- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
electricity circles: నష్టాలొచ్చే విద్యుత్ సర్కిళ్లు ప్రైవేటుకు..!
కరెంటు ‘సరఫరా, పంపిణీ, వాణిజ్య’ (ఏటీసీ) నష్టాల నివారణకు కొన్ని విద్యుత్ సర్కిళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
పాతబస్తీ ప్రాంతం అదానీకి అప్పగించే యోచన
ఇప్పటికే ఆ సంస్థ అధ్యయనం
రాష్ట్రంలో 20 శాతం కరెంటు నష్టాలు
ఈనాడు, హైదరాబాద్: కరెంటు ‘సరఫరా, పంపిణీ, వాణిజ్య’ (ఏటీసీ) నష్టాల నివారణకు కొన్ని విద్యుత్ సర్కిళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైదరాబాద్ దక్షిణ (సౌత్) విద్యుత్ సర్కిల్ పరిధిలోని పాతబస్తీ ప్రాంతాన్ని అదానీ సంస్థకు అప్పగించబోతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి రెండురోజుల క్రితం దిల్లీలో మీడియాకు వెల్లడించారు. దీనికి సంబంధించి ఉన్నతస్థాయిలో సమావేశాలు జరిగాయి. అదానీ సంస్థ సైతం ఇప్పటికే డిస్కం నుంచి సమాచారం సేకరించింది. కరెంటు ‘పంపిణీ, బిల్లుల వసూలు’ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించాలంటే తొలుత రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అనుమతి ఇవ్వాలి. తర్వాత డిస్కంలు టెండర్లు పిలిచి ప్రైవేటు కంపెనీలను ఎంపిక చేయాలి. ఇంకా ప్రభుత్వం అనుమతి ఉత్తర్వులు ఇవ్వకపోయినా.. ఈ దిశగా చర్చలు సాగుతున్నాయి. అదానీ సంస్థ బృందాలు కొంతకాలంగా పాతబస్తీపై అధ్యయనం చేస్తున్నాయి. పాతబస్తీని అప్పగిస్తున్నందున.. భవిష్యత్తులో నష్టాలొచ్చే ఇతర విద్యుత్ సర్కిళ్లకూ అదే విధానం వర్తిస్తుందా అనేది చర్చనీయాంశమవుతోంది.
‘సౌత్’ సర్కిల్లో అత్యధికంగా..
హైదరాబాద్ సౌత్ సర్కిల్లో అత్యధికంగా 41.4 శాతం నష్టాలున్నాయి. దీని పరిధిలోని బార్కాస్ ఫీడర్లో ఏకంగా 90.7 శాతం నష్టాలు నమోదవుతున్నాయి. ఈ సర్కిల్లో పరిధిలో రోజూ రూ.మూడు కోట్ల విలువైన కరెంటు సరఫరా చేస్తే రూ. కోటిన్నర ఆదాయమే తిరిగి వస్తోంది. మిగతా కోటిన్నర రూపాయలను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ (డిస్కం) నష్టాలుగా చూపుతోంది. ఈ ఒక్క సర్కిల్ నుంచే ఏటా రూ.500 కోట్లకు పైగా డిస్కం నష్టపోతోంది. రాష్ట్రంలోని రెండు డిస్కంల వార్షిక నష్టాలు రూ.5,500 కోట్లకు పైగా ఉంటున్నాయి. వాస్తవంగా సరఫరాలో సాంకేతిక సమస్యల వల్ల నష్టం సగటున 10-12 శాతం కాగా.. కరెంటు చౌర్యం, బిల్లుల ఎగవేత వంటి సమస్యలే నష్టాలకు ఎక్కువ కారణమవుతున్నాయి.
దక్షిణ తెలంగాణ డిస్కంలో..
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో 2022-23లో మొత్తం 55,155.92 మిలియన్ యూనిట్ల (మి.యూ.) కరెంటు కొంటే.. సరఫరా నష్టాలు పోను.. 51,242.69 మి.యూ. పంపిణీ చేశారు. ఈ పంపిణీలో చౌర్యం, బిల్లులు కట్టకపోవడం వంటి కారణాలతో చివరికి 46,887.55 మి.యూ.కి మాత్రమే బిల్లుల రూపంలో రాబడి వచ్చింది. 2022-23లో ఈ డిస్కం ఏటీసీ నష్టాలు 19.09 శాతంగా నమోదైతే.. పాతబస్తీలో నష్టాలు ఏకంగా 41 శాతం ఉన్నాయి.
ఉత్తర డిస్కంలో..
ఉత్తర డిస్కం పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏటీసీ నష్టాలు గత ఏడాది (2023-24) అత్యధికంగా 37 శాతం నమోదయ్యాయి. కానీ ఈ జిల్లాలో వాస్తవంగా కరెంటు సరఫరా, పంపిణీ నష్టాలు 7 శాతమే. కాళేశ్వరం ఎత్తిపోతల కరెంటు బిల్లుల సొమ్ము ప్రభుత్వం నుంచి సరిగా రాకపోవడంతో ఆ నష్టాలు 37 శాతానికి చేరాయి.
అక్కడ విద్యుత్ సిబ్బందినే రానివ్వరు..
పాతబస్తీలో కరెంటు మీటరు రీడింగ్ నమోదు చేయడానికి విద్యుత్ సిబ్బందిని ఇళ్లలోకి సైతం కొందరు రానివ్వడం లేదు. బిల్లు కట్టలేదని కరెంటు నిలిపివేసినందుకు పాతబస్తీతో ఒక ఇంటి యజమాని ఇటీవల విద్యుత్ సిబ్బందిపై కత్తితో దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి దాడులు తరచూ జరుగుతుండడంతో విద్యుత్ సిబ్బంది పాతబస్తీలో మీటరు రీడింగ్ నమోదు, బిల్లుల వసూలుకు జంకుతున్నారు. అక్కడి ప్రజాప్రతినిధులు సైతం కరెంటు బిల్లులు కట్టనివారికి వత్తాసు పలుకుతూ.. విద్యుత్ సిబ్బందిని రావద్దంటూ హెచ్చరిస్తుండటం మరో సమస్య. వీటికితోడు మీటర్ ట్యాంపరింగ్, చౌర్యం కారణంగా.. సరఫరా చేసిన కరెంట్లో దాదాపు సగం బిల్లింగ్లోకి రావడం లేదు. కొన్ని సెక్షన్లలో ఇది 90 శాతం దాకా ఉంది. హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలో 7.20 లక్షల మంది విద్యుత్ వినియోగదారులుంటే.. ఏప్రిల్ 2024 నాటికి బిల్లుల బకాయిలు రూ. 81 కోట్ల మేర పేరుకుపోయాయి. ఏటీసీ నష్టాలు తగ్గకపోతే డిస్కంలు మరింత నష్టాల్లో కూరుకుపోతాయని కేంద్రం హెచ్చరిస్తోంది. వీటిని అధిగమించడానికి విద్యుత్ సర్కిళ్లవారీగా ‘పంపిణీ, బిల్లుల వసూలు’ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని గతంలో కేంద్రం విద్యుత్ నియమావళికి సవరణలు సైతం చేసింది. ఈ నేపథ్యంలోనే వీటిని పాతబస్తీ ప్రాంతంలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను విభజించి తహసీల్దార్లకు అప్పగించిన ప్రభుత్వం అదే మార్గంలో త్వరలో మరికొన్ని సంస్కరణలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. -
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
కోడింగ్కు కేంద్రంగా హైదరాబాద్
కోడింగ్లో హైదరాబాద్ ప్రపంచ కేంద్రంగా నిలుస్తోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్ రాయదుర్గం టీహబ్లో ఆదివారం ఎండ్ నౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోషల్వుడ్ 2024 సమిట్ (ద్వి వార్షిక సదస్సు) నిర్వహించారు. -
కొత్త ద్వీపం అందం అదరహో..!
చుట్టూ నీరు.. మధ్యలో భూభాగం ఉంటే ద్వీపం అనడం సహజం. ఇలాంటి దృశ్యాలు నదులు, సముద్రాలు, సరస్సుల్లో కనిపిస్తుంటాయి. -
ఎంపీ లాడ్స్ ఆన్లైన్లో!
పార్లమెంటు సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధుల పథకం (ఎంపీ లాడ్స్) వ్యయం ఇకపై ఆన్లైన్ వేదికగా జరగనుంది. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
వసతుల్లేని వర్సిటీలు!
ఉన్నత చదువులు చదివి.. జీవితంలో ఉత్తమంగా ఎదగాలన్న ఆశలు, ఆశయాలతో విశ్వవిద్యాలయాలకు వస్తున్న విద్యార్థులకు కనీస సదుపాయాల కొరత పరీక్ష పెడుతోంది. -
తెలంగాణ ఏర్పాటులో డీఎస్ పాత్ర కీలకం
పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని.. ఆయన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
10 మంది విద్యార్థులు మించితే.. ఇద్దరు టీచర్లు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 10 మంది విద్యార్థులు దాటిన చోట ఇక ఇద్దరు ఉపాధ్యాయులు రానున్నారు. 41 మంది పిల్లలు మించితే ముగ్గురు టీచర్లు ఉంటారు. -
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా తాండూరులో 5.1 సెం.మీటర్లు కురిసింది. -
అరుదైన రాజనీతిజ్ఞుడు
భారత మాజీ ఉప రాష్ట్రపతి, రాజనీతిజ్ఞుడు వెంకయ్య నాయుడికి ఆదివారంతో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నా. -
నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్తో కాంగ్రెస్ నేతల చర్చలు విఫలం
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆసుపత్రిలో వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్తో ఆదివారం రాత్రి కాంగ్రెస్ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. -
సింగరేణి.. మొక్కల గని..!
అడవిని తలపిస్తున్న ఈ ప్రాంతం సింగరేణి పరిధి రామగుండం ఏరియాలో బొగ్గు తవ్వకం తాలూకు మట్టి కుప్పలు నిండిన ప్రదేశం అంటే నమ్మగలమా. -
పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
దేశం పారిశ్రామికంగా సుస్థిరాభివృద్ధి సాధించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. -
చుక్ చుక్ బండి.. పట్టాల కింది నుంచీ వెళ్తుందండి..!
నగరాలు, జాతీయ రహదారుల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్లు కడతారు. బైపాస్ రోడ్లు నిర్మిస్తారు. రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించేందుకు రైల్వే శాఖ కూడా బైపాస్ లైన్లు, రైల్ ఓవర్ రైల్(ఆర్ఓఆర్) వంతెనలు నిర్మిస్తోంది. -
న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి
దేశ న్యాయవ్యవస్థలో మార్పులు రావాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. పేదలు సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం అడిగే పరిస్థితి ఉందా.. అన్న అంశంపై చర్చ జరగాలన్నారు. -
రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని మాజీ ఎంపీ మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. దివంగత నేత ఎన్టీఆర్కూ ఆ అవార్డు ఇవ్వాలని అన్నారు. -
ఇదీ సంగతి!
అది ఉద్యోగులకే..మనకు కాదు!! -
1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు ప్రధాన విద్యుత్తు కేంద్రాల్లో ఏకంగా 1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తికి విఘాతం ఏర్పడింది. -
మండల, జిల్లా పరిషత్లలోనూ ప్రత్యేకాధికారుల పాలన!
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల, జిల్లా పరిషత్లలోనూ ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. ఎంపీపీలు, జడ్పీ ఛైర్పర్సన్ల పదవీకాలం జులై 3, 4 తేదీల్లో ముగియనుండగా.. వారి స్థానంలో ప్రత్యేకాధికారుల నియామకం చేపట్టనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!
-
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి