- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
USA: అమెరికాలో బిలియన్ డాలర్ల స్కామ్లో భారతీయులకు జైలు
అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తలు బిలియన్ డాలర్ల స్కామ్ చేశారు. దీంతో న్యాయస్థానం వారికి జైలు శిక్ష విధించింది.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా(USA)లో భారత సంతతి వ్యాపారవేత్తలు బిలియన్ డాలర్ల స్కామ్కు పాల్పడినట్లు తేలడంతో జైలు శిక్ష విధించారు. ఒకప్పుడు చికాగోలోనే అత్యంత వేగంగా ఎదిగిన స్టార్టప్ మోసాలకు పాల్పడినట్లు ఈసందర్భంగా న్యాయస్థానం పేర్కొంది. ఔట్కమ్ హెల్త్ పేరిట రిషి షా, శ్రద్ధా అగర్వాల్లు ఓ హెల్త్ మీడియా సంస్థను 2006లో ఏర్పాటుచేశారు. ఈ కంపెనీ డాక్టర్ల వద్ద స్క్రీన్లు, టాబ్లెట్లను ఏర్పాటు చేసింది. వీటిల్లో పేషెంట్లను టార్గెట్ చేసుకొని వివిధ కంపెనీల మెడికల్ అడ్వర్టైజింగ్ ప్రకటనలు ప్రసారం చేసేది. ఈ సృజనాత్మక ఆలోచనకు అమెరికాలో మంచి స్పందన లభించింది. దేశవ్యాప్తంగా కంపెనీకి కాంట్రాక్టులు లభించాయి. 2010లో ఆ దేశ టెక్, హెల్త్కేర్ ఇన్వెస్ట్మెంట్లలో ఉన్నత స్థానానికి చేరింది. దీంతో భారీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. గోల్డ్మన్ సాక్స్, ఆల్ఫాబెట్, జేబీ ప్యాట్రిక్స్ వెంచర్ క్యాపిటల్స్ వంటి సంస్థలు భారీగా ఇన్వెస్ట్మెంట్లు చేశాయి. చికాగో కార్పొరేట్ సర్కిల్స్లో షా అప్పట్లో ఓ స్టార్ అయిపోయాడు.
కానీ, రిషి, శ్రద్ధా, సీఎఫ్వో బ్రాడ్ పౌర్డీలు కంపెనీ ఆపరేషనల్, ఫైనాన్షియల్ కార్యకలాపాలను పెంచి చూపిస్తున్నట్లు గుర్తించారు. కంపెనీ డెలివరీ చేయగలిగిన స్థాయి కంటే ఎక్కువగా వాణిజ్య ప్రకటనల ఇన్వెంటరీని విక్రయిస్తున్నట్లు తేలింది. ఫార్మా జెయింట్ నోవో నార్డ్స్క్, మరికొన్ని కంపెనీలు ఈ అంశాన్ని గుర్తించాయి. మరోవైపు షా విలాసవంతమైన జీవనశైలి ఇన్వెస్టర్లలో అనుమానాలు పెంచింది. అతడు 10 మిలియన్ డాలర్లు వెచ్చించి ఇల్లు కొనుగోలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై వాల్ స్ట్రీట్ జర్నల్ 2017లో కథనం ప్రచురించింది. ఆ తర్వాత గోల్డ్మన్ సాక్స్, ఆల్ఫాబెట్ వంటి ఇన్వెస్టర్లు కోర్టులో కేసు ఫైల్ చేశారు.
