- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
NEET: నీట్పై సీబీఐ విచారణ జరిపించాలి
‘నీట్’ నిర్వహణలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రావణపల్లి బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలన్నారు.
మంత్రి డి.శ్రీధర్బాబు డిమాండ్
గ్రూప్-2, 3లలో పోస్టుల పెంపుపై క్యాబినెట్లో చర్చిస్తామని వెల్లడి
కొరియన్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్బాబు. చిత్రంలో రాయబారి చాంగ్ జే బొక్, శేఖర్రెడ్డి తదితరులు
హైదరాబాద్, న్యూస్టుడే: ‘నీట్’ నిర్వహణలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రావణపల్లి బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలన్నారు. ఎమ్మెల్యేలు విజయ రమణారావు, యెన్నం శ్రీనివాస్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, రాజ్ ఠాకూర్లతో కలిసి ఆయన గురువారం సీఎల్పీ మీడియా సెంటర్లో మాట్లాడారు. ‘‘నీట్ నిర్వహణ, ఫలితాల అంశంలో లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగింది. జూన్ 14న ఫలితాలు రావాల్సి ఉన్నా.. జూన్ 4న అదీ ఎన్నికల ఫలితాల రోజే విడుదల చేయడం, గ్రేస్ మార్కులు కలపడం, 67 మందికి తొలి ర్యాంకు రావడంపై అనుమానాలకు తావిస్తోంది. శ్రావణపల్లి బొగ్గు గనులను సింగరేణికి అందించేలా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చొరవ చూపాలి. ఈ గనుల వేలంలో పాల్గొనాలా... వద్దా... అనే దానిపై సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. మా ఆలోచన వారికి చెప్పాం. రాష్ట్ర సమస్యలు, కేంద్ర సహకారం, సింగరేణి తదితర అంశాలపై సీఎం రేవంత్రెడ్డి త్వరలో ప్రధాని మోదీని కలుస్తారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడబోం. అల్లర్లను ఉక్కుపాదంతో అణచివేస్తాం. ఏపీ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని భారాస నేతలు మాకు సూచించడం విడ్డూరం. పాలనలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటే కాళేశ్వరంలా అవుతుంది. జీఓ 46పై ఆందోళన వద్దు. అందరికీ న్యాయం చేస్తాం. గ్రూప్-1 మెయిన్స్పై నోటిఫికేషన్లో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ముందుకెళతాం. లేదంటే మళ్లీ న్యాయ సమస్యలు వచ్చే ప్రమాదముంది. గ్రూప్-2, 3ల పోస్టుల పెంపు డిమాండ్పై... క్యాబినెట్లో చర్చిస్తాం. అందరి ఆలోచనలకు అనుగుణంగానే సీఎం రేవంత్రెడ్డి జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తారు’’ అని శ్రీధర్బాబు వివరించారు.
కొత్త పారిశ్రామిక విధానంపై కసరత్తు
మాదాపూర్, న్యూస్టుడే: రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్, ఈవీలు, ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్లపై పాలసీలు తీసుకొస్తామన్నారు. గురువారం మాదాపూర్లో నిర్వహించిన ‘‘కొరియా-ఇండియా ఎకనామిక్ కో-ఆపరేషన్ ఫోరం 2024’’ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... ‘‘పెట్టుబడులకు తెలంగాణను తొలి గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తోంది. అనేక కొరియన్ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. యంగ్వన్ కార్పొరేషన్ వరంగల్లోని కాకతీయ మెగా టైక్స్టైల్ పార్క్లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో క్రీడాదుస్తుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించనుంది. తద్వారా 12 వేల మందికి ఉపాధి లభిస్తుంది. కొరియన్ అంకుర సంస్థలకు అవకాశాలు కల్పించేందుకు దక్షిణకొరియాతో టీ-హబ్ ఒప్పందం చేసుకుంది. కొరియన్ పెట్టుబడిదారుల కోసం ఇన్వెస్ట్ తెలంగాణ సెల్’ పేరిట ప్రత్యేక డెస్క్ ప్రారంభించనున్నాం. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టులో అవసరమైతే కొరియన్ కంపెనీల సహకారం తీసుకుంటాం’’ అని వివరించారు. సమావేశంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి చాంగ్ జే బొక్, కొరియా కాన్సుల్ జనరల్ సురేష్ చుక్కపల్లి, రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్రంజన్, సీఐఐ తెలంగాణ మాజీ ఛైర్మన్ సి.శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కృష్ణా జలాల్లో కొత్త ద్వీపం.. అందం అదరహో..!
చుట్టూ నీరు.. మధ్యలో భూభాగం ఉంటే ద్వీపం అనడం సహజం. ఇలాంటి దృశ్యాలు నదులు, సముద్రాలు, సరస్సుల్లో కనిపిస్తుంటాయి. -
ఎంపీ లాడ్స్ ఆన్లైన్లో!
పార్లమెంటు సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధుల పథకం (ఎంపీ లాడ్స్) వ్యయం ఇకపై ఆన్లైన్ వేదికగా జరగనుంది. -
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను విభజించి తహసీల్దార్లకు అప్పగించిన ప్రభుత్వం అదే మార్గంలో త్వరలో మరికొన్ని సంస్కరణలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. -
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
కోడింగ్కు కేంద్రంగా హైదరాబాద్
కోడింగ్లో హైదరాబాద్ ప్రపంచ కేంద్రంగా నిలుస్తోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్ రాయదుర్గం టీహబ్లో ఆదివారం ఎండ్ నౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోషల్వుడ్ 2024 సమిట్ (ద్వి వార్షిక సదస్సు) నిర్వహించారు. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
వసతుల్లేని వర్సిటీలు!
ఉన్నత చదువులు చదివి.. జీవితంలో ఉత్తమంగా ఎదగాలన్న ఆశలు, ఆశయాలతో విశ్వవిద్యాలయాలకు వస్తున్న విద్యార్థులకు కనీస సదుపాయాల కొరత పరీక్ష పెడుతోంది. -
తెలంగాణ ఏర్పాటులో డీఎస్ పాత్ర కీలకం
పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని.. ఆయన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
10 మంది విద్యార్థులు మించితే.. ఇద్దరు టీచర్లు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 10 మంది విద్యార్థులు దాటిన చోట ఇక ఇద్దరు ఉపాధ్యాయులు రానున్నారు. 41 మంది పిల్లలు మించితే ముగ్గురు టీచర్లు ఉంటారు. -
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా తాండూరులో 5.1 సెం.మీటర్లు కురిసింది. -
అరుదైన రాజనీతిజ్ఞుడు
భారత మాజీ ఉప రాష్ట్రపతి, రాజనీతిజ్ఞుడు వెంకయ్య నాయుడికి ఆదివారంతో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నా. -
నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్తో కాంగ్రెస్ నేతల చర్చలు విఫలం
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆసుపత్రిలో వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్తో ఆదివారం రాత్రి కాంగ్రెస్ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. -
సింగరేణి.. మొక్కల గని..!
అడవిని తలపిస్తున్న ఈ ప్రాంతం సింగరేణి పరిధి రామగుండం ఏరియాలో బొగ్గు తవ్వకం తాలూకు మట్టి కుప్పలు నిండిన ప్రదేశం అంటే నమ్మగలమా. -
పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
దేశం పారిశ్రామికంగా సుస్థిరాభివృద్ధి సాధించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. -
చుక్ చుక్ బండి.. పట్టాల కింది నుంచీ వెళ్తుందండి..!
నగరాలు, జాతీయ రహదారుల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్లు కడతారు. బైపాస్ రోడ్లు నిర్మిస్తారు. రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించేందుకు రైల్వే శాఖ కూడా బైపాస్ లైన్లు, రైల్ ఓవర్ రైల్(ఆర్ఓఆర్) వంతెనలు నిర్మిస్తోంది. -
న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి
దేశ న్యాయవ్యవస్థలో మార్పులు రావాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. పేదలు సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం అడిగే పరిస్థితి ఉందా.. అన్న అంశంపై చర్చ జరగాలన్నారు. -
రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని మాజీ ఎంపీ మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. దివంగత నేత ఎన్టీఆర్కూ ఆ అవార్డు ఇవ్వాలని అన్నారు. -
ఇదీ సంగతి!
అది ఉద్యోగులకే..మనకు కాదు!! -
1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు ప్రధాన విద్యుత్తు కేంద్రాల్లో ఏకంగా 1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తికి విఘాతం ఏర్పడింది. -
మండల, జిల్లా పరిషత్లలోనూ ప్రత్యేకాధికారుల పాలన!
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల, జిల్లా పరిషత్లలోనూ ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. ఎంపీపీలు, జడ్పీ ఛైర్పర్సన్ల పదవీకాలం జులై 3, 4 తేదీల్లో ముగియనుండగా.. వారి స్థానంలో ప్రత్యేకాధికారుల నియామకం చేపట్టనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
-
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై ఘాటుగా స్పందించిన లోకేశ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM