- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
‘సుకన్య సమృద్ధి’కి ట్రైనీ అఖిల భారత సర్వీసు అధికారుల చొరవ.. 100 మంది పేరిట ఖాతాలు
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా.. శిక్షణ దశలోనే 2024 బ్యాచ్ అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులు సేవాబాట పట్టి ఆదర్శంగా నిలిచారు.
తెలుగు రాష్ట్రాల్లో అవగాహనకు నిర్ణయం
ఖాతాలు ప్రారంభించి.. వెయ్యి చొప్పున జమ
బాలికకు సుకన్య సమృద్ధి యోజన పాస్పుస్తకం అందిస్తున్న చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ టీఎం శ్రీలత, ట్రైనీ ఐఏఎస్లు అనన్యారెడ్డి, కిరణ్ తదితరులు
ఈనాడు, హైదరాబాద్: పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా.. శిక్షణ దశలోనే 2024 బ్యాచ్ అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులు సేవాబాట పట్టి ఆదర్శంగా నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికలందరినీ ‘బాలికా సుకన్య సమృద్ధి యోజన’లో చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించారు. అందుకు బాటలు వేస్తూ.. 65 మంది శిక్షణ అధికారులు తమకు వచ్చిన రూ.1.30 లక్షల రవాణా భత్యంతో.. హైదరాబాద్లో 100 మంది బాలికల పేరుతో ఖాతాలు తెరిపించి రూ.వెయ్యి చొప్పున జమ చేశారు. ఇకపై బాలికల తల్లిదండ్రులు నెలవారీ నగదు జమ చేసేందుకు తపాలా కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా వారి పేరుతో ఐపీపీబీ (ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్) ఖాతాలు తెరిచి డెబిట్ కార్డులు సైతం అందించారు.
శిక్షణ పొందుతున్న సివిల్ సర్వీస్ అధికారుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 65 మంది కొద్దిరోజుల క్రితం కలుసుకున్నారు. బాలికలు, మహిళల అభ్యున్నతి కోసం శిక్షణ సమయంలోనే ఏదైనా చేయాలని చర్చించుకున్నారు. సివిల్స్ తుది ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించిన అనన్యారెడ్డి సుకన్య సమృద్ధి యోజనపై అవగాహన కల్పిద్దామని సూచించగా అందరూ ఆమోదించారు. తర్వాత హైదరాబాద్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ శ్రీలతను కలిసి తమ ఆలోచనను వివరించారు. ఆమెతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలోని జామై ఉస్మానియా తపాలాశాఖ కార్యాలయంలో ఈ నెల 22న 100 మంది బాలికల పేరుతో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరిచి, తల్లిదండ్రులకు అందించారు.
ఆర్థికాభివృద్ధి ఇలా..
కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన ఈ పొదుపు పథకంలో పదేళ్లలోపు వయసున్న బాలికలందరూ చేరడానికి అర్హులు. తపాలా కార్యాలయంలో బాలిక పేరుమీద ఖాతా తెరిచి ఏడాదికి కనిష్ఠంగా రూ.250, గరిష్ఠంగా రూ.1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. పదిహేనేళ్లు క్రమం తప్పకుండా మదుపు చేయాలి. ఆ తర్వాత మూడేళ్లకు ఈ పథకం గడువు పూర్తవుతుంది. అనంతరం వడ్డీతో సహా మొత్తం నగదును బాలిక పేరుతో తపాలాశాఖ అందజేస్తుంది. నెలకు రూ.వెయ్యి చొప్పున పొదుపు చేస్తే 18 ఏళ్లకు రూ.5,39,454; రూ.1500 పొదుపు చేస్తే రూ.8,09,166, రూ.పది వేల చొప్పున పొదుపు చేస్తే రూ.53,94,492 మొత్తం అందుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
కోడింగ్కు కేంద్రంగా హైదరాబాద్
కోడింగ్లో హైదరాబాద్ ప్రపంచ కేంద్రంగా నిలుస్తోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్ రాయదుర్గం టీహబ్లో ఆదివారం ఎండ్ నౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోషల్వుడ్ 2024 సమిట్ (ద్వి వార్షిక సదస్సు) నిర్వహించారు. -
కొత్త ద్వీపం అందం అదరహో..!
చుట్టూ నీరు.. మధ్యలో భూభాగం ఉంటే ద్వీపం అనడం సహజం. ఇలాంటి దృశ్యాలు నదులు, సముద్రాలు, సరస్సుల్లో కనిపిస్తుంటాయి. -
ఎంపీ లాడ్స్ ఆన్లైన్లో!
పార్లమెంటు సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధుల పథకం (ఎంపీ లాడ్స్) వ్యయం ఇకపై ఆన్లైన్ వేదికగా జరగనుంది. -
విజయవాడ హైవేపై.. ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్ల ప్రారంభం
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను విభజించి తహసీల్దార్లకు అప్పగించిన ప్రభుత్వం అదే మార్గంలో త్వరలో మరికొన్ని సంస్కరణలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
వసతుల్లేని వర్సిటీలు!
ఉన్నత చదువులు చదివి.. జీవితంలో ఉత్తమంగా ఎదగాలన్న ఆశలు, ఆశయాలతో విశ్వవిద్యాలయాలకు వస్తున్న విద్యార్థులకు కనీస సదుపాయాల కొరత పరీక్ష పెడుతోంది. -
తెలంగాణ ఏర్పాటులో డీఎస్ పాత్ర కీలకం
పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని.. ఆయన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
10 మంది విద్యార్థులు మించితే.. ఇద్దరు టీచర్లు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 10 మంది విద్యార్థులు దాటిన చోట ఇక ఇద్దరు ఉపాధ్యాయులు రానున్నారు. 41 మంది పిల్లలు మించితే ముగ్గురు టీచర్లు ఉంటారు. -
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా తాండూరులో 5.1 సెం.మీటర్లు కురిసింది. -
అరుదైన రాజనీతిజ్ఞుడు
భారత మాజీ ఉప రాష్ట్రపతి, రాజనీతిజ్ఞుడు వెంకయ్య నాయుడికి ఆదివారంతో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నా. -
నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్తో కాంగ్రెస్ నేతల చర్చలు విఫలం
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆసుపత్రిలో వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్తో ఆదివారం రాత్రి కాంగ్రెస్ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. -
సింగరేణి.. మొక్కల గని..!
అడవిని తలపిస్తున్న ఈ ప్రాంతం సింగరేణి పరిధి రామగుండం ఏరియాలో బొగ్గు తవ్వకం తాలూకు మట్టి కుప్పలు నిండిన ప్రదేశం అంటే నమ్మగలమా. -
పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
దేశం పారిశ్రామికంగా సుస్థిరాభివృద్ధి సాధించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. -
చుక్ చుక్ బండి.. పట్టాల కింది నుంచీ వెళ్తుందండి..!
నగరాలు, జాతీయ రహదారుల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్లు కడతారు. బైపాస్ రోడ్లు నిర్మిస్తారు. రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించేందుకు రైల్వే శాఖ కూడా బైపాస్ లైన్లు, రైల్ ఓవర్ రైల్(ఆర్ఓఆర్) వంతెనలు నిర్మిస్తోంది. -
న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి
దేశ న్యాయవ్యవస్థలో మార్పులు రావాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. పేదలు సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం అడిగే పరిస్థితి ఉందా.. అన్న అంశంపై చర్చ జరగాలన్నారు. -
రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని మాజీ ఎంపీ మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. దివంగత నేత ఎన్టీఆర్కూ ఆ అవార్డు ఇవ్వాలని అన్నారు. -
ఇదీ సంగతి!
అది ఉద్యోగులకే..మనకు కాదు!! -
1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు ప్రధాన విద్యుత్తు కేంద్రాల్లో ఏకంగా 1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తికి విఘాతం ఏర్పడింది. -
మండల, జిల్లా పరిషత్లలోనూ ప్రత్యేకాధికారుల పాలన!
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల, జిల్లా పరిషత్లలోనూ ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. ఎంపీపీలు, జడ్పీ ఛైర్పర్సన్ల పదవీకాలం జులై 3, 4 తేదీల్లో ముగియనుండగా.. వారి స్థానంలో ప్రత్యేకాధికారుల నియామకం చేపట్టనున్నారు.