- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Solar Power: సౌర విద్యుత్తుపై తెలుగు రాష్ట్రాల నిరాసక్తి
రూఫ్టాప్(ఇంటిపైకప్పు) సౌర విద్యుత్ రాయితీ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు.
రాయితీ ఉన్నా దరఖాస్తుకు వెనకడుగు
14, 16 స్థానాల్లో ఏపీ, తెలంగాణ
ముందంజలో అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర
ఈనాడు, హైదరాబాద్: రూఫ్టాప్(ఇంటిపైకప్పు) సౌర విద్యుత్ రాయితీ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. బిహార్, ఒడిశా, అస్సాం వంటి రాష్ట్రాలతో పోల్చినా ఏపీ, తెలంగాణ వెనకబాటులో ఉన్నాయి. అవగాహనలేమి, పాలకుల నుంచి ప్రోత్సాహం లభించకపోవడం, ఉచిత విద్యుత్తు పథకాలే దానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా కోటి మంది ప్రజలకు ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన’ కింద రూఫ్టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఇంటిపై గరిష్ఠంగా 3 కిలోవాట్లకు రూ.78 వేల చొప్పున రాయితీ ఇస్తామంది. గత ఫిబ్రవరి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ‘ముందు దరఖాస్తు చేసిన వారికి ముందు’ రాయితీ సొమ్ము విడుదల చేస్తామనే నిబంధన విధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి దరఖాస్తులు ఆశించిన మేరకు రాలేదని కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఓ నివేదికలో తెలిపింది.
సిరిసిల్ల జిల్లాలో మూడే.. అల్లూరి జిల్లాలో 178 దరఖాస్తులు
దేశవ్యాప్త గణాంకాలను పరిశీలిస్తే అత్యధికంగా అస్సాం 2.23 లక్షలు, గుజరాత్ 2.14 లక్షలు, మహారాష్ట్ర 1.91 లక్షలు, ఉత్తర్ప్రదేశ్ 1.89 లక్షల దరఖాస్తులతో వరసగా తొలి 4 స్థానాల్లో నిలిచాయి. ఏపీ 29,740, తెలంగాణ 17,152 దరఖాస్తులతో 14, 16 స్థానాల్లో ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లోని కొన్నిచోట్ల కనీసం 100 మంది కూడా దరఖాస్తుకు ముందుకు రాలేదు. తెలంగాణలో అత్యధికంగా మేడ్చల్లో 2,266 మంది దరఖాస్తు చేసుకోగా, అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముగ్గురే స్పందించారు. ఏపీలోని కాకినాడ నుంచి అత్యధికంగా 1,315, అత్యల్పంగా అల్లూరి జిల్లా నుంచి 178 మాత్రమే వచ్చాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లా నుంచి 18,452 దరఖాస్తులు రాగా..గ్రేటర్ హైదరాబాద్ నుంచి కేవలం 1,296 మాత్రమే వచ్చాయి. ‘ఇతర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చే సొమ్ముకు అదనంగా కొంత రాయితీ కలిపి ఇస్తుండటం, ప్రజలను ఆ దిశగా ప్రోత్సహించడంతో రూఫ్టాప్ సౌరవిద్యుత్ ఏర్పాటుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అది లోపించింది. రాష్ట్రంలో ఒక్కో ఇంటికి 200 యూనిట్లు, ఏపీలో 101 యూనిట్ల వరకూ ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తు ఇస్తుండటం వెనకబాటుకు కారణమని’ డిస్కంలు విశ్లేషిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం
కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్లో ఫ్యాను ఊడిపడి ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. -
పోలవరం విధ్వంసం.. రూ.వేల కోట్ల నష్టం
జగన్ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశమైపోయిందని.. ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే రూ.వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. శుక్రవారం విజయవాడకు వచ్చిన గవర్నర్ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం
తిరుమల-అలిపిరి మొదటి ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళన చెందారు. -
కుటుంబానికి రూ.2 లక్షలు!
రైతు రుణమాఫీ మార్గదర్శకాలను మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. -
వీడుతున్న చిక్కుముడులు
హైదరాబాద్ ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) రెండు భాగాలను ఒకేసారి నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. -
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలను జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. అయితే దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండకపోయినా.. ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. -
ఊరూరా మీసేవ కేంద్రాలు
ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
కృష్ణపట్టి ఏరియాలో పెద్దపులి సంచారం
కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు. -
ఆరోగ్య, ఆహార అలవాట్లపై ‘న్యూట్రిషన్ అట్లాస్’
దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల ఆహార అలవాట్లు, వారి ఆరోగ్య పరిస్థితులపై తాజా సమగ్ర సమాచారాన్ని ఐసీఎంఆర్ - ఎన్ఐఎన్ (భారతీయ వైద్య పరిశోధన మండలి - జాతీయ పోషకాహార సంస్థ) అందుబాటులోకి తెచ్చింది. -
జీవో నం.317 కేటాయింపు సమస్యల పరిష్కారం
ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం.317 కింద ఉపాధ్యాయ, అధ్యాపకుల కేటాయింపులో ఆఫ్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది. -
కార్మికుల భద్రత గాల్లో దీపమే
రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. అదే సమయంలో పని ప్రదేశాల్లో కార్మికులకు భద్రత కొరవడుతోంది. -
బాసర ఆలయ ప్రసాదాల్లో చేతివాటం
బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలోని తయారీ కేంద్రం వద్ద రిజిస్టర్లో తక్కువ సంఖ్యలో ప్రసాదాలను నమోదు చేసి కౌంటర్లో ఎక్కువ సంఖ్యలో విక్రయిస్తూ వచ్చిన డబ్బును కాజేస్తున్న సిబ్బందిపై వేటు పడింది. -
నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ శనివారం ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. -
నీట్ను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి
నీట్ అవకతవకల నేపథ్యంలో సంబంధిత పరీక్షను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన సంఘాల ఐకాస నేతలు డిమాండ్ చేశారు. -
రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకులు జగజీత్సింగ్ దల్లేవాల్, నల్లమల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. -
435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య డైరెక్టరేట్లో 431, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లో 4 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక బోర్డు(ఎంహెచ్ఆర్ఎస్బీ) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. -
మహిళా సూపరింటెండెంట్ ఆరోపణలపై నేడు విచారణ
సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి తనను వేధించారంటూ మహిళా సూపరింటెండెంట్ డి.జయలక్ష్మి చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. -
జీవో నం.317 కేటాయింపు సమస్యల పరిష్కారం
ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం.317 కింద ఉపాధ్యాయ, అధ్యాపకుల కేటాయింపులో ఆఫ్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది. -
ఏడుగురు తహసీల్దార్లకు ఎన్నికల తిరుగు బదిలీ
ఈ నెలతోపాటు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న ఏడుగురు తహసీల్దార్లను రెవెన్యూ శాఖ బదిలీ చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాసుల మత్తులో ‘దందా’నతాన.. అనుచరుల బార్ల కోసం మద్యం దుకాణాల మార్పు
-
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం
-
రాజీనామాపై దోబూచులాట.. వైవీయూ వీసీ, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని ఆందోళన
-
‘మర్డర్ ఆఫ్ రేణుకాస్వామి’ పేరిట వికీపీడియాలో కొత్త పేజీ..!
-
ఈవీఎంలను తప్పుపట్టడం హాస్యాస్పదం: సోము వీర్రాజు
-
సర్కారు జాగా దర్జాగా కబ్జా.. ఇంటి నంబర్లతో వెయ్యి గజాలకు దరఖాస్తు