- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
TG Tourism: బర్డ్ వాచింగ్.. నైట్ క్యాంపింగ్.. మధ్యలో బోటింగ్!
పచ్చని చెట్లు.. చుట్టూ ఎత్తైన కొండలు.. చెంతనే గలగల ప్రవాహాలు.. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో.. చలిమంటలు కాగుతూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తుంటే.. ఆ ఆనంద పారవశ్యమే వేరు కదూ..!
ప్రకృతి పర్యాటకానికి ప్రభుత్వం కసరత్తు
అటవీ, జలవనరుల ప్రాంతాల్లో అభివృద్ధి
మూడు, నాలుగు ప్రాంతాలతో కలిపి ఓ సర్క్యూట్
నోడల్ ఏజెన్సీగా టీజీఎఫ్డీసీ!
లక్నవరం వద్ద పర్యాటకుల విడిది కోసం ఏర్పాటుచేసిన గుడారాలు
పచ్చని చెట్లు.. చుట్టూ ఎత్తైన కొండలు.. చెంతనే గలగల ప్రవాహాలు.. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో.. చలిమంటలు కాగుతూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తుంటే.. ఆ ఆనంద పారవశ్యమే వేరు కదూ..! ఇలాంటి అనుభూతినే కల్పించి పర్యాటకులను కట్టిపడేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ట్రెక్కింగ్, బర్డ్వాచింగ్, నైట్ క్యాంపింగ్, బోటింగ్.. వంటివాటిని అందుబాటులోకి తీసుకువచ్చే దిశలో అడుగులు వేస్తోంది.
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలు, జలవనరులు ఉన్న పరిసరాలను ప్రకృతి పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అధికారులు మూడు, నాలుగు ప్రాంతాలను ఒక సర్క్యూట్ కిందికి తీసుకువస్తూ ప్రాథమికంగా 12 ప్రకృతి పర్యాటక సర్క్యూట్లను గుర్తించారు. అందులో రక్షిత అటవీ ప్రాంతాల్లో ఏడు, అటవీ ప్రాంతాల వెలుపల అయిదు సర్క్యూట్లు ఉన్నాయి. అమ్రాబాద్, కవ్వాల్ వంటి పెద్దపులులు తిరిగే అభయారణ్యాలు.. కుంటాల, పొచ్చెర, భొగత లాంటి జలపాతాలు.. రామప్ప, అనంతపద్మనాభస్వామి, బాసర తదితర ఆలయాలు.. కోటిపల్లి రిజర్వాయర్, శామీర్పేట చెరువు, ప్రాణహిత నది, కిన్నెరసాని డ్యాం వంటి జలవనరులను ప్రకృతి పర్యాటక సర్క్యూట్లలో ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో కొంతమేర సౌకర్యాలున్నాయి. ప్రకృతి పర్యాటక విధానం ఖరారయ్యాక మరిన్ని సౌకర్యాలు, సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది. పర్యాటకులు విడిది చేసేలా రాత్రిబసకు అవసరమైన వసతులను కల్పించనుంది. వారికి వినోదాన్ని పంచడానికి వీలుగా ట్రెక్కింగ్, సఫారీ, బర్డ్ వాచింగ్, బోటింగ్, కయాకింగ్, నైట్ క్యాంపింగ్ వంటి ఏర్పాట్లు చేయనుంది. ప్రస్తుతం పరిమితంగా ఉన్న బోట్లు, సఫారీ వాహనాల సంఖ్యను పెంచనుంది. వీటి వల్ల పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుందని, ఖజానాకు ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఈ పాలసీ అమలుకు ప్రభుత్వం.. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్డీసీ)ను నోడల్ ఏజెన్సీగా నియమించింది.
