- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Kazipet: చుక్ చుక్ బండి.. పట్టాల కింది నుంచీ వెళ్తుందండి..!
నగరాలు, జాతీయ రహదారుల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్లు కడతారు. బైపాస్ రోడ్లు నిర్మిస్తారు. రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించేందుకు రైల్వే శాఖ కూడా బైపాస్ లైన్లు, రైల్ ఓవర్ రైల్(ఆర్ఓఆర్) వంతెనలు నిర్మిస్తోంది.
340 మీటర్ల మేర భూగర్భంలో ప్రయాణం
భూఉపరితలంపై ఓ రైలు.. లోపల మరోటి
కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మాణం
ఈనాడు, హైదరాబాద్: నగరాలు, జాతీయ రహదారుల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్లు కడతారు. బైపాస్ రోడ్లు నిర్మిస్తారు. రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించేందుకు రైల్వే శాఖ కూడా బైపాస్ లైన్లు, రైల్ ఓవర్ రైల్(ఆర్ఓఆర్) వంతెనలు నిర్మిస్తోంది. అయితే, ఈ ప్రక్రియలో భూసేకరణ సమస్యలు వస్తున్నాయి. కొన్నిచోట్ల సేకరిద్దామన్నా భూమి అందుబాటులో ఉండదు. చుట్టూ నివాస, ఇతర భవనాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నచోట రైల్వేశాఖ వినూత్నంగా రైల్ అండర్ రైల్(ఆర్యూఆర్) వంతెనలు నిర్మిస్తోంది. అంటే నేలపై నుంచి ఒక రైలు వెళ్తే.. ఆ రైలు కింది నుంచి మరో రైలు ప్రయాణం చేస్తుంది. నేలపైన ఉన్న పట్టాల కింద అంటే.. భూగర్భంలో మరో రైలు మార్గాన్ని నూతనంగా నిర్మించడం అన్నమాట. రాష్ట్రంలోని కోమటిపల్లి-కాజీపేట సెక్షన్లో నిర్మిస్తున్న ఆర్యూఆర్.. జోన్ పరిధిలోనే మొదటిదని ద.మ. రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ‘ఈనాడు’కు తెలిపారు.
11చోట్ల రైల్ ఓవర్ రైల్ వంతెనలు
జోన్ పరిధిలో 11 చోట్ల రైల్ ఓవర్ రైలు వంతెనలున్నాయి. అంటే కింది నుంచి ఒక రైలు వెళ్తోంటే.. పైనుంచి మరోటి వెళ్తుంది. ఇలాంటి వంతెనలు విజయవాడ సమీపంలో రెండు.. వెంకటాచలం, గూడూరు, అకోలా సమీపంలో ఒక్కోటి.. అమ్ముగూడ, లాలాగూడ, మేడ్చల్ సమీపంలో రెండేసి ఉన్నాయి.
రూ.125 కోట్లతో 21.47 కి.మీ. బైపాస్
నిర్మాణంలో ఉన్న భూగర్భ రైలు మార్గం
దేశంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో కాజీపేట ప్రాంతం కీలకమైంది. దిల్లీ వైపు నుంచి వచ్చే రైలు మార్గం వడ్డేపల్లి చెరువు దగ్గరకు రాగానే- ‘వై’ ఆకారంలో రెండుగా చీలిపోతుంది. ఒకవైపు వెళ్తే కాజీపేట మార్గం. ఇది కి.మీ. దూరం. మరోవైపు వెళ్తే వరంగల్ స్టేషన్. ఇది 10 కి.మీ. దూరం. దిల్లీ-సికింద్రాబాద్ రైళ్లు కాజీపేట మీదుగా.. దిల్లీ-విజయవాడ మార్గంలోని రైళ్లు వరంగల్ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. మూడు వైపులా రైళ్ల రాకపోకలతో వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో రైల్వే ట్రాక్ రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా వరంగల్ వైపు గూడ్సు రైళ్లు వెళ్లేంతవరకు.. దిల్లీ, బల్లార్షాల వైపు నుంచి కాజీపేట, సికింద్రాబాద్ వైపు వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లను వడ్డేపల్లి చెరువు ప్రాంతం(కాజీపేట స్టేషన్ ఔటర్)లో నిలిపివేస్తున్నారు. దీంతో ప్రయాణం ఆలస్యం అవుతోంది. ఈ సమస్యను నివారించి బల్లార్షా-సికింద్రాబాద్, విజయవాడ-బల్లార్షా, సికింద్రాబాద్-విజయవాడ... ఇలా అన్ని మార్గాల్లో రైళ్లు సాఫీగా రాకపోకలు సాగించేందుకు కోమటిపల్లి-వరంగల్ మధ్య బైపాస్ లైన్ను ద.మ. రైల్వే నిర్మిస్తోంది. ఇక్కడ రూ.125 కోట్ల వ్యయంతో 21.47 కి.మీ. మేర భూగర్భ మార్గం నిర్మిస్తున్నారు. ఈ పనుల్ని జోన్ జీఎం అరుణ్కుమార్ జైన్ ఇటీవల పరిశీలించారు.
3, 4 నెలల్లో సొరంగ మార్గం పూర్తి!
కాజీపేట సమీపంలో ఇప్పుడున్న రైలు పట్టాల పక్కన భూగర్భంలోకి వెళ్లే ట్రాక్ నిర్మిస్తున్నది ఇక్కడే..
బైపాస్ లైన్లో 3 పెద్ద, 31 చిన్న వంతెనలు రానున్నాయి. బైపాస్ కోసం 7.8 హెక్టార్ల భూమి సేకరించారు. అయితే ఒకచోట భవనాల కారణంగా భూసేరణ సాధ్యం కాలేదని.. అందుకే ఆ ప్రాంతం వరకు భూ ఉపరితలంపై ప్రస్తుతం ఉన్న రైలు మార్గం కింద మరో రైలు మార్గం నిర్మిస్తున్నట్లు ద.మ. రైల్వే వర్గాలు తెలిపాయి. కోమటిపల్లి నుంచి వడ్డేపల్లి చెరువు వరకు భూగర్భంలో 340 మీటర్ల మేర సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 3, 4 నెలల్లో భూగర్భ మార్గం పూర్తయ్యే అవకాశం ఉంది. కోమటిపల్లి దగ్గర భూఊపరితలం నుంచి రైలు మెల్లమెల్లగా కిందికి దిగుతుంది. అండర్గ్రౌండ్లో 340 మీటర్లు ప్రయాణం చేసి.. ఆ తర్వాత మెల్లమెల్లగా పైకి వెళ్తూ వడ్డేపల్లి చెరువు దగ్గర భూ ఉపరితల స్థితికి చేరుకుంటుంది. ఎలక్ట్రిక్ ఇంజిన్తో నడిచేందుకు వీలుగా భూగర్భంలో విద్యుదీకరణ కూడా చేయనున్నారు. అండర్గ్రౌండ్ మార్గం మినహా మిగతా బైపాస్ లైన్ పనులు సాగుతున్నాయి. వీటికి ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. బైపాస్ పూర్తయితే హసన్పర్తి రోడ్ నుంచి అటు వరంగల్ వైపు, ఇటు కాజీపేట వైపు రైళ్లను ఒకేసారి పంపించొచ్చు. బల్లార్షా నుంచి కాజీపేట, వరంగల్ వైపు వచ్చే రైళ్లకు క్రాసింగ్ సమస్యలు తీరిపోతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ
మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణను వేగంగా పూర్తి చేయాలని, వచ్చే ఏడాది నాటికి కార్యకలాపాలను ముమ్మురం చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. -
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ గందరగోళానికి తెర!
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్పై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. రీ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడి, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి కొత్త ర్యాంకులు ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నీట్-యూజీ కౌన్సెలింగ్ తేదీలు వెలువడతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. -
తుది దశకు మంత్రివర్గ విస్తరణ
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుని నియామకంపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు. -
హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణకు ‘హైడ్రా’
హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణకు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్(హైడ్రా) అనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. -
ఏటా ఉద్యోగాల భర్తీ!
