- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Students: గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు బదిలీపై వెళ్లిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురవుతారు. వారిని చుట్టుముట్టి కన్నీరుమున్నీరుగా విలపిస్తారు.
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు బదిలీపై వెళ్లిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురవుతారు. వారిని చుట్టుముట్టి కన్నీరుమున్నీరుగా విలపిస్తారు. అయితే, బదిలీపై వెళ్లిన ఓ ఉపాధ్యాయుడితోపాటే పదుల సంఖ్యలో విద్యార్థులు పాఠశాల మారిన అరుదైన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జన్నారం మండలం పొనకల్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా జాజాల శ్రీనివాస్ 2012 జులై 13న చేరారు. అప్పుడు అక్కడ ఐదు తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులు, 32 మంది విద్యార్థులు ఉండేవారు. ఆయన పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ, ఆటపాటలతో పాఠాలు బోధించడం, ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా 250కి చేరింది.ఆయన ఈ నెల 1న ఇదే మండలంలో మూడు కి.మీ. దూరంలోని అక్కపెల్లిగూడ పాఠశాలకు బదిలీ అయ్యారు. ఈ పరిణామాన్ని విద్యార్థులు తట్టుకోలేకపోయారు. తమకెంతో ఇష్టమైన మాస్టారున్న పాఠశాలలోనే చేరతామంటూ పిల్లలు గొడవ చేయడంతో 2, 3 తేదీల్లో ఏకంగా 133 మందిని వారి తల్లిదండ్రులు అక్కపెల్లిగూడ బడిలో చేర్పించారు. దాంతో జూన్ 30న కేవలం 21 మంది విద్యార్థులున్న అక్కపెల్లిగూడ పాఠశాల ఇప్పుడు 154 మందితో కళకళలాడుతోంది. ఈ పాఠశాలలో జాజాల శ్రీనివాస్తోపాటు మరో ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు.
న్యూస్టుడే, జన్నారం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్లోనూ వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు
ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే.. ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు. -
ఇక్కడ వంద మందికి ఒక్క సారు.. అక్కడ విద్యార్థులే లేరు
సర్కారు విద్యావ్యవస్థలో లోపాలకు కొన్ని పాఠశాలలు అద్దం పడుతున్నాయి. కొన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోగా.. మరికొన్ని బడుల్లో అసలు విద్యార్థులు లేకపోవడంతో సార్లు ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఆస్తుల విభజన.. బకాయిల ఖరారు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా.. ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న ఆస్తుల విభజన, బకాయిల చెల్లింపు అంశాలపై చర్చించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారి భేటీ కానున్నారు. -
ఖరీఫ్ సాగు ఆలస్యమే!
వానాకాలం ప్రారంభమై నెలరోజులు దాటినా రిజర్వాయర్లలోకి ప్రవాహాలు చెప్పుకోతగ్గట్టుగా ప్రారంభం కాకపోవడంతో ఖరీఫ్ ఆయకట్టు సాగు జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. -
ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యలో ఫార్మా క్లస్టర్లు
హైదరాబాద్లో బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్), ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) మధ్యలో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసి, ఔషధ పరిశ్రమను ప్రోత్సహిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. -
రెండేళ్ల తాత్కాలిక సంరక్షణ పూర్తయితే శాశ్వత దత్తత
రాష్ట్రంలో తల్లిదండ్రుల్లేని, సంరక్షణ కొరవడిన ఆరేళ్లకు పైబడిన చిన్నారులను దత్తతకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సులభతరం చేసింది. -
ఇందిరమ్మ ఇళ్ల అర్హుల గుర్తింపు ఎలా?
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులను గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏటా నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా 82.82 లక్షల దరఖాస్తులు అందాయి. -
దాత ఔదార్యం.. చేరువైన వైద్యం
ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు వాసుల కల నేరనుంది. ఇప్పటిదాకా ఇక్కడి పేదలు ఉచిత వైద్యం కోసం పెనమలూరు మండల పీహెచ్సీకి వెళ్లేవారు. -
రూ.40 వేల కోట్ల రుణసేకరణ!
రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా పథకాల అమలు కోసం భారీగా రుణాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. -
బాలిక అవాంఛనీయ గర్భం తొలగింపునకు హైకోర్టు అనుమతి
అత్యాచార బాధితురాలైన ఓ బాలిక అవాంఛనీయ గర్భం తొలగింపునకు అనుమతిస్తూ శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
సీఎం, మంత్రులకు ప్రభుత్వం ఐటీ చెల్లింపు నిబంధన రద్దు చేయండి
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పొందే వేతనానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను (ఐటీ) చెల్లింపు నిబంధనను రద్దు చేయాలంటూ హైకోర్టులో శుక్రవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. -
వైద్యుల మధ్య బదిలీల ఘర్షణ
రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో వైద్యుల బదిలీల అంశం సంఘాల మధ్య ఘర్షణకు దారితీసింది. శుక్రవారం వైద్య విద్య డైరెక్టరేట్(డీఎంఈ) కార్యాలయంలోనే జరిగిన దాడి ఘటన వైద్య, ఆరోగ్యశాఖలో కలకలం రేపింది. -
ఆర్టీసీ బస్సులో భూమ్మీదకు వచ్చిన ‘మహాలక్ష్మి’..!
ఆర్టీసీ సిటీ బస్సులో ఆసుపత్రికి బయలుదేరిన గర్భిణికి మార్గం మధ్యలోనే నొప్పులు మొదలయ్యాయి. ప్రసవవేదనతో విలవిల్లాడుతుండటంతో తోటి ప్రయాణికులు మహిళా కండక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. -
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సుదర్శన్రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సి.సుదర్శన్రెడ్డిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
లవ్ యూ సిరాజ్ భాయ్!
టీ20 ప్రపంచకప్-2024 విజేత భారత్ జట్టులో సభ్యుడైన సిరాజ్కు శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, బంధువులు, క్రికెట్ అభిమానులు ఘనస్వాగతం పలికారు. -
కోర్ బ్రాంచీల్లో చేరితే స్కాలర్షిప్
మీరు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ బ్రాంచీల్లో ఇంజినీరింగ్, డిప్లొమాలో చేరాలనుకుంటున్నారా?.. అయితే మీకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) సిద్ధంగా ఉంది. -
కవిత జ్యుడిషియల్ కస్టడీ 18 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధాన రూపకల్పనలో జరిగిన అవకతవకలపై సీబీఐ నమోదు చేసిన కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు విధించిన జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది. -
తోపులాట.. వాగ్వాదం!
నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలంటూ శుక్రవారం వివిధ సంఘాలు పిలుపునిచ్చిన టీజీపీఎస్సీ ముట్టడి పోలీసు పహారాలో తోపులాటలు, వాగ్వాదాల మధ్య కొనసాగింది. -
మేడిగడ్డ ఇసుక తవ్వకాలకు గుత్తేదారుల పోటాపోటీ
మేడిగడ్డ బ్యారేజీ ఎగువ భాగంలో ఇసుక తవ్వితీసేందుకు గుత్తేదారులు పెద్దసంఖ్యలో బిడ్లు దాఖలు చేశారు. 14 బ్లాక్లకుగాను మొత్తం 383 బిడ్లు వచ్చాయి. -
జాతీయ రహదారులకు రూ.3,834 కోట్లు
రాష్ట్రంలోని జాతీయ రహదారుల పటిష్ఠం, మరమ్మతులకు కేంద్రం రూ.3,834 కోట్లు కేటాయించింది. పలు రహదారుల విస్తరణ, బైపాస్రోడ్లు, వంతెనల భద్రతకు ఈ నిధులు మంజూరు చేసేందుకు వీలుగా 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక ప్రణాళికలో చేర్చినట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. -
మాది పరిశ్రమల ఫ్రెండ్లీ సర్కారు
ప్రపంచంలోనే రాష్ట్రాన్ని స్కిల్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.