- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Land Market Value: మార్కెట్ విలువల పెంపు 20-40 శాతం!
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ పెంపు దాదాపు 20 నుంచి 40 శాతం మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రిజిస్ట్రేషన్ శాఖకు చేరిన నివేదికలు
కొత్త ఐజీ రాకతో మంగళవారం నాటి సమీక్ష వాయిదా
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ పెంపు దాదాపు 20 నుంచి 40 శాతం మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ భూములు, స్థలాలు, వెంచర్లు, అపార్ట్మెంట్లకు సంబంధించి ప్రాంతాల వారీగా ఈ నెల 18వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేపట్టిన స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు విలువల సవరణపై ప్రాథమిక అంచనాలను శాఖ ప్రధాన కార్యాలయంలో అందజేశారు. 2021 నాటి సవరణ అనంతరం అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్, బహిరంగ మార్కెట్ విలువలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన సవరణ ప్రతిపాదనలు మొదటి దశలో సబ్ రిజిస్ట్రార్ల నుంచి జిల్లా రిజిస్ట్రార్లకు, వారి పరిశీలన అనంతరం డీఐజీ (డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్) కార్యాలయాలకు వచ్చాయి. వాటిపై తుది పరిశీలనలు పూర్తిచేసిన డీఐజీలు మంగళవారం కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్కు ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉండగా వాయిదా పడింది.
కొత్త ఐజీ రాకతో...
స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్గా(అదనపు బాధ్యతలు) జ్యోతి బుద్ధ ప్రకాశ్ను ప్రభుత్వం తాజాగా నియమించింది. ఈ పోస్టులో ఉన్న నవీన్మిత్తల్ నుంచి ఆయన బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తికానందున భూముల మార్కెట్ విలువల సవరణకు సంబంధించి మంగళవారం కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ నిర్వహించాల్సిన సమీక్ష వాయిదా పడింది. బుధ లేదా గురువారాల్లో ఈ ప్రక్రియ పూర్తికావొచ్చని అధికార వర్గాల సమాచారం.
అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో అధికంగా..
రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెంపు అధికంగా ఉండొచ్చని విశ్వసనీయ సమాచారం. ఉదాహరణకు హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ఐదారేళ్ల నుంచి బహిరంగ మార్కెట్లో భూముల ధరలు చుక్కలనంటుతున్నాయి. నగరాన్ని ఆనుకుని ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ విలువకు, బహిరంగ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో పెంపు కనీసం 40 శాతం ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. అంటే చ.గజం విలువ ఇప్పుడు అమల్లో ఉన్న మార్కెట్ విలువ ప్రకారం రూ.లక్ష ఉంటే కొత్త విలువ రూ.ఒక లక్షా నలభై వేలకు చేరవచ్చు. మండల, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల విలువల పెంపు 20 శాతం వరకు ఉండే అవకాశాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూముల విలువలు భారీగా సవరించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎకరా కనీస ధర రూ.75 వేలుగా ఉండగా, మారుమూల గిరిజన ప్రాంతాలను మినహాయించి ఇతర ప్రాంతాల్లో ఎకరా కనీస విలువ రూ.2.50 లక్షలుగా నిర్ణయించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. పట్టణ ప్రాంతాలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పారిశ్రామిక ప్రాంతాల్లో మాత్రం స్థానిక ధరల ఆధారంగా పెంపు ఉండొచ్చని తెలిసింది.
వాయిదాకూ అవకాశం
మార్కెట్ విలువల సవరణ నిర్ణయాన్ని ప్రభుత్వం కొంతకాలం వాయిదా వేసుకునే అవకాశం ఉందనే చర్చ రిజిస్ట్రేషన్ శాఖ వర్గాల్లో నడుస్తోంది. త్వరలో రాష్ట్రంలో వివిధ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటం, పొరుగు రాష్ట్రం ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుతీరిన నేపథ్యంలో అక్కడ స్థిరాస్తి రంగంలో మార్పులను పరిగణనలోకి తీసుకున్న అనంతరమే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని కొందరు అధికారులు వ్యక్తంచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలను జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. -
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం
కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్లో ఫ్యాను ఊడిపడి ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. -
పోలవరం విధ్వంసం.. రూ.వేల కోట్ల నష్టం
జగన్ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశమైపోయిందని.. ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే రూ.వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. శుక్రవారం విజయవాడకు వచ్చిన గవర్నర్ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం
తిరుమల-అలిపిరి మొదటి ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళన చెందారు. -
కుటుంబానికి రూ.2 లక్షలు!
రైతు రుణమాఫీ మార్గదర్శకాలను మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. -
వీడుతున్న చిక్కుముడులు
హైదరాబాద్ ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) రెండు భాగాలను ఒకేసారి నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. అయితే దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండకపోయినా.. ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. -
ఊరూరా మీసేవ కేంద్రాలు
ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
కృష్ణపట్టి ఏరియాలో పెద్దపులి సంచారం
కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు. -
ఆరోగ్య, ఆహార అలవాట్లపై ‘న్యూట్రిషన్ అట్లాస్’
దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల ఆహార అలవాట్లు, వారి ఆరోగ్య పరిస్థితులపై తాజా సమగ్ర సమాచారాన్ని ఐసీఎంఆర్ - ఎన్ఐఎన్ (భారతీయ వైద్య పరిశోధన మండలి - జాతీయ పోషకాహార సంస్థ) అందుబాటులోకి తెచ్చింది. -
జీవో నం.317 కేటాయింపు సమస్యల పరిష్కారం
ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం.317 కింద ఉపాధ్యాయ, అధ్యాపకుల కేటాయింపులో ఆఫ్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది. -
కార్మికుల భద్రత గాల్లో దీపమే
రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. అదే సమయంలో పని ప్రదేశాల్లో కార్మికులకు భద్రత కొరవడుతోంది. -
బాసర ఆలయ ప్రసాదాల్లో చేతివాటం
బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలోని తయారీ కేంద్రం వద్ద రిజిస్టర్లో తక్కువ సంఖ్యలో ప్రసాదాలను నమోదు చేసి కౌంటర్లో ఎక్కువ సంఖ్యలో విక్రయిస్తూ వచ్చిన డబ్బును కాజేస్తున్న సిబ్బందిపై వేటు పడింది. -
నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ శనివారం ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. -
నీట్ను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి
నీట్ అవకతవకల నేపథ్యంలో సంబంధిత పరీక్షను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన సంఘాల ఐకాస నేతలు డిమాండ్ చేశారు. -
రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకులు జగజీత్సింగ్ దల్లేవాల్, నల్లమల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. -
435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య డైరెక్టరేట్లో 431, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లో 4 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక బోర్డు(ఎంహెచ్ఆర్ఎస్బీ) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. -
మహిళా సూపరింటెండెంట్ ఆరోపణలపై నేడు విచారణ
సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి తనను వేధించారంటూ మహిళా సూపరింటెండెంట్ డి.జయలక్ష్మి చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. -
జీవో నం.317 కేటాయింపు సమస్యల పరిష్కారం
ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం.317 కింద ఉపాధ్యాయ, అధ్యాపకుల కేటాయింపులో ఆఫ్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది. -
ఏడుగురు తహసీల్దార్లకు ఎన్నికల తిరుగు బదిలీ
ఈ నెలతోపాటు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న ఏడుగురు తహసీల్దార్లను రెవెన్యూ శాఖ బదిలీ చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్
-
చంద్రబాబు కార్యసాధకుడు.. అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తారు: సుమన్
-
మహిళలూ.. భర్తలతో తాగుడు ఇలా మాన్పించండి: మంత్రి టిప్ వైరల్
-
ఏయూలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తాం: సి.ఎం.రమేశ్