- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
America: భారత్లో మైనారిటీలపై దాడులు ఆందోళనకరం
భారత్లో తీసుకొస్తున్న మతమార్పిడి నిషేధ చట్టాలు, విద్వేష వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా వ్యాఖ్యానించింది.
అమెరికా వ్యాఖ్య
వాషింగ్టన్: భారత్లో తీసుకొస్తున్న మతమార్పిడి నిషేధ చట్టాలు, విద్వేష వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా వ్యాఖ్యానించింది. మైనారిటీలకు సంబంధించిన ఇళ్లను, ప్రార్థనా స్థలాలను కూల్చివేయడమూ ఇబ్బందికరమేనని అభిప్రాయపడింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై బుధవారం నివేదిక విడుదల చేసిన సందర్భంగా అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మత స్వేచ్ఛ కోసం పలువురు పని చేస్తున్నారని తెలిపారు.‘భారత్లోని 28 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాలు మత మార్పిడి నిషేధిస్తూ చట్టాలు చేశాయి. ఇందులో కొన్ని బలవంతపు మత మార్పిడికి పాల్పడితే భారీ జరిమానాలను విధిస్తున్నాయి. దీనిపై అమెరికా అధికారులు ఎప్పటికప్పుడు భారత్ ఆధికారులతో మాట్లాడి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు’ అని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై విడుదల చేసిన 2023 నివేదిక పేర్కొంది.
భారత్ దర్యాప్తు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం
తమ దేశంలో జరిగిన ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్ను హత్య కేసులో భారత్ దర్యాప్తు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని అమెరికా పేర్కొంది. ఈ హత్యలో భారత్కు చెందిన నిఖిల్ గుప్తా ప్రమేయముందని అమెరికా అధికారులు గత నవంబరులో అభియోగాలు మోపారు. గత ఏడాది జూన్లో చెక్ రిపబ్లిక్లో నిఖిల్ను అరెస్టు చేసి అమెరికాకు తీసుకొచ్చారు. ‘ఈ కేసులో విచారణ జరుపుతున్నామని భారత్ అధికారులు తెలిపారు. ఆ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం’ అని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి బుధవారం వాషింగ్టన్లో వ్యాఖ్యానించారు.
ఇరు దేశాల సంబంధాలు మరింత విస్తృతం
అమెరికా రాయబారి గార్సెట్టీ వెల్లడి
ఆక్సన్ హిల్: భారత్, అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత అత్యుత్తమంగా ఉన్నాయని, అవి మరింత విస్తృతమవుతున్నాయని భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఇంత దగ్గరగా రెండు దేశాలు లేవని, అమెరికాలో భారతీయులు 1.5 శాతం ఉన్నారని, వారు దేశ పన్నుల్లో 6శాతం చెల్లిస్తున్నారని తెలిపారు. అమెరికాలో భారతీయులు అత్యంత విజయవంతమైన వలస వర్గమని వ్యాఖ్యానించారు. భారత్ నుంచి భారీగా తరలివచ్చిన ప్రతినిధులతో వాషింగ్టన్కు సమీపంలోని ఆక్సన్ హిల్లో నిర్వహించిన సెలక్ట్ యూఎస్ఏ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. ‘భారత్, అమెరికా సంబంధాలంటే కూడిక కాదు.. మల్టిప్లికేషన్. ఇది అమెరికా ప్లస్ ఇండియా కాదు. గుణింతం లాంటిది’ అని గార్సెట్టీ పేర్కొన్నారు. అమెరికన్లకు మరిన్ని భారత్ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైడెన్ వైదొలగాల్సిందే
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అట్లాంటాలో ఇటీవల జరిగిన సంవాదంలో పలుమార్లు తడబడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ దఫా ఎన్నికల బరి నుంచి వైదొలగాలన్న డిమాండ్లు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. -
పుడమికి చేరువగా వచ్చి వెళ్లిన గ్రహశకలాలు
రెండు గ్రహశకలాలు భూమికి అతిదగ్గరగా వచ్చి వెళ్లాయి. వీటి వల్ల ఎలాంటి ముప్పు కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
పిట్ట కొంచెం.. కిక్కు ఘనం..!
పక్షుల వ్యవహారశైలి చాలా వింతగా ఉంటుంది. కొన్ని విహంగాలు ఘాటైన రసాయనాల కోసం గాలిస్తుంటాయి. -
ఫ్రాన్స్లో పార్లమెంటరీ ఎన్నికల తొలి విడత పూర్తి
ఫ్రాన్స్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న పార్లమెంటరీ ఎన్నికల పర్వం ప్రారంభమైంది. మొత్తం రెండు విడతల్లో ఈ ఎన్నికలు జరగనుండగా.. ఆదివారం తొలి రౌండ్ పోలింగ్ పూర్తయింది. -
భీకర హరికేన్ ముప్పు అంచున ఆగ్నేయ కరేబియా ప్రాంతం
ఆగ్నేయ కరేబియన్ ప్రాంతం భీకర హరికేన్ (4వ తరగతి) ముప్పు ముంగిట నిలిచింది. ఆ ప్రాంతానికి సమీపంలో ఏర్పడిన బెరిల్ హరికేన్ దాని అనుకుని ఉన్న హరికేన్ను మరింత బలోపేతం చేస్తోందని అధికారులు తెలిపారు. -
బొమ్మ తుపాకీతో పోలీసులకు బెదిరింపు
పోలీసుల నుంచి తప్పించుకోబోయి, బొమ్మ తుపాకీతో వారిని బెదిరించడంతో ఓ 13ఏళ్ల బాలుడిని న్యూయార్క్ అధికారి ఒకరు తుపాకీతో కాల్చిచంపారు. న్యూయార్క్లోని యుటికా నగరంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
ఉక్రెయిన్పై రష్యా దాడి.. ఏడుగురి మృతి
దక్షిణ ఉక్రెయిన్లోని విల్నియాన్స్క్ పట్టణంపై శనివారం రాత్రి రష్యా ప్రయోగించిన క్షిపణులు ఏడుగురి ప్రాణాలను బలిగొన్నాయి. వీరిలో ముగ్గురు పిల్లలు. దాడిలో అనేకమంది గాయాలపాలయ్యారు. -
నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడులు
నైజీరియాలో శనివారం జరిగిన వరుస ఆత్మాహుతి దాడులు కలకలం రేపాయి. ఈ దాడుల్లో కనీసం 18 మంది మృతిచెందారు. 30 మంది తీవ్రంగా గాయపడగా.. వీరిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉంది. -
హిందూ విశ్వాసం నుంచి ప్రేరణ పొందా
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి శనివారం లండన్లోని నీస్డెన్లో గల బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ్ ఆలయాన్ని సందర్శించారు. -
సూడాన్లో సైన్యంతో సాయుధ ఘర్షణ
సైన్యానికి, ప్రమాదకరమైన సాయుధ బలగాలకు మధ్య మొదలైన ఘర్షణతో ఆఫ్రికాలోని సూడాన్లో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. -
బైడెన్ స్థానంలో మరొకరు?- రిపబ్లికన్లకు నిక్కీ హేలీ అలర్ట్
జో బైడెన్ స్థానంలో ఓ యువనేత, సమర్థవంతమైన వ్యక్తి రానున్నాడని రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ అంచనా వేశారు.