- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Ramoji Rao: రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని మాజీ ఎంపీ మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. దివంగత నేత ఎన్టీఆర్కూ ఆ అవార్డు ఇవ్వాలని అన్నారు.
మాజీ ఎంపీ మురళీమోహన్
అరాచక పాలనను చీల్చి చెండాడారు: ఎమ్మెల్యే రఘురామ
జర్నలిజాన్ని సామాన్యుడి చెంతకు తెచ్చారు: ‘ఈనాడు’ తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్
బొటానికల్ గార్డెన్లో సంస్మరణ సభ
రామోజీరావు సంస్మరణ సభలో రవిశంకర్, రఘురామకృష్ణరాజు, మురళీమోహన్, డాక్టర్ సోమరాజు,
డీఎన్ ప్రసాద్, పొదిలె అప్పారావు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
రాయదుర్గం, న్యూస్టుడే: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని మాజీ ఎంపీ మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. దివంగత నేత ఎన్టీఆర్కూ ఆ అవార్డు ఇవ్వాలని అన్నారు. గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్లో ఆదివారం వాకర్స్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మురళీమోహన్ హాజరై ప్రసంగించారు. ‘సమాజానికి ఎంతో చేయాల్సి ఉందన్న సదుద్దేశంతో ఉద్యోగాన్ని వదిలి వచ్చిన రామోజీరావు.. పత్రికలు, సినిమాలు, డిస్ట్రిబ్యూషన్, ఫిల్మ్సిటీ వంటి అనేకం చేపట్టి వేల మందికి ఉపాధి కల్పించారు. నాటి కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్త పరిస్థితులు చూసి.. మహానటుడు ఎన్టీఆర్ను రాజకీయ రంగంలోకి ఆహ్వానించారు. రామోజీరావు ఏ ముఖ్యమంత్రినీ.. ఏదీ కావాలని అడగలేదు. బ్యాంకులే దివాలా తీస్తున్న రోజుల్లో చిన్న లోపం కూడా లేకుండా మార్గదర్శిని నడిపిస్తుండడం గొప్ప విషయం. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో అవినీతి, రౌడీయిజం పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్న తీరును ఎండగడుతూ ఈనాడు-ఈటీవీలో వార్తాకథనాలు ఇచ్చారు’ అని అన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. ‘ఏపీలో గత ప్రభుత్వ హయాంలో సాగిన అరాచక పాలనను రామోజీరావు అక్షరాలతో చీల్చి చెండాడారు. మా కూటమి విజయంలో ఆయన పాత్ర కీలకం. తప్పు జరిగితే ఏ ప్రభుత్వాన్నైనా రామోజీరావు వ్యతిరేకించారు. ఆయన ఆదర్శాలు కొనసాగాలి’ అన్నారు. నిమ్స్ మాజీ డైరెక్టర్, ఏఐజీ ఆసుపత్రి కార్డియాలజీ విభాగ నిపుణుడు డా.బి.సోమరాజు మాట్లాడుతూ.. ‘1985లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ధనవంతులకు రుసుంతో, పేదలకు ఉచిత వైద్య సేవలతో నిమ్స్ ప్రారంభించారు. వైద్యసేవలకు డబ్బులు వసూలు చేయడమేంటని ఇతర పత్రికలు, ప్రతిపక్షాలు వ్యతిరేకించినా.. రామోజీరావు ఈ విధానాన్ని సమర్థించారు. ఆయన మద్దతు వల్లే ఈ సంస్థ నిలబడగలిగింది’ అని గుర్తు చేసుకున్నారు.
‘ఈనాడు’ తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. రామోజీరావు క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, చట్టాన్ని గౌరవించడం వంటి లక్షణాలను పుణికి పుచ్చుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ‘ఆయన ప్రతి వ్యాపారం చట్టబద్ధంగా చేయాలనుకునేవారు. ప్రపంచంలో మార్పు అనేది శాశ్వతమని చెప్పేవారు. జర్నలిజం ఆకాశంలో విహరిస్తున్న సమయంలో దాన్ని సామాన్యుడి గుడిసె చెంతకు తీసుకొచ్చారు. ‘ఈనాడు’ జిల్లా పత్రికల్లో ప్రచురించే ‘మేమున్నాం.. మీకు తోడుగా’ శీర్షిక ద్వారా ప్రతినెలా సగటున 3 వేలు, ఏటా 36 వేల సమస్యలు పరిష్కారమవుతున్నాయి. దాని రూపకర్త మా ఛైర్మన్. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గంటన్నరసేపు మాతో మాట్లాడారు. అప్పుడూ ఆయన మానసిక పరిస్థితి ఎంతో దృఢంగా ఉంది. ఇకపై మనం ఇంకా బాధ్యతగా మెలగాల్సి ఉందని, ప్రజాపక్షమే ఈనాడు ధ్యేయమని మాకు హితబోధ చేశారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్సీయూ మాజీ వీసీ పొదిలె అప్పారావు, ‘రాజధాని ఫైల్స్’ సినీ నిర్మాత కంఠంనేని రవిశంకర్, సంస్మరణ సభ సమన్వయకర్త క్రాంతి తదితరులు మాట్లాడుతూ రామోజీరావుతో తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కార్యక్రమ ప్రారంభంలో రామోజీరావు చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి, మౌనం పాటించారు. గచ్చిబౌలి ఇస్కాన్ గీతా లైఫ్ ప్రతినిధులు సంకీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో వాకర్స్ డా.గడ్డిపాటి శ్యాంప్రసాద్, భరత్రెడ్డి, బాలకృష్ణ, వైడీ రామారావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ నివాసం వెనుక రోడ్డులో.. అడ్డంకుల తొలగింపు
వైకాపా హయాంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం చుట్టూ సామాన్యులెవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురిచేశారు. -
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
రేషన్ సరకులు పంపిణీ చేసే వ్యాన్లపై మాజీ సీఎం జగన్ బొమ్మలు తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినా, పాటించకపోవడంపై శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఊరువాడా ‘కొత్త పింఛన్ల కళ’
రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా వాడవాడలా సోమవారం పింఛన్ల సంబరం హోరెత్తింది. సామాజిక భద్రత పింఛనుదారుల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.7 వేల చొప్పున పింఛన్ను లబ్ధిదారులకు అందించింది. -
నిరుపేద ఇంటికి చంద్రన్న ‘భరోసా’
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెనుమాకలో ఉండే బాణావత్ పాములు నాయక్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆ కుటుంబానికి తొలి పింఛను అందజేశారు. -
నీళ్లలో ఉన్నా డయాఫ్రం వాల్కు ఏం కాదు
‘పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రం వాల్పై వరద నీరు ప్రవహంచినంత మాత్రాన ఆ కట్టడానికి ఏమీ కాదు. నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందనే ఆలోచన సరికాదు’ అని అంతర్జాతీయ జలవనరుల నిపుణులు వ్యాఖ్యానించారు. -
విభజన సమస్యలు పరిష్కరించుకుందాం
విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6న హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి.. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం లేఖ రాశారు. -
ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. టెట్ నోటిఫికేషన్ను సోమవారం ప్రభుత్వం విడుదల చేసింది. పేపర్-1ఏ ఎస్జీటీ టీచర్లకు, పేపర్-1బీ ప్రత్యేక విద్య ఎస్జీటీ టీచర్లకు నిర్వహించనున్నారు. -
ఇలా తిందాం.. పదికాలాలు పచ్చగా ఉందాం
తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. ఆహారంలో సమతుల్యత లోపించినప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. -
ఫోన్పే, గూగుల్పే ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు ఇక కుదరదు
ఫోన్పే, గూగుల్పే, పేటీఎం తదితŸర యూపీఐ యాప్ల ద్వారా ఇప్పటి వరకు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులకు షాక్ తగిలింది. ఈ నెల నుంచి వాటి ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. -
95 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
‘చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు 95 శాతం మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశాం. ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల్లోపు 61,76,188 మందికి, రూ.4,169.49 కోట్లు అందించాం. -
రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి ఎగుమతి!
కాకినాడలో రేషన్ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పేదల బియ్యాన్ని నూకలుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు రెండు రోజులుగా పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు నిర్వహించిన దాడుల్లో బట్టబయలైంది. -
స్తంభించిన దేవాదాయశాఖ వెబ్సైట్
దేవాదాయశాఖకు చెందిన వెబ్సైట్ ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి నిలిచిపోయింది. దీంతో వివిధ ప్రధాన ఆలయాల్లో దర్శనాలు, పూజలు తదితరాలకు ఆన్లైన్లో ముందే టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు గందరగోళానికి గురయ్యారు. -
నేటి నుంచి డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్
ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్ ప్రవేశాల కౌన్సెలింగ్కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్కు మంగళవారం నుంచి ఈ నెల 10 వరకు అవకాశం కల్పించింది. -
ఆరోగ్యశాఖ ఉద్యోగుల వివరాలివ్వండి: మంత్రి సత్యకుమార్
ప్రజారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వివరాలు పంపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు. -
ప్రభుత్వం మారినా ఉన్నత విద్యామండలిలో వారిదే పెత్తనం
ప్రభుత్వం మారినా ఉన్నత విద్యామండలి నిర్వహణ గాడిన పడలేదు. అధికారుల బెదిరింపులు, పాతవారి పెత్తనం కొనసాగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చంద్రబాబు చిత్రపటానికి ఎంపీల పాలాభిషేకం
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలు, దివ్యాంగులకు ఏప్రిల్ నుంచి పెంచిన పింఛను అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి తెదేపా ఎంపీలు సోమవారమిక్కడ పాలాభిషేకం చేశారు. -
ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు అంతా సిద్ధం
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. -
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ముంగిళిపట్టు పంచాయతీలో పింఛన్ల అక్రమ బాగోతం వెలుగు చూసింది. వైకాపా సర్పంచి జాగర్లమూడి భారతి దంపతులతోపాటు మరో 20 మంది వరకు అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్లు తెదేపా నాయకులు వెల్లడించారు. -
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం!
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. -
‘స్టాప్ డయేరియా’పై విస్తృత అవగాహన
డయేరియా మహమ్మారి పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రానున్న రెండు నెలల పాటు పల్లెల్లో, మురికివాడల్లో ‘స్టాప్ డయేరియా’ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. రెండున్నరేళ్ల తర్వాత కదిలిన పోలీసులు
తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా మూకల దాడి ఘటనలో రెండున్నరేళ్ల తర్వాత పోలీసులు కదిలారు. నాటి వైకాపా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ హింసాకాండపై ఇన్నాళ్లూ కనీసం చర్యలు తీసుకోని పోలీసులు..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తిరుమల శ్రీవారి ప్రసాదం ఇచ్చి వెళ్తూ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
-
ఏపీ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చండి: లోక్సభలో తెదేపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
-
జగన్ నివాసం వెనుక రోడ్డులో.. అడ్డంకుల తొలగింపు
-
ఆ ఒక్కటీ కొట్టండి.. కోహ్లీకి ఓ బాధ్యత అప్పగించిన ద్రవిడ్
-
‘మై క్వీన్’ విష కౌగిలి.. అడుగడుగునా బాధితులే..
-
తెలంగాణలో వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ: మంత్రి శ్రీధర్బాబు