- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Telangana High Court: కేసీఆర్ పిటిషన్పై విచారణకు హైకోర్టు నిర్ణయం
కరెంటు కొనుగోళ్లు, భదాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయంలో లోటుపాట్లను సమీక్షించడానికి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటుపై మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కె.చంద్రశేఖర్రావు దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి హైకోర్టు నిర్ణయించింది.
జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటును సవాలు చేసిన భారాస అధినేత
రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చిన న్యాయస్థానం
విచారణ నేటికి వాయిదా
ఈనాడు, హైదరాబాద్: కరెంటు కొనుగోళ్లు, భదాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయంలో లోటుపాట్లను సమీక్షించడానికి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటుపై మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కె.చంద్రశేఖర్రావు దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి హైకోర్టు నిర్ణయించింది. రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ నంబరు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై రిజిస్ట్రీ అభ్యంతరాలు వ్యక్తం చేయగా... గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతో కమిషన్ను ఏర్పాటు చేశారని ఆయన ప్రస్తావించగా... విచారణ చేపడితే ఏమవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. కమిషన్... నివేదికను అసెంబ్లీకే సమర్పిస్తుంది కదా, అందులో ఇబ్బందేముందని అడిగింది. కమిషన్ ఏర్పాటు చేసిన తీరుపైన అభ్యంతరాలున్నాయని న్యాయవాది వివరించారు.
అభ్యంతరాలనే పరిగణనలోకి తీసుకోలేదు: ‘‘కేసీఆర్కు ఏప్రిల్ 14న కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఉన్నందున గడువు కావాలని ఆయన లేఖ రాశారు. దీనికి ఆమోదించిన కమిషన్ విచారణను వాయిదా వేసింది. ఈలోగానే జూన్ 11న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. కమిషన్ తన ముందున్న వివరాలతో నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉండగా అరకొర సమాచారంతో మీడియా సమావేశం పెట్టారు. అందులో ఆయన వెల్లడించిన అంశాలను పరిశీలిస్తే విచారణకు సంబంధించి ఆయన ముందే ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కమిషన్ ఛైర్మన్ పదవిలో కొనసాగడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు గౌరవంగా తప్పుకోవాల్సిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి మరో నోటీసు జారీచేశారు. దాన్నిబట్టి ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నిష్పాక్షిక విచారణ కొనసాగించకపోవడంతో ఆయనను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చాల్సి వచ్చింది.
కమిషన్ వ్యవహార శైలి ఏపీ హైకోర్టు తీర్పునకు విరుద్ధం: కమిషన్ వ్యవహార శైలి గతంలో మాజీ సీఎం కె.విజయభాస్కర్రెడ్డి కేసులో ఉమ్మడి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉంది. ఆ కేసులో కమిషన్ విచారణకు నిర్దిష్ట బాధ్యతలు మాత్రమే ఉంటాయని, న్యాయపరమైన అధికారాలు ఉండవని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు... రామకృష్ణ దాల్మియా కేసులోనూ స్పష్టం చేసింది. ఏలేరు కుంభకోణంపై ఏర్పాటు చేసిన జస్టిస్ సోమశేఖర కమిషన్పై పీలా పోతినాయుడు వేసిన కేసులో అప్పటి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి వెలువరించిన తీర్పు ఇక్కడ వర్తిస్తుంది. కమిషన్కు నేతృత్వం వహించే వ్యక్తి ఏకపక్షంగా వ్యవహరించరాదని ప్రవర్తన శైలి గురించి నాడు ఆయన పేర్కొన్నారు.
రాజకీయ కక్షలో భాగమే..: విద్యుత్ వివాదాలకు సంబంధించి ఏ అభ్యంతరం ఉన్నా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిని (ఎస్ఈఆర్సీని) ఆశ్రయించాల్సి ఉంది. గతంలో ఎస్ఈఆర్సీ ముందు ఫిర్యాదు చేసిన రేవంత్రెడ్డి అప్పిలేట్ అథారిటినీ ఆశ్రయించకుండా ముఖ్యమంత్రి అయ్యాక మరో కమిషన్ ఏర్పాటు చేయడం రాజకీయ కక్షలో భాగమే’’ అని పిటిషనర్ న్యాయవాది ఆదిత్య సోంధి వివరించారు. అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్కు నంబరు కేటాయించడానికి ఉన్న అర్హతలపై వాదనలు వినిపించాలని, పూర్వాపరాలపై కాదని అన్నారు. అనంతరం ధర్మాసనం కేసీఆర్ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంచనాలు అడ్డగోలుగా పెంచేస్తారా?
వరంగల్లో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా ఎందుకు పెంచారని.. మౌఖిక ఆదేశాలతో ఏకంగా రూ.626 కోట్లు అదనంగా ఎలా ఖర్చు చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ కన్నుమూత
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్(76) కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యేకాలనీలోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. -
నిర్లక్ష్యపు బస్సు నడిచేదెప్పుడో!
ప్రయాణికులు పెరుగుతుంటే బస్సుల సంఖ్యా పెరగాలి. టీజీఎస్ఆర్టీసీలో ఇందుకు భిన్నమైన పరిస్థితి. ఆర్టీసీలో పదేళ్ల క్రితం 10,479 బస్సులుంటే ఇప్పుడా సంఖ్య 8,574. ఈ బస్సుల్లోనూ కాలం చెల్లినవి పెద్ద సంఖ్యలో ఉన్నాయి. -
మాస్టారూ.. మీరే మీరే మాస్టారు!
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 39 ఏళ్లు వ్యాయామోపాధ్యాయునిగా పనిచేసిన తూము హన్మంతరావు చివరిగా సూర్యాపేట జిల్లా నూతనకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ పొందారు. -
80ఏళ్ల నాటి దస్త్రాలకు రక్షణేది?
వస్త్రాల్లో కట్టి ఉంచిన ఈ దస్త్రాలు భూ కొలతలశాఖకు సంబంధించినవి. నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డికి తరలించిన వీటికి రక్షణ లేకుండా పోయింది. సుమారు పది నెలల నుంచి కామారెడ్డి కలెక్టరేట్లోని ఓ గదిలో మూలన పెట్టి ఉంచారు. -
సరళమా.. సంక్లిష్టమా..?
దేశంలో జులై 1 నుంచి అమలులోకి రాబోతున్న కొత్త న్యాయ చట్టాలతో లాభనష్టాలపై చర్చ జరుగుతోంది. దాదాపు 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్), -
విజ్ఞాన గని.. డా.పావులూరి కృష్ణ చౌదరి
డా.పావులూరి కృష్ణ చౌదరికి అనేక అంశాలపై పరిజ్ఞానం ఉండేదని ‘ఈనాడు’ ఎండీ కిరణ్ అన్నారు. ఆయనతో తనకు 16 ఏట నుంచే సాన్నిహిత్యం ఉందని చెప్పారు. -
కౌంటర్ దాఖలుకు 4 వారాల గడువివ్వండి
కృష్ణా జలాల పునః పంపిణీకి సంబంధించి కౌంటర్ దాఖలు చేయడానికి నాలుగు వారాల గడువు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్... బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ను (కేడబ్ల్యూడీటీ-2) కోరింది. -
గోదాముల్లో.. సమిధలు!
సికింద్రాబాద్ బోయిగూడలోని తుక్కు గోదాములో 2022 మార్చి 22న 11 మంది మంటల్లో మసయ్యారు.. 2023 నవంబరు 13న హైదరాబాద్ బజార్ఘాట్లో రసాయన గోదాములో జరిగిన పేలుడులో 9 మంది అగ్నికీలలకు ఆహుతయ్యారు... -
మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్ హఠాన్మరణం
భాజపా నేత, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్(57) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఉట్నూరులోని తన నివాసంలో అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. -
‘సుకన్య సమృద్ధి’కి శిక్షణ ఏఐఎస్ల చొరవ
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా.. శిక్షణ దశలోనే 2024 బ్యాచ్ అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులు సేవాబాట పట్టి ఆదర్శంగా నిలిచారు. -
సంక్షిప్త వార్తలు (8)
షాద్నగర్ సౌత్గ్లాస్ ప్రైవేటు కంపెనీ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
ఇక భూ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించం
ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్మిత్తల్ జిల్లా కలెక్టర్లకు తెలిపారు. -
పీసీసీఎఫ్ వేధింపుల నుంచి రక్షించండి
అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ శాఖాపరమైన వేధింపుల నుంచి తనను రక్షించాలని, చట్టప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ డి.జయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
బీటీపీఎస్లో భారీ అగ్ని ప్రమాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు-పినపాక మండలాల సరిహద్దున ఉన్న భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం(బీటీపీఎస్)లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. -
కొత్త క్రిమినల్ చట్టాలపై ‘సమాహార’ యాప్
కొత్త క్రిమినల్ చట్టాల వివరాలతో కూడిన హ్యాండ్బుక్తోపాటు మొబైల్ అప్లికేషన్ (యాప్) ‘సమాహార’ను తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి డా.జితేందర్ శనివారం ఆవిష్కరించారు. -
వైద్య పర్యాటక కేంద్రంగా తెలంగాణ
రాష్ట్రంలో ప్రతి పౌరుడి ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ ప్రొఫైల్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని, తెలంగాణను వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన కళాకారుడు సాయిచంద్
తన ఆట, పాట, అద్భుతమైన వాగ్ధాటితో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన కళాకారుడు సాయిచంద్ కుటుంబానికి అండగా నిలుస్తామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
ఆ బంగారం జప్తు సరైన చర్యే
కస్టమ్స్ అధికారులు హైదరాబాద్ విమానాశ్రయంలో గతేడాది ఆగస్టు 12న తమ నుంచి జప్తు చేసిన బంగారాన్ని తిరిగి అప్పగించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. -
టిస్లో 90 మంది సిబ్బంది తొలగింపు!
హైదరాబాద్లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్)లో 90 మంది ఉద్యోగులను శనివారం విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. -
యుద్ధప్రాతిపదికన జాతీయ రహదారుల భూసేకరణ!
జాతీయ రహదారుల నిర్మాణానికి పీటముడిగా ఉన్న భూసేకరణను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రవాణా,