TG News: జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ విచారణ గడువు పొడిగింపు

జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ విచారణ గడువు వ్యవధిని మరో నెల రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది.

Published : 03 Jul 2024 02:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ విచారణ గడువు వ్యవధిని మరో నెల రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది. కమిషన్‌ ఏర్పాటు చేసినప్పుడు జూన్‌ 30 వరకూ గడువు విధించింది. విచారణ ఇంకా పూర్తికానందున జులై నెలాఖరు వరకు గడువు పొడిగించినట్లు సమాచారం. కమిషన్‌ ఏర్పాటును తప్పు పడుతూ మాజీ సీఎం కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసినందున.. ఆయన నుంచి వివరణ తీసుకునేందుకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని