- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
data centers: తెలంగాణలో వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ: మంత్రి శ్రీధర్బాబు
మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణను వేగంగా పూర్తి చేయాలని, వచ్చే ఏడాది నాటికి కార్యకలాపాలను ముమ్మురం చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆ సంస్థ ప్రతినిధులను కోరారు.
సంస్థ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్బాబు భేటీ
మంత్రి శ్రీధర్బాబుతో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు
ఈనాడు, హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణను వేగంగా పూర్తి చేయాలని, వచ్చే ఏడాది నాటికి కార్యకలాపాలను ముమ్మురం చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. పనులు పూర్తయితే డేటా సెక్యూరిటీ, క్లౌడ్ సొల్యూషన్స్ రంగాల్లో హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకుంటుందన్నారు. డేటా సెంటర్లకు సంబంధించిన భూసమస్యల పరిష్కారం, మౌలిక వసతులపై సచివాలయంలో సోమవారం మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
మైక్రోసాఫ్ట్ సంస్థ రంగారెడ్డి జిల్లా మేకగూడలో 22 ఎకరాలు, షాద్నగర్లో 41 ఎకరాలు, చందన్వల్లిలో 52 ఎకరాలు కొనుగోలు చేసింది. డేటా సెంటర్ల పనులు 70% పూర్తయ్యాయని, మేకగూడలోని భూమిపై స్థానిక గ్రామ పంచాయతీతో కొన్ని సమస్యలున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ప్రస్తావించారు. వెంటనే పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె.శశాంకను శ్రీధర్బాబు ఆదేశించారు. విద్యుత్ సబ్స్టేషన్ల సామర్థ్యం పెంపు, వరద నీటి కాలువల నిర్మాణాలను గడువులోగా ముగిస్తామని, పెండింగ్ పనుల పర్యవేక్షణకు ప్రభుత్వం తరఫున ఒక అధికారిని నియమిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన లభించినందుకు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మైక్రోసాఫ్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్ ఇయాన్ కాలన్, భూ అభివృద్ధి విభాగం హెడ్ ఉత్తమ్గుప్తా, ఇండియా కమ్యూనిటీ హెడ్ శ్రీచందన పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు బదిలీపై వెళ్లిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురవుతారు. వారిని చుట్టుముట్టి కన్నీరుమున్నీరుగా విలపిస్తారు. -
నేటి నుంచి ఎప్సెట్ కౌన్సెలింగ్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్లో ప్రవేశించేందుకు ఎప్సెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
తమది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమే, అలాగని కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే ఎలాగంటూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు. -
ఫోన్ ట్యాపింగ్ కుట్రలో నవీన్రావు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్రావుకు భాగమున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. -
ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్!
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా... రాష్ట్రంలోని ప్రజలందరి సమగ్ర ఆరోగ్య సమాచారం (హెల్త్ ప్రొఫైల్) సేకరించేందుకు వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. -
పర్యాటక అభివృద్ధికి రాష్ట్రంలో వనరులు అనేకం
రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని.. ఆరు నెలల్లోనే పురోగతి సాధిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. -
ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రక్రియలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో వివరించింది. బదిలీలు చేపట్టే ప్రభుత్వ శాఖలు వీటిని తప్పక అమలుచేయాలని స్పష్టం చేసింది. -
ఇదీ సంగతి!
ఇదీ సంగతి! -
వరదనీటి చేరికతో వడివడిగా గోదావరి
వానాకాలం ప్రారంభంలో సరైన వర్షాలు లేక నదులు, నీరు లేక చెరువులు వెలవెలబోయాయి. గోదావరిలో ఇసుక మేటలు తేలాయి. -
నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
వరంగల్లోని జాతీయ సాంకేతిక సంస్థ (నిట్)లో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో బీటెక్ (ఈసీఈ) విద్యార్థి రవిషాకు రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ దక్కినట్లు నిట్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం
నేత కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. -
శస్త్రచికిత్స అవసరం లేకుండానే..దెబ్బతిన్న మోకాలి భాగం తిరిగి అమరిక
శస్త్రచికిత్స అవసరం లేకుండానే 40 సంవత్సరాల వ్యక్తికి మోకాలిలో దెబ్బతిన్న భాగాన్ని తిరిగి అమర్చిన అరుదైన చికిత్సను హైదరాబాద్ బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. -
నాలుగు జిల్లాలకే సగం ‘బాసర’ సీట్లు
బాసర ఆర్జీయూకేటీలోని మొత్తం సీట్లలో సగం నాలుగు జిల్లాల విద్యార్థులే దక్కించుకున్నారు. ఆ వర్సిటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ చదివేందుకు పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపికైన విద్యార్థుల ప్రాథమిక జాబితాను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇన్ఛార్జి ఉపకులపతి వి.వెంకటరమణ, వర్సిటీ అధికారులు బుధవారం సచివాలయంలో విడుదల చేశారు. -
శిక్షణ ఇచ్చి ఖైదీల్లో మార్పు తెచ్చాం
తెలిసో తెలియకో తప్పుచేసి కారాగారానికి వచ్చిన ఖైదీలకు శిక్షకు బదులు.. శిక్షణ ఇచ్చి మార్పు తీసుకొచ్చామని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్ర తెలిపారు. -
ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి బ్యాంకు లాకర్లు తెరిచిన ఈడీ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్రెడ్డికి చెందిన బ్యాంకు లాకర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం తెరిచారు. -
కళ్లెదుటే తిరుగుతున్నా సమన్లు అందించలేరా!
ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసుల్లో విచారణ జరుగుతున్న తీరుపై బుధవారం హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్కు ప్రత్యామ్నాయం సూచించండి
జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా నేల స్వభావాన్ని అంచనా వేసేందుకు గాను నమూనాల సేకరణకు డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో భారీగా నీరు, ఇసుక బయటకు వస్తుండటంతో పరీక్షలను నిలిపివేశామని.. ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో సూచించాలని నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ)ని నీటిపారుదలశాఖ కోరింది. -
ఉత్తర తెలంగాణలో హైదరాబాద్ వర్సిటీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయండి
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ సెంటర్ను ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కేంద్రాన్ని కోరారు. -
మండల ప్రజాపరిషత్లకు ప్రత్యేకాధికారులు
రాష్ట్రంలో పాలకవర్గాల పదవీకాలం ముగిసిన మండల ప్రజాపరిషత్లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో నం.43) జారీ చేసింది. -
ప్రభుత్వాసుపత్రుల్లోని ఒప్పంద ఉద్యోగులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. -
సంక్షేమ కార్పొరేషన్లలో సిబ్బంది ఎంతమంది?
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమం కోసం కొత్తగా ప్రకటించిన 16 కార్పొరేషన్లు, బోర్డులు, సమాఖ్యలు కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.