- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Sitarama Lift Irrigation: సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫేజ్-1 పంప్హౌస్ ట్రయల్ రన్ విజయవంతమైంది.
తొలుత ఏటా 2 లక్షల ఎకరాలకు సాగునీరు: తుమ్మల
సీతారామ ప్రాజెక్టు ఫేజ్-1 పంప్హౌస్ డెలివరీ సిస్టర్న్ వద్ద ఎత్తిపోస్తున్న గోదావరి జలాలు
అశ్వాపురం, న్యూస్టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫేజ్-1 పంప్హౌస్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈనెల 13న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టులను సందర్శించిన సంగతి తెలిసిందే. సీతారామ ప్రాజెక్టు ఫేజ్-1 పంప్హౌస్కు విద్యుత్తు కనెక్షన్ను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. పంప్హౌస్ పూర్తయి మూడేళ్లు అయినా అప్పటివరకు విద్యుత్తు కనెక్షన్ ఇవ్వలేదు. ఆగస్టు 15లోగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.50 లక్షల ఎకరాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరందించాలన్న లక్ష్యం నేపథ్యంలో పంప్హౌస్ను ట్రయల్ రన్కు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఆనాటి నుంచి అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.
పంప్హౌస్ కంట్రోల్ యూనిట్లో స్విచ్ ఆన్ చేస్తున్న జలవనరుల శాఖ ముఖ్య సలహాదారు పెంటారెడ్డి, చిత్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు
రైతులతో పూజలు చేయించిన అనంతరం...
పంప్హౌస్ను మంత్రి తుమ్మల గురువారం ఉదయం సందర్శించారు. ఆయన సమక్షంలో జలవనరులశాఖ అధికారులు ట్రయల్ రన్ను నిర్వహించారు. పంప్హౌస్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులతో పూజలు చేయించిన అనంతరం కంట్రోల్ యూనిట్లో జలవనరుల శాఖ ముఖ్య సలహాదారు పెంటారెడ్డి స్విచ్ ఆన్ చేసి మొదటి పంప్ను ప్రారంభించారు. డెలివరీ సిస్టర్న్లో ఆ పంప్ మొదటి విభాగం నుంచి గోదావరి జలాలు ఒక్కసారిగా ముందుకు దూకి సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వలోకి ప్రవహించాయి. తుమ్మల, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత గోదావరి జలాల్లోకి పసుపు, కుంకుమ, పూలు చల్లి పూజలు నిర్వహించారు. ప్రవహిస్తున్న గోదావరి జలాలకు, నేలతల్లికి మంత్రి నమస్కరించారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, జలవనరులశాఖ సీఈ ఎ.శ్రీనివాసరెడ్డి, ఎస్ఈలు కె.వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఈఈ చెన్నం వెంకటేశ్వరరావు, డీఈలు కె.శ్రీనివాస్, రాంబాబు, ఏఈలు రమేశ్, ప్రవీణ్, రాజీవ్గాంధీ తదితరులు పాల్గొన్నారు.
మూడు, నాలుగేళ్లలో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు
ఏటా 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించేలా సీతారామ ప్రాజెక్టును తొలుత పూర్తిచేయనున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. మూడు, నాలుగేళ్లలో మిగిలిన నిర్మాణ పనులు పూర్తి చేసి పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరందించే ఏర్పాటు చేస్తామన్నారు. ‘కొన్ని నిధులు సమకూర్చితే ఈ ఏడాదే గోదావరి జలాలను ఖమ్మం భూభాగంలోకి తీసుకుపోగలమని.. భద్రాచలం వచ్చినప్పుడు సీఎం రేవంత్రెడ్డికి చెప్పాం. ఆయన పెద్దమనసుతో స్పందించి నిధులు విడుదల చేశారు. వాటితో విద్యుత్తు, మరికొన్ని పెండింగ్ పనులు పూర్తిచేశాం’ అని మంత్రి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సుకన్య సమృద్ధి’కి ట్రైనీ అఖిల భారత సర్వీసు అధికారుల చొరవ.. 100 మంది పేరిట ఖాతాలు
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా.. శిక్షణ దశలోనే 2024 బ్యాచ్ అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులు సేవాబాట పట్టి ఆదర్శంగా నిలిచారు. -
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని పౌర(సివిలియన్) ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. -
అంచనాలు అడ్డగోలుగా పెంచేస్తారా?
వరంగల్లో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా ఎందుకు పెంచారని.. మౌఖిక ఆదేశాలతో ఏకంగా రూ.626 కోట్లు అదనంగా ఎలా ఖర్చు చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ కన్నుమూత
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్(76) కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యేకాలనీలోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. -
నిర్లక్ష్యపు బస్సు నడిచేదెప్పుడో!
ప్రయాణికులు పెరుగుతుంటే బస్సుల సంఖ్యా పెరగాలి. టీజీఎస్ఆర్టీసీలో ఇందుకు భిన్నమైన పరిస్థితి. ఆర్టీసీలో పదేళ్ల క్రితం 10,479 బస్సులుంటే ఇప్పుడా సంఖ్య 8,574. ఈ బస్సుల్లోనూ కాలం చెల్లినవి పెద్ద సంఖ్యలో ఉన్నాయి. -
మాస్టారూ.. మీరే మీరే మాస్టారు!
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 39 ఏళ్లు వ్యాయామోపాధ్యాయునిగా పనిచేసిన తూము హన్మంతరావు చివరిగా సూర్యాపేట జిల్లా నూతనకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ పొందారు. -
80ఏళ్ల నాటి దస్త్రాలకు రక్షణేది?
వస్త్రాల్లో కట్టి ఉంచిన ఈ దస్త్రాలు భూ కొలతలశాఖకు సంబంధించినవి. నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డికి తరలించిన వీటికి రక్షణ లేకుండా పోయింది. సుమారు పది నెలల నుంచి కామారెడ్డి కలెక్టరేట్లోని ఓ గదిలో మూలన పెట్టి ఉంచారు. -
సరళమా.. సంక్లిష్టమా..?
దేశంలో జులై 1 నుంచి అమలులోకి రాబోతున్న కొత్త న్యాయ చట్టాలతో లాభనష్టాలపై చర్చ జరుగుతోంది. దాదాపు 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్), -
విజ్ఞాన గని.. డా.పావులూరి కృష్ణ చౌదరి
డా.పావులూరి కృష్ణ చౌదరికి అనేక అంశాలపై పరిజ్ఞానం ఉండేదని ‘ఈనాడు’ ఎండీ కిరణ్ అన్నారు. ఆయనతో తనకు 16 ఏట నుంచే సాన్నిహిత్యం ఉందని చెప్పారు. -
కౌంటర్ దాఖలుకు 4 వారాల గడువివ్వండి
కృష్ణా జలాల పునః పంపిణీకి సంబంధించి కౌంటర్ దాఖలు చేయడానికి నాలుగు వారాల గడువు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్... బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ను (కేడబ్ల్యూడీటీ-2) కోరింది. -
గోదాముల్లో.. సమిధలు!
సికింద్రాబాద్ బోయిగూడలోని తుక్కు గోదాములో 2022 మార్చి 22న 11 మంది మంటల్లో మసయ్యారు.. 2023 నవంబరు 13న హైదరాబాద్ బజార్ఘాట్లో రసాయన గోదాములో జరిగిన పేలుడులో 9 మంది అగ్నికీలలకు ఆహుతయ్యారు... -
మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్ హఠాన్మరణం
భాజపా నేత, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్(57) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఉట్నూరులోని తన నివాసంలో అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. -
సంక్షిప్త వార్తలు (8)
షాద్నగర్ సౌత్గ్లాస్ ప్రైవేటు కంపెనీ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
ఇక భూ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించం
ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్మిత్తల్ జిల్లా కలెక్టర్లకు తెలిపారు. -
పీసీసీఎఫ్ వేధింపుల నుంచి రక్షించండి
అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ శాఖాపరమైన వేధింపుల నుంచి తనను రక్షించాలని, చట్టప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ డి.జయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
బీటీపీఎస్లో భారీ అగ్ని ప్రమాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు-పినపాక మండలాల సరిహద్దున ఉన్న భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం(బీటీపీఎస్)లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. -
కొత్త క్రిమినల్ చట్టాలపై ‘సమాహార’ యాప్
కొత్త క్రిమినల్ చట్టాల వివరాలతో కూడిన హ్యాండ్బుక్తోపాటు మొబైల్ అప్లికేషన్ (యాప్) ‘సమాహార’ను తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి డా.జితేందర్ శనివారం ఆవిష్కరించారు. -
వైద్య పర్యాటక కేంద్రంగా తెలంగాణ
రాష్ట్రంలో ప్రతి పౌరుడి ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ ప్రొఫైల్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని, తెలంగాణను వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన కళాకారుడు సాయిచంద్
తన ఆట, పాట, అద్భుతమైన వాగ్ధాటితో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన కళాకారుడు సాయిచంద్ కుటుంబానికి అండగా నిలుస్తామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
ఆ బంగారం జప్తు సరైన చర్యే
కస్టమ్స్ అధికారులు హైదరాబాద్ విమానాశ్రయంలో గతేడాది ఆగస్టు 12న తమ నుంచి జప్తు చేసిన బంగారాన్ని తిరిగి అప్పగించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. -
టిస్లో 90 మంది సిబ్బంది తొలగింపు!
హైదరాబాద్లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్)లో 90 మంది ఉద్యోగులను శనివారం విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.