- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
TG News: ఈ ఏడాది పూర్తయ్యే నిర్మాణాలకే పెద్దపీట!
ఈ ఏడాది పనులు పూర్తయ్యి, ఆయకట్టుకు సాగునీరు అందించగల ప్రాజెక్టుల నిర్మాణాలకు బడ్జెట్లో పెద్దపీట వేసేందుకు నీటిపారుదలశాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది.
ప్రాధాన్య పనుల వారీగా సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు
ఈనాడు, హైదరాబాద్: ఈ ఏడాది పనులు పూర్తయ్యి, ఆయకట్టుకు సాగునీరు అందించగల ప్రాజెక్టుల నిర్మాణాలకు బడ్జెట్లో పెద్దపీట వేసేందుకు నీటిపారుదలశాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈమేరకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అధికారులు బడ్జెట్ కూర్పు చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి డిస్ట్రిబ్యూటరీ వరకు నీటిని అందించే వ్యవస్థలను పటాల ఆధారంగా సమీక్షిస్తున్నారు. ఇప్పటికే సర్కిళ్ల నుంచి అందిన ప్రతిపాదనల్లో మూడు దఫాలు మార్పులుచేర్పులు చేసినట్లు తెలిసింది. ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్లో కేటాయింపులను సైతం పరిగణనలోకి తీసుకుంటున్నారు. మొత్తంగా గత బడ్జెట్లకు భిన్నంగా ఈ దఫా కేటాయింపులు ఉండొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులు 14 ఉండగా వాటి కింద చివరి దశ పనులు పూర్తి చేయడం ద్వారా కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు అన్ని ప్రాజెక్టుల కింద పెండింగ్ బిల్లులు రూ.8,500 కోట్ల వరకు ఉన్నట్లు తెలిసింది.
సర్కిళ్ల వారీగా ఇలా..
- ఖమ్మం సర్కిల్ పరిధిలో.. శ్రీరాంసాగర్ చివరి ఆయకట్టులో ప్రస్తుతం 30 వేల ఎకరాలకు నీరు అందుతోంది. మరో 29 వేల ఎకరాలకు సాగునీరివ్వడానికి పనులు చేపట్టాల్సి ఉంది. సీతారామ ఎత్తిపోతల కింద భూసేకరణ, సొరంగాల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీ పనులు చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది నీళ్లు ఇవ్వాలంటే ఈ ఏడాది పనులు జరగాలి. మున్నేరు నదికి రక్షణ గోడల నిర్మాణంతోపాటు సర్కిల్ పరిధిలో 135 మధ్యతరహా లిఫ్టులు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి ఈ ఏడాది రూ.1050 కోట్లు అవసరమన్న అంచనాలు ఉన్నాయి. అత్యవసరంగా కనీసం రూ.600 కోట్ల వరకు కేటాయింపుల ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిసింది.
- నాగర్కర్నూల్ సర్కిల్ పరిధిలో.. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల్లో భూసేకరణతోపాటు ప్యాకేజీ 29లో ప్రధాన కాలువ పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో రూ.440 కోట్ల వరకు ప్రతిపాదిస్తున్నారు. కనీసం రూ.220 కోట్ల మేర కేటాయింపుల ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం.
- ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతలకు మహబూబ్నగర్, వనపర్తి సర్కిళ్ల నుంచి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి దశ పనులకు వనపర్తి సర్కిల్ నుంచి, మిగిలిన పనులకు మహబూబ్నగర్ సర్కిల్ నుంచి ప్రతిపాదిస్తున్నారు. వనపర్తి నుంచి మొత్తం రూ.1250 కోట్లకు ప్రతిపాదించారు. దీనిలో దాదాపు రూ.వెయ్యి కోట్లు నారాయణపేట- కొడంగల్ లిఫ్టుకు సంబంధించిన కేటాయింపులు. మిగిలినవి రాజీవ్ నెట్టెంపాడు, భీమా, ఆర్డీఎస్, జూరాల కింద పెండింగ్ పనులు, భూసేకరణకు సంబంధించినవి. అయితే, ప్రస్తుతం పనులు చేపట్టే కాలాన్ని పరిగణలోకి తీసుకుని రూ.240 కోట్లకు చివరి ప్రతిపాదనలు చేరినట్లు సమాచారం.
- ఆదిలాబాద్ సర్కిల్ పరిధిలో.. రూ.420 కోట్లకు పైగా ప్రతిపాదనలు ఉండగా.. చనాక- కొరటా తదితర ప్రాజెక్టుల కింద సత్వరమే సాగునీరు ఇచ్చేందుకు రూ.220 కోట్లకు తుది ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిసింది.
- నిజామాబాద్ సర్కిల్ పరిధిలో.. కాళేశ్వరం ప్యాకేజీలు 20, 21లో పైపులతో సాగునీటిపారుదల, జలాశయాల విస్తరణ తదితర పనులు కలిపి తుది ప్రతిపాదనలు రూ.300 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం.
- రామగుండం సర్కిల్ పరిధిలో.. కాళేశ్వరం, ఎల్లంపల్లి, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులు ప్రాధాన్య ప్రాజెక్టుల కింద తీసుకుంటున్నారు. అంచనాలు ఖరారు కాలేదు.
- రాష్ట్రంలో సాగునీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) పరిధిలోని ఎత్తిపోతల నిర్వహణకు ఆ శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రధానంగా నిర్వహణ సమస్యలతో ఈ పథకాలు మూలకు చేరుతున్నట్లు గుర్తించారు. దీంతో ప్రతి లిఫ్టుకు ఒక ఆపరేటర్, వాచ్మెన్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనల్లో పేర్కొంటున్నారు. ప్రతి పది ఎత్తిపోతలకు డీఈ లేదా ఏఈ నేతృత్వంలో ఒక సాంకేతిక బృందం ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనికీ బడ్జెట్ కేటాయింపులు చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం
హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎనుముల రేవంత్రెడ్డి, నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. -
కీలక ప్రాజెక్టులపై కలిసి పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలు, ఇతర సమస్యల పరిష్కారంపై శనివారం సాయంత్రం హైదరాబాద్లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డిల మధ్య అత్యంత సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. -
కమిటీల ద్వారా పరిష్కారం
విభజన చట్టంలోని పెండింగు సమస్యలకు కమిటీల ద్వారా పరిష్కారమార్గాలను అన్వేషిస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్లు తెలిపారు. -
కాళేశ్వరం పంపుహౌస్లపైనా విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ కమిషన్ పరిధి మరింత విస్తరించనుంది. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి సాంకేతిక అంశాలపై విచారణ చేపట్టిన కమిషన్.. -
నైనీ కరెంటు కొంటారా?
దేశంలోని సుదూర ప్రాంతాల్లో ఉన్న థర్మల్ విద్యుత్కేంద్రాలకు బొగ్గు రవాణా కన్నా కరెంటు సరఫరా వ్యయం తక్కువ అవుతుందని తాజాగా కేంద్ర విద్యుత్శాఖ రాష్ట్రాలకు సూచించింది. బొగ్గు గనులున్న ప్రాంతాల్లోనే థర్మల్ విద్యుత్కేంద్రాలను నిర్మిస్తే కరెంటు చౌకగా లభిస్తుంది. -
బాధ్యతల భారం.. పరిష్కారం దూరం!
రాష్ట్రంలో కాలుష్య సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు భారీగా పెరిగిపోతున్నాయి. అయినా. వాటి పరిష్కారానికి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఉద్యోగులు దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కృష్ణ జింకలను పట్టుకోవాల్సిందే!
రాష్ట్రంలోని కృష్ణా నదీ తీర మండలాల్లో రైతులకు కృష్ణ జింకలతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లోని మాగనూరు, కృష్ణా, మక్తల్, ఊట్కూరు, నర్వ, దేవరకద్ర మండలాల పరిధిలో ఉన్న కృష్ణా నదీ తీరంలో మూడు వేల పైచిలుకు కృష్ణ జింకలున్నాయి. -
విమానాశ్రయాల్లో భద్రతపై అధ్యయనం!
విమానాశ్రయాల్లో భద్రత ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వాటి నిర్మాణాలకు సంబంధించి భద్రతా వ్యవస్థను అధ్యయనం చేయించాలని ఆదేశించింది. అనంతరం నివేదికను పంపాలని అధికారులకు స్పష్టం చేసింది. -
తిరుమల తరహాలో యాదాద్రి స్వయంభువుల దర్శనం
తిరుమల వేంకటేశ్వరస్వామి దేవాలయం తరహాలో భక్తులకు యాదాద్రి స్వయంభువుల దర్శనం కలగనుంది. దర్శనానికి వచ్చే భక్తులు మహాముఖ మండపంలో మూలవరులను దర్శించుకొంటూ.. -
ధాన్యం లేదు.. డబ్బులిస్తాం!
అన్నదాతల నుంచి సేకరించిన వడ్లను మరాడించి బియ్యాన్ని ఎఫ్సీఐకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న రైస్మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోంది. గతానికి భిన్నంగా కఠినంగా వ్యవహరిస్తుండటంతో రూ.వందల కోట్ల బకాయిలు వసూలవుతున్నాయి. -
కమ్యూనిటీ వాలంటీర్లతో మధ్యవర్తిత్వం
కమ్యూనిటీ వాలంటీర్లకు మధ్యవర్తిత్వ చట్టాలపై అవగాహన కల్పించి వివాహ వ్యవస్థలోని తగాదాలు పరిష్కరించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవా సంస్థ అధ్యక్షుడు జస్టిస్ సుజయ్ పాల్ పేర్కొన్నారు. -
కలెక్టర్ల వద్దే ఏజెన్సీ భూ వివాదాల పరిష్కారం
ఏజెన్సీల్లోని భూ వివాదాలను జిల్లా కలెక్టర్ల వద్దనే పరిష్కరించుకోవచ్చని ఆదిలాబాద్ కోర్టుల పోర్ట్ఫోలియో జడ్జి అయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు
డోర్నకల్-భద్రాచలం స్టేషన్ల మధ్య లైన్ డబ్లింగ్ కోసం భూసేకరణ చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ లైన్ కోసం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, గార్ల మండలాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. -
ఎస్సీ గురుకుల సొసైటీలో పూర్తికాని తుది కేటాయింపులు
రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం. 317కు సంబంధించిన ఉద్యోగుల తుది కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఇతర సంక్షేమ సొసైటీల్లో సాంకేతిక పొరపాట్లకు అవకాశం లేకుండా తుది కేటాయింపులు పూర్తయ్యాయి. -
దండు మల్కాపూర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించండి
యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్ హరిత సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కు వద్ద హైదరాబాద్- విజయవాడ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టిఫ్) కోరింది. -
దేవాదుల సొరంగం ప్రారంభమయ్యేనా?
దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడో దశలో నిర్మించిన సొరంగం పూర్తయితే లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఈ టన్నెలే. -
నిరుపయోగ బొగ్గు గనుల నుంచి జల విద్యుత్
విద్యుదుత్పత్తి పెంచేందుకు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు(పీఎస్పీపీ) నిర్మించాలని సింగరేణి సంస్థ తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ యాజమాన్యంలో పీఎస్పీపీ నిర్మాణం కోసం కసరత్తు చేస్తోంది. -
ఉత్తర భాగానికి రూ.5వేల కోట్లు!
హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్కు ఆర్థిక అవస్థలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అవతల నుంచి 2 భాగాలుగా ప్రాంతీయ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్)ను తలపెట్టిన విషయం తెలిసిందే. -
రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. -
ఉత్తరాఖండ్లో విరిగిన కొండచరియలు.. ఇద్దరు తెలంగాణ యాత్రికుల దుర్మరణం
దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. చమోలీ జిల్లా కర్ణప్రయాగ, గౌచర్ల మధ్యలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకున్న ఘటనలో ఇద్దరు తెలంగాణవాసులు మృతి.. -
సింగపూర్లో కోదాడ యువకుడి మృతి
సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఓ యువకుడు సింగపూర్లో మృతి చెందిన ఘటన శనివారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ (30) సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయా: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
-
మీరు భలే ఉంటారు...! ఓ పోలీసు అధికారి విపరీత ప్రవర్తన
-
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్