- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
WHO: ఇలా తిందాం.. పదికాలాలు పచ్చగా ఉందాం
తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. ఆహారంలో సమతుల్యత లోపించినప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో రోగ నిరోధక శక్తి
వేపుళ్లు, నిల్వ ఆహారాలు, తీపి పదార్థాలతో చేటు
మోతాదు మించితే జీవనశైలి వ్యాధుల పంజా
ఐదింట ఒక మరణం అనారోగ్యకర ఆహారం వల్లనే
‘ఆరోగ్యకర ఆహారం’పై డబ్ల్యూహెచ్వో, యునిసెఫ్ మార్గదర్శకాలు
ఈనాడు, హైదరాబాద్: తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. ఆహారంలో సమతుల్యత లోపించినప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. 40 ఏళ్లలోపే అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులు విజృంభించడానికి అనారోగ్యకర ఆహారపు అలవాట్లు కూడా ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) స్పష్టం చేసింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడమే కాదు.. ఎంత మోతాదులో, ఎలా తీసుకుంటున్నామనేది కూడా కీలకమని పేర్కొంది. ‘ఆరోగ్యకరమైన ఆహారం’పై డబ్ల్యూహెచ్వో, యునిసెఫ్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ‘గ్లోబల్ డైట్ క్వాలిటీ స్కోర్’ పేరిట 25 రకాల ఆహారాలను నిపుణులు విశ్లేషించారు. ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో రోగ నిరోధక శక్తి అధికమవుతుందని, తద్వారా జీవనశైలి వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తపడవచ్చని వారు పేర్కొన్నారు. వేపుళ్లు, నిల్వ ఆహారాలు, తీపి పదార్థాలను ఎక్కువగా వినియోగించే వారికి చిన్న వయసులోనే తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరణాలకు గల కారణాలను విశ్లేషిస్తే.. ప్రతి ఐదు మరణాల్లో ఒకటి ఆహారంలో సమతౌల్యత లోపించడం కారణంగానే జరుగుతుందని గుర్తించినట్టు చెప్పారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2008లో జీవనశైలి వ్యాధుల కారణంగా సంభవించిన మరణాలు(1.10 కోట్లు).. 2030 నాటికి 5.50 కోట్లకు చేరుకుంటాయని అధ్యయన నివేదికను విశ్లేషించిన అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచంలోని అన్ని దేశాలూ ఆరోగ్యకర ఆహార అలవాట్లపై తక్షణమే దృష్టిసారించాల్సిన అవసరముందని స్పష్టంచేసింది. ఏ రకమైన ఆహారాన్ని రోజుకు ఎంత మోతాదులో తీసుకుంటే, ఏ మేరకు ప్రయోజనం ఉంటుందో పేర్కొంటూ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఇలా తినొద్దు
- మాంసం రోజుకు 46 గ్రాములకు మించకూడదు. వారంలో ఒకట్రెండు సార్లు తిన్నా 200-300 గ్రాములకన్నా ఎక్కువ తీసుకోకూడదు.
- ఎక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు(జున్ను వంటివి) 150 గ్రాములు దాటకూడదు.
- ప్రాసెస్డ్ ఫుడ్ (ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ప్యాకెట్లలో నింపిన చిప్స్ సహా ఇతర పదార్థాలు), జంక్ఫుడ్లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది గనుక రోజుకు 30 గ్రాములు మించకూడదు.
- ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ రైస్ వంటి వేపుడు పదార్థాలు రోజుకు 9 గ్రాముల కంటే అధికంగా తింటే ముప్పే.
- బేకరీ ఆహారాలు అంటే కేకులు, పఫ్లు, బిస్కెట్లు వంటివి రోజుకు 7 గ్రాములు మించొద్దు.
- శీతల పానీయాలు రోజూ 57 మి.లీ. కంటే అధికంగా వద్దు. అంటే ఒక గుటక వేయాలి అంతే.
- బంగాళాదుంప రోజుకు 100 గ్రాములే.
- స్వీట్లు, ఐస్ క్రీములు వంటివి 13 గ్రాములే.
- పండ్ల రసాలు 37 మి.లీ. కంటే ఎక్కువ తీసుకోవద్దు. పండ్ల రసం కంటే నేరుగా పండ్లను తింటే ఎక్కువ ప్రయోజనం.
ఒక రోజులో తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన ఆహారం
- నిమ్మ జాతి పళ్లు (సిట్రస్ ఫ్రూట్స్) కనీసం 24-69 గ్రాములు. ఉదాహరణకు ఒక నారింజ పండు సుమారు 50-100 గ్రాములుంటుంది. అంటే రోజుకొక పండు తింటే సరిపోతుంది.
