- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rythu Bharosa: పటిష్ఠ విధానాలతో రైతుభరోసా
గత భారాస ప్రభుత్వం సాగులో లేని భూములకు కూడా రైతుబంధు వర్తింపజేసి 12 విడతల్లో దాదాపు రూ.25,670 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.
భారాస హయాంలో రైతుబంధు ద్వారా రూ.25,670 కోట్ల ప్రజాధనం వృథా
రుణమాఫీపై త్వరలో ఉత్తర్వులు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల. చిత్రంలో కోదండరెడ్డి, చిన్నారెడ్డి, అన్వేష్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: గత భారాస ప్రభుత్వం సాగులో లేని భూములకు కూడా రైతుబంధు వర్తింపజేసి 12 విడతల్లో దాదాపు రూ.25,670 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. రైతుబంధు తరహాలో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా.. రైతుభరోసాకు పటిష్ఠ విధానాలను తమ ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిపారు. ఆలస్యమైనా.. అర్హులకు మాత్రమే అందేలా రూపకల్పన చేస్తామని వివరించారు. రైతునేస్తం కార్యక్రమం కింద మంగళవారం 110 గ్రామీణ నియోజకవర్గాల్లోని రైతు వేదికల్లో వ్యవసాయశాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా రైతుభరోసాపై రైతుల అభిప్రాయాలను తెలుసుకొన్నారు.
సాగులో ఉన్న భూములకే ఇవ్వాలి..
ఈ సందర్భంగా పలువురు రైతులు సూచనలు చేశారు. ‘‘సాగు చేసేవారికి, సాగులో ఉన్న భూములకే రైతుభరోసా అందించాలి. స్థిరాస్తి భూములను మినహాయించాలి. గరిష్ఠ పరిమితి విధించాలి. వానాకాలం సీజన్కు ఈ నెలలోనే సాయం అందించాలి. యాసంగికి నవంబరులో ఇవ్వాలి’’ అని కోరారు. పదెకరాలు ఉన్నవారికీ సాయం అందించాలని.. అలాంటివారిలో ఎక్కువ మంది ఆదర్శ రైతులున్నారని కొందరు తెలిపారు. ఆదాయపు పన్ను చెల్లించేవారికి చెల్లించవద్దని కొందరు కోరగా... ట్రాక్టర్ల రుణాలకు ఐటీ రిటర్నులు తప్పనిసరి చేసిన నేపథ్యంలో వారికీ ‘రైతుభరోసా’ వర్తింపజేయాలని మరికొందరు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు; ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, కార్పొరేషన్ల ఛైర్పర్సన్లను మినహాయించాలని సూచించారు. 2018 డిసెంబరు 12 కంటే ముందు రుణ బకాయిలున్న వారికీ మాఫీ వర్తింపజేయాలని కొందరు కోరారు. దీనిపై మరోసారి మాట్లాడతామని మంత్రి చెప్పారు. కౌలు రైతులకు, రైతు కూలీలకూ రైతుభరోసా అందిస్తామని, రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. రైతునేస్తంలో వచ్చిన సూచనలన్నింటినీ క్రోడీకరించి.. నివేదిక రూపొందించాలని వ్యవసాయ సంచాలకుడు గోపిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావు, అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారాస హయాంలోనే చేనేత సంక్షోభం
భారాస పాలనలో చేనేత రంగం సంక్షోభానికి గురైందని, నేతన్నలకు డబ్బులు చెల్లించకుండా గత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులపాలు చేసిందని మంత్రి తుమ్మల విమర్శించారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘గత పదేళ్లలో చేనేత రంగాన్ని అన్ని స్థాయుల్లో అస్తవ్యస్తం చేశారు. సొంత లాభాలకు వాడుకున్నారు. ఇప్పుడు లేఖ పేరిట కేటీఆర్ రాజకీయం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టాన్ని కొత్త ప్రభుత్వంపై రుద్దాలని చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్రెడ్డి.. చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమంపై సమీక్ష చేశారు. ఆయన ఆదేశాల మేరకు కార్మికుల స్వయం సమృద్ధికి నూతన పథకం రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వం నేతన్న బీమా పథకాన్ని ప్రకటించి నామమాత్రంగా రూ.5 కోట్లు విడుదల చేసింది. ఇంకా రూ.16 కోట్ల బకాయిలున్నాయి. కాంగ్రెస్ హయాంలో అమలైన 50 శాతం పవర్ సబ్సిడీ పథకాన్ని గత భారాస ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. 2016 నుంచి రూ.59 కోట్ల బకాయిలున్నాయి. 2024 జనవరి నుంచి సిరిసిల్లలో జరిగిన ఆరుగురు చేనేత కార్మికుల ఆత్మహత్యలపై విచారణ జరిపి.. అర్హులకు ఎక్స్గ్రేషియా చెల్లించేందుకు చర్యలు చేపట్టాం’’ అని తుమ్మల పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం
కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్లో ఫ్యాను ఊడిపడి ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. -
పోలవరం విధ్వంసం.. రూ.వేల కోట్ల నష్టం
జగన్ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశమైపోయిందని.. ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే రూ.వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. శుక్రవారం విజయవాడకు వచ్చిన గవర్నర్ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం
తిరుమల-అలిపిరి మొదటి ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళన చెందారు. -
కుటుంబానికి రూ.2 లక్షలు!
రైతు రుణమాఫీ మార్గదర్శకాలను మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. -
వీడుతున్న చిక్కుముడులు
హైదరాబాద్ ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) రెండు భాగాలను ఒకేసారి నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. -
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలను జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. అయితే దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండకపోయినా.. ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. -
ఊరూరా మీసేవ కేంద్రాలు
ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
కృష్ణపట్టి ఏరియాలో పెద్దపులి సంచారం
కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు. -
ఆరోగ్య, ఆహార అలవాట్లపై ‘న్యూట్రిషన్ అట్లాస్’
దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల ఆహార అలవాట్లు, వారి ఆరోగ్య పరిస్థితులపై తాజా సమగ్ర సమాచారాన్ని ఐసీఎంఆర్ - ఎన్ఐఎన్ (భారతీయ వైద్య పరిశోధన మండలి - జాతీయ పోషకాహార సంస్థ) అందుబాటులోకి తెచ్చింది. -
జీవో నం.317 కేటాయింపు సమస్యల పరిష్కారం
ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం.317 కింద ఉపాధ్యాయ, అధ్యాపకుల కేటాయింపులో ఆఫ్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది. -
కార్మికుల భద్రత గాల్లో దీపమే
రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. అదే సమయంలో పని ప్రదేశాల్లో కార్మికులకు భద్రత కొరవడుతోంది. -
బాసర ఆలయ ప్రసాదాల్లో చేతివాటం
బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలోని తయారీ కేంద్రం వద్ద రిజిస్టర్లో తక్కువ సంఖ్యలో ప్రసాదాలను నమోదు చేసి కౌంటర్లో ఎక్కువ సంఖ్యలో విక్రయిస్తూ వచ్చిన డబ్బును కాజేస్తున్న సిబ్బందిపై వేటు పడింది. -
నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ శనివారం ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. -
నీట్ను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి
నీట్ అవకతవకల నేపథ్యంలో సంబంధిత పరీక్షను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన సంఘాల ఐకాస నేతలు డిమాండ్ చేశారు. -
రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకులు జగజీత్సింగ్ దల్లేవాల్, నల్లమల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. -
435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య డైరెక్టరేట్లో 431, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లో 4 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక బోర్డు(ఎంహెచ్ఆర్ఎస్బీ) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. -
మహిళా సూపరింటెండెంట్ ఆరోపణలపై నేడు విచారణ
సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి తనను వేధించారంటూ మహిళా సూపరింటెండెంట్ డి.జయలక్ష్మి చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. -
జీవో నం.317 కేటాయింపు సమస్యల పరిష్కారం
ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం.317 కింద ఉపాధ్యాయ, అధ్యాపకుల కేటాయింపులో ఆఫ్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది. -
ఏడుగురు తహసీల్దార్లకు ఎన్నికల తిరుగు బదిలీ
ఈ నెలతోపాటు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న ఏడుగురు తహసీల్దార్లను రెవెన్యూ శాఖ బదిలీ చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
డీఎస్ మృతిపట్ల సీఎం రేవంత్రెడ్డి సంతాపం
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
-
భార్యను నమ్మించి హతమార్చిన భర్త
-
ఊదమంటే.. బ్రీత్ ఎనలైజర్ లాక్కెళ్లాడు!
-
కాసుల మత్తులో ‘దందా’నతాన.. అనుచరుల బార్ల కోసం మద్యం దుకాణాల మార్పు