- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
TGRTC: నిర్లక్ష్యపు బస్సు నడిచేదెప్పుడో!
ప్రయాణికులు పెరుగుతుంటే బస్సుల సంఖ్యా పెరగాలి. టీజీఎస్ఆర్టీసీలో ఇందుకు భిన్నమైన పరిస్థితి. ఆర్టీసీలో పదేళ్ల క్రితం 10,479 బస్సులుంటే ఇప్పుడా సంఖ్య 8,574. ఈ బస్సుల్లోనూ కాలం చెల్లినవి పెద్ద సంఖ్యలో ఉన్నాయి.
బస్భవన్ వెనుక నెలల తరబడి పిచ్చిమొక్కల మధ్యే ఛాసిస్లు
బస్సు బాడీ తయారీకి మీనమేషాలు
ఉద్యోగుల కొరత, వనరుల లేమితో సమస్యలు
చిత్రంలో కనిపిస్తున్నవి ఆర్టీసీ బస్సుల కోసం కొనుగోలు చేసిన ఛాసిస్లు.. వీటికి బాడీ (గూడు) నిర్మిస్తే రోడ్కెక్కుతాయి. బాడీ బిల్డింగ్ కోసం పంపకపోవడంతో ఇవన్నీ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్భవన్ వెనుక ఖాళీ స్థలంలో ఇలా పిచ్చి మొక్కల మధ్య నెలల తరబడి ఉండిపోయాయి. నిరుపయోగంగా పడి ఉన్న వీటి సంఖ్య అయిదో, పదో కాదు.. దాదాపు వందకుపైనే..
ఈనాడు, హైదరాబాద్: ప్రయాణికులు పెరుగుతుంటే బస్సుల సంఖ్యా పెరగాలి. టీజీఎస్ఆర్టీసీలో ఇందుకు భిన్నమైన పరిస్థితి. ఆర్టీసీలో పదేళ్ల క్రితం 10,479 బస్సులుంటే ఇప్పుడా సంఖ్య 8,574. ఈ బస్సుల్లోనూ కాలం చెల్లినవి పెద్ద సంఖ్యలో ఉన్నాయి. గతంలో రోజూ సగటున 44-45 లక్షలుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడంతో ఆ సంఖ్య 55 లక్షలకు పెరిగింది. ఈ రద్దీతో చాలా రూట్లలో ఆర్టీసీ బస్సుల్లో కాలు పెట్టే సందు కూడా ఉండట్లేదు. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను ఆర్టీసీ పెంచలేకపోతోంది. మరోవైపు కొనుగోలు చేసిన బస్సులనూ ప్రయాణికులకు సకాలంలో అందుబాటులోకి తీసుకురాలేకపోతోంది. కొన్ని సమయాల్లో ఒక్కో బస్సులో 150 మంది వరకు ప్రయాణిస్తున్న ప్రమాదకర పరిస్థితులున్నాయి.
మియాపూర్ బస్బాడీ యూనిట్
ప్రైవేటు వారు కట్టినప్పుడే ‘గూడు’
ఆర్టీసీ ఏడాది క్రితం 1,325 బస్సులు కొనుగోలు చేసింది. సొంత యూనిట్లో, ప్రైవేట్ యూనిట్లలో ఛాసిస్లకు బాడీ తయారు చేయించి దశలవారీగా రోడ్డెక్కిస్తోంది. ఇంకా దాదాపు 305 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రావాల్సి ఉన్నట్లు సమాచారం. ఎక్కువగా ప్రైవేటు బస్బాడీ యూనిట్లపైనే ఆధారపడుతోంది. బస్బాడీ యూనిట్లో ఛాసిస్పైన ఫ్లోరింగ్, పైకప్పు నిర్మాణం, సీట్ల బిగింపు, గ్లాస్ అమరిక, రంగులు వేసి తీర్చిదిద్దడం, సీట్లు బిగించడం వంటి పనులు చేస్తారు. బాడీ నిర్మాణం 45 రోజుల్లో పూర్తవుతుంది. హైదరాబాద్లో 40కి పైగా ప్రైవేటు బస్బాడీ యూనిట్లు ఉన్నాయి. అయితే ఆర్డర్లు భారీగా ఉండటంతో ఆ యూనిట్లు టీజీఎస్ఆర్టీసీకి ప్రాధాన్యమివ్వట్లేదని సమాచారం. దీంతో ఆర్టీసీ నుంచి వెళ్లిన ఛాసిస్లకు బాడీ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ పనులు పూర్తయితే 180 దాకా పల్లెవెలుగు బస్సులు, 125 వరకు మెట్రోడీలక్స్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని సమాచారం.
బక్కచిక్కిన బస్బాడీ యూనిట్
బస్సు తయారీ సంస్థలు ఛాసిస్లనే అందిస్తాయి. బాడీని ఆర్టీసీయే నిర్మించుకోవాలి. ఈ పని చేసేందుకు ఆర్టీసీకి మియాపూర్లో 12 ఎకరాల స్థలంలో బస్బాడీ యూనిట్ ఉంది. 1988లో ప్రారంభించారు. అప్పట్లో ఉద్యోగుల సంఖ్య దాదాపు 770 మంది. అప్పట్లో నెలకు 150-180 బస్సులకు బాడీని అమర్చేవారు. రిటైర్మెంట్లే తప్ప నియామకాల్లేకపోవడంతో ఈ యూనిట్ బక్కచిక్కిపోయింది. ఉద్యోగుల సంఖ్య మూడేళ్ల క్రితం మూడొందలకు, ప్రస్తుతం 121కి పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో ఆ యూనిట్ సామర్థ్యం నెలకు 24-25 బస్సుల బాడీ నిర్మాణానికే పరిమితమైంది. ఫలితంగా ఆర్టీసీ ప్రైవేటు వర్క్షాప్లపై ఆధారపడాల్సి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తుది దశకు మంత్రివర్గ విస్తరణ
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుని నియామకంపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు. -
హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణకు ‘హైడ్రా’
హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణకు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్(హైడ్రా) అనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. -
ఏటా ఉద్యోగాల భర్తీ!
రాష్ట్రంలో నిరంతర ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. నిరుద్యోగులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏటా నోటిఫికేషన్లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్ వెలువరించేందుకు సమాయత్తమవుతోంది. -
కమిషన్ చట్టబద్ధమే
విద్యుత్తు కొనుగోళ్లు.. యాదాద్రి, భదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటులో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కచ్చితత్వం, ఔచిత్యాన్ని తేల్చడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ చట్టబద్ధమేనని హైకోర్టు తేల్చిచెప్పింది. -
నేరుగా జీపే, ఫోన్పే, పేటీఎంలో కరెంటు బిల్లు కట్టవద్దు
ఆన్లైన్లో కరెంటు బిల్లు కట్టేవారందరూ ఇకనుంచి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్ పేర్కొంది. -
ఇలా తిందాం.. పదికాలాలు పచ్చగా ఉందాం
తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. ఆహారంలో సమతుల్యత లోపించినప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. -
వరదలొచ్చినా.. విద్యుదుత్పత్తి ఉండనట్టే!
ప్రస్తుత వానాకాలంలో కృష్ణానదికి వరదలొచ్చినా శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. -
సారూ.. వెళ్లొద్దు
నల్గొండ జిల్లా డిండి మండల పరిధిలోని వావిల్కోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9 ఏళ్లుగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయుడు ముద్దాడ బాలరాజు.. మండలంలోని కొత్తతండాకు బదిలీ అయ్యారు. -
క్రీడాకారులకు సీఎం అభినందన
ఎయిర్ గన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్’ ఆధ్వర్యంలో గోవాలో జరిగిన 10వ నేషనల్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ 2024 పోటీల్లో బంగారు పతకాలు సాధించిన భూక్య మోనాలిసా, భూక్య సోనాలిసాలను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. -
బొగతలో జల సవ్వడి
తెలంగాణ నయాగరాగా పిలిచే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. -
వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయంపై దృష్టి
రాష్ట్రంలో ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు సక్రమంగా అందేలా వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. -
తమిళనాడుకు తెలంగాణ అధికారుల బృందం
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు తమిళనాడులో రవాణా విధివిధానాలపై అధ్యయనం చేయడానికి రంగారెడ్డి జిల్లా ఉప రవాణాధికారి (డీటీసీ) మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఆర్టీవో వాణి, కామారెడ్డి ఎంవీఐ శ్రీనివాస్తో కూడిన అధికారుల బృందం ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లింది. -
నాకు దక్కాల్సిన స్థలం.. బంధువులు పట్టా చేసుకున్నారు!
తనకు దక్కాల్సిన ఆస్తిని బంధువులు అక్రమంగా తీసుకున్నారని ఆరోపిస్తూ.. తనకు తిరిగి ఇప్పించాలని కోరుతూ కరీంనగర్లో ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధుడు సోమవారం నిరసనకు దిగారు. -
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ గందరగోళానికి తెర!
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్పై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. రీ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడి, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి కొత్త ర్యాంకులు ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నీట్-యూజీ కౌన్సెలింగ్ తేదీలు వెలువడతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. -
సత్ప్రవర్తన ఖైదీల విడుదలకు మార్గం సుగమం
సత్ప్రవర్తన కింద ఖైదీల విడుదలకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలిపింది. -
7 నుంచి నేతన్న పోరుయాత్ర
రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలంటూ ‘మగ్గం నడవాలి-నేతన్న బతకాలి’ నినాదంతో ఈ నెల 7వ తేదీ నుంచి నేతన్న పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ అనుబంధ చేనేత, మరమగ్గాల కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. -
బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సింగరేణి సంస్థకు ఉన్న బొగ్గు గనులకు వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, ఈ తరహా చర్యలను తక్షణం విరమించుకోవాలని రాష్ట్రంలోని కార్మిక సంఘాలు విజ్ఞప్తిచేశాయి. -
‘గాంధీ’ ఎదుట నిరుద్యోగుల ఆందోళన
భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు, వివిధ పార్టీల నేతలు, వారిని అడ్డుకునేందుకు మోహరించిన పోలీసులతో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గాంధీ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత కొనసాగింది. -
రాష్ట్ర గవర్నర్తో మిజోరాం గవర్నర్ హరిబాబు భేటీ
తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సోమవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. -
జన్యు సవరణతో నేత్ర వ్యాధులకు చెక్!
పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల జన్యు వ్యాధులకు సంబంధించి జీన్ ఎడిటింగ్ (జన్యు సవరణ)తో చెక్పెట్టే పరిశోధనలు జరుగుతున్నాయి. -
చరిత్రలో నిలిచిపోయేలా గిరిజన అమరవీరుల స్మృతివనం
పోడు భూములకు హక్కు పత్రాల సాధనకు పోరాడిన గిరిజన అమరవీరుల స్మారకార్థం చరిత్రలో నిలిచిపోయేలా స్మృతివనం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
-
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం
-
శాఖల్లో మార్పులు జరిగితే సీతక్కకు హోం!