- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Dharani: ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను విభజించి తహసీల్దార్లకు అప్పగించిన ప్రభుత్వం అదే మార్గంలో త్వరలో మరికొన్ని సంస్కరణలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
తహసీల్దార్లకు భూ సమస్యల పరిష్కారం, ఇతర బాధ్యతలు
సేవల్లో వేగం పెంచేందుకు కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను విభజించి తహసీల్దార్లకు అప్పగించిన ప్రభుత్వం అదే మార్గంలో త్వరలో మరికొన్ని సంస్కరణలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లతోపాటు భూ సమస్యల పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లు- సంయుక్త సబ్ రిజిస్ట్రార్లు నిర్వహిస్తున్నారు. అయితే రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ల సేవలతోనే వారి సమయం గడిచిపోతోంది. భూ సమస్యలు ఇతర ప్రొటోకాల్ సేవల పరిశీలన పనులు భారంగా మారుతున్నాయి. భూ సమస్యల పరిష్కారంలో వేగం తగ్గిపోతోంది. ఈ క్రమంలోనే మండల స్థాయిలో పనిని విభజించి సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ధరణి రిజిస్ట్రేషన్లను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించి, కార్యాలయ నిర్వహణ, సమస్యల పరిష్కారం ఇతర అధికారిక విధులు, కార్యాలయ పర్యవేక్షణ అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇది అమలైతే తహసీల్దార్లకు మాత్రమే ఉన్న ధరణి లాగిన్ను డిప్యూటీ తహసీల్దార్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
మొదట పైలట్ ప్రాజెక్టు
2020 నవంబరు నుంచి తహసీల్దారు కార్యాలయాలు వేదికగా సాగు భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం ప్రారంభించింది. ధరణి ఆపరేటర్ మినహా కొత్త సిబ్బందిని ఎవరినీ కేటాయించలేదు. పైగా కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ఏర్పాటుతో ఉన్నవారినే పంచారు. దీంతో తీవ్రమైన సిబ్బంది కొరత ఏర్పడింది. భూ సేవలే కాకుండా ధ్రువీకరణ పత్రాలు, ప్రకృతి విపత్తుల నిర్వహణ, విచారణలు, పంచనామాలు, ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపిక వంటి 36 రకాల సేవలను తహసీల్దారు కార్యాలయమే నిర్వహిస్తుంది. ఈ క్రమంలో రెవెన్యూశాఖ కీలక సంస్కరణలను తీసుకురావాలని భావిస్తోంది. ధరణి పోర్టల్ లాగిన్లను తహసీల్దార్లతోపాటు డిప్యూటీ తహసీల్దార్లకు పూర్తిస్థాయిలో ఇచ్చేముందు కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద నడిపించి పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కొద్ది రోజుల్లోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ: మంత్రి శ్రీధర్బాబు
మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణను వేగంగా పూర్తి చేయాలని, వచ్చే ఏడాది నాటికి కార్యకలాపాలను ముమ్మురం చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. -
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ గందరగోళానికి తెర!
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్పై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. రీ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడి, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి కొత్త ర్యాంకులు ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నీట్-యూజీ కౌన్సెలింగ్ తేదీలు వెలువడతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. -
తుది దశకు మంత్రివర్గ విస్తరణ
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుని నియామకంపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు. -
హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణకు ‘హైడ్రా’
హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణకు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్(హైడ్రా) అనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. -
ఏటా ఉద్యోగాల భర్తీ!
రాష్ట్రంలో నిరంతర ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. నిరుద్యోగులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏటా నోటిఫికేషన్లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్ వెలువరించేందుకు సమాయత్తమవుతోంది. -
కమిషన్ చట్టబద్ధమే
విద్యుత్తు కొనుగోళ్లు.. యాదాద్రి, భదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటులో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కచ్చితత్వం, ఔచిత్యాన్ని తేల్చడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ చట్టబద్ధమేనని హైకోర్టు తేల్చిచెప్పింది. -
నేరుగా జీపే, ఫోన్పే, పేటీఎంలో కరెంటు బిల్లు కట్టవద్దు
ఆన్లైన్లో కరెంటు బిల్లు కట్టేవారందరూ ఇకనుంచి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్ పేర్కొంది. -
ఇలా తిందాం.. పదికాలాలు పచ్చగా ఉందాం
తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. ఆహారంలో సమతుల్యత లోపించినప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. -
వరదలొచ్చినా.. విద్యుదుత్పత్తి ఉండనట్టే!
ప్రస్తుత వానాకాలంలో కృష్ణానదికి వరదలొచ్చినా శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. -
సారూ.. వెళ్లొద్దు
నల్గొండ జిల్లా డిండి మండల పరిధిలోని వావిల్కోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9 ఏళ్లుగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయుడు ముద్దాడ బాలరాజు.. మండలంలోని కొత్తతండాకు బదిలీ అయ్యారు. -
క్రీడాకారులకు సీఎం అభినందన
ఎయిర్ గన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్’ ఆధ్వర్యంలో గోవాలో జరిగిన 10వ నేషనల్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ 2024 పోటీల్లో బంగారు పతకాలు సాధించిన భూక్య మోనాలిసా, భూక్య సోనాలిసాలను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. -
బొగతలో జల సవ్వడి
తెలంగాణ నయాగరాగా పిలిచే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. -
వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయంపై దృష్టి
రాష్ట్రంలో ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు సక్రమంగా అందేలా వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. -
తమిళనాడుకు తెలంగాణ అధికారుల బృందం
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు తమిళనాడులో రవాణా విధివిధానాలపై అధ్యయనం చేయడానికి రంగారెడ్డి జిల్లా ఉప రవాణాధికారి (డీటీసీ) మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఆర్టీవో వాణి, కామారెడ్డి ఎంవీఐ శ్రీనివాస్తో కూడిన అధికారుల బృందం ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లింది. -
నాకు దక్కాల్సిన స్థలం.. బంధువులు పట్టా చేసుకున్నారు!
తనకు దక్కాల్సిన ఆస్తిని బంధువులు అక్రమంగా తీసుకున్నారని ఆరోపిస్తూ.. తనకు తిరిగి ఇప్పించాలని కోరుతూ కరీంనగర్లో ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధుడు సోమవారం నిరసనకు దిగారు. -
సత్ప్రవర్తన ఖైదీల విడుదలకు మార్గం సుగమం
సత్ప్రవర్తన కింద ఖైదీల విడుదలకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలిపింది. -
7 నుంచి నేతన్న పోరుయాత్ర
రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలంటూ ‘మగ్గం నడవాలి-నేతన్న బతకాలి’ నినాదంతో ఈ నెల 7వ తేదీ నుంచి నేతన్న పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ అనుబంధ చేనేత, మరమగ్గాల కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. -
బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సింగరేణి సంస్థకు ఉన్న బొగ్గు గనులకు వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, ఈ తరహా చర్యలను తక్షణం విరమించుకోవాలని రాష్ట్రంలోని కార్మిక సంఘాలు విజ్ఞప్తిచేశాయి. -
‘గాంధీ’ ఎదుట నిరుద్యోగుల ఆందోళన
భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు, వివిధ పార్టీల నేతలు, వారిని అడ్డుకునేందుకు మోహరించిన పోలీసులతో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గాంధీ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత కొనసాగింది. -
రాష్ట్ర గవర్నర్తో మిజోరాం గవర్నర్ హరిబాబు భేటీ
తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సోమవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. -
జన్యు సవరణతో నేత్ర వ్యాధులకు చెక్!
పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల జన్యు వ్యాధులకు సంబంధించి జీన్ ఎడిటింగ్ (జన్యు సవరణ)తో చెక్పెట్టే పరిశోధనలు జరుగుతున్నాయి.