- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Turbulence in Flight: విమానంలో కుదుపులు.. ఓవర్హెడ్ బిన్లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు
గగనతలంలో విమాన ప్రయాణికులు తీవ్ర భయానక పరిస్థితులు ఎదుర్కొన్నారు. కుదుపుల (Turbulence)తో కొందరు అమాంతం సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు.
ఇంటర్నెట్డెస్క్: తాము ప్రయాణిస్తోన్న విమానంలో ఒక్కసారిగా కుదుపులు (Turbulence) రావడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ కుదుపుల(Turbulence) తీవ్రతకు కొందరు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. ఒక వ్యక్తి ఏకంగా ఓవర్హెడ్ బిన్ వద్ద ఇరుక్కుపోయాడు. మిగతా ప్రయాణికులు అతడిని కిందికి దించుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయపడ్డారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం..
విమానయాన సంస్థ ఎయిర్ యురోపా(Air Europa)కు చెందిన బోయింగ్ 787-9 విమానం 325 మంది ప్రయాణికులతో స్పెయిన్ నుంచి ఉరుగ్వేకు బయల్దేరింది. ఆ సమయంలో ఒక్కసారిగా కుదుపులకు లోనయింది. ప్రయాణికులు ఎగిరిపడటమే గాకుండా సీలింగ్ ప్యానెల్, సీట్లు దెబ్బతిన్నాయి. చిన్నారులు భయంతో ఏడుపు లంకించుకున్నారు. ఈ ఘటనతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. బ్రెజిల్లోని నాటల్ ఎయిర్పోర్టులో దింపారు. దీనిపై ఎయిర్ యురోపా సంస్థ స్పందించింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపింది.
సోమవారం జరిగిన ఈ ఘటనపై ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ.. ఐరోపా టూర్ ముగించుకొని తాను స్వదేశానికి తిరిగి వస్తున్నప్పుడు ఇలా జరిగిందని చెప్పారు. మార్గమధ్యలో ఉండగా కుదుపుల గురించి కెప్టెన్ వార్నింగ్ ఇచ్చారు. సీట్బెల్ట్ బిగించి పెట్టుకోవాలని సూచించారు. సీట్బెల్ట్ సరిగా పెట్టుకోనివారు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఆ అనుభవం భయానకంగా అనిపించిందని మరో ప్రయాణికుడు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యూయార్క్ ‘ఇండియా డే’ కవాతులో.. అయోధ్య రామమందిర నమూనా
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆగస్టు 18న నిర్వహించనున్న చారిత్రక ‘ఇండియా డే’ కవాతులో అయోధ్య రామమందిర నమూనాను ప్రదర్శించనున్నారు. -
తోషాఖానా కేసులో ఇమ్రాన్కు మరో ఊరట
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(71)ను వెంటాడిన తోషాఖానా కేసులో మరో ఊరట లభించింది. -
బెంబేలెత్తించిన బెరిల్.. ద్వీపం ధ్వంసం!
కరీబియన్ దీవుల్లో భీకర ‘బెరిల్’ హరికేన్ భారీ విధ్వంసం సృష్టించింది. గంటకు దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు అనేక దీవుల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీశాయి. -
బ్రిటన్ పార్లమెంటు బరిలో భారత సంతతి అభ్యర్థుల హవా
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమైంది. గురువారం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2019 ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు రికార్డు స్థాయిలో ఎన్నికై పార్లమెంటులో అడుగడుపెట్టి చరిత్ర సృష్టించారు. -
భారతీయ విద్యార్థుల మద్దతుకు అమెరికాలో ప్రత్యేక ‘పోర్టల్’ వేదిక
అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సహాయార్థం న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక వేదికను రూపొందించింది. విద్యార్థులకు అమెరికన్ కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు వెదకటంతోపాటు న్యాయ, వైద్యపరమైన సమచారం ఈ వేదిక ద్వారా వారికి అందుబాటులో ఉంచుతారు. -
యుద్ధభూమిలో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా పంపండి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారత జాతీయులను క్షేమంగా స్వదేశానికి తిప్పిపంపాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ను బుధవారం భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ గట్టిగా కోరారు. -
ఇజ్రాయెల్ దాడిలో హెజ్బొల్లా కమాండర్ మృతి
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకుంటున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. -
చర్చ సమయంలో దాదాపు నిద్రపోయాను
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో గతవారం ముఖాముఖిలో తన ప్రదర్శన సరిగా లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. ‘సిబ్బంది వద్దని చెప్పినా చర్చకు ముందు నేను విదేశీ పర్యటనలు చేశాను. -
రష్యా క్షిపణుల దాడిలో ఐదుగురి మృతి
తూర్పు ఉక్రెయిన్లోని నిప్రొ నగరంపై బుధవారం రష్యా చేసిన క్షిపణి దాడుల్లో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. -
సంక్షిప్త వార్తలు
అమెరికాలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు.. ట్రంప్ హయాంలో గర్భవిచ్ఛిత్తిపై నిషేధం అమల్లోకి వచ్చిన రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
-
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
-
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
అన్లిమిటెడ్ క్లెయిం మొత్తంతో ఐసీఐసీఐ ఆరోగ్య బీమా పాలసీ!
-
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్
-
రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 24,350 ఎగువన నిఫ్టీ