- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
TG EAPCET 2024: ఎప్సెట్ కౌన్సెలింగ్ వాయిదా
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద బీటెక్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఎప్సెట్ కౌన్సెలింగ్ వారం రోజులపాటు వాయిదా పడింది.
ఈ నెల 27కి బదులు జులై 4 నుంచి ప్రారంభం
8 నుంచి వెబ్ ఆప్షన్లు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద బీటెక్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఎప్సెట్ కౌన్సెలింగ్ వారం రోజులపాటు వాయిదా పడింది. గత నెలలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 27వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకావాల్సి ఉంది. దాన్ని జులై 4వ తేదీ నుంచి ప్రారంభిస్తామని ఎప్సెట్ ప్రవేశాల కన్వీనర్ బుర్రా వెంకటేశం తాజాగా ప్రకటించారు. వాస్తవానికి ఇంజినీరింగ్ కళాశాలలకు జూన్ 30 నాటికి అనుమతుల ప్రక్రియ పూర్తి చేస్తామని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) గతంలోనే ప్రకటించింది. అయితే రాష్ట్ర విద్యాశాఖ అధికారులు మాత్రం ఈ నెల 27వ తేదీ నుంచి కౌన్సెలింగ్, 30వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభిస్తామంటూ మూడు విడతల కౌన్సెలింగ్ షెడ్యూలు జారీ చేశారు. వాస్తవానికి ఈ ప్రక్రియను ఒకటీ, రెండు రోజులు వాయిదా వేస్తే సరిపోతుంది. అయినా వారం రోజులపాటు వాయిదా వేయడం గమనార్హం.
సీట్ల పెంపుపై తుది నిర్ణయం తీసుకోకపోవడంతోనే..
ఏఐసీటీఈ ఇచ్చిన వెసులుబాటుతో ఈసారి దాదాపు 50 కళాశాలలు సీఎస్ఈ, ఇతర డిమాండ్ ఉన్న సీట్లను పెంచుకోవడానికి దరఖాస్తు చేశాయి. ఏఐసీటీఈ అనుమతులు కూడా ఇచ్చింది. వాటికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపితేనే కౌన్సెలింగ్లో చేరుస్తారు. దీనిపై విద్యాశాఖ కూడా సీఎం వద్దే ఉండటంతో.. ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త సీట్లకు అనుమతి ఇస్తే బోధనా రుసుముల భారం భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీట్ల పెంపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోవడంతో కౌన్సెలింగ్ను వారం రోజులపాటు వాయిదా వేసినట్లు సమాచారం.
ఆఫ్ క్యాంపస్లకు ఈసారి అనుమతి లేనట్లే!
కొన్ని నిర్దిష్ట నిబంధనల మేరకు కళాశాలలు ఆఫ్ క్యాంపస్లు ఏర్పాటు చేసుకోవడానికి ఏఐసీటీఈ అనుమతులు ఇస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని నాలుగు కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో బీవీఆర్ఐటీ, వర్ధమాన్, కేఎంఐటీ, జయప్రకాశ్ నారాయణ్(మహబూబ్నగర్) కళాశాలలు ఉన్నాయి. హైదరాబాద్లో మరో క్యాంపస్ ఏర్పాటుకు ఆ కళాశాలలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. వాటికి ఏఐసీటీఈ నుంచి అనుమతులు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. ఇప్పటికే ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు వెల్లడించినందువల్ల ఈ సంవత్సరానికి ఆఫ్ క్యాంపస్లకు అనుమతి ఇవ్వకూడదని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. కళాశాలల యాజమాన్యాలు మాత్రం కౌన్సెలింగ్ వాయిదా పడినందువల్ల.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ : జులై 4 నుంచి 12 వరకు
- ధ్రువపత్రాల పరిశీలన : జులై 6 నుంచి 13 వరకు
- వెబ్ ఆప్షన్ల నమోదు : జులై 8 నుంచి 15 వరకు
- సీట్ల కేటాయింపు : జులై 19వ తేదీ లేదా ఆలోపు
- ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు : జులై 19 నుంచి 23 వరకు
- రెండో విడత కౌన్సెలింగ్ : జులై 26 నుంచి ఆగస్టు 2 వరకు
- చివరి విడత కౌన్సెలింగ్ : ఆగస్టు 8 నుంచి 17 వరకు
- కేంద్రీయ అంతర్గత స్లైడింగ్ : ఆగస్టు 21 నుంచి 28 వరకు
- స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాల జారీ : ఆగస్టు 28న
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలను జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. -
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం
కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్లో ఫ్యాను ఊడిపడి ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. -
పోలవరం విధ్వంసం.. రూ.వేల కోట్ల నష్టం
జగన్ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశమైపోయిందని.. ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే రూ.వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. శుక్రవారం విజయవాడకు వచ్చిన గవర్నర్ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం
తిరుమల-అలిపిరి మొదటి ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళన చెందారు. -
కుటుంబానికి రూ.2 లక్షలు!
రైతు రుణమాఫీ మార్గదర్శకాలను మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. -
వీడుతున్న చిక్కుముడులు
హైదరాబాద్ ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) రెండు భాగాలను ఒకేసారి నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. అయితే దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండకపోయినా.. ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. -
ఊరూరా మీసేవ కేంద్రాలు
ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
కృష్ణపట్టి ఏరియాలో పెద్దపులి సంచారం
కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు. -
ఆరోగ్య, ఆహార అలవాట్లపై ‘న్యూట్రిషన్ అట్లాస్’
దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల ఆహార అలవాట్లు, వారి ఆరోగ్య పరిస్థితులపై తాజా సమగ్ర సమాచారాన్ని ఐసీఎంఆర్ - ఎన్ఐఎన్ (భారతీయ వైద్య పరిశోధన మండలి - జాతీయ పోషకాహార సంస్థ) అందుబాటులోకి తెచ్చింది. -
జీవో నం.317 కేటాయింపు సమస్యల పరిష్కారం
ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం.317 కింద ఉపాధ్యాయ, అధ్యాపకుల కేటాయింపులో ఆఫ్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది. -
కార్మికుల భద్రత గాల్లో దీపమే
రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. అదే సమయంలో పని ప్రదేశాల్లో కార్మికులకు భద్రత కొరవడుతోంది. -
బాసర ఆలయ ప్రసాదాల్లో చేతివాటం
బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలోని తయారీ కేంద్రం వద్ద రిజిస్టర్లో తక్కువ సంఖ్యలో ప్రసాదాలను నమోదు చేసి కౌంటర్లో ఎక్కువ సంఖ్యలో విక్రయిస్తూ వచ్చిన డబ్బును కాజేస్తున్న సిబ్బందిపై వేటు పడింది. -
నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ శనివారం ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. -
నీట్ను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి
నీట్ అవకతవకల నేపథ్యంలో సంబంధిత పరీక్షను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన సంఘాల ఐకాస నేతలు డిమాండ్ చేశారు. -
రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకులు జగజీత్సింగ్ దల్లేవాల్, నల్లమల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. -
435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య డైరెక్టరేట్లో 431, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లో 4 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక బోర్డు(ఎంహెచ్ఆర్ఎస్బీ) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. -
మహిళా సూపరింటెండెంట్ ఆరోపణలపై నేడు విచారణ
సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి తనను వేధించారంటూ మహిళా సూపరింటెండెంట్ డి.జయలక్ష్మి చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. -
జీవో నం.317 కేటాయింపు సమస్యల పరిష్కారం
ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం.317 కింద ఉపాధ్యాయ, అధ్యాపకుల కేటాయింపులో ఆఫ్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది. -
ఏడుగురు తహసీల్దార్లకు ఎన్నికల తిరుగు బదిలీ
ఈ నెలతోపాటు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న ఏడుగురు తహసీల్దార్లను రెవెన్యూ శాఖ బదిలీ చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
క్రెడిట్ కార్డు రూల్స్లో మార్పులు.. ఈ జాబితాలో మీ బ్యాంక్ ఉందా?
-
రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్.. వాహనాలు దగ్ధం
-
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
-
‘ఐవీఎఫ్తో కవలలకు జన్మనిచ్చా’: వ్యక్తిగత విషయం వెల్లడించిన ఈశా అంబానీ
-
పులివెందుల కౌన్సిలర్ల అసమ్మతి.. పార్టీలోనే ఉండాలని ఎంపీ అవినాశ్ సూచన
-
రోహిత్ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్ప్రీత్ బుమ్రా