- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Telangana News: మండల, జిల్లా పరిషత్లలోనూ ప్రత్యేకాధికారుల పాలన!
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల, జిల్లా పరిషత్లలోనూ ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. ఎంపీపీలు, జడ్పీ ఛైర్పర్సన్ల పదవీకాలం జులై 3, 4 తేదీల్లో ముగియనుండగా.. వారి స్థానంలో ప్రత్యేకాధికారుల నియామకం చేపట్టనున్నారు.
జడ్పీలకు కలెక్టర్లు, మండల పరిషత్లకు జిల్లాస్థాయి అధికారులు
ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల, జిల్లా పరిషత్లలోనూ ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. ఎంపీపీలు, జడ్పీ ఛైర్పర్సన్ల పదవీకాలం జులై 3, 4 తేదీల్లో ముగియనుండగా.. వారి స్థానంలో ప్రత్యేకాధికారుల నియామకం చేపట్టనున్నారు. జిల్లా పరిషత్లకు జిల్లా కలెక్టర్లను, మండల పరిషత్లకు జిల్లాస్థాయి అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. 2019 మే నెలలో 539 జడ్పీటీసీ; 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది జులై మూడో తేదీన మండల పరిషత్లకు పాలకవర్గాలు ఏర్పడ్డాయి. అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. జులై నాలుగో తేదీన 28 జిల్లా పరిషత్లకు.. ఆగస్టు 7న ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జడ్పీలకు ఛైర్పర్సన్లు, వైస్ఛైర్పర్సన్లు, సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్నందున ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసిన ప్రభుత్వం తాజాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను, జడ్పీ ఛైర్పర్సన్లు, ఎంపీపీల ఎన్నికలను వాయిదావేసి ప్రత్యేకాధికారులను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. దీనిని ఆమోదించిన అనంతరం ఉత్తర్వులు జారీ అవుతాయి. దీని ప్రకారం తెలంగాణలోని మండల పరిషత్లకు జులై నాలుగో తేదీ నుంచి జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు చేపడతారు. ఐదో తేదీన 28 జిల్లా పరిషత్లకు.. ఆగస్టు 7న ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జడ్పీలకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు స్వీకరిస్తారు.
పంచాయతీల్లో ఫిబ్రవరి నుంచి..
రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీల్లో జనవరిలో సర్పంచుల పదవీకాలం ముగియగా.. ఫిబ్రవరి నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. గెజిటెడ్ అధికారులను ఆయా స్థానాల్లో నియమించారు. త్వరలో మండల పరిషత్, జిల్లా పరిషత్లకూ నియమించనుండటంతో స్థానిక సంస్థల్లో మొత్తం అధికారుల పాలనే సాగనుంది. ప్రత్యేకాధికారుల పాలన ఆరు నెలల వరకు నిర్వహించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది. ఈ లెక్కన జులై వరకు గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుంది. అయితే మరో 6 నెలలు వీటికి ప్రత్యేకాధికారుల పాలన పొడిగించే అవకాశం ఉంది.
బీసీ రిజర్వేషన్లు తేలాకే..!
బీసీ రిజర్వేషన్ల అంశంతో ఎన్నికలు ముడిపడి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం కులగణన అనంతరం ఈ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. వచ్చే ఆగస్టుతో బీసీ కమిషన్ పాలకమండలి గడువు ముగిశాక కొత్త పాలకమండలిని నియమించి కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. డిసెంబరు వరకు ఆ ప్రక్రియ కొనసాగే వీలుంది. అంతవరకు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగవు. మరోవైపు జులైలో మండల, జిల్లా పరిషత్లలో ప్రత్యేకాధికారుల పాలన మొదలవుతుండగా.. వాటికి డిసెంబరు వరకు గడువు ఉంటుంది. అప్పటికి ఎన్నికలు జరిగితే 2025 నుంచి కొత్త పాలకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ గందరగోళానికి తెర!
