- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
TG High Court: కమిషన్ చట్టబద్ధమే
విద్యుత్తు కొనుగోళ్లు.. యాదాద్రి, భదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటులో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కచ్చితత్వం, ఔచిత్యాన్ని తేల్చడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ చట్టబద్ధమేనని హైకోర్టు తేల్చిచెప్పింది.
ఈఆర్సీ కంటే దాని పరిధి విస్తృతం
జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ విచారణను నిలిపివేయేం
పక్షపాతం అనడానికి ఆధారాలు చూపలేదు
మీడియా సమావేశం ఆధారంగా ఆరోపణలు సరికాదు
నోటీసుల జారీలో చట్టాన్ని ఉల్లంఘించారన్న వాదనా ఆమోదయోగ్యం కాదు
మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు
ప్రజాప్రాముఖ్యం ఉన్న సున్నితమైన అంశాలను సాధారణ దర్యాప్తు సంస్థలకు అప్పగించిన పక్షంలో సందేహాలకు తావిచ్చే అవకాశం ఉందని.. విస్తృత ప్రయోజనాలున్న అంశాలపై ప్రజలకు విశ్వాసాన్నిచ్చే వ్యక్తులతో కూడిన ఉన్నత స్థాయి కమిషన్తో విచారణ జరిపించవచ్చని రాంకృష్ణ దాల్మియా వర్సెస్ ఎస్.ఆర్.టెండోల్కర్, కర్ణాటక వర్సెస్ కేంద్రం కేసుల్లో సుప్రీంకోర్టు పేర్కొంది.
కమిషన్కు నేతృత్వం వహిస్తున్న వ్యక్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాజ్యాంగ విధులు నిర్వహించారన్న విషయాన్ని విస్మరించలేం. కేవలం విలేకరుల సమావేశం నిర్వహించి ప్రకటన ఇచ్చారన్న కారణం తప్ప వేరే ఇతర సమాచారం లేదు. పక్షపాతం అంటూ ఊహించి చెప్పరాదు.. దాన్ని నిరూపించాలి. నిరూపించడంలో కేసీఆర్ విఫలమయ్యారు.
తీర్పులో హైకోర్టు ధర్మాసనం
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్తు కొనుగోళ్లు.. యాదాద్రి, భదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటులో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కచ్చితత్వం, ఔచిత్యాన్ని తేల్చడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ చట్టబద్ధమేనని హైకోర్టు తేల్చిచెప్పింది. విస్తృత ప్రయోజనాలున్న అంశాలపై ప్రజలకు విశ్వాసాన్నిచ్చే వ్యక్తులతో కూడిన ఉన్నతస్థాయి కమిషన్తో విచారణ జరిపించవచ్చని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని పేర్కొంది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై న్యాయపరమైన వ్యవస్థలైన తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల విద్యుత్తు నియంత్రణ మండళ్లు(ఈఆర్సీ) తేల్చిన అంశాలపై విచారించే పరిధి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు లేదన్న మాజీ సీఎం కేసీఆర్ వాదన ఆమోదయోగ్యం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈఆర్సీల కంటే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పరిధి విస్తృతమని పేర్కొంది. ఈఆర్సీలు తేల్చిన అంశాలపై విచారించే పరిధి ఈ కమిషన్కు లేదన్న వాదన ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారించే పరిధి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు ఉందని తేల్చిచెప్పింది. జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఊహించి చెప్పరాదని.. దానికి తగిన ఆధారాలను సమర్పించాల్సి ఉందని పేర్కొంది. అయితే, ఇక్కడ కేవలం మీడియా ప్రకటన తప్ప ఎలాంటి ఆధారాలు చూపలేదని, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని నిరూపించడంలో కేసీఆర్ విఫలమయ్యారని ధర్మాసనం తెలిపింది. విద్యుత్తు కొనుగోళ్లు, ఉత్పత్తి సంస్థల ఏర్పాటు నిర్ణయాల్లో కేసీఆర్ పాత్ర ఉందనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని ఆయనకు కమిషన్ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొందని.. అందువల్ల నోటీసులు చట్టవిరుద్ధమన్న వాదన ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. పక్షపాతంతో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై విచారణను నిలిపివేయలేమని స్పష్టం చేసింది. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మార్చి 14న ఇచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్కుమార్లతో కూడిన ధర్మాసనం.. కేసీఆర్ పిటిషన్ను కొట్టివేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. తీర్పులోని ముఖ్యాంశాలు..
ఇది వాస్తవ నిర్ధారణ కమిషన్
‘‘విచారణ కమిషన్ల చట్టం-1952 కింద కొన్ని అధికారాలతో ప్రభుత్వాలు కమిషన్ను ఏర్పాటు చేయవచ్చు. ఈ చట్టం కింద వాస్తవ నిర్ధారణ కమిషన్ మాత్రమే ఏర్పాటవుతుంది. తమ ముందున్న ఆధారాల ద్వారా వాస్తవాలను సేకరించి నివేదిక సమర్పించడమే కమిషన్ బాధ్యత. అంతేగానీ బాధ్యులుగా నిర్ణయిస్తూ తీర్పు వెలువరించడంగానీ, నివేదికను అమలు చేసే అధికారంగానీ కమిషన్కు లేవు.
ఈఆర్సీల నిర్ణయంపై అప్పీలేట్ ట్రైబ్యునల్, ఆపైన సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోళ్లు.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటులో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లోని కచ్చితత్వాన్ని, ఔచిత్యాన్ని ఈఆర్సీ నిర్ణయించిందా? లేదా అన్న అంశాన్ని తేల్చాల్సి ఉంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ విద్యుత్తు సంస్థల మధ్య 2015 సెప్టెంబరు 22న విద్యుత్తు కొనుగోలు ఒప్పందం(పీపీఏ) జరిగింది. ప్రాజెక్టు ఖర్చు, టారిఫ్ నిర్ణయాలపై మాత్రమే తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈఆర్సీలు విచారించాయి. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ విధివిధానాలను పరిశీలిస్తే.. ఈఆర్సీలు తేల్చిన అంశాల కంటే విస్తృతమైనవి ఉన్నాయి. ఈ వ్యవహారాలపై నిర్ణయాల్లోని లోపాలు, అవి చూపే ఆర్థిక ప్రభావంపై కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. అందువల్ల తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈఆర్సీలు తేల్చిన అంశాలపై విచారించే పరిధి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్కు లేదన్న వాదన ఆమోదయోగ్యం కాదు. గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారించే పరిధి కమిషన్కు ఉంది.
పక్షపాతం ఆరోపణ ఊహాజనితం కారాదు
పక్షపాతంతో వ్యవహరించారన్న ఊహకు చట్టబద్ధతలేదు. దాన్ని నిరూపించాలి.. అంతేగానీ ఊహాజనితం కారాదు. ఏప్రిల్ 14న కమిషన్ నోటీసు జారీ చేయగా జూన్ చివరి వరకు ఎన్నికల హడావుడి ఉన్నందున గడువు కావాలని కేసీఆర్ మే 1న లేఖ రాశారు. దీనిపై కమిషన్ స్పందిస్తూ మూడు నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉందని, మే 13న ఎన్నికలు పూర్తవుతున్నందున మే 31.. లేదంటే జూన్ 15లోగా వివరణ ఇవ్వాలని కేసీఆర్కు మే 4న సమాచారం అందజేసింది. అనంతరం జూన్ 11న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి విచారణ స్థాయిని వివరించడానికి విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతమాత్రాన కమిషన్ పక్షపాతంతో ఉందన్న ఆరోపణలపై విచారణను నిలిపివేయలేం. కేసీఆర్కు మార్చి 14న జారీ చేసిన నోటీసులు చట్ట విరుద్ధమన్న వాదనా ఆమోదయోగ్యం కాదు. అదేవిధంగా సెక్షన్ 8బి కింద జారీ చేసిన నోటీసులు కూడా చట్టఉల్లంఘన కాదు’’ అని ధర్మాసనం తెలిపింది. అందువల్ల కేసీఆర్ పిటిషన్పై విచారించడానికి ఎలాంటి కారణాలు లేవని పేర్కొంటూ.. దాన్ని కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కుట్రలో నవీన్రావు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్రావుకు భాగమున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. -
ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్!
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా... రాష్ట్రంలోని ప్రజలందరి సమగ్ర ఆరోగ్య సమాచారం (హెల్త్ ప్రొఫైల్) సేకరించేందుకు వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. -
పర్యాటక అభివృద్ధికి రాష్ట్రంలో వనరులు అనేకం
రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని.. ఆరు నెలల్లోనే పురోగతి సాధిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. -
ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రక్రియలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో వివరించింది. బదిలీలు చేపట్టే ప్రభుత్వ శాఖలు వీటిని తప్పక అమలుచేయాలని స్పష్టం చేసింది. -
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
తమది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమే, అలాగని కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే ఎలాగంటూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు. -
ఇదీ సంగతి!
ఇదీ సంగతి! -
వరదనీటి చేరికతో వడివడిగా గోదావరి
వానాకాలం ప్రారంభంలో సరైన వర్షాలు లేక నదులు, నీరు లేక చెరువులు వెలవెలబోయాయి. గోదావరిలో ఇసుక మేటలు తేలాయి. -
నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
వరంగల్లోని జాతీయ సాంకేతిక సంస్థ (నిట్)లో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో బీటెక్ (ఈసీఈ) విద్యార్థి రవిషాకు రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ దక్కినట్లు నిట్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం
నేత కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. -
శస్త్రచికిత్స అవసరం లేకుండానే..దెబ్బతిన్న మోకాలి భాగం తిరిగి అమరిక
శస్త్రచికిత్స అవసరం లేకుండానే 40 సంవత్సరాల వ్యక్తికి మోకాలిలో దెబ్బతిన్న భాగాన్ని తిరిగి అమర్చిన అరుదైన చికిత్సను హైదరాబాద్ బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. -
నాలుగు జిల్లాలకే సగం ‘బాసర’ సీట్లు
బాసర ఆర్జీయూకేటీలోని మొత్తం సీట్లలో సగం నాలుగు జిల్లాల విద్యార్థులే దక్కించుకున్నారు. ఆ వర్సిటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ చదివేందుకు పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపికైన విద్యార్థుల ప్రాథమిక జాబితాను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇన్ఛార్జి ఉపకులపతి వి.వెంకటరమణ, వర్సిటీ అధికారులు బుధవారం సచివాలయంలో విడుదల చేశారు. -
గురువెక్కడో.. మేమూ అక్కడే
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు బదిలీపై వెళ్లిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురవుతారు. వారిని చుట్టుముట్టి కన్నీరుమున్నీరుగా విలపిస్తారు. -
శిక్షణ ఇచ్చి ఖైదీల్లో మార్పు తెచ్చాం
తెలిసో తెలియకో తప్పుచేసి కారాగారానికి వచ్చిన ఖైదీలకు శిక్షకు బదులు.. శిక్షణ ఇచ్చి మార్పు తీసుకొచ్చామని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్ర తెలిపారు. -
ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి బ్యాంకు లాకర్లు తెరిచిన ఈడీ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్రెడ్డికి చెందిన బ్యాంకు లాకర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం తెరిచారు. -
నేటి నుంచి ఎప్సెట్ కౌన్సెలింగ్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్లో ప్రవేశించేందుకు ఎప్సెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
కళ్లెదుటే తిరుగుతున్నా సమన్లు అందించలేరా!
ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసుల్లో విచారణ జరుగుతున్న తీరుపై బుధవారం హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్కు ప్రత్యామ్నాయం సూచించండి
జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా నేల స్వభావాన్ని అంచనా వేసేందుకు గాను నమూనాల సేకరణకు డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో భారీగా నీరు, ఇసుక బయటకు వస్తుండటంతో పరీక్షలను నిలిపివేశామని.. ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో సూచించాలని నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ)ని నీటిపారుదలశాఖ కోరింది. -
ఉత్తర తెలంగాణలో హైదరాబాద్ వర్సిటీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయండి
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ సెంటర్ను ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కేంద్రాన్ని కోరారు. -
మండల ప్రజాపరిషత్లకు ప్రత్యేకాధికారులు
రాష్ట్రంలో పాలకవర్గాల పదవీకాలం ముగిసిన మండల ప్రజాపరిషత్లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో నం.43) జారీ చేసింది. -
ప్రభుత్వాసుపత్రుల్లోని ఒప్పంద ఉద్యోగులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. -
సంక్షేమ కార్పొరేషన్లలో సిబ్బంది ఎంతమంది?
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమం కోసం కొత్తగా ప్రకటించిన 16 కార్పొరేషన్లు, బోర్డులు, సమాఖ్యలు కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్