- ఆపిల్, దానిమ్మ వంటి పండ్లు సుమారు 100 గ్రాములు.
- ఆకుకూరలు కనీసం 37-69 గ్రాములు(నలుగురు సభ్యులున్న కుటుంబం మూడు కట్టల ఆకుకూరను పప్పు, పచ్చడి, సలాడ్..ఇలా ఏదో ఒక రూపంలో తినాలి)
- కాలిఫ్లవర్, క్యాబేజ్, బ్రకోలీ వంటి కూరగాయలు కనీసం 30 గ్రాములు, క్యారెట్, గుమ్మడి వంటి కూరగాయలు 50 గ్రాముల వరకూ తినాలి. రోజూ తినలేని వాళ్లు వారానికి ఒకసారైనా 200-250 గ్రాములు తీసుకోవాలి.
- బెండకాయ, బీరకాయ, వంకాయ వంటి ఇతర కూరగాయల్లో ఏదో ఒక దాన్ని 100 గ్రాముల చొప్పున తినాలి. నలుగురు సభ్యులున్న కుటుంబం అర కిలో కూరగాయలను వండుకోవాలి.
- పప్పు దినుసులు కనీసం 40 గ్రాములు.
- బాదం, పిస్తా వంటివి రోజుకు 13 గ్రాములు. లేదంటే వారంలో 50 గ్రాముల వరకూ..
- 100 గ్రాముల అన్నం. ఒకట్రెండు చపాతీలు.
- వంట నూనెలు రోజుకు ఒక వ్యక్తికి 10 గ్రాములు. అంటే సుమారు రెండు టీ స్పూన్లు.
- చేప ఏదైనా 100 గ్రాములు, చికెన్ 50 గ్రాముల వరకు, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులను 150 గ్రాములు తీసుకోవచ్చు. ఒక గుడ్డు తినాలి.
సురక్షిత ఆహారానికి ప్రాధాన్యం
పౌష్టికాహార లోపంతోనే ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, ఎదుగుదల లోపించడం, బలహీనంగా ఉండడం, శరీరంలో అతి ముఖ్యమైన ఖనిజ లవణాలు లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు గుర్తించారు. జంక్ఫుడ్ వల్ల అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలతోపాటు దీర్ఘకాలిక వ్యాధుల బారినపడతారు. ప్రధానంగా నిల్వ ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యకర ఆహారంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి
ఆహారంలో వైవిధ్యం ఉండాలి
తినే ఆహారంలోనూ వైవిధ్యం ఉండాలి. అంటే రోజూ ఒకే రకమైన కూరగాయలు, ఆకుకూరలు కాకుండా వేర్వేరువి ఎంచుకోవాలి. జంతువుల నుంచి వచ్చే ఆహారం కంటే.. మొక్కల ద్వారా వచ్చే ఆహారం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. పప్పులు కూడా పాలిష్ చేసినవి కాకుండా పొట్టు ఉండేలా చూసుకోవాలి. శాకాహారంలోనూ నిల్వ ఉంచిన ఆహారాలు, వేపుళ్లు, తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. ప్రధానంగా నిమ్మ జాతి పళ్లలో జీవనశైలి వ్యాధుల బారినపడకుండా అడ్డుకునే శక్తి అధికంగా ఉంటుంది.
డాక్టర్ ఎస్తర్ సాతియారాజ్, క్లినికల్ న్యూట్రిషనిస్ట్, హెచ్సీజీ హాస్పిటల్స్, బెంగళూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్
గత ఎన్నికల ముందు ప్రకటించిన డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. -
నిత్యావసరాల ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి
పెరిగిన నిత్యావసరాల ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. -
పోలవరంలో సవాళ్లు.. పరిష్కరించదగ్గవే!
పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఎదురైన సవాళ్లన్నీ పరిష్కరించదగ్గవేనని విదేశీ నిపుణులు ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. మొత్తం మీద సానుకూల వ్యాఖ్యలు చేసినప్పటికీ సమగ్ర అధ్యయనం తర్వాతే తుది నిర్ణయాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. -
వందేళ్ల తాతా.. వహ్వా నీ ఘనత
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ మంగళవారం పెదబయలు మండలంలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. -
అచ్యుతాపురం సెజ్లో కృతిమ మేధ పరిశ్రమ
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో తొలిసారి కృత్రిమ మేధ కంపెనీ అడుగుపెట్టబోతోంది. సబ్స్ట్రాక్ట్ మాన్యుఫ్యాక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంటర్ప్రైజ్ (స్మైల్) పేరుతో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో నిందితులు
మూడేళ్ల క్రితం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు మంగళవారం అర్ధరాత్రి తర్వాత కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. -
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
వైకాపా అధినేత జగన్కు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి బినామీగా వ్యవహరిస్తున్నట్లు ఏపీ సాధు పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు, ఆనందాశ్రమం పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. -
అలాగే.. 6న కలుద్దాం
విభజన అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపాదనపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. -
ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం
రాజకీయ నాయకుల సిఫార్సులు ఉన్నవారికే పైరవీ బదిలీలు.. గత ఎన్నికల ముందు సిఫార్సు బదిలీలతో మాజీ మంత్రి రూ.50 కోట్లకుపైగా దండుకున్న వైనం.. సాధారణ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరం.. ఇలాంటి విధానంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం బదిలీల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. -
పులివెందులలో ‘ఫోర్ స్టార్’ పన్నాగం
స్టార్ హోటళ్లు ఎక్కడ కడతారు? సందర్శకులు, పర్యాటకులు ఎక్కువగా వచ్చే నగరాల్లో కదా. కానీ ఘనత వహించిన జగన్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? పర్యాటకులే రాని పులివెందులలో ఫోర్స్టార్ హోటల్ కట్టేందుకంటూ తమ బంధువు క్లబ్హౌస్ను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థతో రూ.12.87 కోట్లతో కొనిపించింది. -
అమ్మ వెంకటరెడ్డీ.. ఇంత మోసమా?
జగన్ ప్రభుత్వంలో సాగిన ఇసుక దోపిడీలో ఆశ్చర్యకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ‘ముఖ్య’నేతలు భారీగా ఇసుక సొమ్ము దోచేయగా.. గుత్తేదారు పూర్తిగా డబ్బు చెల్లించకుండా ప్రభుత్వానికి రూ.800 కోట్ల బాకీ ఉండగా.. బకాయి లేదంటూ గనులశాఖ సంచాలకుడు వెంకటరెడ్డి ఏకంగా నో డ్యూ సర్టిఫికెట్ జారీచేసేశారు. -
ఆడపిల్లల అదృశ్యంపై ప్రత్యేక సెల్
‘‘ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదేళ్లలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే వైకాపా ప్రభుత్వం కనీసం ప్రెస్మీట్ కూడా పెట్టలేదు. పోలీసులూ స్పందించలేదు. -
‘వేలిముద్రలు’ చెరిపేసిన నేరం జగన్దే!
గత వైకాపా ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర పోలీసు శాఖ 10 లక్షల మందికి పైగా నేరగాళ్ల వేలిముద్రలను నిక్షిప్తపరిచిన అధునాతన సర్వర్లు కాలిపోయాయి. -
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి: మంత్రి లోకేశ్
విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. -
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో.. సాంకేతిక సమస్యలను అధిగమించాలి
డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. -
‘ఆర్థిక’ శ్వేతపత్రం రూపకల్పనపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆరా
జగన్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక అరాచకంపై శ్వేతపత్రం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం తన ఛాంబరులో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, కార్యదర్శులు వినయ్చంద్, జానకి తదితరులతో సమావేశమయ్యారు. -
విశాఖ జైల్లో గంజాయి ఖైదీలే ఎక్కువ
విశాఖ జైల్లో 2 వేల మంది ఖైదీలు ఉండగా.. వారిలో 1,200 మంది గంజాయి ఖైదీలే ఉండటం విచారకరమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. -
18 వేల టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
కాకినాడ, పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ బృందాలు మంగళవారం పలు గోదాముల్లో తనిఖీలు కొనసాగించాయి. రెండు గోదాముల్లో రూ.52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటీ డెమో పోస్టు భర్తీ
వైద్య, ఆరోగ్యశాఖ జోన్-3 పరిధిలోని డిప్యూటీ మాస్ మీడియా అధికారి (డెమో) పోస్టును నిబంధనలకు విరుద్ధంగా జోన్-4 అధికారులు భర్తీ చేయడం చర్చనీయాంశమైంది. -
అమరావతి అనుసంధాన రహదారుల అభివృద్ధి
రాజధాని అమరావతికి అనుసంధాన రహదారి అభివృద్ధి, కరకట్ట రోడ్డు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలకమని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే విశాలమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి రూపకల్పన చేశారు. -
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు త్వరలో శిక్షణ
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు. విజయనగరంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్
-
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
-
ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
-
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో నిందితులు