- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సహకార రంగాన్ని బలోపేతం చేస్తాం: తుమ్మల
తెలంగాణలో సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసి, సేవలను విస్తరిస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల సంఖ్యను పెంచుతామన్నారు.
మహదేవ్పూర్ ప్రాథమిక సహకార సంఘానికి పురస్కారం అందజేస్తున్న మంత్రి తుమ్మల, చిత్రంలో టెస్కాబ్ ఛైర్మన్ రవీందర్రావు, ఎన్సీడీసీ ఆర్డీ వంశీకృష్ణ తదితరులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసి, సేవలను విస్తరిస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల సంఖ్యను పెంచుతామన్నారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) ఆధ్వర్యంలో గురువారం ఉత్తమ సహకార సంఘాలకు పురస్కారాలను అందజేశారు. రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు(టెస్కాబ్)లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ... ‘‘పీఏసీఎస్ల ద్వారా రుణాలతోపాటు సాధారణ, ఆరోగ్య బీమాలను, దిగుబడుల శుద్ధి, నిల్వ సదుపాయాలను కల్పిస్తాం. రాష్ట్రంలో ప్రస్తుతం 60,759 సంఘాలుండగా వాటిలో 908 కీలకమైనవి. వ్యవసాయ రుణాల్లో 20%, ఎరువుల పంపిణీలో 60% వాటా సహకార సంఘాలదే. పాల ఉత్పత్తిలో, చేపల వ్యాపారంలోనూ వీటి పాత్రే అధికం. ఈ రంగంలో యువత, మహిళల భాగస్వామ్యం పెరగాలి. మున్ముందు విత్తనాల, సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ సర్టిఫికేషన్ కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వాటి మార్కెటింగ్, ఎగుమతుల కోసం సహకార సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతాం’’ అని వివరించారు.
సంఘాలకు ఎన్సీడీసీ పురస్కారాలు
పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్, అప్పన్నపేట, జగిత్యాల జిల్లా రాయికల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లోని పీఏసీఎస్లకు, మేడ్చల్ జిల్లా జీడిమెట్ల మత్స్యకార సహకార సంఘానికి... ప్రతిభ, ఉత్తమ పురస్కారాలను, రూ.25 వేల చొప్పున నగదు బహుమతులను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో టెస్కాబ్ ఛైర్మన్ రవీందర్రావు, ఇన్ఛార్జి ఎండీ గోపి, సహకార సంచాలకుడు ఉదయ్కుమార్, ఎన్సీడీసీ ప్రాంతీయ సంచాలకుడు డి.వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్కాబ్ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి తుమ్మల ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
మరో మార్కెట్ కమిటీకి పాలకవర్గం
వరంగల్ జిల్లా నర్సంపేట మార్కెట్ కమిటీకి పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కమిటీ నియామకం జరిగిన పదో మార్కెట్ యార్డు ఇది. మరో 100 యార్డులకు నియామకాలు జరగాల్సి ఉంది.
వ్యవసాయ డైరెక్టరేట్లో మంత్రి తనిఖీ
హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న వ్యవసాయ శాఖ సంచాలకుడి కార్యాలయాన్ని గురువారం ఉదయం 10.49 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. లోపల అధికారులు, సిబ్బంది కనిపించకపోవడంతో విస్మయం చెందారు. మంత్రి 10.55 గంటల వరకు వేచిచూడగా మరో ఇద్దరు మాత్రమే వచ్చారు. వ్యవసాయ సంచాలకుడు గోపికి పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా, టెస్కాబ్ ఇన్ఛార్జి ఎండీగా అదనపు బాధ్యతలు కల్పించడంతో ఆయన డైరెక్టరేట్కు ఎక్కువగా రావడం లేదు. దాంతో మిగిలిన అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వచ్చిపోతున్నట్లు తనిఖీలో వెల్లడైంది. అక్కడి నుంచి టెస్కాబ్కు వెళ్లిన మంత్రికి... డైరెక్టర్ గోపి విషయాన్ని వివరించేందుకు యత్నించారు. డైరెక్టరేట్లోనే సమయపాలన పాటించకపోవడంపై తుమ్మల మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక టెట్ ఏటా రెండుసార్లు
ఇక నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు 2015 డిసెంబరు 23న ఇచ్చిన జీవో 36లో సవరణ చేస్తూ శనివారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో 18 జారీ చేశారు. -
విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం
హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎనుముల రేవంత్రెడ్డి, నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. -
కీలక ప్రాజెక్టులపై కలిసి పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలు, ఇతర సమస్యల పరిష్కారంపై శనివారం సాయంత్రం హైదరాబాద్లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డిల మధ్య అత్యంత సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. -
కమిటీల ద్వారా పరిష్కారం
విభజన చట్టంలోని పెండింగు సమస్యలకు కమిటీల ద్వారా పరిష్కారమార్గాలను అన్వేషిస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్లు తెలిపారు. -
కాళేశ్వరం పంపుహౌస్లపైనా విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ కమిషన్ పరిధి మరింత విస్తరించనుంది. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి సాంకేతిక అంశాలపై విచారణ చేపట్టిన కమిషన్.. -
నైనీ కరెంటు కొంటారా?
దేశంలోని సుదూర ప్రాంతాల్లో ఉన్న థర్మల్ విద్యుత్కేంద్రాలకు బొగ్గు రవాణా కన్నా కరెంటు సరఫరా వ్యయం తక్కువ అవుతుందని తాజాగా కేంద్ర విద్యుత్శాఖ రాష్ట్రాలకు సూచించింది. బొగ్గు గనులున్న ప్రాంతాల్లోనే థర్మల్ విద్యుత్కేంద్రాలను నిర్మిస్తే కరెంటు చౌకగా లభిస్తుంది. -
బాధ్యతల భారం.. పరిష్కారం దూరం!
రాష్ట్రంలో కాలుష్య సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు భారీగా పెరిగిపోతున్నాయి. అయినా. వాటి పరిష్కారానికి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఉద్యోగులు దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కృష్ణ జింకలను పట్టుకోవాల్సిందే!
రాష్ట్రంలోని కృష్ణా నదీ తీర మండలాల్లో రైతులకు కృష్ణ జింకలతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లోని మాగనూరు, కృష్ణా, మక్తల్, ఊట్కూరు, నర్వ, దేవరకద్ర మండలాల పరిధిలో ఉన్న కృష్ణా నదీ తీరంలో మూడు వేల పైచిలుకు కృష్ణ జింకలున్నాయి. -
విమానాశ్రయాల్లో భద్రతపై అధ్యయనం!
విమానాశ్రయాల్లో భద్రత ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వాటి నిర్మాణాలకు సంబంధించి భద్రతా వ్యవస్థను అధ్యయనం చేయించాలని ఆదేశించింది. అనంతరం నివేదికను పంపాలని అధికారులకు స్పష్టం చేసింది. -
తిరుమల తరహాలో యాదాద్రి స్వయంభువుల దర్శనం
తిరుమల వేంకటేశ్వరస్వామి దేవాలయం తరహాలో భక్తులకు యాదాద్రి స్వయంభువుల దర్శనం కలగనుంది. దర్శనానికి వచ్చే భక్తులు మహాముఖ మండపంలో మూలవరులను దర్శించుకొంటూ.. -
ధాన్యం లేదు.. డబ్బులిస్తాం!
అన్నదాతల నుంచి సేకరించిన వడ్లను మరాడించి బియ్యాన్ని ఎఫ్సీఐకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న రైస్మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోంది. గతానికి భిన్నంగా కఠినంగా వ్యవహరిస్తుండటంతో రూ.వందల కోట్ల బకాయిలు వసూలవుతున్నాయి. -
కమ్యూనిటీ వాలంటీర్లతో మధ్యవర్తిత్వం
కమ్యూనిటీ వాలంటీర్లకు మధ్యవర్తిత్వ చట్టాలపై అవగాహన కల్పించి వివాహ వ్యవస్థలోని తగాదాలు పరిష్కరించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవా సంస్థ అధ్యక్షుడు జస్టిస్ సుజయ్ పాల్ పేర్కొన్నారు. -
కలెక్టర్ల వద్దే ఏజెన్సీ భూ వివాదాల పరిష్కారం
ఏజెన్సీల్లోని భూ వివాదాలను జిల్లా కలెక్టర్ల వద్దనే పరిష్కరించుకోవచ్చని ఆదిలాబాద్ కోర్టుల పోర్ట్ఫోలియో జడ్జి అయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు
డోర్నకల్-భద్రాచలం స్టేషన్ల మధ్య లైన్ డబ్లింగ్ కోసం భూసేకరణ చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ లైన్ కోసం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, గార్ల మండలాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. -
ఎస్సీ గురుకుల సొసైటీలో పూర్తికాని తుది కేటాయింపులు
రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం. 317కు సంబంధించిన ఉద్యోగుల తుది కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఇతర సంక్షేమ సొసైటీల్లో సాంకేతిక పొరపాట్లకు అవకాశం లేకుండా తుది కేటాయింపులు పూర్తయ్యాయి. -
దండు మల్కాపూర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించండి
యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్ హరిత సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కు వద్ద హైదరాబాద్- విజయవాడ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టిఫ్) కోరింది. -
దేవాదుల సొరంగం ప్రారంభమయ్యేనా?
దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడో దశలో నిర్మించిన సొరంగం పూర్తయితే లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఈ టన్నెలే. -
నిరుపయోగ బొగ్గు గనుల నుంచి జల విద్యుత్
విద్యుదుత్పత్తి పెంచేందుకు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు(పీఎస్పీపీ) నిర్మించాలని సింగరేణి సంస్థ తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ యాజమాన్యంలో పీఎస్పీపీ నిర్మాణం కోసం కసరత్తు చేస్తోంది. -
ఉత్తర భాగానికి రూ.5వేల కోట్లు!
హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్కు ఆర్థిక అవస్థలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అవతల నుంచి 2 భాగాలుగా ప్రాంతీయ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్)ను తలపెట్టిన విషయం తెలిసిందే. -
రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. -
ఉత్తరాఖండ్లో విరిగిన కొండచరియలు.. ఇద్దరు తెలంగాణ యాత్రికుల దుర్మరణం
దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. చమోలీ జిల్లా కర్ణప్రయాగ, గౌచర్ల మధ్యలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకున్న ఘటనలో ఇద్దరు తెలంగాణవాసులు మృతి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రూ.కోటి విలువచేసే ప్లాటు.. ఆడీ కారు.. పోలీసులకు చిక్కిన దర్జాదొంగ
-
వయసు 57.. సెంచరీలు 1000
-
ఏపీలోని ఆ ఐదు గ్రామాలు.. మళ్లీ భద్రాచలంలో కలిసేనా..?
-
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..
-
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం