TG DGP: తెలంగాణ డీజీపీగా జితేందర్!
తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సీఎం రేవంత్ నిర్ణయం.. నేడు ఉత్తర్వుల జారీ
కొందరు ఐపీఎస్లూ బదిలీ అయ్యే అవకాశం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బుధవారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలియవచ్చింది. వాస్తవానికి మంగళవారమే ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నా.. సీఎం మహబూబ్నగర్ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలిసింది. ఈ ఉత్తర్వులు వెలువడితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్ కానున్నారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
నిర్మల్ ఏఎస్పీ నుంచి డీజీపీ దాకా..
పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఆంధ్రప్రదేశ్ కేడర్కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు. తర్వాత దిల్లీ సీబీఐలో.., 2004-06 వరకు గ్రేహౌండ్స్లో పనిచేశారు. అనంతరం డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం హైదరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ అదనపు కమిషనర్గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన 2025 సెప్టెంబరులో పదవీవిరమణ చేయనున్నారు. ఇప్పుడు డీజీపీగా నియమితులైతే 14 నెలలపాటు కొనసాగే అవకాశముంది. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ఎన్నికల కమిషన్ నియమించింది. అప్పట్లో డీజీపీగా ఉన్న అంజనీకుమార్ను క్రమశిక్షణ చర్య కింద సస్పెండ్ చేసిన తర్వాత రవిగుప్తాను ఎంపిక చేసింది. అప్పటినుంచి ఆయనే డీజీపీగా ఉన్నారు. తాజాగా జితేందర్ వైపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
రాజధానిలో ఒక కమిషనర్కు స్థానచలనం!
కొత్త డీజీపీ నియామకంతో పాటు మరికొందరు ఐపీఎస్ అధికారులకు స్థానచలనం ఉండవచ్చని తెలుస్తోంది. రాజధాని కమిషనరేట్లకు సంబంధించి ఒక కమిషనర్ను మార్చే అవకాశముంది. గతంలో అదే కమిషనరేట్ యూనిట్ అధికారిగా పనిచేసిన ఐపీఎస్ను అక్కడ తిరిగి నియమించనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి మారనున్న ఐపీఎస్కు మల్టీజోన్ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. అలాగే మరో మల్టీజోన్కు హైదరాబాద్లోనే పనిచేస్తున్న ఓ ఐజీని నియమించి.. ఇటీవల మారిన మరో ఐపీఎస్ను అక్కడ భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీటర్లపై దుర్మార్గపు ఒప్పందం
మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదని ఇంతకాలం వారు(భారాస నేతలు) ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. దీనిపై హరీశ్రావు ఎవర్ని మభ్యపెడుతున్నారు? భారాస అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెడతామని సంతకాలు చేశారా, లేదా? తెలంగాణ విద్యుత్శాఖను కేంద్రానికి అప్పగించారా, లేదా? సమాధానం చెప్పాలి. -
మేం ఒప్పుకోలేదు
వ్యవసాయ మోటార్లకు మీటర్లను పెట్టడానికి భారాస ప్రభుత్వం ఒప్పుకోలేదని, మందబలం ఉందని సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించారని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తున్నదేమోనని అనుమానంగా ఉందని చెప్పారు. -
ప్రజల మీద పన్నులు వేయం
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పన్నులు పెంచదని, ప్రజలపై ఏమాత్రం భారం వేయబోదని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. మోటార్లకు మీటర్లు పెట్టబోమన్నారు. త్వరలో కొత్త రేషన్కార్డులు ఇస్తామన్నారు. నూటికి నూరుశాతం తమ గ్యారంటీ హామీలను అమలు చేస్తామని చెప్పారు. -
గోదావరి ఉగ్రరూపం
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో శనివారం మధ్యాహ్నం 53 అడుగుల స్థాయిని దాటింది. దీంతో కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. -
బొగ్గు భయపెడుతోంది?
దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నెలకొంది. తెలంగాణ, ఏపీలతోపాటు అన్ని రాష్ట్రాల్లోని 166 థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో నిల్వలు తగ్గిపోతున్నాయని, రోజుకు సగటున 1.30 లక్షల టన్నుల కొరత ఏర్పడే అవకాశముందని కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది. -
ఇంటి ముంగిటకే.. అమెరికా డాక్టరు!
ఇప్పటివరకు కోటీశ్వరులు, సినిమా, రాజకీయ, వ్యాపార దిగ్గజాలకు పరిమితమైన విదేశీ వైద్యం నేడు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి రానుంది. మీరు 149 డాలర్లు(సుమారు రూ.12,500) వెచ్చిస్తే చాలు.. నేరుగా అమెరికా వైద్యులే మీ ముందు ప్రత్యక్షం కానున్నారు. -
విద్యార్థుల జుత్తు కత్తిరించిన ఉపాధ్యాయురాలు.. సస్పెండ్ చేసిన డీఈవో
పాఠశాలకు జుత్తు పెంచుకుని వస్తున్నారని ఆగ్రహించిన ఓ ఉపాధ్యాయురాలు 20 మంది విద్యార్థులకు ఇష్టారీతిన క్షవరం చేశారు. దీంతో ఆగ్రహించిన పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఆందోళన నిర్వహించగా.. అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. -
‘పాతుకుపోయిన’ నిర్లక్ష్యం!
నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం మల్లోని చెరువుతండా రోడ్డు మధ్యలో అధికారుల నిర్లక్ష్యం ‘పాతుకుపోవడం’తో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
అవన్నీ సాగుభూములేనా? వారందరూ సాగుదారులేనా?
తెలంగాణవ్యాప్తంగా ఎవరెవరు పంటలు సాగు చేస్తున్నారో పక్కాగా వివరాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రుణమాఫీ, రైతుభరోసా, పంటల బీమా, రైతుబీమా పథకాల వర్తింపునకు వాటినే ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తోంది. -
తెలంగాణ గవర్నర్గా జిష్ణు దేవ్ వర్మ
కేంద్ర ప్రభుత్వం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. ఇందులో ఏడుగురిని కొత్తగా నియమించగా, ముగ్గురిని ఒకచోట నుంచి మరోచోటకు బదిలీ చేసింది. శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ (66) నియమితులయ్యారు. -
ఓటర్ల జాబితా తయారీకి సన్నాహాలు
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించేందుకు తెలంగాణ ఎన్నికల సంఘం సన్నాహాలు చేపట్టింది. -
అంబేడ్కర్ వర్సిటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
డా.బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ (ఎంఏ/ఎంకాం/ఎమ్మెస్సీ) కోర్సులు, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం ఆ వర్సిటీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. -
కవి యాకూబ్కు సినారె పురస్కారం ప్రదానం
అత్యున్నమైన జ్ఞానపీఠాన్ని అధిరోహించిన ‘విశ్వంభరుడు’ డా.సి.నారాయణరెడ్డి అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.జి.చిన్నారెడ్డి కొనియాడారు. శనివారం రాత్రి హైదరాబాద్ బొగ్గులకుంటలో తెలంగాణ సారస్వత పరిషత్తు జ్ఞానపీఠ పురస్కారగ్రహీత డా.సి.నారాయణరెడ్డి జయంత్యుత్సవాలు నిర్వహించారు. -
‘ఎల్లంపల్లి’ ఎత్తిపోతలు షురూ
వానాకాలం ప్రారంభమైన దాదాపు 45 రోజుల తర్వాత తొలిసారి పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 20.17 టీఎంసీలు కాగా శనివారం మధ్యాహ్నం నాటికి 17.39 టీఎంసీలు దాటడంతో నిండుకుండలా మారింది. -
ఆగస్టు 5 నుంచి జేఎల్ కొలువుల ధ్రువపత్రాల పరిశీలన
రాష్ట్రంలో ఇంటర్ విద్యాశాఖలోని 1,392 జూనియర్ అధ్యాపకుల(జేఎల్) పోస్టులకు(ప్రకటన నం.22/2022) నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. -
భద్రాచలంలోకి చుక్క వరద నీరు రానివ్వం: మంత్రి తుమ్మల
భద్రాచలం పట్టణంలోకి చుక్క వరద నీటిని రానివ్వబోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53 అడుగులు దాటడంతో చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారని, 75 అడుగుల మేర వరద వచ్చినా ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా కాపాడుకుంటామని తెలిపారు. -
7 నుంచి పీఈసెట్.. 8 నుంచి ఎడ్సెట్ కౌన్సెలింగ్
రాష్ట్రంలో డీపీఎడ్, బీపీఎడ్ సీట్ల భర్తీకి ఆగస్టు 7 నుంచి పీఈసెట్, బీఈడీ సీట్ల భర్తీకి ఆగస్టు 8 నుంచి ఎడ్సెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. -
స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు 1,809.. నేడు పదోన్నతుల ద్వారా భర్తీ
రాష్ట్రంలో ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లు(ఎస్ఏ)గా ఇటీవల పదోన్నతులు కల్పించిన అనంతరం ఎస్ఏ పోస్టుల ఖాళీలు 1,809 వరకు ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ తేల్చింది. -
సంక్షిప్త వార్తలు(9)
దిల్లీలో శనివారం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. -
మేధో వికలాంగుల కుటుంబాల అవగాహనకు ‘నయీ దిశ’
మేధో వికలాంగుల కుటుంబాలకు అవగాహన కల్పించేందుకు ‘నయీ దిశా’ సంస్థ రూపొందించిన వాట్సాప్ ఆధారిత చాట్బాట్(హెల్ప్లైన్ నం. 8448448996)ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. -
నేడు కేంద్ర మాజీమంత్రి జైపాల్రెడ్డి విగ్రహావిష్కరణ
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి సమీపంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న కొట్రా తండా చౌరస్తాలో ఏర్పాటు చేసిన కేంద్ర మాజీమంత్రి సూదిని జైపాల్రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించనున్నారు.