షాపై 2023 ఏప్రిల్లో డజను కౌంట్స్కుపైగా మనీ లాండరింగ్ కేసు నమోదైంది. మిగిలిన ఇద్దరిని కూడా దీనిలో భాగస్వాములను చేశారు. ఈ కేసు విచారణ జరిపిన న్యాయస్థానం జూన్ 26 నుంచి షాకు ఏడేళ్ల ఆరు నెలలు, జూన్ 30 నుంచి శ్రద్ధాకు మూడేళ్ల హాఫ్వే హౌస్లో ఉండేలా, పౌర్డీకి రెండేళ్ల మూడు నెలల జైలు శిక్ష విధించింది. మరోవైపు తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నట్లు షా తన నేరం అంగీకారంలో వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వాస్తవాధీన రేఖ’ను గౌరవించాల్సిందే - చైనాకు జైశంకర్ స్పష్టం
సరిహద్దులో నెలకొన్న ఇతర సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాకు స్పష్టం చేశారు. -
రిషి సునాక్కు మళ్లీ విజయం దక్కేనా? బ్రిటన్లో మొదలైన ఓటింగ్
Rishi Sunak: బ్రిటన్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్కు రెండోసారి విజయం దక్కుతుందా, లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. -
సందేహం అక్కర్లేదు.. నేనే అధ్యక్ష అభ్యర్థిని: బైడెన్
Biden: బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తాను పోటీ నుంచి వైదొలగబోనని స్పష్టం చేశారు. -
న్యూయార్క్ ‘ఇండియా డే’ కవాతులో.. అయోధ్య రామమందిర నమూనా
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆగస్టు 18న నిర్వహించనున్న చారిత్రక ‘ఇండియా డే’ కవాతులో అయోధ్య రామమందిర నమూనాను ప్రదర్శించనున్నారు. -
తోషాఖానా కేసులో ఇమ్రాన్కు మరో ఊరట
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(71)ను వెంటాడిన తోషాఖానా కేసులో మరో ఊరట లభించింది. -
బెంబేలెత్తించిన బెరిల్.. ద్వీపం ధ్వంసం!
కరీబియన్ దీవుల్లో భీకర ‘బెరిల్’ హరికేన్ భారీ విధ్వంసం సృష్టించింది. గంటకు దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు అనేక దీవుల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీశాయి. -
బ్రిటన్ పార్లమెంటు బరిలో భారత సంతతి అభ్యర్థుల హవా
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమైంది. గురువారం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2019 ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు రికార్డు స్థాయిలో ఎన్నికై పార్లమెంటులో అడుగడుపెట్టి చరిత్ర సృష్టించారు. -
భారతీయ విద్యార్థుల మద్దతుకు అమెరికాలో ప్రత్యేక ‘పోర్టల్’ వేదిక
అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సహాయార్థం న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక వేదికను రూపొందించింది. విద్యార్థులకు అమెరికన్ కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు వెదకటంతోపాటు న్యాయ, వైద్యపరమైన సమచారం ఈ వేదిక ద్వారా వారికి అందుబాటులో ఉంచుతారు. -
యుద్ధభూమిలో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా పంపండి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారత జాతీయులను క్షేమంగా స్వదేశానికి తిప్పిపంపాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ను బుధవారం భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ గట్టిగా కోరారు. -
ఇజ్రాయెల్ దాడిలో హెజ్బొల్లా కమాండర్ మృతి
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకుంటున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. -
చర్చ సమయంలో దాదాపు నిద్రపోయాను
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో గతవారం ముఖాముఖిలో తన ప్రదర్శన సరిగా లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. ‘సిబ్బంది వద్దని చెప్పినా చర్చకు ముందు నేను విదేశీ పర్యటనలు చేశాను. -
రష్యా క్షిపణుల దాడిలో ఐదుగురి మృతి
తూర్పు ఉక్రెయిన్లోని నిప్రొ నగరంపై బుధవారం రష్యా చేసిన క్షిపణి దాడుల్లో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. -
సంక్షిప్త వార్తలు
అమెరికాలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు.. ట్రంప్ హయాంలో గర్భవిచ్ఛిత్తిపై నిషేధం అమల్లోకి వచ్చిన రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘వాస్తవాధీన రేఖ’ను గౌరవించాల్సిందే - చైనాకు జైశంకర్ స్పష్టం
-
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి భేటీ
-
తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం మంచిదే: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
-
మాట నిలబెట్టుకున్న భాజపా నేత.. మంత్రి పదవికి రాజీనామా
-
కోహ్లీ ‘ఫిట్నెస్’ చూశాక.. పోటీపడలేమనుకున్నా: సూర్యకుమార్
-
శరవేగంగా ‘విశ్వంభర’.. లేటెస్ట్ అప్డేట్ ఇదే!