- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Seethakka: మహిళాశక్తి క్యాంటీన్లు బ్రాండ్గా మారాలి
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యార్థులకు ఆగస్టు 15న నాటికి రెండో జత ఏకరూప దుస్తులను పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు.
నాణ్యతకు మారుపేరుగా నిలవాలి
ఆగస్టు 15 నాటికి పాఠశాల విద్యార్థులకు రెండో జత దుస్తులు
సమీక్షలో మంత్రి సీతక్క
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క. పక్కన సెర్ప్ సీఈవో కాత్యాయని, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా
ఈనాడు,హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యార్థులకు ఆగస్టు 15న నాటికి రెండో జత ఏకరూప దుస్తులను పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘాలు ఆ దుస్తులను సిద్ధం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మహిళా స్వయంసహాయక సంఘాలతో ఏర్పాటుచేస్తున్న మహిళాశక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్గా ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహిళాశక్తిపై ఆమె జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, అదనపు డీఆర్డీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ‘‘ప్రజాపాలనలో మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తున్నాం. ప్రజల అవసరాలు, వనరుల లభ్యతకు తగ్గట్టుగా ‘మహిళా శక్తి’ బిజినెస్ మోడల్ ఉండాలి స్థానికంగా లభ్యమయ్యే వస్తువుల ఆధారంగా వ్యాపారం చేస్తే అద్భుతాలు సాధించగలం. ఆధార్ కేంద్రాలు, మీ-సేవ సెంటర్లు, పౌల్ట్రీ, డెయిరీ వ్యాపారాలు, క్యాంటీన్లు, స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కల్పిస్తున్నాం పర్యాటక కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ రహదారుల వెంట మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభిస్తాం. ఇవి నాణ్యతకు మారుపేరుగా నిలవాలి. పల్లె రుచులు, ఇప్ప పువ్వు లడ్డులు, నన్నారి వంటి సంప్రదాయ ఆహార పానీయాలను పట్టణాలకు పరిచయం చేయాలి. క్యాంటీన్లకు భూకేటాయింపులు, రాయితీలు ఇస్తాం. హైదరాబాద్ నలుమూలల శిల్పారామాలు ఏర్పాటు చేసి డ్వాక్రా బజార్లను ప్రారంభించాలి. వచ్చే అయిదేళ్లలో మహిళా సంఘాలకు రూ. లక్ష కోట్ల బ్యాంకు రుణాలు అందిస్తాం’’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
రానున్న రెండేళ్లలో 151 మహిళాశక్తి క్యాంటీన్లు
రాష్ట్ర సర్కారు నిర్ణయం
రెండేళ్లలో రాష్ట్రంలో 151 మహిళాశక్తి క్యాంటీన్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బిహార్లోని దీదీకి రసోయి తరహాలో వీటిని నిర్వహించాలని ఆదేశించింది. శుక్రవారం సచివాలయంలో రెండు క్యాంటీన్లు ప్రారంభమవుతుండగా, ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్లు, ఆసుపత్రులు, దేవాలయాలు, ఆర్టీసీ బస్టాండ్లు, పర్యాటక ప్రాంతాలు, పారిశ్రామిక పార్కులలో వాటిని ప్రారంభిస్తారు. ప్రతీ జిల్లాకు అయిదు చొప్పున వీటిని స్థాపించాలని ప్రభుత్వం నిర్దేశించింది. క్యాంటీన్ల నిర్వహణ కోసం మహిళా సంఘాలకు జాతీయ పర్యాటక ఆతిథ్య సంస్థ (నిథమ్)లో శిక్షణ ఇస్తారు. దీని కోసం మహిళా సంఘాలు ఆయా సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటాయి. రెండు నమూనాలో క్యాంటీన్లు ఉంటాయి. మొదటి నమూనాకు రూ.15 లక్షలు, రెండో నమూనాకు రూ.25 లక్షలు వెచ్చిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గవర్నర్తో శాసన సభాపతి, మండలి ఛైర్మన్, సీఎస్ భేటీ
రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను రాజ్భవన్లో మంగళవారం శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. -
పరిహారంతో సరిపెట్టడంకాదు.. విధానాలు రూపొందించాలి
కుక్క కాటుతో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుంటే సరిపోదని... భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొన్ని విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు సూచించింది. -
కొత్త బీటెక్ సీట్లు 20,500
రాష్ట్రంలో డిమాండ్ ఉన్న బీటెక్ సీఎస్ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో ఏకంగా 20,500 సీట్లు పెరగనున్నాయి. అదీ... కేవలం జేఎన్టీయూహెచ్ పరిధిలోని కళాశాలల్లో మాత్రమే. -
డబ్బులిచ్చి పోస్టింగ్కు ప్రయత్నిస్తే వేటు తప్పదు
డబ్బులిచ్చి కోరుకున్న పోస్టింగ్ తెచ్చుకునేందుకు ప్రయత్నించే పోలీసులపై వేటు తప్పదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. అలాంటివారిని ఎవరూ కాపాడలేరని.. ఏసీబీ, విజిలెన్స్ వెంటాడుతాయని స్పష్టంచేశారు. -
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో నాణ్యతలోపం మరోసారి వెల్లడైంది. -
మందుల కొరత ఉండొద్దు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. -
టీజీపీఎస్సీని స్వచ్ఛంగా తీర్చిదిద్దాం
గత ప్రభుత్వ హయాంలో కలుషితమైన టీఎస్పీఎస్సీ(ప్రస్తుత టీజీపీఎస్సీ)ని స్వచ్ఛమైన బంగారంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్ది రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
దేవాదాయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు
‘భూముల పరిరక్షణ, అదనపు ఆదాయాన్ని పెంచుకునేందుకు దేవాదాయ శాఖ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి’ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం కొండాపూర్లో 5.2, నర్సాపూర్లో 4.7, పాత మంచిర్యాలలో 3.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
రైతు ఆత్మహత్యపై సమగ్ర విచారణ.. సీఎం రేవంత్, మంత్రి తుమ్మల ఆదేశాలు
ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, -
వచ్చే మూడు నెలల్లో రైతు సంక్షేమానికి రూ.50-60 వేల కోట్లు
పంట రుణాల మాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలకు వచ్చే మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లు వెచ్చించనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో సమస్యలపై పోర్టల్
రాష్ట్రంలో తాజాగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అనంతరం ఏమైనా ఫిర్యాదులుంటే పరిష్కరించేందుకు త్వరలో ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నారు. -
సీఎంఆర్ఎఫ్ వెబ్సైట్ ప్రారంభం
సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. పారదర్శకంగా సీఎంఆర్ఎఫ్ నిధులను వినియోగించాలని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
వినూత్న ఆలోచనలతో ముందుకు రండి
వ్యక్తుల ఇష్టాయిష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవని, కేవలం పనితీరు ఆధారంగానే వారికి తదుపరి ఉన్నత అవకాశాలుంటాయని, బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలుంటాయని భరోసా ఇచ్చారు. -
అలాగే.. 6న కలుద్దాం
విభజన అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపాదనపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. -
బర్డ్ వాచింగ్.. నైట్ క్యాంపింగ్.. మధ్యలో బోటింగ్!
పచ్చని చెట్లు.. చుట్టూ ఎత్తైన కొండలు.. చెంతనే గలగల ప్రవాహాలు.. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో.. చలిమంటలు కాగుతూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తుంటే.. ఆ ఆనంద పారవశ్యమే వేరు కదూ..! -
231 మంది ఖైదీలకు క్షమాభిక్ష
సత్ప్రవర్తన కలిగిన 231 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరంతా బుధవారం జైళ్ల నుంచి విడుదల కానున్నారు. -
టీజీఎస్ఆర్టీసీలో 3,035 కొలువులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో వివిధ కేటగిరీల్లో 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పచ్చజెండా ఊపింది. -
ఎన్ఎండీసీ సీఎండీ పోస్టుకు శ్రీధర్ పేరును తిరస్కరించిన కేంద్రం
జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) సీఎండీ పోస్టులో తెలంగాణ ఐఏఎస్ అధికారి నడిమట్ల శ్రీధర్ను నియమించేందుకు కేంద్ర క్యాబినెట్ కమిటీ తిరస్కరించిందని అధికారవర్గాలు తెలిపాయి. -
రైతు భరోసా విధివిధానాలకు మంత్రివర్గ ఉపసంఘం
రైతుభరోసా పథకంపై అధ్యయనం చేసి విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ గడువు పొడిగింపు
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ గడువు వ్యవధిని మరో నెల రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/07/24)
-
టాటూ రూమర్స్పై దిశా పటానీ అలా.. వెంకటేశ్ సినిమాలో ఐశ్వర్య ఇలా!
-
‘మిస్టర్ మస్క్.. బగ్ను ఫిక్స్ చేయగలరా?’ స్పందించిన టెస్లా అధినేత
-
బీరు కోసం స్నేహితుడ్ని నాలుగో అంతస్తు నుంచి తోసి చంపేశారు!
-
కాంటాక్టుల్లో పాస్వర్డులు.. ఇతరులతో షేరింగ్లు.. ఇదీ మన గోప్యత తీరు!