- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
TG News: ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రక్రియలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో వివరించింది. బదిలీలు చేపట్టే ప్రభుత్వ శాఖలు వీటిని తప్పక అమలుచేయాలని స్పష్టం చేసింది.
కనీసం రెండేళ్లు నిండితేనే దరఖాస్తుకు అర్హత
ఒకేచోట నాలుగేళ్ల సర్వీసు పూర్తయినవారికి స్థానచలనం తప్పనిసరి
ఒక క్యాడర్లో 40 శాతానికి మించి సిబ్బందిని బదిలీ చేయరాదు
పారదర్శకంగా ఆన్లైన్ కౌన్సెలింగ్
8వ తేదీ కల్లా ఖాళీలు, బదిలీ అయ్యే వారి జాబితా వెల్లడి
9 నుంచి 12 వరకూ ఆప్షన్ల స్వీకరణ
19, 20 తేదీల్లో ఉత్తర్వుల జారీ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రక్రియలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో వివరించింది. బదిలీలు చేపట్టే ప్రభుత్వ శాఖలు వీటిని తప్పక అమలుచేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నాయకులను సైతం 2012లో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం తప్పనిసరిగా బదిలీ చేయాలని తెలిపింది. బదిలీలకు సంబంధించి జారీచేసిన మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు.
- 2024 జూన్ 30 నాటికి ఒకచోట రెండేళ్ల సర్వీసు పూర్తికానివారిని బదిలీ చేయకూడదు. రెండేళ్లు పూర్తయినవారే దరఖాస్తుకు అర్హులు. కానీ, భార్యాభర్తల నిబంధన కింద బదిలీ కోరేవారికి ఇది వర్తించదు.
- 2024 జూన్ 30 నాటికి ఒకచోట నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలి.
- 2025 జూన్ 30లోగా రిటైరయ్యే ఉద్యోగులు.. ఒకేచోట నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసినా బదిలీ చేయకూడదు.
- ఒక ప్రభుత్వ శాఖలో ఒక క్యాడర్లో ఉన్న మొత్తం పోస్టుల్లో 40 శాతానికి మించి ఉద్యోగులను బదిలీ చేయొద్దు.
- ప్రతి ఉద్యోగి ఎక్కడికి బదిలీ కోరుకుంటున్నారో తెలుపుతూ ఐదు ప్రాంతాల పేర్లను వరస క్రమంలో శాఖాధిపతికి పంపాలి.
- ఒకే స్థానాన్ని ఎక్కువ మంది ఉద్యోగులు అడిగితే 7 రకాల నిబంధనల ప్రకారం ప్రాధాన్యం ఇస్తారు. ఈ 7 నిబంధనలు... భార్య లేదా భర్త ఒకచోట పనిచేస్తుంటే మరొకరు అదే ప్రాంతం అడిగితే వారికి తొలి ప్రాధాన్యం కింద ఇవ్వాలి. వీరు లేకపోతే 2025 జూన్ 30లోగా రిటైరయ్యే వారికి రెండో ప్రాధాన్యం, 70 శాతానికి మించి వైకల్యం ఉన్నవారికి మూడో ప్రాధాన్యం, మానసిక వికలాంగులైన పిల్లలుంటే నాలుగో ప్రాధాన్యం, ఆ తరవాత వరస క్రమంలో వితంతువులు, క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఓపెన్ హార్ట్సర్జరీ చేయించుకున్నవారు, బోన్ టీబీ బాధితులు, మారుమూల ప్రాంతాల్లో పనిచేసేవారికి ప్రాధాన్యం ఇచ్చి కోరుకున్నచోటుకు బదిలీ చేయాలి.
- ఉద్యోగి కోరిన స్థానం దక్కితే ‘బదిలీ రవాణా అలవెన్స్’కు అనర్హులు.
- ప్రతి శాఖాధిపతి కేడర్వారీగా ఎన్ని ఖాళీలున్నాయి, ఎంత మంది పనిచేస్తున్నారు, అక్కడ ఎంతకాలం నుంచి ఉన్నారనే జాబితాలను ఈ నెల 8వ తేదీ కల్లా తయారుచేయాలి.
- నాలుగేళ్లకు మించి ఒకేచోట పనిచేస్తున్నవారి పేర్లతో జాబితాను ఈ నెల 5 నుంచి 8వ తేదీకల్లా విడుదల చేయాలి.
- ప్రతి ఉద్యోగి ఎక్కడికి బదిలీ కోరుకుంటున్నారనేది తెలుపుతూ ప్రాధాన్య క్రమంలో ఐదు ప్రాంతాల పేర్లను ఈ నెల 9 నుంచి 12 వరకూ ఆప్షన్గా ఇవ్వాలి.
- ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం ఎవరు ఎక్కడికి బదిలీకి అర్హులనే మాస్టర్ జాబితాను ఈ నెల 13 నుంచి 18 లోగా శాఖాధిపతులు తయారుచేయాలి.
- ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని శాఖలు బదిలీ ఉత్తర్వులు జారీచేయాలి. ఈ ఉత్తర్వు జారీఅయిన తర్వాత సదరు ఉద్యోగి పాత స్థానం నుంచి రిలీవ్ అయినట్లుగా పరిగణించాలి. ఉత్తర్వు జారీఅయిన మూడు రోజుల్లోగా ఉద్యోగి పాత స్థానం నుంచి రిలీవ్ కావాలి.
- ఈ నెల 20వ తేదీ కల్లా బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలి. ఈ నెల 21 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుంది.
- ఒక ఆఫీసులో అందరూ నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసి బదిలీకి అర్హులైనా సరే, వారందరినీ బదిలీ చేయకుండా కనీసం కొంతమందిని ఆఫీసు నిర్వహణ కోసం కొనసాగించాలి.
- మారుమూల ప్రాంతాల్లోని పోస్టులకు అవసరమైనంత మంది ఉద్యోగులు బదిలీ కోరుతూ ఆప్షన్లు ఇవ్వకపోతే లాటరీ విధానంలో ఎంపిక చేయాలి.
- పారదర్శకంగా ఆన్లైన్ వెబ్ఆధారిత కౌన్సెలింగ్ విధానంలోనే బదిలీలు చేయాలి.
- ఖాళీలు, బదిలీలకు అర్హులైనవారి పేర్లు, ఇతర వివరాలన్నీ ప్రతి ప్రభుత్వ శాఖ ఆన్లైన్లో విడుదల చేయాలి.
కమిటీలను ఏర్పాటుచేయాలి
బదిలీల నిర్వహణకు ప్రతి శాఖలో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటుచేయాలి. రాష్ట్రస్థాయి పోస్టుల్లో పనిచేసేవారిని బదిలీ చేసేందుకు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి, శాఖాధిపతి, అదనపు కార్యదర్శులతో కమిటీ ఏర్పాటుచేయాలి. మల్టీజోన్ లేదా జోనల్ స్థాయి ఉద్యోగుల కోసం శాఖాధిపతి, అదనపు కార్యదర్శి, జాయింట్ డైరెక్టర్ సభ్యులుగా కమిటీ, జిల్లా స్థాయి ఉద్యోగుల కోసం కలెక్టర్, అదనపు కలెక్టర్, సంబంధిత శాఖ జిల్లా అధికారి సభ్యులుగా కమిటీ బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలి. ఈ కమిటీల ఆమోదంతోనే బదిలీ ఉత్తర్వులు జారీచేయాలి. ప్రతి శాఖ ముఖ్యకార్యదర్శి తన శాఖలో జరిగే బదిలీల ప్రక్రియను జాగ్రత్తగా పర్యవేక్షించాలి. ఈ మార్గదర్శకాల అమలులో ఏవైనా ఉల్లంఘనలు జరిగితే సదరు శాఖాధిపతి బాధ్యత వహించాలి.
ఆరు శాఖలకు మినహాయింపు
బదిలీల మార్గదర్శకాలు ఆరు శాఖలకు వర్తించవని, వాటి అవసరాల దృష్ట్యా మార్పులు చేర్పులు చేసి అమలు చేసుకోవచ్చని ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, విద్య, అటవీ, పోలీసుశాఖలకు ఈ వెసులుబాటు కల్పించింది.
ఐదేళ్ల నుంచి నాలుగేళ్లకు తగ్గింపుతో..
వాస్తవానికి ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన ఉద్యోగిని మాత్రమే కచ్చితంగా బదిలీ చేయాలనే నిబంధన గతంలో ఉంది. 2018 నుంచి సాధారణ బదిలీలు లేనందున ఇప్పుడు 90 శాతం మంది నాలుగేళ్లకు మించి ఒకేచోట పనిచేస్తున్నందున వారంతా ‘కచ్చితంగా’ బదిలీ జాబితాలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో పరిపాలన కుంటుపడకుండా ఐదేళ్ల పాత నిబంధన అలాగే కొనసాగించినా లేదా అంతకుమించి సర్వీసు ఉండాలనే నిబంధన పెడితే బాగుండేదని.. అలా కాకుండా, ఐదుని కాస్తా నాలుగేళ్లకు తగ్గించడం వల్ల... కచ్చితంగా బదిలీ అయ్యే వారి సంఖ్య భారీగా పెరగనుందని చెబుతున్నారు. ఇలా కచ్చితంగా బదిలీ అయ్యేవారు ఒక కేడర్లో అత్యధిక సంఖ్యలో ఉంటే.. వారిలో 40 శాతం మందిని మాత్రమే మార్చడానికి ఎవరిని ఎంపిక చేయాలనే సూచనలను మార్గదర్శకాల్లో ఇవ్వకపోవడం గమనార్హం. 40 శాతం కోటా కింద ఎవరిని బదిలీకి ఎంపిక చేయాలనే స్పష్టత లేనందున ఈ విషయంలో శాఖాధిపతుల నిర్ణయాలే కీలకంగా మారనున్నాయి.
నగరాల పోస్టులకు భారీ డిమాండ్
ఆర్థిక శాఖ జారీచేసిన మార్గదర్శకాలలో అస్పష్టత కారణంగా.. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి నగరాల్లోని పోస్టులకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఒక శాఖలో ఒక క్యాడర్లో ఉన్న మొత్తం పోస్టుల్లో 40 శాతం వరకూ బదిలీ చేయాలని ఆదేశించారు. ఒక స్థానంలో నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నవారందరినీ బదిలీ చేయాలని పేర్కొన్నారు. ఇంతకుముందు 2018లో సాధారణ బదిలీలు జరిగాయి. అంటే అప్పటి నుంచి ఆరేళ్లుగా ఉద్యోగులంతా పాత స్థానాల్లో కొనసాగుతున్నందున కొన్ని శాఖల్లో 90 శాతం మంది ఉద్యోగులను నాలుగేళ్ల నిబంధన కింద తప్పనిసరిగా బదిలీకి అర్హుల జాబితాలో అన్ని శాఖలు వెల్లడించాల్సి ఉంటుంది. వీరిలో భార్యభర్తలు, 2025 జూన్ 30లోగా రిటైరయ్యేవారు కోరుకున్న స్థానాన్ని తప్పనిసరిగా ఇవ్వాలని నిబంధన పెట్టారు. త్వరలో రిటైరయ్యే వాళ్లు నగరాలకు వచ్చినా ఏడాదికల్లా రిటైర్మెంట్తో ఆ పోస్టులు మళ్లీ ఖాళీకానున్నాయి. 2025 జూన్ 30లోగా రిటైరయ్యేవారిని బదిలీ చేయవద్దని ఒక నిబంధన పెట్టి.. వారు కోరుకుంటే ఎక్కడైనా ఇవ్వవచ్చని మరో నిబంధన పెట్టడంతో మార్గదర్శకాల్లో అస్పష్టత ఏర్పడింది. ఇలాంటి వారంతా తప్పనిసరిగా నగరాలు లేదా వాటికి దగ్గరగా ఉన్న పోస్టులనే ఎంచుకుంటారు. మరోవైపు నగరాల్లోని ఉద్యోగుల్లో 90 శాతం మంది నాలుగేళ్లకు పైగా ఒకేచోట పనిచేస్తున్నందున వీరి పోస్టులన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు తమకే ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక్కడ వంద మందికి ఒక్క సారు.. అక్కడ విద్యార్థులే లేరు
సర్కారు విద్యావ్యవస్థలో లోపాలకు కొన్ని పాఠశాలలు అద్దం పడుతున్నాయి. కొన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోగా.. మరికొన్ని బడుల్లో అసలు విద్యార్థులు లేకపోవడంతో సార్లు ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఆస్తుల విభజన.. బకాయిల ఖరారు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా.. ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న ఆస్తుల విభజన, బకాయిల చెల్లింపు అంశాలపై చర్చించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారి భేటీ కానున్నారు. -
ఖరీఫ్ సాగు ఆలస్యమే!
వానాకాలం ప్రారంభమై నెలరోజులు దాటినా రిజర్వాయర్లలోకి ప్రవాహాలు చెప్పుకోతగ్గట్టుగా ప్రారంభం కాకపోవడంతో ఖరీఫ్ ఆయకట్టు సాగు జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. -
వాట్సప్లోనూ వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు
ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే.. ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు. -
ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యలో ఫార్మా క్లస్టర్లు
హైదరాబాద్లో బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్), ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) మధ్యలో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసి, ఔషధ పరిశ్రమను ప్రోత్సహిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. -
రెండేళ్ల తాత్కాలిక సంరక్షణ పూర్తయితే శాశ్వత దత్తత
రాష్ట్రంలో తల్లిదండ్రుల్లేని, సంరక్షణ కొరవడిన ఆరేళ్లకు పైబడిన చిన్నారులను దత్తతకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సులభతరం చేసింది. -
ఇందిరమ్మ ఇళ్ల అర్హుల గుర్తింపు ఎలా?
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులను గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏటా నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా 82.82 లక్షల దరఖాస్తులు అందాయి. -
దాత ఔదార్యం.. చేరువైన వైద్యం
ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు వాసుల కల నేరనుంది. ఇప్పటిదాకా ఇక్కడి పేదలు ఉచిత వైద్యం కోసం పెనమలూరు మండల పీహెచ్సీకి వెళ్లేవారు. -
రూ.40 వేల కోట్ల రుణసేకరణ!
రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా పథకాల అమలు కోసం భారీగా రుణాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. -
బాలిక అవాంఛనీయ గర్భం తొలగింపునకు హైకోర్టు అనుమతి
అత్యాచార బాధితురాలైన ఓ బాలిక అవాంఛనీయ గర్భం తొలగింపునకు అనుమతిస్తూ శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
సీఎం, మంత్రులకు ప్రభుత్వం ఐటీ చెల్లింపు నిబంధన రద్దు చేయండి
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పొందే వేతనానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను (ఐటీ) చెల్లింపు నిబంధనను రద్దు చేయాలంటూ హైకోర్టులో శుక్రవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. -
వైద్యుల మధ్య బదిలీల ఘర్షణ
రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో వైద్యుల బదిలీల అంశం సంఘాల మధ్య ఘర్షణకు దారితీసింది. శుక్రవారం వైద్య విద్య డైరెక్టరేట్(డీఎంఈ) కార్యాలయంలోనే జరిగిన దాడి ఘటన వైద్య, ఆరోగ్యశాఖలో కలకలం రేపింది. -
ఆర్టీసీ బస్సులో భూమ్మీదకు వచ్చిన ‘మహాలక్ష్మి’..!
ఆర్టీసీ సిటీ బస్సులో ఆసుపత్రికి బయలుదేరిన గర్భిణికి మార్గం మధ్యలోనే నొప్పులు మొదలయ్యాయి. ప్రసవవేదనతో విలవిల్లాడుతుండటంతో తోటి ప్రయాణికులు మహిళా కండక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. -
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సుదర్శన్రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సి.సుదర్శన్రెడ్డిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
లవ్ యూ సిరాజ్ భాయ్!
టీ20 ప్రపంచకప్-2024 విజేత భారత్ జట్టులో సభ్యుడైన సిరాజ్కు శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, బంధువులు, క్రికెట్ అభిమానులు ఘనస్వాగతం పలికారు. -
కోర్ బ్రాంచీల్లో చేరితే స్కాలర్షిప్
మీరు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ బ్రాంచీల్లో ఇంజినీరింగ్, డిప్లొమాలో చేరాలనుకుంటున్నారా?.. అయితే మీకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) సిద్ధంగా ఉంది. -
కవిత జ్యుడిషియల్ కస్టడీ 18 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధాన రూపకల్పనలో జరిగిన అవకతవకలపై సీబీఐ నమోదు చేసిన కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు విధించిన జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది. -
తోపులాట.. వాగ్వాదం!
నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలంటూ శుక్రవారం వివిధ సంఘాలు పిలుపునిచ్చిన టీజీపీఎస్సీ ముట్టడి పోలీసు పహారాలో తోపులాటలు, వాగ్వాదాల మధ్య కొనసాగింది. -
మేడిగడ్డ ఇసుక తవ్వకాలకు గుత్తేదారుల పోటాపోటీ
మేడిగడ్డ బ్యారేజీ ఎగువ భాగంలో ఇసుక తవ్వితీసేందుకు గుత్తేదారులు పెద్దసంఖ్యలో బిడ్లు దాఖలు చేశారు. 14 బ్లాక్లకుగాను మొత్తం 383 బిడ్లు వచ్చాయి. -
జాతీయ రహదారులకు రూ.3,834 కోట్లు
రాష్ట్రంలోని జాతీయ రహదారుల పటిష్ఠం, మరమ్మతులకు కేంద్రం రూ.3,834 కోట్లు కేటాయించింది. పలు రహదారుల విస్తరణ, బైపాస్రోడ్లు, వంతెనల భద్రతకు ఈ నిధులు మంజూరు చేసేందుకు వీలుగా 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక ప్రణాళికలో చేర్చినట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. -
మాది పరిశ్రమల ఫ్రెండ్లీ సర్కారు
ప్రపంచంలోనే రాష్ట్రాన్ని స్కిల్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.