రాష్ట్రంలో నిరంతర ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. నిరుద్యోగులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏటా నోటిఫికేషన్లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్ వెలువరించేందుకు సమాయత్తమవుతోంది. -
కమిషన్ చట్టబద్ధమే
విద్యుత్తు కొనుగోళ్లు.. యాదాద్రి, భదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటులో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కచ్చితత్వం, ఔచిత్యాన్ని తేల్చడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ చట్టబద్ధమేనని హైకోర్టు తేల్చిచెప్పింది. -
నేరుగా జీపే, ఫోన్పే, పేటీఎంలో కరెంటు బిల్లు కట్టవద్దు
ఆన్లైన్లో కరెంటు బిల్లు కట్టేవారందరూ ఇకనుంచి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్ పేర్కొంది. -
ఇలా తిందాం.. పదికాలాలు పచ్చగా ఉందాం
తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. ఆహారంలో సమతుల్యత లోపించినప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. -
వరదలొచ్చినా.. విద్యుదుత్పత్తి ఉండనట్టే!
ప్రస్తుత వానాకాలంలో కృష్ణానదికి వరదలొచ్చినా శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. -
సారూ.. వెళ్లొద్దు
నల్గొండ జిల్లా డిండి మండల పరిధిలోని వావిల్కోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9 ఏళ్లుగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయుడు ముద్దాడ బాలరాజు.. మండలంలోని కొత్తతండాకు బదిలీ అయ్యారు. -
క్రీడాకారులకు సీఎం అభినందన
ఎయిర్ గన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్’ ఆధ్వర్యంలో గోవాలో జరిగిన 10వ నేషనల్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ 2024 పోటీల్లో బంగారు పతకాలు సాధించిన భూక్య మోనాలిసా, భూక్య సోనాలిసాలను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. -
బొగతలో జల సవ్వడి
తెలంగాణ నయాగరాగా పిలిచే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. -
వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయంపై దృష్టి
రాష్ట్రంలో ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు సక్రమంగా అందేలా వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. -
తమిళనాడుకు తెలంగాణ అధికారుల బృందం
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు తమిళనాడులో రవాణా విధివిధానాలపై అధ్యయనం చేయడానికి రంగారెడ్డి జిల్లా ఉప రవాణాధికారి (డీటీసీ) మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఆర్టీవో వాణి, కామారెడ్డి ఎంవీఐ శ్రీనివాస్తో కూడిన అధికారుల బృందం ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లింది. -
నాకు దక్కాల్సిన స్థలం.. బంధువులు పట్టా చేసుకున్నారు!
తనకు దక్కాల్సిన ఆస్తిని బంధువులు అక్రమంగా తీసుకున్నారని ఆరోపిస్తూ.. తనకు తిరిగి ఇప్పించాలని కోరుతూ కరీంనగర్లో ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధుడు సోమవారం నిరసనకు దిగారు. -
సత్ప్రవర్తన ఖైదీల విడుదలకు మార్గం సుగమం
సత్ప్రవర్తన కింద ఖైదీల విడుదలకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలిపింది. -
7 నుంచి నేతన్న పోరుయాత్ర
రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలంటూ ‘మగ్గం నడవాలి-నేతన్న బతకాలి’ నినాదంతో ఈ నెల 7వ తేదీ నుంచి నేతన్న పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ అనుబంధ చేనేత, మరమగ్గాల కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. -
బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సింగరేణి సంస్థకు ఉన్న బొగ్గు గనులకు వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, ఈ తరహా చర్యలను తక్షణం విరమించుకోవాలని రాష్ట్రంలోని కార్మిక సంఘాలు విజ్ఞప్తిచేశాయి. -
‘గాంధీ’ ఎదుట నిరుద్యోగుల ఆందోళన
భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు, వివిధ పార్టీల నేతలు, వారిని అడ్డుకునేందుకు మోహరించిన పోలీసులతో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గాంధీ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత కొనసాగింది. -
రాష్ట్ర గవర్నర్తో మిజోరాం గవర్నర్ హరిబాబు భేటీ
తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సోమవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. -
జన్యు సవరణతో నేత్ర వ్యాధులకు చెక్!
పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల జన్యు వ్యాధులకు సంబంధించి జీన్ ఎడిటింగ్ (జన్యు సవరణ)తో చెక్పెట్టే పరిశోధనలు జరుగుతున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ
-
ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్ఎంసీ అధికారులు!
-
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. ఎస్సార్నగర్లో ఘటన
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
-
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు