- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Telangana Govt: నైపుణ్యాభివృద్ధికి శ్రీకారం
‘‘సాంకేతిక నైపుణ్యం, అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలను రూ.2,324 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నాం.
రూ.2,324 కోట్లతో 65 ఐటీఐలకు కొత్తరూపు
ఉపాధికి గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే వారికీ ఇక్కడ శిక్షణ ఇస్తాం
మన చదువులు అవుటాఫ్ సిలబస్గా మారిపోయాయి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
నాలుగు అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్లకు శంకుస్థాపన
ఈనాడు - హైదరాబాద్
లాక్హీడ్-మార్టిన్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,
మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి
‘‘సాంకేతిక నైపుణ్యం, అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలను రూ.2,324 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నాం. పదో తరగతి చదివి ఉపాధి కోసం గల్ఫ్దేశాలకు వెళ్లాలనుకునే వారినీ ఐటీఐల్లో చేర్పించుకుని.. అక్కడ ఏయే సంస్థలు, రంగాల్లో ఉపాధి అవకాశాలున్నాయో తెలుసుకుని వాటిల్లో శిక్షణ ఇవ్వనున్నాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీఐలను అధునాతన సాంకేతిక కేంద్రాలు(అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్స్)గా రూపొందిస్తున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని మల్లేపల్లి ఐటీఐలో నిర్వహించిన నాలుగు కేంద్రాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడ వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా దౌత్యపరంగా సంప్రదింపులు నిర్వహించి న్యాయం చేస్తుంది. ప్రస్తుతం పదోతరగతి చదవకుండానే ఉపాధి కోసం ఏజెంట్ల ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ కష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్తులో ఎవరూ ఎదుర్కోకుండా మేం జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం, ఉపాధి లభించాలంటే పట్టా ఉంటే సరిపోదు.. సాంకేతిక నైపుణ్యం ఉండాలి. విశ్వవ్యాప్తంగా విద్యాబోధనలో అత్యాధునిక మార్పులుసంతరించుకుంటుంటే.. మనం మాత్రం 40, 50 ఏళ్ల క్రితం ఉన్న విధానాలు అనుసరిస్తూ అప్పటి విద్యను బోధిస్తున్నాం. దీంతో మన చదువులు అవుటాఫ్ సిలబస్గా మారిపోయాయి. ఇంటర్ చదవలేనివారు ఐటీఐలో చేరితే కొంతైనా విజ్ఞానం వస్తుందన్న భావనతో కొందరు తల్లిదండ్రులు పిల్లలను ఇందులో చేర్పిస్తున్నారు. ఐటీఐలను అధునాతన విజ్ఞాన కేంద్రాలుగా మార్చాక వాటిల్లో చేరేందుకు విద్యార్థులు పోటీపడతారు’’ అని సీఎం చెప్పారు.
ఇంజినీర్కు రూ.15 వేలు.. మేస్త్రీకి రూ.60 వేలు..
‘‘చదువున్నా సాంకేతిక నైపుణ్యం, అనుభవం లేకపోతే డిగ్రీ సర్టిఫికెట్ల ఉపయోగం అంతంత మాత్రమే. ఎందుకంటే నేను ఇల్లు కట్టించేప్పుడు సైట్ సూపర్వైజర్గా ఇద్దరిని నియమించుకుందామని అనుకున్నా. సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన నలుగురైదుగురు విద్యార్థులు వచ్చారు. నెలకు రూ.15వేలు జీతం ఇస్తే పనిచేస్తామన్నారు. అనుభవజ్ఞుల కోసం వాకబు చేస్తే ఒక మేస్త్రీ వచ్చాడు. నెలకు రూ.60వేలు ఇస్తే పనిచేస్తానన్నాడు. ఇది నా స్వీయ అనుభవం. సివిల్ ఇంజినీర్లు అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొంటే వారికి రూ.లక్షల్లో జీతాలొస్తాయి’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివరించారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల అభివృద్ధిలో భాగస్వామి అయినందుకు టాటా టెక్నాలజీస్ ప్రతినిధి
సుశీల్ కుమార్కు జ్ఞాపిక బహూకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్బాబు తదితరులు
ఐటీఐలలో వర్చువల్ రియాల్టీ ప్రయోగశాలలు..: మంత్రి శ్రీధర్బాబు
రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలలో వర్చువల్ రియాల్టీ ప్రయోగశాలలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలలో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా విద్యా, విజ్ఞాన కేంద్రాలుగా మారనున్నాయని ఇందుకోసం టాటా టెక్నాలజీస్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. రోబోటిక్స్, కృత్రిమ మేధ, వర్చువల్ రియాల్టీ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు నేర్పించనున్నామని వివరించారు. యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా త్వరలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. టాటా టెక్నాలజీస్ ప్రతినిధి సుశీల్ కుమార్, కార్మికశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రాణికుముదిని, కార్మికశాఖ సంచాలకులు కృష్ణ ఆదిత్య, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్, నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ఎమ్మెల్సీ రహమత్ బేగ్, కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇస్తాం
రాబోయే రోజుల్లో రాష్ట్రానికి అన్నీ మంచి శకునాలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయని.. తనపై మోయలేనంత భారం ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. -
రాష్ట్ర కార్యక్రమంగా రామోజీరావు సంస్మరణ సభ
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణకు సముచిత ఏర్పాట్లు చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, విభాగాధిపతులు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
కరెంటు కొనుగోలు, విద్యుత్కేంద్రాలపై.. కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం
ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణాంశాల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడాన్ని మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. -
ఎన్హెచ్ఎం నిధులు విడుదల చేయండి
జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కింద తెలంగాణకు రావాల్సిన రూ.693.13 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. -
ప్రాజెక్టులకు తక్షణం రూ. 8,500 కోట్లు అవసరం
రాష్ట్రంలో చివరి దశలో ఉండి, ఈ వానాకాలం లోపు పనులు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులకు తక్షణమే రూ.8,500 కోట్లు కేటాయించాలని నీటిపారుదల శాఖ సర్కిల్ ఇంజినీర్లు కోరినట్లు తెలిసింది. -
క్రమబద్ధీకరణ ఆశ నెరవేరేదెప్పుడో!
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు.. తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణ (రెగ్యులరైజేషన్) విషయమై ఎదురుచూపులు తప్పడం లేదు. -
సౌర విద్యుత్తుపై తెలుగు రాష్ట్రాల నిరాసక్తి
రూఫ్టాప్(ఇంటిపైకప్పు) సౌర విద్యుత్ రాయితీ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ వాయిదా
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద బీటెక్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఎప్సెట్ కౌన్సెలింగ్ వారం రోజులపాటు వాయిదా పడింది. -
కాజీపేట-బల్లార్ష సెక్షన్లో 78 రైళ్ల రద్దు
దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్లో భారీగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. -
మన నడవడిక మన్ననలు పొందాలి
‘మనపై ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఉన్నారు. అభ్యర్థులందరినీ శాసనసభకు పంపించారు. వారి నమ్మకాన్ని సభలో ప్రతిఫలింపజేద్దాం’ అని జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. -
రెండోరోజు ఉద్ధృతంగా జూనియర్ డాక్టర్ల ఆందోళన
తమ సమస్యలు పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం కొనసాగింది. తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం(టీజూడా) పిలుపు మేరకు ఓఎంసీ(ఉస్మానియా మెడికల్ కళాశాల) యూనిట్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో నిరసన చేపట్టారు. -
డ్రగ్స్ రవాణాలో ఎంతటివారున్నా ఉపేక్షించం
మాదకద్రవ్యాల రహిత తెలంగాణ రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. డ్రగ్స్ రవాణాలో ఎంతటివారున్నా ఉపేక్షించబోమని, ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుందని పేర్కొన్నారు. -
పంచాయతీ భవనాల కోసం రూ.1,544 కోట్లు అవసరం
తెలంగాణలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.1,544 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క కేంద్రమంత్రి రాజీవ్ రంజన్సింగ్ను కోరారు. -
తెలంగాణ అభివృద్ధికి సహకరించండి
కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డిని తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు అభినందించారు. -
రామగుండంలో 800 మె.వా. విద్యుత్కేంద్రం
రామగుండంలో పాత 62.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్కేంద్రాన్ని తొలగించి అదే ప్రదేశంలో అత్యాధునిక సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మె.వా. థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. -
ఆదివాసీ మహిళలపై సాయుధ బలగాల అకృత్యాలు
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర బలగాలు ఆదివాసీ మహిళల జీవన హక్కులను కాలరాస్తూ, వారిపై అఘాయిత్యాలకు పాల్పడటం దుర్మార్గమని వక్తలు మండిపడ్డారు. -
పింఛనుదారులపై చిన్నచూపు తగదు: మందకృష్ణ మాదిగ
రేవంత్రెడ్డి ప్రభుత్వం పింఛనుదారులను చిన్నచూపు చూస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. -
పాత పింఛను విధానం అమలు చేయండి
తెలంగాణ ఉద్యోగుల ఐకాస అత్యవసర సమావేశం హైదరాబాద్లోని టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగింది. -
మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి
కేంద్ర ప్రభుత్వం పంటల కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లకు చట్టబద్ధత కల్పించాలని.. ప్రతి రైతుకు అవి దక్కేలా చూడాలని.. దేశవ్యాప్తంగా పంటల రుణమాఫీని అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతలు డిమాండ్ చేశారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలు లేఖలు రాసి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. -
సన్నిహితుల ఖాతాల్లోకి లంచం సొమ్ము!
గొర్రెల సరఫరా పథకం కుంభకోణంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడిగా విశ్వనాథ్
భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) రాష్ట్ర అధ్యక్షుడిగా కె.విశ్వనాథ్(గోదావరిఖని), ప్రధాన కార్యదర్శిగా ఆరెళ్లి కృష్ణ(వరంగల్)ను ఎన్నుకున్నారు.