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్పై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. రీ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడి, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి కొత్త ర్యాంకులు ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నీట్-యూజీ కౌన్సెలింగ్ తేదీలు వెలువడతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. -
సత్ప్రవర్తన ఖైదీల విడుదలకు మార్గం సుగమం
సత్ప్రవర్తన కింద ఖైదీల విడుదలకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలిపింది. -
7 నుంచి నేతన్న పోరుయాత్ర
రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలంటూ ‘మగ్గం నడవాలి-నేతన్న బతకాలి’ నినాదంతో ఈ నెల 7వ తేదీ నుంచి నేతన్న పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ అనుబంధ చేనేత, మరమగ్గాల కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. -
బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సింగరేణి సంస్థకు ఉన్న బొగ్గు గనులకు వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, ఈ తరహా చర్యలను తక్షణం విరమించుకోవాలని రాష్ట్రంలోని కార్మిక సంఘాలు విజ్ఞప్తిచేశాయి. -
‘గాంధీ’ ఎదుట నిరుద్యోగుల ఆందోళన
భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు, వివిధ పార్టీల నేతలు, వారిని అడ్డుకునేందుకు మోహరించిన పోలీసులతో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గాంధీ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత కొనసాగింది. -
రాష్ట్ర గవర్నర్తో మిజోరాం గవర్నర్ హరిబాబు భేటీ
తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సోమవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. -
జన్యు సవరణతో నేత్ర వ్యాధులకు చెక్!
పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల జన్యు వ్యాధులకు సంబంధించి జీన్ ఎడిటింగ్ (జన్యు సవరణ)తో చెక్పెట్టే పరిశోధనలు జరుగుతున్నాయి. -
చరిత్రలో నిలిచిపోయేలా గిరిజన అమరవీరుల స్మృతివనం
పోడు భూములకు హక్కు పత్రాల సాధనకు పోరాడిన గిరిజన అమరవీరుల స్మారకార్థం చరిత్రలో నిలిచిపోయేలా స్మృతివనం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. -
వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ
మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణను వేగంగా పూర్తి చేయాలని, వచ్చే ఏడాది నాటికి కార్యకలాపాలను ముమ్మురం చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. -
బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట
పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
వర్సిటీల్లో సదుపాయాలు కల్పించండి
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు అవసరమైన కనీస వసతులను కల్పించాలని, అందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. -
యువ ఐపీఎస్లకు స్థానచలనం
యువ ఐపీఎస్లు (2020-21 బ్యాచ్) 8 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. -
ఆలయాలు వ్యాపార కేంద్రాలు కావు!
ఆలయాలు వ్యాపార కేంద్రాలు కావని.. ఆదాయం పెంచుకోవడానికి ఆలయాలు వ్యాపార దృక్పథంతో పనిచేయజాలవని హైకోర్టు స్పష్టం చేసింది. -
కొత్త చట్టాల ప్రకారం కేసుల నమోదుకు ‘ఎస్వోపీ’
రాష్ట్రంలో కొత్త చట్టాల ప్రకారం కేసుల నమోదు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. -
నిమ్స్కు రూ.2.1 కోట్ల విరాళం
పీడియాట్రిక్ ఎపిలెప్సీ సెంటర్ స్థాపనతో పాటు వివిధ వసతుల కోసం నిమ్స్కు ‘ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్’ సంస్థ రూ.2.1 కోట్ల విరాళం అందజేసింది. -
ములుగు జిల్లాకు ‘సమ్మక్క సారలమ్మ’ పేరు!
ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
ఎయిర్ఫోర్స్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) అధ్యక్షుడిగా విశ్రాంత గ్రూపు కెప్టెన్ పెమ్మసాని రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారు. -
ఇలా తిందాం.. పదికాలాలు పచ్చగా ఉందాం
తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. ఆహారంలో సమతుల్యత లోపించినప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. -
వరదలొచ్చినా.. విద్యుదుత్పత్తి ఉండనట్టే!
ప్రస్తుత వానాకాలంలో కృష్ణానదికి వరదలొచ్చినా శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. -
సారూ.. వెళ్లొద్దు
నల్గొండ జిల్లా డిండి మండల పరిధిలోని వావిల్కోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9 ఏళ్లుగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయుడు ముద్దాడ బాలరాజు.. మండలంలోని కొత్తతండాకు బదిలీ అయ్యారు. -
క్రీడాకారులకు సీఎం అభినందన
ఎయిర్ గన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్’ ఆధ్వర్యంలో గోవాలో జరిగిన 10వ నేషనల్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ 2024 పోటీల్లో బంగారు పతకాలు సాధించిన భూక్య మోనాలిసా, భూక్య సోనాలిసాలను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు.