- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
South Korea: దక్షిణ కొరియా బ్యాటరీ ప్లాంట్లో ఘోర ప్రమాదం: 20 మంది మృతి
దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఓ బ్యాటరీ ప్లాంట్లో మంటలు చెలరేగి 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్డెస్క్: దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీల కర్మాగారంలో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 సమయంలో సియోల్ దక్షిణ ప్రాంతంలోని హ్వసోంగ్లో ఉన్న ఆరిసెల్ బ్యాటరీ ప్లాంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాదాపు 35,000 సెల్స్ను భద్రపర్చిన గోదాములో పేలుళ్లు జరగడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకొంది.
ఇప్పటివరకు 20 మృతదేహాలను ప్రమాదం జరిగినచోట అధికారులు గుర్తించారు. డజన్లకొద్దీ ఫైర్ ఇంజిన్లు ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. లిథియం బ్యాటరీలు వేగంగా మండటం.. అత్యధిక ఉష్ణోగ్రతలు వెదజల్లడంతో తొలుత సహాయక చర్యలు కష్టంగా మారాయి. దీనికితోడు నీరు ఈ బ్యాటరీలపై మంటలు ఆర్పలేదు. ఈనేపథ్యంలో డ్రైశాండ్ను కూడా వినియోగించారు.
ఈ కర్మాగారంలో ప్రమాదం జరిగే సమయంలో సుమారు 100 మంది పని చేస్తున్నారు. వీరిలో 78 మంది సురక్షితంగా బయటపడ్డారు. మంటలను అదుపు చేయడంతో సహాయక బృందాలు కర్మాగారం లోపలికి చేరుకొని మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై ఆ దేశాధ్యక్షుడు యూన్సుక్ యోల్ స్పందించారు. అధికారులు అందుబాటులో ఉన్న వనరులు, సిబ్బందిని వినియోగించి ప్రమాదాన్ని అదుపుచేయాలని ఆదేశించారు.
ప్రపంచంలో బ్యాటరీల తయారీ రంగంలో దక్షిణ కొరియా చాలా ముందుంది. అంతేకాదు.. వాటిని వినియోగించే కార్లు కూడా అక్కడ ఎక్కువే. ద.కొరియా బ్యాటరీ తయారీ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తు వాహన కంపెనీలకు సరఫరా చేస్తుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
Milk price in pak: పాకిస్థాన్లో పాల ధరకు రెక్కలొచ్చాయి. లీటర్ పాల ధర ఏకంగా రూ.370కి చేరింది. -
చరిత్ర సృష్టించి.. సవాళ్ల నడుమ ‘సునాక్’ ప్రయాణం!
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలిస్తే.. అందుకు సునాక్ బాధ్యుడు కాదని, అంతకుముందు అధికారం చేపట్టిన కన్జర్వేటివ్ పార్టీ నేతల నిర్ణయాలే ఆ దుస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఇజ్రాయెల్ పైకి 200 రాకెట్లు.. హెజ్బొల్లా ప్రతీకార దాడులు!
ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే లక్ష్యంగా 200కుపైగా రాకెట్లు ప్రయోగించినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. -
రష్యాకు ప్రధాని మోదీ.. అయిదేళ్ల తర్వాత తొలిసారి
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8, 9, 10వ తేదీల్లో రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటించనున్నారు. -
‘వాస్తవాధీన రేఖ’ను గౌరవించాల్సిందే - చైనాకు జైశంకర్ స్పష్టం
సరిహద్దులో నెలకొన్న ఇతర సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాకు స్పష్టం చేశారు. -
రిషి సునాక్కు మళ్లీ విజయం దక్కేనా? బ్రిటన్లో మొదలైన ఓటింగ్
Rishi Sunak: బ్రిటన్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్కు రెండోసారి విజయం దక్కుతుందా, లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. -
సందేహం అక్కర్లేదు.. నేనే అధ్యక్ష అభ్యర్థిని: బైడెన్
Biden: బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తాను పోటీ నుంచి వైదొలగబోనని స్పష్టం చేశారు. -
న్యూయార్క్ ‘ఇండియా డే’ కవాతులో.. అయోధ్య రామమందిర నమూనా
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆగస్టు 18న నిర్వహించనున్న చారిత్రక ‘ఇండియా డే’ కవాతులో అయోధ్య రామమందిర నమూనాను ప్రదర్శించనున్నారు. -
తోషాఖానా కేసులో ఇమ్రాన్కు మరో ఊరట
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(71)ను వెంటాడిన తోషాఖానా కేసులో మరో ఊరట లభించింది. -
బెంబేలెత్తించిన బెరిల్.. ద్వీపం ధ్వంసం!
కరీబియన్ దీవుల్లో భీకర ‘బెరిల్’ హరికేన్ భారీ విధ్వంసం సృష్టించింది. గంటకు దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు అనేక దీవుల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీశాయి. -
బ్రిటన్ పార్లమెంటు బరిలో భారత సంతతి అభ్యర్థుల హవా
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమైంది. గురువారం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2019 ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు రికార్డు స్థాయిలో ఎన్నికై పార్లమెంటులో అడుగడుపెట్టి చరిత్ర సృష్టించారు. -
భారతీయ విద్యార్థుల మద్దతుకు అమెరికాలో ప్రత్యేక ‘పోర్టల్’ వేదిక
అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సహాయార్థం న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక వేదికను రూపొందించింది. విద్యార్థులకు అమెరికన్ కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు వెదకటంతోపాటు న్యాయ, వైద్యపరమైన సమచారం ఈ వేదిక ద్వారా వారికి అందుబాటులో ఉంచుతారు. -
యుద్ధభూమిలో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా పంపండి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారత జాతీయులను క్షేమంగా స్వదేశానికి తిప్పిపంపాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ను బుధవారం భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ గట్టిగా కోరారు. -
ఇజ్రాయెల్ దాడిలో హెజ్బొల్లా కమాండర్ మృతి
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకుంటున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. -
చర్చ సమయంలో దాదాపు నిద్రపోయాను
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో గతవారం ముఖాముఖిలో తన ప్రదర్శన సరిగా లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. ‘సిబ్బంది వద్దని చెప్పినా చర్చకు ముందు నేను విదేశీ పర్యటనలు చేశాను. -
రష్యా క్షిపణుల దాడిలో ఐదుగురి మృతి
తూర్పు ఉక్రెయిన్లోని నిప్రొ నగరంపై బుధవారం రష్యా చేసిన క్షిపణి దాడుల్లో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. -
సంక్షిప్త వార్తలు
అమెరికాలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు.. ట్రంప్ హయాంలో గర్భవిచ్ఛిత్తిపై నిషేధం అమల్లోకి వచ్చిన రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలికపై లైంగిక వేధింపులు.. వైకాపా మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్
-
అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
-
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
-
ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో గంజాయి కలకలం
-
17 రోజుల్లో కూలిన 12 వంతెనలు.. తప్పెవరిది?
-
చరిత్ర సృష్టించి.. సవాళ్ల నడుమ ‘సునాక్’ ప్రయాణం!