులో గ్యాస్ లీక్.. 39 మందికి అస్వస్థత
విమానాశ్రయంలో గ్యాస్ లీక్ అవ్వడంతో పలువురు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్ (Rishi Sunak) నేతృత్వం వహిస్తోన్న కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. దీనిపై ఆయన స్పందించారు. -
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భంగపాటు.. ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం
UK elections: యూకేలో గురువారం రాత్రి సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారంలో ఉన్న ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. -
సునాక్ భవితవ్యంపై ఉత్కంఠ!
భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ భవితవ్యాన్ని తేల్చే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ గురువారం ఉదయం 7 గంటలకు బ్రిటన్లో ప్రారంభమైంది. దేశంలో మొత్తం 4.6 కోట్ల మంది ఓటర్లున్నారు. -
బలవంతంగా సంతానశక్తి తొలగింపు.. తగిన పరిహారం చెల్లింపునకు కోర్టు ఆదేశం
జపాన్లో దాదాపు డజను మంది బాధితులకు బలవంతంగా సంతానశక్తి తొలగించినందుకుగాను తగిన పరిహారం చెల్లించవలసిందిగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం బుధవారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. -
బైడెన్ వైదొలగేదే లేదు
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగే ప్రసక్తే లేదని శ్వేతసౌధం స్పష్టంచేసింది. తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ముఖాముఖిలో బైడెన్ తడబడడం అనేక సందేహాలకు తావిచ్చిన.. -
దక్షిణాఫ్రికాలో 34 వేల ఏళ్ల పురాతన చెదపుట్టలు
ఇప్పటికీ చెద పురుగులు నివసిస్తున్న అతి పురాతనమైన చెదపుట్టలను దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు నమోదైనవాటిలో ఇవే పురాతనమైనవని పేర్కొన్నారు. -
వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిందే
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించింది. -
ఆ దేశాలను ఉపేక్షించొద్దు
ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలను ఏకాకులుగా మార్చాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే దేశాలనూ బహిరంగంగా ఎండగట్టాలని సూచించింది. -
షికాగోలో కాల్పులు.. ఇద్దరు మహిళల మృతి
అమెరికాలోని షికాగో సమీపంలో గ్రాండ్ క్రాసింగ్ వద్ద గురువారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. గాయపడిన మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఉక్రెయిన్కు మరో ఎదురుదెబ్బ
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు దొనెట్స్క్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా చాలా కీలకమైన చాసివ్ యార్ పట్టణ శివార్ల నుంచి ఆ దేశ బలగాలు వెనక్కి మళ్లాయి. -
ఇజ్రాయెల్పైకి 200 రాకెట్లు.. హెజ్బొల్లా ప్రతీకార దాడి
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తమ కమాండర్ మృతికి ప్రతీకారంగా గురువారం హెజ్బొల్లా.. ఉత్తర ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలపైకి ఏకంగా 200కుపైగా రాకెట్లను, డ్రోన్లను ప్రయోగించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై నాకే నమ్మకం కుదరలేదు: కోహ్లీ
-
అదే నిజమైతే.. భోలే బాబా మా వారిని బతికించొచ్చు కదా..!
-
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం.. స్తంభించిన ట్రాఫిక్
-
ఇప్పుడు 140+ కోట్ల మంది ఛాంపియన్లే: హార్దిక్ పాండ్య
-
బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి హవా.. 26 మంది గెలుపు!
-
ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలి: డిప్యూటీ సీఎం పవన్