కోటిపల్లి రిజర్వాయర్లో పర్యాటకులు
నిధుల సమీకరణపై దృష్టి
ప్రకృతి పర్యాటక అభివృద్ధి, అందుకు అవసరమైన సౌకర్యాల కల్పనకు పెద్దమొత్తంలో నిధులు అవసరమవుతాయి. దీంతో కర్ణాటక, ఒడిశా, కేరళ రాష్ట్రాలు ప్రకృతి పర్యాటక విధానాన్ని ఎలా అమలుచేస్తున్నాయి, నిధులు ఎలా సమకూర్చుకుంటున్నాయి కోణాల్లో అధికారులు అధ్యయనం చేశారు. కర్ణాటకలో ‘జంగిల్ లాడ్జెస్, రిసార్ట్సు’ పేరుతో ప్రత్యేక సంస్థను నెలకొల్పారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, అటవీ, పర్యాటక శాఖలు, జంగిల్ రిసార్ట్స్ ఇందులో భాగస్వామ్యంగా ఉన్నాయి. కేరళలో పర్యాటక శాఖ.. అటవీ శాఖకు నిధులు సమకూర్చుతోంది. తెలంగాణలో టీజీఎఫ్డీసీ, పర్యాటక శాఖ, ప్రభుత్వ పథకాలు, సీఎస్ఆర్, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా నిధులు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ సమీపంలో జింకలు
సర్క్యూట్ల వారీగా ప్రత్యేకతలు:
అమ్రాబాద్-సోమశిల: మన్ననూరు, సోమశిలలో వసతి. అమ్రాబాద్ టైగర్ రిజర్వులో సఫారీ, అభయారణ్యంలో ట్రెక్కింగ్, కృష్ణా బ్యాక్వాటర్లో బోటింగ్, శ్రీశైలం ఆలయ సందర్శన.
కవ్వాల్: కవ్వాల్ టైగర్ రిజర్వులో సఫారీ, మంచిర్యాలలో గాంధారీ ఫోర్ట్ సందర్శన, శివ్వారం వైల్డ్లైఫ్ శాంక్షరీ సందర్శన, జన్నారంలో వసతి.
వికారాబాద్-అనంతగిరి: అనంతగిరిలో బసకు గెస్ట్హౌస్, అనంత పద్మనాభస్వామి ఆలయ సందర్శన, అనంతగిరి అడవిలో సఫారీ, కోటపల్లి రిజర్వాయర్లో బోటింగ్, కయాకింగ్.
ఖమ్మం-కనకగిరి: కనకగిరి అటవీప్రాంతంలో సఫారీ, బర్డ్వాచ్, ట్రెక్కింగ్, బోటింగ్, కనకగిరిలో వసతి.
ఆదిలాబాద్-కుంటాల: మావల పార్క్లో బోటింగ్, బర్డ్వాక్, సఫారీ, వసతి. కుంటాల, పొచ్చెర వాటర్ఫాల్స్, బోథ్ అర్బన్పార్క్ సందర్శన, సాత్నాల చెరువులో బోటింగ్, ట్రెక్కింగ్.
కొత్తగూడెం-కిన్నెరసాని: కిన్నెరసాని ప్రాంతంలో వసతి. డ్యాంలో బోటింగ్, పాల్వంచలో సఫారీ, ట్రెక్కింగ్, రంగాపురం క్యాంప్ సందర్శన, జంగాలపల్లి అటవీప్రాంత సందర్శన.
పాకాల-ఏటూరునాగారం: తాడ్వాయి హట్స్, పాకాల, లక్నవరంలో వసతి, భొగత వాటర్ఫాల్స్, రామప్ప ఆలయం సందర్శన, ఏటూరునాగారం అభయారణ్యంలో టెక్క్రింగ్, క్యాంపింగ్, బర్డ్ వాచ్, పాకాల అభయారణ్యంలో క్యాంపింగ్.
నిజామాబాద్-నందిపేట: ఉమ్మెడ బ్యాక్ వాటర్ ప్రాంతంలో వసతి. బ్యాక్ వాటర్లో బోటింగ్, కృష్ణ జింకల సఫారీ, గాదెపల్లిలో రాత్రి బస, బాసర ఆలయ సందర్శన.
నల్గొండ-గాజుబిడెం: గాజుబిడెం బ్యాక్ వాటర్లో బస, బోటింగ్, నెల్లికల్ ఎకోపార్క్లో సఫారీ, కంబాలపల్లి అడవుల్లో ట్రెక్కింగ్.
మేడ్చల్-శామీర్పేట: చెరువులో బోటింగ్, బర్డ్ వాచ్, రిసార్టుల్లో బస.
సంగారెడ్డి-మంజీర: మంజీర డ్యాం దగ్గర వసతి. డ్యాంలో బోటింగ్, బర్డ్ వాచింగ్.
ఆసిఫాబాద్-కాగజ్నగర్: వేంపల్లిలో వసతి. ప్రాణహితలో బోటింగ్, గుండెపల్లిలో ట్రెక్కింగ్, సఫారీ, బర్డ్వాచింగ్. రాబందుల పాలరాపుగుట్ట సందర్శన.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరంగల్ నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
వరంగల్లోని జాతీయ సాంకేతిక సంస్థ (నిట్)లో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో బీటెక్ (ఈసీఈ) విద్యార్థి రవిషాకు రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ దక్కినట్లు నిట్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
తమది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమే, అలాగని కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే ఎలాగంటూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు. -
గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు బదిలీపై వెళ్లిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురవుతారు. వారిని చుట్టుముట్టి కన్నీరుమున్నీరుగా విలపిస్తారు. -
నేటి నుంచి ఎప్సెట్ కౌన్సెలింగ్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్లో ప్రవేశించేందుకు ఎప్సెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
ఫోన్ ట్యాపింగ్ కుట్రలో నవీన్రావు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్రావుకు భాగమున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. -
ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్!
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా... రాష్ట్రంలోని ప్రజలందరి సమగ్ర ఆరోగ్య సమాచారం (హెల్త్ ప్రొఫైల్) సేకరించేందుకు వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. -
పర్యాటక అభివృద్ధికి రాష్ట్రంలో వనరులు అనేకం
రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని.. ఆరు నెలల్లోనే పురోగతి సాధిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. -
ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రక్రియలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో వివరించింది. బదిలీలు చేపట్టే ప్రభుత్వ శాఖలు వీటిని తప్పక అమలుచేయాలని స్పష్టం చేసింది. -
ఇదీ సంగతి!
ఇదీ సంగతి! -
వరదనీటి చేరికతో వడివడిగా గోదావరి
వానాకాలం ప్రారంభంలో సరైన వర్షాలు లేక నదులు, నీరు లేక చెరువులు వెలవెలబోయాయి. గోదావరిలో ఇసుక మేటలు తేలాయి. -
నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం
నేత కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. -
శస్త్రచికిత్స అవసరం లేకుండానే..దెబ్బతిన్న మోకాలి భాగం తిరిగి అమరిక
శస్త్రచికిత్స అవసరం లేకుండానే 40 సంవత్సరాల వ్యక్తికి మోకాలిలో దెబ్బతిన్న భాగాన్ని తిరిగి అమర్చిన అరుదైన చికిత్సను హైదరాబాద్ బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. -
నాలుగు జిల్లాలకే సగం ‘బాసర’ సీట్లు
బాసర ఆర్జీయూకేటీలోని మొత్తం సీట్లలో సగం నాలుగు జిల్లాల విద్యార్థులే దక్కించుకున్నారు. ఆ వర్సిటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ చదివేందుకు పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపికైన విద్యార్థుల ప్రాథమిక జాబితాను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇన్ఛార్జి ఉపకులపతి వి.వెంకటరమణ, వర్సిటీ అధికారులు బుధవారం సచివాలయంలో విడుదల చేశారు. -
శిక్షణ ఇచ్చి ఖైదీల్లో మార్పు తెచ్చాం
తెలిసో తెలియకో తప్పుచేసి కారాగారానికి వచ్చిన ఖైదీలకు శిక్షకు బదులు.. శిక్షణ ఇచ్చి మార్పు తీసుకొచ్చామని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్ర తెలిపారు. -
ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి బ్యాంకు లాకర్లు తెరిచిన ఈడీ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్రెడ్డికి చెందిన బ్యాంకు లాకర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం తెరిచారు. -
కళ్లెదుటే తిరుగుతున్నా సమన్లు అందించలేరా!
ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసుల్లో విచారణ జరుగుతున్న తీరుపై బుధవారం హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్కు ప్రత్యామ్నాయం సూచించండి
జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా నేల స్వభావాన్ని అంచనా వేసేందుకు గాను నమూనాల సేకరణకు డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో భారీగా నీరు, ఇసుక బయటకు వస్తుండటంతో పరీక్షలను నిలిపివేశామని.. ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో సూచించాలని నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ)ని నీటిపారుదలశాఖ కోరింది. -
ఉత్తర తెలంగాణలో హైదరాబాద్ వర్సిటీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయండి
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ సెంటర్ను ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కేంద్రాన్ని కోరారు. -
మండల ప్రజాపరిషత్లకు ప్రత్యేకాధికారులు
రాష్ట్రంలో పాలకవర్గాల పదవీకాలం ముగిసిన మండల ప్రజాపరిషత్లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో నం.43) జారీ చేసింది. -
ప్రభుత్వాసుపత్రుల్లోని ఒప్పంద ఉద్యోగులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. -
సంక్షేమ కార్పొరేషన్లలో సిబ్బంది ఎంతమంది?
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమం కోసం కొత్తగా ప్రకటించిన 16 కార్పొరేషన్లు, బోర్డులు, సమాఖ్యలు కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్
-
రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 24,350 ఎగువన నిఫ్టీ
-
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు.. డ్రగ్ రాకెట్ను ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు
-
వరంగల్ నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM