- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
RRR: వీడుతున్న చిక్కుముడులు
హైదరాబాద్ ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) రెండు భాగాలను ఒకేసారి నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి.
ఏకకాలంలో ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణం
కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత
త్వరలో దక్షిణ భాగానికి జాతీయ రహదారి హోదా
భూ సేకరణ వేగవంతానికి అధికారుల కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) రెండు భాగాలను ఒకేసారి నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. వేర్వేరుగా కాకుండా ఏకకాలంలో పనులు చేపట్టడమే ఉత్తమమని కేంద్రం చేసిన సూచనకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. ఈమేరకు దిల్లీలో ఇటీవల జరిగిన సమీక్షలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన సూచనలకు సీఎం రేవంత్రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతోపాటు ఆయా అంశాలపై దృష్టి సారించాలని రాష్ట్ర అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి 350.79 కిలోమీటర్ల మేర ఆర్ఆర్ఆర్ను నిర్మించనున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు వేయనున్న 161.59 కిలోమీటర్ల ఉత్తర భాగానికి కేంద్రం నాలుగేళ్ల కిందటే జాతీయ రహదారి హోదా ఇచ్చింది. దీన్ని నిర్మించేందుకు 4,750 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ కీలక దశలో ఉంది. ఒకట్రెండు ప్రాంతాలకు సంబంధించి న్యాయస్థానంలో వ్యాజ్యాలు నమోదవగా మిగిలిన ప్రాంతాల్లో తుది దశకు చేరుకుంది. జులైలో భూముల యజమానులకు తుది నోటీసులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో కోర్టుల్లో ఉన్న కేసుల పరిష్కారానికీ కసరత్తు చేస్తున్నారు.
దక్షిణ భాగం ఎలైన్మెంట్కు సూత్రప్రాయ ఆమోదం
చౌటుప్పల్, ఆమన్గల్, షాద్నగర్, చేవెళ్ల, సంగారెడ్డి మీదుగా 189.20 కిలోమీటర్ల పొడవున దక్షిణ భాగాన్ని నిర్మిస్తారు. దీనికి జాతీయ రహదారి హోదాను సూచించే తాత్కాలిక నంబరును త్వరలో కేటాయించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అధికారులు ఆయా ప్రతిపాదనలను రూపొందిస్తున్నట్లు సమాచారం. దక్షిణ భాగం ఎలైన్మెంటును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినప్పటికీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఆ ప్రక్రియను కూడా త్వరలో పూర్తి చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది.
ఆ రెండింటిపై స్పష్టత
- రహదారి నిర్మాణంలో భాగంగా వివిధ రకాల తీగలు, స్తంభాలు, పైప్లైన్ల(యుటిలిటీస్) తరలింపు విషయంలో నెలకొన్న సందిగ్ధతకు కేంద్రం తెరదించింది. ఇందుకు రూ.300 కోట్లకుపైగా వ్యయం అవుతుందని, ఆ మొత్తాన్ని చెల్లించాలని అప్పటి భారాస ప్రభుత్వానికి ఎన్హెచ్ఏఐ లేఖ రాయడంతో ఆర్ఆర్ఆర్పై పీటముడి పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఖర్చులను చెల్లిస్తామని ఒప్పుకొంది. అయితే, గత ఒప్పందం ప్రకారం... యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని నితిన్గడ్కరీ స్పష్టం చేయటంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
- భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలని నిర్ణయించిన నేపథ్యంలో గతంలో అంగీకరించిన మేరకు రూ.100 కోట్లతో రివాల్వింగ్ ఫండ్ విధానాన్ని కొనసాగించేందుకు కేంద్రం అంగీకరించింది. నష్టపరిహారం కింద రైతులకు చెల్లించేందుకు ఆ మొత్తాన్ని వినియోగించిన వెంటనే మరో రూ.100 కోట్లను ఆ నిధికి జమ చేయాలని రాష్ట్రం నిర్ణయించింది. ఇప్పటికే రూ.100 కోట్లు జమ చేసింది. ఇలా చిక్కుముడులు ఒక్కొక్కటిగా విడిపోతుండటంతో ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను విభజించి తహసీల్దార్లకు అప్పగించిన ప్రభుత్వం అదే మార్గంలో త్వరలో మరికొన్ని సంస్కరణలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. -
విజయవాడ హైవేపై.. ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్ల ప్రారంభం
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
కోడింగ్కు కేంద్రంగా హైదరాబాద్
కోడింగ్లో హైదరాబాద్ ప్రపంచ కేంద్రంగా నిలుస్తోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్ రాయదుర్గం టీహబ్లో ఆదివారం ఎండ్ నౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోషల్వుడ్ 2024 సమిట్ (ద్వి వార్షిక సదస్సు) నిర్వహించారు. -
కొత్త ద్వీపం అందం అదరహో..!
చుట్టూ నీరు.. మధ్యలో భూభాగం ఉంటే ద్వీపం అనడం సహజం. ఇలాంటి దృశ్యాలు నదులు, సముద్రాలు, సరస్సుల్లో కనిపిస్తుంటాయి. -
ఎంపీ లాడ్స్ ఆన్లైన్లో!
పార్లమెంటు సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధుల పథకం (ఎంపీ లాడ్స్) వ్యయం ఇకపై ఆన్లైన్ వేదికగా జరగనుంది. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
వసతుల్లేని వర్సిటీలు!
ఉన్నత చదువులు చదివి.. జీవితంలో ఉత్తమంగా ఎదగాలన్న ఆశలు, ఆశయాలతో విశ్వవిద్యాలయాలకు వస్తున్న విద్యార్థులకు కనీస సదుపాయాల కొరత పరీక్ష పెడుతోంది. -
తెలంగాణ ఏర్పాటులో డీఎస్ పాత్ర కీలకం
పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని.. ఆయన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
10 మంది విద్యార్థులు మించితే.. ఇద్దరు టీచర్లు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 10 మంది విద్యార్థులు దాటిన చోట ఇక ఇద్దరు ఉపాధ్యాయులు రానున్నారు. 41 మంది పిల్లలు మించితే ముగ్గురు టీచర్లు ఉంటారు. -
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా తాండూరులో 5.1 సెం.మీటర్లు కురిసింది. -
అరుదైన రాజనీతిజ్ఞుడు
భారత మాజీ ఉప రాష్ట్రపతి, రాజనీతిజ్ఞుడు వెంకయ్య నాయుడికి ఆదివారంతో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నా. -
నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్తో కాంగ్రెస్ నేతల చర్చలు విఫలం
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆసుపత్రిలో వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్తో ఆదివారం రాత్రి కాంగ్రెస్ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. -
సింగరేణి.. మొక్కల గని..!
అడవిని తలపిస్తున్న ఈ ప్రాంతం సింగరేణి పరిధి రామగుండం ఏరియాలో బొగ్గు తవ్వకం తాలూకు మట్టి కుప్పలు నిండిన ప్రదేశం అంటే నమ్మగలమా. -
పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
దేశం పారిశ్రామికంగా సుస్థిరాభివృద్ధి సాధించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. -
చుక్ చుక్ బండి.. పట్టాల కింది నుంచీ వెళ్తుందండి..!
నగరాలు, జాతీయ రహదారుల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్లు కడతారు. బైపాస్ రోడ్లు నిర్మిస్తారు. రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించేందుకు రైల్వే శాఖ కూడా బైపాస్ లైన్లు, రైల్ ఓవర్ రైల్(ఆర్ఓఆర్) వంతెనలు నిర్మిస్తోంది. -
న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి
దేశ న్యాయవ్యవస్థలో మార్పులు రావాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. పేదలు సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం అడిగే పరిస్థితి ఉందా.. అన్న అంశంపై చర్చ జరగాలన్నారు. -
రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని మాజీ ఎంపీ మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. దివంగత నేత ఎన్టీఆర్కూ ఆ అవార్డు ఇవ్వాలని అన్నారు. -
ఇదీ సంగతి!
అది ఉద్యోగులకే..మనకు కాదు!! -
1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు ప్రధాన విద్యుత్తు కేంద్రాల్లో ఏకంగా 1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తికి విఘాతం ఏర్పడింది. -
మండల, జిల్లా పరిషత్లలోనూ ప్రత్యేకాధికారుల పాలన!
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల, జిల్లా పరిషత్లలోనూ ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. ఎంపీపీలు, జడ్పీ ఛైర్పర్సన్ల పదవీకాలం జులై 3, 4 తేదీల్లో ముగియనుండగా.. వారి స్థానంలో ప్రత్యేకాధికారుల నియామకం చేపట్టనున్నారు.